సైకో కిల్లర్కు జీవిత ఖైదు
అమాయకమైన పసిపిల్లలను కిడ్నాప్ చేసి వారిపై దారుణంగా వ్యవహరించి హతమార్చిన సైకో కిల్లర్కు జీవిత ఖైదు, జరిమానా విధిస్తూ గుంటూరు పొక్సో కోర్టు ఇన్ఛార్జి, ఐదో అదనపు జిల్లా జడ్జి కె.నీలిమ బుధవారం తీర్పు చెప్పారు.
పసి పిల్లలపై దారుణానికి పాల్పడి హతమార్చాడు
గుంటూరు పోక్సో కోర్టు తీర్పు
గుంటూరు లీగల్ న్యూస్టుడే: అమాయకమైన పసిపిల్లలను కిడ్నాప్ చేసి వారిపై దారుణంగా వ్యవహరించి హతమార్చిన సైకో కిల్లర్కు జీవిత ఖైదు, జరిమానా విధిస్తూ గుంటూరు పొక్సో కోర్టు ఇన్ఛార్జి, ఐదో అదనపు జిల్లా జడ్జి కె.నీలిమ బుధవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. తాడేపల్లి మండలం మల్లెంపూడికి చెందిన మల్లెంపూడి గోపి (19) దుర్వ్యసనాలు, మత్తు మందులకు అలవాటుపడి మగ పసిపిల్లలపై అసహజ లైంగిక దాడికి పాల్పడేవాడు. 2021 మార్చి 14న అదే గ్రామానికి చెందిన ఆరేళ్ల బాలుడికి మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేసి సమీపంలోని తోటలోకి తీసుకెళ్లాడు. ఆ బాలుడు కనిపించకపోవటంతో తల్లిదండ్రులు తాడేపల్లి పొలీసులకు ఫిర్యాదుచేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు. తరవాత రోజు జామ తోట వద్ద చెప్పులు గుర్తించి వెతకగా అక్కడే కొద్ది దూరంలో బాలుడు శవమై పడిఉన్నాడు. ఈ మేరకు తాడేపల్లి పోలీసులు బాలుడి మృతిని అనుమానాస్పద కేసుగా మార్చి శవ పరీక్ష నిర్వహించగా దారుణమైన విషయాలు డాక్టర్ల నివేదకలో వెల్లడయ్యాయి. బాలుడితో అసహజ శృంగారం నిర్వహించడంతోపాటు కాళ్లు, చేతులు విరిచేసి హతమార్చినట్లు తేలింది. హత్య కేసుగా నమోదు చేసిన పొలీసులు దర్యాప్తును సీఐడీకి బదిలీ చేశారు. వారి దర్యాప్తులో అదే గ్రామానికి చెందిన నిందితుడు గోపి ఈ దారుణానికి పాల్పడినట్లు గుర్తించడంతో అతను వీఆర్వో ద్వారా పొలీసులకు లొంగిపోయి ఈ దారుణానికి తానే పాల్పడినట్లు అంగీకరించాడు. ప్రాసిక్యూషన్ నేరం రుజువు చేయటంతో నిందితుడు గోపికి జీవిత ఖైదు, రూ.62 వేలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. సీఐడీ డీఎస్పీ జయసూర్య కేసు దర్యాప్తు నిర్వహించగా పీపీ జి.శివప్రసాద్రెడ్డి ప్రాసిక్యూషన్ నిర్వహించారు.
కొనసాగుతున్న విచారణ..
పోలీసుల విచారణలో ఈ సంఘటనకు నెల రోజుల ముందు వడ్డేశ్వరం వద్ద నిందితుడు గోపి మరో బాలుడిపై ఇదే విధమైన నేరానికి పాల్పడి హతమార్చాడు. పోలీసులు అతన్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించి ఛార్జిషీటు దాఖలు చేశారు. ఈ కేసులో విచారణ కొనసాగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాడు గొప్పలు.. నేడు తిప్పలు..
[ 06-07-2024]
బడుల రూపురేఖలు మార్చేస్తామని నాడు వైకాపా సర్కారు చెప్పింది నిజమే.. వాటి రూపును దారుణంగా మార్చేసి విద్యార్థులు, ఉపాధ్యాయులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. -
పాత్రధారులు సరే.. సూత్రధారులు ఎక్కడ?
[ 06-07-2024]
ఉమ్మడి గుంటూరులో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పరిధిలో నకిలీ పాసుపుస్తకాలు, అడంగల్, 1బీ, నకిలీ చిరునామా ధ్రువపత్రాలు పెట్టి రూ.కోట్లు కొల్లగొట్టారు. -
ఉల్లంఘనలు దండి.. ఆదాయానికి గండి..
[ 06-07-2024]
గుంటూరు నగర పట్టణ ప్రణాళిక విభాగం అవినీతి, అక్రమాల్లో మునిగితేలుతోంది. భవన అనుమతుల ఫీజుల రూపేణా నగరపాలికకు రావాల్సిన ఆదాయానికి ప్రణాళికాధికారులే గండికొట్టి తమ సొంత జేబులు నింపుకొంటున్నారు. -
నాణ్యత డొల్ల.. కష్టాలు నిలువెల్లా
[ 06-07-2024]
‘నాడు-నేడు’ పనులతో పాఠశాలల రూపురేఖలు మార్చేశాం.. మునుపెన్నడూ లేనిరీతిలో తరగతి గదులు నిర్మించాం.. సకల సౌకర్యాలు కల్పించాం’ అంటూ ఊదరగొట్టిన మాజీ సీఎం జగన్ మాటలన్నీ బూటకాలేనని నాటి లోపాలు నేడు ఒక్కొకటిగా బయటపడుతున్నాయి. -
పిన్నెల్లి అరాచకాలపై చర్చిద్దామా?
[ 06-07-2024]
‘మీకు ధైర్యముంటే మాచర్లలో ఒక వేదిక ఏర్పాటు చేద్దాం.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎన్ని ఆస్తులు దోపిడీ చేశాడో, ఎంత గ్రానైట్ తరలించాడో.. ఎంత గ్రావెల్ అమ్ముకున్నాడో చర్చిద్దామా?’ అంటూ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి మాజీ సీఎం జగన్కు సవాల్ విసిరారు. -
లక్ష్యం 100 రోజులు.. 3,600 ఇళ్లు
[ 06-07-2024]
జిల్లాలో గృహ నిర్మాణాలను వేగవంతం చేసి లబ్ధిదారులకు అందజేసేలా చూడాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. -
జలవనరులకు జవసత్వాలు
[ 06-07-2024]
ఐదేళ్ల వైకాపా పాలనలో జలవనరుల కనీస నిర్వహణకు నిధులు కేటాయించకపోవడంతో నిర్వీర్యమయ్యాయి. -
బాలికలూ.. ఇబ్బందులు ఎదురైతే చెప్పండి
[ 06-07-2024]
లైంగిక వేధింపులకు గురైన విద్యార్థినులు వెంటనే తమకు జరిగిన అన్యాయం ఇంట్లో తల్లిదండ్రులు, పోలీసులకు తెలియజేయడం ద్వారా అటువంటి నేరాలకు అడ్డుకట్ట వేయవచ్చని జిల్లా బాలికా పరిరక్షణ అధికారులు శ్రీప్రియ, కృష్ణ పేర్కొన్నారు. -
ఓపీకి వెళితే బీపీ ఖాయం!
[ 06-07-2024]
గుంటూరులోని సర్వజన ఆసుపత్రిలో ఓపీ సేవలందించేందుకు 11 కౌంటర్లున్నాయి. 70 మందికిపైగా నర్సింగ్ విద్యార్థులను నియమించారు. -
ఆరు జీవితాలకు వరప్రసాదం!
[ 06-07-2024]
పుట్టెడు దుఃఖంలోనూ పలువురి ప్రాణాలు కాపాడేందుకు ఆ కుటుంబం ముందుకు వచ్చింది. -
‘పిన్నెల్లిని జగన్ పరామర్శించడం సిగ్గుచేటు’
[ 06-07-2024]
ప్రజలు తమ పవిత్రమైన ఓటు వేసే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం)ను ధ్వంసం చేసి జైలులో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి జైలుకు వెళ్లి పరామర్శించడం సిగ్గుచేటని -
జల్సాలకు అలవాటు పడ్డారు.. దొంగతనాల వైపు మళ్లారు
[ 06-07-2024]
జల్సాలకు అలవాటు పడిన యువకులు ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతూ పొలీసులకు దొరికిపోయారు. -
హైకోర్టు న్యాయవాదికి జైలుశిక్ష, జరిమానా
[ 06-07-2024]
భార్యను వేధించిన కేసులో హైకోర్టు న్యాయవాది నిమ్మల ప్రేమ్రాజ్కు జైలుశిక్ష, జరిమానా విధిస్తూ మంగళగిరి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి శుక్రవారం తీర్పు చెప్పారు.