logo

అక్షర యోధుడు రామోజీరావుకు నివాళులర్పిద్దాం

రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్, అక్షర యోధుడు, పద్మవిభూషణ్‌ రామోజీరావు సంస్మరణ సభకు అందరూ హాజరై నివాళులర్పిద్దామని జనచైతన్య వేదిక అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి పిలుపునిచ్చారు.

Published : 04 Jul 2024 04:19 IST

7న గుంటూరులో సంస్మరణ సభ

గుంటూరు నగరం, న్యూస్‌టుడే: రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్, అక్షర యోధుడు, పద్మవిభూషణ్‌ రామోజీరావు సంస్మరణ సభకు అందరూ హాజరై నివాళులర్పిద్దామని జనచైతన్య వేదిక అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి పిలుపునిచ్చారు. గుంటూరులోని జనచైతన్య వేదిక కార్యాలయంలో ఠాగూర్‌ మెమోరియల్‌ థియేటర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఎమ్మెల్సీ లక్ష్మణరావు, మాజీమంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్‌ మాట్లాడుతూ ఈనెల 7వ తేదీన జరిగే సంస్మరణ సభకు అందరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు. విద్యావేత్తలు కన్నా మాస్టార్, మేకల రవీంద్రబాబు, ఠాగూర్‌ మెమోరియల్‌ థియేటర్‌ ట్రస్ట్‌ కార్యదర్శి రామచంద్రరాజు, మానవత వ్యవస్థాపక కార్యదర్శి రమణబాబు తదితరులు పాల్గొన్నారు.     

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని