సకుటుంబ సపరివార సమేతం!
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో నియామకాల్లో నాటి వైకాపా ప్రభుత్వ హయాంలో పూర్తిగా రాజకీయ జోక్యమే రాజ్యమేలింది.
ఏఎన్యూలోకొలువుల తీరిది
వైకాపా హయాంలో అడ్డగోలుగా నియామకాలు
ఈనాడు - అమరావతి
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో నియామకాల్లో నాటి వైకాపా ప్రభుత్వ హయాంలో పూర్తిగా రాజకీయ జోక్యమే రాజ్యమేలింది. విద్యార్హతలు, ప్రతిభను పక్కన పెట్టి.. అప్పటి ప్రభుత్వ పెద్దలు, నాటి వైకాపా ప్రజాప్రతినిధుల సిఫారసులు ఉన్న వారినే అతిథి, ఒప్పంద అధ్యాపకులుగా నియమించారు. రెగ్యులర్ అధ్యాపకులు, నాన్ టీచింగ్ ఉద్యోగుల్లో కొందరు తమ పిల్లలు, బంధువులకు కొలువులు ఇప్పించుకున్నారు. తాజాగా ప్రభుత్వం మారటంతో ఈ అడ్డగోలు నియామకాలు చర్చనీయాంశం అవుతున్నాయి. ఉపకులపతి ఆచార్య రాజశేఖర్ తన బంధువులను ఉద్యోగులుగా నియమించుకోవడం గమనార్హం. వీరికి వర్సిటీ ఆదాయాన్ని జీతాల రూపేణా భారీగా దోచిపెడుతున్నారు. అసలు వర్సిటీకి వస్తున్న ఆదాయానికి, ఖర్చుకు పొంతనే లేకుండా ఉంది. గడచిన మూడు, నాలుగేళ్లలో జీతాలు, వేతనాల వ్యయం బాగా పెరిగిందని ఫైనాన్స్ అధికారులు చెబుతున్నారు. డిపాజిట్లను సైతం తీసి జీతాలకు చెల్లించాల్సి వస్తోందంటే నియామకాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఊహించుకోవచ్చు.
- వర్సిటీ సీడీసీ డీన్ ఆచార్య మధుబాబు తన తోడల్లుడిని ఇంజినీరింగ్ కళాశాలలో అతిథి అధ్యాపకుడిగా నియమించటంలో కీలకపాత్ర పోషించారు.
- దూరవిద్య డైరెక్టర్ ఆచార్య నాగరాజు తన కుటుంబీకులు, బంధువుల పిల్లలతోపాటు ఇతరులను తీసుకొచ్చి వివిధ పోస్టింగ్లు ఇప్పించుకున్నారని బలమైన ఆరోపణలున్నాయి.
- తోడల్లుడు వసంతరావు ఎడ్యుకేషన్ డిపార్టుమెంట్లో గెస్ట్ ఫ్యాకల్టీ. మరో బంధువు అబ్రహం లింకన్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అధ్యయన కేంద్రంలో అతిథి అధ్యాపకుడు.
- మేనకోడలు క్యాజువల్ లేబర్. తన వద్ద పని చేసే ఓ స్కాలర్కు ఎంబీఏ హాస్పిటల్ అండ్ అడ్మినిస్ట్రేషన్లో గెస్ట్ ఫ్యాకల్టీగా ఉద్యోగం ఇప్పించుకున్నారు.
- ద్వితీయశ్రేణిలో ఉత్తీర్ణులైన జంగా చంద్రమోహన్ను నిబంధనలకు విరుద్ధంగా ఫైన్ ఆర్ట్స్ కళాశాలలో అతిథి అధ్యాపకుడిగా తీసుకున్నారు. ఈయన ఐదేళ్ల కోర్సును పదేళ్లకు పూర్తి చేశారు. బోధనానుభవం అంతగా లేకపోయినా అప్పటి కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య సిద్ధయ్య నియమించారు. ఆయనకు వచ్చిన మార్కులను కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్కు అప్లోడ్ చేసినప్పుడు ఏఎన్యూ మాయాజాలం ప్రదర్శించింది. ద్వితీయశ్రేణికి బదులు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైనట్లు తప్పుడు వివరాలు పంపింది. ఈ విషయం. కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్కు తెలిస్తే కళాశాలను బ్లాక్ లిస్టులో పెడుతుందని ఫైన్ఆర్ట్స్ కళాశాల అధ్యాపకులు మొత్తుకున్నా వారిని బెదిరించి మరీ తప్పుడు వివరాలు పంపారు. చంద్రమోహన్ది వర్సిటీ ఉన్నతాధికారిది ఒకే సామాజికవర్గం కావడం గమనార్హం.
- వర్సిటీ ఇంజినీర్ కుమార్రాజా తనకు వరసకు కుమార్తె అయిన ఉషా కిరణ్ను ఫైన్ ఆర్ట్స్ కళాశాలలో అతిథిÅ అధ్యాపకురాలిగా నియమింపజేశారు. ఆమెకు బోధనానుభవం అంతంతమే మాత్రమే.
- వైకాపా నాయకుడు విజయబాబు కుమార్తె శృతికీర్తిని కొత్త కోర్సు అయిన ఫెర్ఫార్మింగ్ ఆర్ట్స్ విభాధిపతిగా నియమించారు.
- ఇంజినీరింగ్ కళాశాల డీన్ ప్రొఫెసర్ సిద్ధయ్య కుమారుడు ఆర్వీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు. కానీ అతని వద్ద ఇంజినీరింగ్ విద్యార్థులు పీహెచ్డీ చేసేలా పీహెచ్డీ గైడ్షిప్ ఇప్పించుకున్నారని సమాచారం.
- వీసీ రాజశేఖర్ వద్ద గతంలో స్కాలర్గా ఉన్న రాజ్కుమార్కు సోషియాలజీలో గెస్ట్ ఫ్యాకల్టీగా అవకాశం కల్పించారు.
- వర్సిటీ గ్రంథాలయంలో రోజువారీ వేతన ఉద్యోగిగా ఉన్న కొండలరావు దూరవిద్యలో డిగ్రీ పూర్తి చేస్తే ఆయనను లైబ్రరీ సైన్స్లో, మరో వ్యక్తి కోటేశ్వరరావును పూలే అధ్యయన కేంద్రంలో అతిథి అధ్యాపకులుగా నియమించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాడు గొప్పలు.. నేడు తిప్పలు..
[ 06-07-2024]
బడుల రూపురేఖలు మార్చేస్తామని నాడు వైకాపా సర్కారు చెప్పింది నిజమే.. వాటి రూపును దారుణంగా మార్చేసి విద్యార్థులు, ఉపాధ్యాయులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. -
పాత్రధారులు సరే.. సూత్రధారులు ఎక్కడ?
[ 06-07-2024]
ఉమ్మడి గుంటూరులో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పరిధిలో నకిలీ పాసుపుస్తకాలు, అడంగల్, 1బీ, నకిలీ చిరునామా ధ్రువపత్రాలు పెట్టి రూ.కోట్లు కొల్లగొట్టారు. -
ఉల్లంఘనలు దండి.. ఆదాయానికి గండి..
[ 06-07-2024]
గుంటూరు నగర పట్టణ ప్రణాళిక విభాగం అవినీతి, అక్రమాల్లో మునిగితేలుతోంది. భవన అనుమతుల ఫీజుల రూపేణా నగరపాలికకు రావాల్సిన ఆదాయానికి ప్రణాళికాధికారులే గండికొట్టి తమ సొంత జేబులు నింపుకొంటున్నారు. -
నాణ్యత డొల్ల.. కష్టాలు నిలువెల్లా
[ 06-07-2024]
‘నాడు-నేడు’ పనులతో పాఠశాలల రూపురేఖలు మార్చేశాం.. మునుపెన్నడూ లేనిరీతిలో తరగతి గదులు నిర్మించాం.. సకల సౌకర్యాలు కల్పించాం’ అంటూ ఊదరగొట్టిన మాజీ సీఎం జగన్ మాటలన్నీ బూటకాలేనని నాటి లోపాలు నేడు ఒక్కొకటిగా బయటపడుతున్నాయి. -
పిన్నెల్లి అరాచకాలపై చర్చిద్దామా?
[ 06-07-2024]
‘మీకు ధైర్యముంటే మాచర్లలో ఒక వేదిక ఏర్పాటు చేద్దాం.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎన్ని ఆస్తులు దోపిడీ చేశాడో, ఎంత గ్రానైట్ తరలించాడో.. ఎంత గ్రావెల్ అమ్ముకున్నాడో చర్చిద్దామా?’ అంటూ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి మాజీ సీఎం జగన్కు సవాల్ విసిరారు. -
లక్ష్యం 100 రోజులు.. 3,600 ఇళ్లు
[ 06-07-2024]
జిల్లాలో గృహ నిర్మాణాలను వేగవంతం చేసి లబ్ధిదారులకు అందజేసేలా చూడాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. -
జలవనరులకు జవసత్వాలు
[ 06-07-2024]
ఐదేళ్ల వైకాపా పాలనలో జలవనరుల కనీస నిర్వహణకు నిధులు కేటాయించకపోవడంతో నిర్వీర్యమయ్యాయి. -
బాలికలూ.. ఇబ్బందులు ఎదురైతే చెప్పండి
[ 06-07-2024]
లైంగిక వేధింపులకు గురైన విద్యార్థినులు వెంటనే తమకు జరిగిన అన్యాయం ఇంట్లో తల్లిదండ్రులు, పోలీసులకు తెలియజేయడం ద్వారా అటువంటి నేరాలకు అడ్డుకట్ట వేయవచ్చని జిల్లా బాలికా పరిరక్షణ అధికారులు శ్రీప్రియ, కృష్ణ పేర్కొన్నారు. -
ఓపీకి వెళితే బీపీ ఖాయం!
[ 06-07-2024]
గుంటూరులోని సర్వజన ఆసుపత్రిలో ఓపీ సేవలందించేందుకు 11 కౌంటర్లున్నాయి. 70 మందికిపైగా నర్సింగ్ విద్యార్థులను నియమించారు. -
ఆరు జీవితాలకు వరప్రసాదం!
[ 06-07-2024]
పుట్టెడు దుఃఖంలోనూ పలువురి ప్రాణాలు కాపాడేందుకు ఆ కుటుంబం ముందుకు వచ్చింది. -
‘పిన్నెల్లిని జగన్ పరామర్శించడం సిగ్గుచేటు’
[ 06-07-2024]
ప్రజలు తమ పవిత్రమైన ఓటు వేసే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం)ను ధ్వంసం చేసి జైలులో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి జైలుకు వెళ్లి పరామర్శించడం సిగ్గుచేటని -
జల్సాలకు అలవాటు పడ్డారు.. దొంగతనాల వైపు మళ్లారు
[ 06-07-2024]
జల్సాలకు అలవాటు పడిన యువకులు ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతూ పొలీసులకు దొరికిపోయారు. -
హైకోర్టు న్యాయవాదికి జైలుశిక్ష, జరిమానా
[ 06-07-2024]
భార్యను వేధించిన కేసులో హైకోర్టు న్యాయవాది నిమ్మల ప్రేమ్రాజ్కు జైలుశిక్ష, జరిమానా విధిస్తూ మంగళగిరి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి శుక్రవారం తీర్పు చెప్పారు.