త్వరలో రాజధానుల మధ్య రయ్రయ్!
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కీలకమైన బీబీనగర్(పగిడిపల్లి) - నల్లపాడు మధ్య రెండో రైల్వే లైను నిర్మాణం, విద్యుదీకరణ పనులు ఎట్టకేలకు పట్టాలెక్కాయి. ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్టు తొలి దశ పనులు ప్రారంభమయ్యాయి.
పట్టాలెక్కిన నల్లపాడు-బీబీనగర్ ప్రాజెక్టు
తొలి దశలో రూ.570 కోట్లతో రెండో రైల్వే లైను పనులు
గుంటూరు రైల్వే, న్యూస్టుడే
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కీలకమైన బీబీనగర్(పగిడిపల్లి) - నల్లపాడు మధ్య రెండో రైల్వే లైను నిర్మాణం, విద్యుదీకరణ పనులు ఎట్టకేలకు పట్టాలెక్కాయి. ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్టు తొలి దశ పనులు ప్రారంభమయ్యాయి. కుక్కడం-నడికుడి మధ్య 47 కి.మీ పనులు చేపట్టేందుకు ఇటీవలే గుత్తేదారుడ్ని ఎంపిక చేశారు. ఈ పనులకు రూ.570 కోట్లు ఖర్చు చేస్తున్నారు.
మొత్తం నాలుగు దశల్లో..
నల్లపాడు-బీబీనగర్ మధ్య 248 కి.మీ లైను నిర్మాణానికి రూ.2,853 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశారు. ఈ మొత్తాన్ని పూర్తిగా కేంద్రమే భరించనుంది. ఈ మార్గం మొత్తం నాలుగు దశల్లో పూర్తి చేయాలని కన్స్ట్రక్షన్ విభాగం అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. తొలి దశలో కుక్కడం-నడికుడి పనులకు ఇప్పటికే కాంట్రాక్టరును ఎంపిక చేశారు. రెండో దశలో కుక్కడం-వలిగొండ పనులకు టెండర్లు పిలిచారు. ఈ పనులు ఆగస్టులో ప్రారంభం కానున్నాయి. మూడు, నాలుగు దశల పనులు తర్వాత చేపట్టనున్నారు. రెండో రైల్వే లైను నిర్మాణానికి మొత్తం 200 హెక్టార్ల భూమి అవసరమని అంచనా వేశారు. ఇందులో ఏపీ పరిధిలో 135 హెక్టార్లు.. మిగిలింది తెలంగాణలో ఉంది. భూసేకరణ అవసరం లేని చోట పనులకు ముందుగా టెండర్లు పిలుస్తున్నారు.
ఈ మార్గంలో సింగిల్ లైను
సికింద్రాబాద్ నుంచి బీబీనగర్ వరకు రెండులైన్ల రైలు మార్గం ఉంది. ఆ తర్వాత పగిడిపల్లి స్టేషన్ నుంచి నల్గొండ-మిర్యాలగూడ.. ఆంధ్రప్రదేశ్లోని నల్లపాడు వరకు ఒక లైను మాత్రమే ఉంది. దీంతో ఈ మార్గంలో ఒక రైలు వస్తుంటే మరో బండిని స్టేషన్లో ఆపాల్సి వస్తోంది. ట్రాక్ సామర్థ్యంతో పోలిస్తే 140 శాతం రైళ్లు నడుస్తున్నాయి. ప్రయాణికుల రద్దీ, అవసరాల దృష్ట్యా ఈ మార్గాన రెండో లైను నిర్మాణానికి సంబంధించిన సర్వే నివేదికను రైల్వే బోర్డు పరిశీలించి ఆమోదించింది. మొత్తం 248 కి.మీ లైనుకు రూ.2,853 కోట్లు అవసరమని ఇంజినీరింగ్ అధికారులు అంచనా వేశారు. దీనికి కేంద్ర కేబినెట్ కమిటీ నిరుడే ఆమోదముద్ర వేసింది. రద్దీ మార్గం కావడంతో రైల్వే బోర్డు అధికారులు ఈ ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు సానుకూలంగా ఉన్నారు.
మూడు గంటల్లోనే సికింద్రాబాద్కు
పనులు పూర్తయితే రైలులో గుంటూరు నుంచి సికింద్రాబాద్కు కేవలం మూడు గంటల్లోనే చేరుకోవచ్చని భావిస్తున్నారు. దీనివల్ల రెండు రాష్ట్రాల రాజధానుల మధ్య రాకపోకలు సులువు కానున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాడు గొప్పలు.. నేడు తిప్పలు..
[ 06-07-2024]
బడుల రూపురేఖలు మార్చేస్తామని నాడు వైకాపా సర్కారు చెప్పింది నిజమే.. వాటి రూపును దారుణంగా మార్చేసి విద్యార్థులు, ఉపాధ్యాయులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. -
పాత్రధారులు సరే.. సూత్రధారులు ఎక్కడ?
[ 06-07-2024]
ఉమ్మడి గుంటూరులో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పరిధిలో నకిలీ పాసుపుస్తకాలు, అడంగల్, 1బీ, నకిలీ చిరునామా ధ్రువపత్రాలు పెట్టి రూ.కోట్లు కొల్లగొట్టారు. -
ఉల్లంఘనలు దండి.. ఆదాయానికి గండి..
[ 06-07-2024]
గుంటూరు నగర పట్టణ ప్రణాళిక విభాగం అవినీతి, అక్రమాల్లో మునిగితేలుతోంది. భవన అనుమతుల ఫీజుల రూపేణా నగరపాలికకు రావాల్సిన ఆదాయానికి ప్రణాళికాధికారులే గండికొట్టి తమ సొంత జేబులు నింపుకొంటున్నారు. -
నాణ్యత డొల్ల.. కష్టాలు నిలువెల్లా
[ 06-07-2024]
‘నాడు-నేడు’ పనులతో పాఠశాలల రూపురేఖలు మార్చేశాం.. మునుపెన్నడూ లేనిరీతిలో తరగతి గదులు నిర్మించాం.. సకల సౌకర్యాలు కల్పించాం’ అంటూ ఊదరగొట్టిన మాజీ సీఎం జగన్ మాటలన్నీ బూటకాలేనని నాటి లోపాలు నేడు ఒక్కొకటిగా బయటపడుతున్నాయి. -
పిన్నెల్లి అరాచకాలపై చర్చిద్దామా?
[ 06-07-2024]
‘మీకు ధైర్యముంటే మాచర్లలో ఒక వేదిక ఏర్పాటు చేద్దాం.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎన్ని ఆస్తులు దోపిడీ చేశాడో, ఎంత గ్రానైట్ తరలించాడో.. ఎంత గ్రావెల్ అమ్ముకున్నాడో చర్చిద్దామా?’ అంటూ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి మాజీ సీఎం జగన్కు సవాల్ విసిరారు. -
లక్ష్యం 100 రోజులు.. 3,600 ఇళ్లు
[ 06-07-2024]
జిల్లాలో గృహ నిర్మాణాలను వేగవంతం చేసి లబ్ధిదారులకు అందజేసేలా చూడాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. -
జలవనరులకు జవసత్వాలు
[ 06-07-2024]
ఐదేళ్ల వైకాపా పాలనలో జలవనరుల కనీస నిర్వహణకు నిధులు కేటాయించకపోవడంతో నిర్వీర్యమయ్యాయి. -
బాలికలూ.. ఇబ్బందులు ఎదురైతే చెప్పండి
[ 06-07-2024]
లైంగిక వేధింపులకు గురైన విద్యార్థినులు వెంటనే తమకు జరిగిన అన్యాయం ఇంట్లో తల్లిదండ్రులు, పోలీసులకు తెలియజేయడం ద్వారా అటువంటి నేరాలకు అడ్డుకట్ట వేయవచ్చని జిల్లా బాలికా పరిరక్షణ అధికారులు శ్రీప్రియ, కృష్ణ పేర్కొన్నారు. -
ఓపీకి వెళితే బీపీ ఖాయం!
[ 06-07-2024]
గుంటూరులోని సర్వజన ఆసుపత్రిలో ఓపీ సేవలందించేందుకు 11 కౌంటర్లున్నాయి. 70 మందికిపైగా నర్సింగ్ విద్యార్థులను నియమించారు. -
ఆరు జీవితాలకు వరప్రసాదం!
[ 06-07-2024]
పుట్టెడు దుఃఖంలోనూ పలువురి ప్రాణాలు కాపాడేందుకు ఆ కుటుంబం ముందుకు వచ్చింది. -
‘పిన్నెల్లిని జగన్ పరామర్శించడం సిగ్గుచేటు’
[ 06-07-2024]
ప్రజలు తమ పవిత్రమైన ఓటు వేసే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం)ను ధ్వంసం చేసి జైలులో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి జైలుకు వెళ్లి పరామర్శించడం సిగ్గుచేటని -
జల్సాలకు అలవాటు పడ్డారు.. దొంగతనాల వైపు మళ్లారు
[ 06-07-2024]
జల్సాలకు అలవాటు పడిన యువకులు ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతూ పొలీసులకు దొరికిపోయారు. -
హైకోర్టు న్యాయవాదికి జైలుశిక్ష, జరిమానా
[ 06-07-2024]
భార్యను వేధించిన కేసులో హైకోర్టు న్యాయవాది నిమ్మల ప్రేమ్రాజ్కు జైలుశిక్ష, జరిమానా విధిస్తూ మంగళగిరి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి శుక్రవారం తీర్పు చెప్పారు.