పేదల బియ్యాన్ని బొక్కేశారు
పేదల బియ్యాన్ని వైకాపా రేషన్ డీలర్లు బొక్కేశారు. క్వింటాళ్ల కొద్దీ నల్లబజారులో తెగ నమ్ముకున్నారు. ఆన్లైన్లో నిల్వ చూపిస్తున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం కనిపించడం లేదు.
చోద్యం చూసిన యంత్రాంగం
మాచవరం, న్యూస్టుడే
పేదల బియ్యాన్ని వైకాపా రేషన్ డీలర్లు బొక్కేశారు. క్వింటాళ్ల కొద్దీ నల్లబజారులో తెగ నమ్ముకున్నారు. ఆన్లైన్లో నిల్వ చూపిస్తున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం కనిపించడం లేదు. గత ఐదేళ్లు రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ అధికారులెవరూ పట్టించుకోలేదు. ప్రభుత్వం మారి దుకాణాల నిర్వహణ చేతులు మారడంతో ఈ తతంగం వెలుగు చూసింది. అయినా గత డీలర్లు జంకుబొంకు లేకుండా వ్యవహరిస్తున్నారు. అధికార యంత్రాంగం నిల్వలు తీసుకురమ్మని కోరుతున్నా లెక్కపెట్టడం లేదు. పైగా 6ఏ కేసు నమోదు చేసుకోవాలని బరితెగించి మాట్లాడుతున్నారు. అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో ప్రభుత్వ సొమ్ము పరులపాలైందన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
మండలంలో పరిస్థితి ఇదీ..
మండలంలో 37 చౌక ధరల దుకాణాలు ఉన్నాయి. వీటి పరిధిలో 17,481 కార్డుదారులు, 49,423 సభ్యులు ఉన్నారు. ప్రతినెలా ప్రభుత్వం వీరికి బియ్యంతోపాటు పంచదార, కందిపప్పు అందిస్తోంది. అప్పుడప్పుడు గోధుమ పండి సరఫరా చేశారు. వైకాపా అధికారంలోకి వచ్చాక, చౌక దుకాణాలన్నీ ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల చేతుల్లోకి వెళ్లాయి. బయోమెట్రిక్ విధానం ద్వారా సరకులు పంపిణీ చేస్తున్నా, పిన్నెల్లి, గంగిరెడ్డిపాలెం, మాచవరంతోపాటు మరికొన్ని గ్రామాల్లో ముందుగానే బియ్యం అమ్ముకుని కార్డుదారులకు ఎంతోకొంత డబ్బులు ముట్టజెప్పేవారు. అలా ఐదేళ్లు గోదాములో పడ్డ ఎలుకల మాదిరిగా తినేశారు. విషయం రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ అధికారులకు తెలిసినా, ఏనాడు దుకాణాలు తనిఖీ చేసి చర్యలు తీసుకోలేదు. డీలర్లకు ఇష్టారాజ్యంగా మారింది. కందిపప్పు, పంచదార రాలేదని బియ్యంతోపాటు కార్డుదారులతో వేలిముద్ర వేయించుకుని బహిరంగ మార్కెట్లో అమ్ముకున్నారు. ప్రస్తుతం ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడంతో దుకాణాల నిర్వహణ మారింది. కొత్తవారు బాధ్యతలు తీసుకునే ముందు నిల్వలు చూస్తే, పెద్ద ఎత్తున అవినీతి బాగోతం బయట పడింది. దీంతో అధికారులు ఉరుకులు, పరుగులు పెడుతున్నారు.
ఆన్లైన్లోనే నిల్వలు..
రెవెన్యూ అధికారులు జూన్ నెలాఖరున నిల్వలు పరిశీలించినప్పుడు కళ్లు చెదిరే విషయాలు వెలుగు చూశాయి.
గంగిరెడ్డిపాలెంలోని రేషన్ దుకాణాన్ని పరిశీలిస్తే.. ఆన్లైన్లో 120.35 క్వింటాళ్ల బియ్యం నిల్వలు ఉంటే, క్షేత్ర స్థాయిలో 15 క్వింటాళ్లు మాత్రమే దర్శనమిచ్చాయి. 105.35 క్వింటాళ్లు పక్కదారి పట్టాయి. ఇక్కడ డ్వాక్రా సంఘం ముసుగులో నిర్వహణ చూస్తున్న యువకుడిని అడిగితే, 6ఏ కేసు నమోదు చేసుకోమని చెప్పాడని అధికారులు వాపోయారు.
మాచవరం
దుకాణం నెంబరు 32లో 36.60 క్వింటాళ్లు ఉండాల్సి ఉండగా.. అసలు బియ్యపు గింజ కూడా కనిపించలేదు. వేమవరంలోని ఓ దుకాణంలో 41.16 క్వింటాళ్ల 0.40 క్వింటాళ్లు మాత్రమే నిల్వలు ఉన్నాయి. ఇక్కడ 40.76 క్వింటాళ్ల బియ్యం మాయమయ్యాయి.
కొత్తగణేశునిపాడు
8.85 క్వింటాళ్ల వ్యత్యాసం కనిపించింది. ఇక పిన్నెల్లి గ్రామంలో ఎన్ని పక్కదారి పట్టాయో అధికారులు నోరుమెదపడం లేదు.
దీనిపై ఉన్నతాధికారులు లోతుగా విచారించి, చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కార్డుదారులు కోరుతున్నారు. దీనిపై తహసీల్దారు శ్రీరామకృష్ణను వివరణ అడగ్గా.. ఆర్ఐ ద్వారా నివేదిక తెప్పించాం.. వివరాలన్నీ ఆర్డీవో, పౌరసరఫరాల అధికారుల దృష్టికి తీసుకెళతాం. ఉన్నతాధికారుల నిర్ణయం మేరకు తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పొలాల్లో ప్లాట్లు!
[ 07-07-2024]
వ్యవసాయ భూములను చదును చేసి తాత్కాలికంగా మట్టి రోడ్లు వేసి ప్లాట్లుగా విభజించి విక్రయిస్తున్నారు. వాస్తవానికి వ్యవసాయ భూములను ఇతర అవసరాలకు వినియోగించాలంటే మార్కెట్ విలువలో 5 శాతం సొమ్ము ప్రభుత్వానికి చెల్లించి వ్యవసాయేతర భూములుగా మార్చుకోవాలి. -
ఇదేం చెత్త పని?
[ 07-07-2024]
వైకాపా నాయకులంటే అంతే మరి. అక్రమ వసూళ్లకు అలవాటు పడిన ప్రాణాలు కదా! ఏ అవకాశాన్నీ వదులుకోవడం లేదు. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సాగించిన దందాను ప్రభుత్వం మారినా నేటికీ కొనసాగిస్తూనే ఉన్నారు. -
ఇసుక లెక్క తేలింది
[ 07-07-2024]
ల్లాలో టన్ను ఇసుక ధర సగటున రూ. 250గా కలెక్టరు ఆధ్వర్యంలోని ఇసుక కమిటీ నిర్ణయించింది. అవసరమైనవారు ఈ నెల 8న సోమవారం నుంచి నిల్వ కేంద్రాలకు వెళ్లి తెచ్చుకోవచ్చు. తెదేపా కూటమి ప్రభుత్వం ఇసుకను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. -
బడుగుజీవిపై ప్రతాపం
[ 07-07-2024]
గుంటూరు నగరపాలక సంస్థ ప్రణాళికాధికారులు పేదల పట్ల దారుణంగా వ్యవహరిస్తున్న ఉదంతాలు తరచూ వెలుగుచూస్తున్నాయి. ఇటీవల శారదాకాలనీలో ఓ నిర్మాణం వద్ద ఇంటి మెట్లు రహదారిమీదకొచ్చాయని వాటిని ధ్వంసం చేశారు. -
బకాయిలు.. అక్షరాల రూ.11కోట్లు
[ 07-07-2024]
వైకాపా ఐదేళ్ల పాలనలో పురపాలక సంఘం ఆర్థికంగా అథఃపాతాళానికి చేరింది. ఎన్నికలు నిర్వహించకుండా పురపాలికను తన గుప్పెట్లో పెట్టుకున్న అప్పటి ప్రజాప్రతినిధి ఇష్టారీతిన నిధులు ఖర్చు చేసేశారు. సాధారణ నిధులు లేకపోయినా ఎడాపెడా వినియోగించారు. -
వాయుసేనలో చేరేందుకు ఆన్లైన్లో దరఖాస్తులు
[ 07-07-2024]
అగ్నివీర్ వాయుసేనలో చేరటానికి అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని వైమానికదళ అధికారి ఎన్.సందీప్ అన్నారు. కలెక్టరేట్లో ఆయన శనివారం మాట్లాడుతూ ఈ నెల 8 నుంచి 28 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు. -
రామోజీరావు సంస్మరణ సభ నేడు
[ 07-07-2024]
రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్, పద్మవిభూషణ్ రామోజీరావు సంస్మరణ సభ గుంటూరులోని శ్రీ వేెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఆదివారం ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు జనచైతన్య వేదిక అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి తెలిపారు. -
వయస్సు..57 సెంచరీలు..100
[ 07-07-2024]
ఆరోగ్యంగా ఉండాలని అందరం అనుకుంటాం. అందుకోసం రన్నింగ్, వాకింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, యోగా చేస్తుంటాం. కానీ కొన్ని రోజులు గడిచాక ఏవో పనులు, ఇతర వ్యాపకాలు, బద్ధకం, వాన పడుతుంది.. ఎండ ఎక్కువగా ఉంది.. ఇలా ఏవో కారణాలతో మానేస్తుంటాం. -
కనుమరుగైన నల్లమడ జాడ
[ 07-07-2024]
నల్లమడ వాగు మూడు జిల్లాల్లో లక్ష ఎకరాల్లో పంటల ముంపునకు కారణమవుతోంది. ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి వాగు ఆధునికీకరణకు గత తెదేపా ప్రభుత్వ హయాంలో బీజం పడింది. రూ.360 కోట్ల అంచనాతో పనులు చేపట్టడానికి ఆమోదం లభించింది. -
ఇసుక ప్రైవేటుగా విక్రయిస్తే చర్యలు
[ 07-07-2024]
జిల్లాలో సోమవారం నుంచి ఉచిత ఇసుక విధానం చేపడుతున్నట్లు గనులు భూగర్భ శాఖ జిల్లా అధికారి నాగిని తెలిపారు. నరసరావుపేటలోని జిల్లా కార్యాలయంలో ఆమె శనివారం మాట్లాడుతూ కృష్ణానది సమీప యార్డుల్లో నిల్వ చేసిన ఇసుక టన్ను రూ.191.52గా ఉన్నతాధికారులు నిర్ణయించారన్నారు. -
అమ్మానాన్న మనసు వెన్న.. మమత మిన్న
[ 07-07-2024]
ప్రతి ఒక్కరి జీవితంలో అమ్మానాన్నలే నిండి ఉంటారు. ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రించే వరకు తల్లిదండ్రుల ఉరుకులు, పరుగుల వెనుకా పిల్లల భవితే ఉంటుంది. బాధ్యతే కనిపిస్తుంది. జీవన పయనంలో వేగం, ఆధునికత పెరిగే కొద్దీ బంధాలు, వాటిని దగ్గరి నుంచి ఆస్వాదించే సమయాలు కరవై పోయాయి. -
ముందుగా వచ్చిన వారికి ప్రాధాన్యం: కలెక్టర్
[ 07-07-2024]
జిల్లాలో ఈ నెల 8వ తేదీ నుంచి ఉచిత ఇసుక విధానం అమలులోకి రానుందని, ఇందుకు సంబంధించి ఎక్కడా అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. -
ఐదేళ్లుగా సామగ్రి శిథిలం..
[ 07-07-2024]
అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించ తలపెట్టిన సెక్రటేరియట్ గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో పునాదుల స్థాయిలోనే నిలిచిపోయింది. ఈ ప్రాంతంలో నిర్మాణాల కోసం సమకూర్చిన విలువైన సామగ్రి చోరీ అవకుండా కాపలాగా సిబ్బందిని ఏర్పాటు చేశారు. -
8 నుంచి ఉచిత ఇసుక
[ 07-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 8 నుంచి ఉచిత ఇసుక విధానాన్ని అమలులోకి తెచ్చిందని కలెక్టర్ జె.వెంకట మురళి తెలిపారు. ఇసుక నూతన విధానంపై జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని స్థానిక కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్లో శనివారం నిర్వహించారు. -
త్రుటిలో తప్పిన పెనుముప్పు
[ 07-07-2024]
ప్రయాణికులతో గమ్యస్థానానికి చేరుకుంటున్న ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి వంతెన రక్షణ గోడను ఢీకొనడంతో పెను ప్రమాదం తప్పింది. అందులో ప్రయాణిస్తున్న 30 మంది ప్రయాణికులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బయటపడ్డారు. -
గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఆనవాళ్లు
[ 07-07-2024]
పంచారామాల్లో మొదటి క్షేత్రమైన అమరావతి నుంచి విజయవాడ, రాజధాని ప్రాంతాలను కలిపే కీలకమైన రహదారి అది.. గత వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఈ రహదారి గుంతలమయమైనా కనీస మరమ్మతులకు నోచుకోలేదు.
తాజా వార్తలు (Latest News)
-
మీరు భలే ఉంటారు...! ఓ పోలీసు అధికారి విపరీత ప్రవర్తన
-
ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన అశ్వారావుపేట ఎస్సై మృతి
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (07/07/24)
-
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
-
అనసూయ కోడ్ రెడ్.. శ్రీలీల ఫైర్.. జాన్వీ స్టైల్
-
లక్ష ఇళ్లు అంధకారంలో.. ఉక్రెయిన్పై భీకర దాడులు!