మట్టిని మింగిన ఘనులు
అడిగేవారు లేరని... అడ్డుకునేందుకు ఎవరూ రారని... పర్యవేక్షించాల్సిన వారు పట్టించుకోరని.. మట్టి మాఫియా చెలరేగిపోతోంది. నిరుపేదల సొంతింటి కలను నిర్దాక్షిణ్యంగా చిదిమేస్తోంది.
జగనన్న కాలనీలో నేతల అక్రమ తవ్వకాలు
ఈనాడు - అమరావతి
అడిగేవారు లేరని... అడ్డుకునేందుకు ఎవరూ రారని... పర్యవేక్షించాల్సిన వారు పట్టించుకోరని.. మట్టి మాఫియా చెలరేగిపోతోంది. నిరుపేదల సొంతింటి కలను నిర్దాక్షిణ్యంగా చిదిమేస్తోంది. వారి కోసం కేటాయించిన స్థలంలో అడ్డగోలుగా మట్టి తవ్వేసి.. అందినకాడికి దండుకుంటోంది.
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఇళ్లు లేని పేదల కోసం వట్టిచెరుకూరు మండలం కొర్నెపాడు పరిధిలో నాటి వైకాపా ప్రభుత్వం 334 ఎకరాలను కొనుగోలు చేసింది. ఎకరానికి రూ. 46 లక్షల చొప్పున మొత్తం రూ. 153.64 కోట్లు వెచ్చించింది. 15 వేలమందికిపైగా పేదలకు ప్లాట్లు కేటాయించింది. 2021 జనవరిలో అప్పటి ప్రజాప్రతినిధులు ఆర్భాటంగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి చేతులు దులిపేసుకున్నారు. మౌలిక వసతులు కల్పించకపోవడంతో అవస్థల నడుమ ఇళ్ల నిర్మాణానికి లబ్ధిదారులు మొగ్గు చూపలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో కొంతమంది మాత్రమే ఇళ్లను నిర్మించుకున్నారు. మిగిలినవారు ఖాళీగా వదిలేశారు. పేదలకు పంచగా మిగిలిన సుమారు 50 ఎకరాల ఖాళీ భూమిని రెండో విడతలో ఇళ్ల పట్టాలుగా పంపిణీ చేయాలనుకున్నారు. ఈ క్రమంలో నాటి ఎమ్మెల్యే తనయుడి కన్ను పడింది. ఆయనతోపాటు మరికొందరు మట్టిదొంగల అవతారమెత్తారు. భారీగా తవ్వేసి గుంటూరు నగరంతోపాటు పరిసర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకున్నారు. 25 అడుగులకుపైగా లోతుకు తవ్వేశారు. సుమారు 15 ఎకరాల్లో అత్యంత లోతుకు తవ్వేసి ఎందుకూ పనికిరాకుండా చేశారు. ఇప్పుడది నివాసయోగ్యంగా లేదు. సుమారు రూ. 5 కోట్లకుపైగా విలువైన మట్టిని రాత్రివేళల్లో తరలించి అమ్మేసుకున్నారు. ఇపుడా ప్రాంతం చెరువులా మారింది. నివాసయోగ్యంగా ఉంచాల్సిన ఆ ప్రాంతంలో మట్టి తవ్వేస్తున్నా స్థానిక అధికారులు పట్టించుకోలేదు. ప్రస్తుతం ఈ తవ్వకాలు కాలనీలోని ప్లాట్లవైపు విస్తరిస్తోంది. ఈ ప్రాంతానికి రావాలంటే లబ్ధిదారులు భయపడే పరిస్థితి. స్థలాలన్నీ ఖాళీగా ఉండడంతో పిచ్చి మొక్కలు పెరిగి జగనన్న కాలనీ చిట్టడవిలా తయారవుతోంది. రూ. కోట్ల ప్రజాధనం వెచ్చించి కొనుగోలు చేసిన భూములను అక్రమార్కులు ఆదాయవనరుగా మార్చేసుకున్నారు.
అప్పుడు వైకాపా.. ఇప్పుడు తెదేపా
గుంటూరు జిల్లాలో ప్రభుత్వ రహదారులు, జగనన్న కాలనీల్లో రోడ్ల నిర్మాణానికి బోయపాలెం, పేరేచర్ల, నారాకోడూరు క్వారీలలో లభించే కంకర, గ్రావెల్ను మాత్రమే ఉపయోగించాలనేది నిబంధన. ఇందుకు విరుద్ధంగా వట్టిచెరుకూరు మండలం కొర్నెపాడులోని జగనన్న కాలనీలో మట్టి తవ్వి తరలిస్తున్నారు. ఇక్కడ 25 అడుగుల తర్వాత కూడా గ్రావెల్ లభిస్తుండటంతో మరింత లోతుకు తవ్వేస్తున్నారు. గుంటూరు నగరంతోపాటు పరిసర ప్రాంతాల్లోని వెంచర్లలో లోతట్టు ప్రాంతాలను మెరక చేయడానికి, ఇళ్ల స్థలాలు ఎత్తు చేసుకోవడానికి, పొలాల్లో ఎగుడుదిగుడులను సరిచేయడానికి ఈ మట్టిని తరలిస్తున్నారు. గుంటూరు నగరానికి అత్యంత సమీపంలోనే లభిస్తుండడంతో రాత్రివేళ పెద్దఎత్తున రవాణా చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత కొర్నెపాడు గ్రామానికి చెందిన కొందరు తెదేపా నేతలు సైతం మట్టి తవ్వి సొమ్ము చేసుకుంటున్నారు. అధికార పక్ష నేతలు కావడంతో యంత్రాంగం కూడా పట్టించుకోకపోవడంతో వారికి మరింత లోతుకు తవ్వుతున్నారు. రెండురోజులుగా వర్షం పడి నీరు రావడంతో తవ్వకాలు ఆగిపోయాయి. ఇప్పటికైనా అధికారులు వీటికి అడ్డుకట్ట వేయాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఒకే ఒక్క నిర్ణయం.. ఆరు జీవితాలకు వరప్రసాదం!
[ 06-07-2024]
పుట్టెడు దుఃఖంలోనూ పలువురి ప్రాణాలు కాపాడేందుకు ఆ కుటుంబం ముందుకు వచ్చింది. -
నాడు గొప్పలు.. నేడు తిప్పలు..
[ 06-07-2024]
బడుల రూపురేఖలు మార్చేస్తామని నాడు వైకాపా సర్కారు చెప్పింది నిజమే.. వాటి రూపును దారుణంగా మార్చేసి విద్యార్థులు, ఉపాధ్యాయులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. -
పాత్రధారులు సరే.. సూత్రధారులు ఎక్కడ?
[ 06-07-2024]
ఉమ్మడి గుంటూరులో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పరిధిలో నకిలీ పాసుపుస్తకాలు, అడంగల్, 1బీ, నకిలీ చిరునామా ధ్రువపత్రాలు పెట్టి రూ.కోట్లు కొల్లగొట్టారు. -
ఉల్లంఘనలు దండి.. ఆదాయానికి గండి..
[ 06-07-2024]
గుంటూరు నగర పట్టణ ప్రణాళిక విభాగం అవినీతి, అక్రమాల్లో మునిగితేలుతోంది. భవన అనుమతుల ఫీజుల రూపేణా నగరపాలికకు రావాల్సిన ఆదాయానికి ప్రణాళికాధికారులే గండికొట్టి తమ సొంత జేబులు నింపుకొంటున్నారు. -
నాణ్యత డొల్ల.. కష్టాలు నిలువెల్లా
[ 06-07-2024]
‘నాడు-నేడు’ పనులతో పాఠశాలల రూపురేఖలు మార్చేశాం.. మునుపెన్నడూ లేనిరీతిలో తరగతి గదులు నిర్మించాం.. సకల సౌకర్యాలు కల్పించాం’ అంటూ ఊదరగొట్టిన మాజీ సీఎం జగన్ మాటలన్నీ బూటకాలేనని నాటి లోపాలు నేడు ఒక్కొకటిగా బయటపడుతున్నాయి. -
పిన్నెల్లి అరాచకాలపై చర్చిద్దామా?
[ 06-07-2024]
‘మీకు ధైర్యముంటే మాచర్లలో ఒక వేదిక ఏర్పాటు చేద్దాం.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎన్ని ఆస్తులు దోపిడీ చేశాడో, ఎంత గ్రానైట్ తరలించాడో.. ఎంత గ్రావెల్ అమ్ముకున్నాడో చర్చిద్దామా?’ అంటూ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి మాజీ సీఎం జగన్కు సవాల్ విసిరారు. -
లక్ష్యం 100 రోజులు.. 3,600 ఇళ్లు
[ 06-07-2024]
జిల్లాలో గృహ నిర్మాణాలను వేగవంతం చేసి లబ్ధిదారులకు అందజేసేలా చూడాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. -
జలవనరులకు జవసత్వాలు
[ 06-07-2024]
ఐదేళ్ల వైకాపా పాలనలో జలవనరుల కనీస నిర్వహణకు నిధులు కేటాయించకపోవడంతో నిర్వీర్యమయ్యాయి. -
బాలికలూ.. ఇబ్బందులు ఎదురైతే చెప్పండి
[ 06-07-2024]
లైంగిక వేధింపులకు గురైన విద్యార్థినులు వెంటనే తమకు జరిగిన అన్యాయం ఇంట్లో తల్లిదండ్రులు, పోలీసులకు తెలియజేయడం ద్వారా అటువంటి నేరాలకు అడ్డుకట్ట వేయవచ్చని జిల్లా బాలికా పరిరక్షణ అధికారులు శ్రీప్రియ, కృష్ణ పేర్కొన్నారు. -
ఓపీకి వెళితే బీపీ ఖాయం!
[ 06-07-2024]
గుంటూరులోని సర్వజన ఆసుపత్రిలో ఓపీ సేవలందించేందుకు 11 కౌంటర్లున్నాయి. 70 మందికిపైగా నర్సింగ్ విద్యార్థులను నియమించారు. -
‘పిన్నెల్లిని జగన్ పరామర్శించడం సిగ్గుచేటు’
[ 06-07-2024]
ప్రజలు తమ పవిత్రమైన ఓటు వేసే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం)ను ధ్వంసం చేసి జైలులో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి జైలుకు వెళ్లి పరామర్శించడం సిగ్గుచేటని -
జల్సాలకు అలవాటు పడ్డారు.. దొంగతనాల వైపు మళ్లారు
[ 06-07-2024]
జల్సాలకు అలవాటు పడిన యువకులు ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతూ పొలీసులకు దొరికిపోయారు. -
హైకోర్టు న్యాయవాదికి జైలుశిక్ష, జరిమానా
[ 06-07-2024]
భార్యను వేధించిన కేసులో హైకోర్టు న్యాయవాది నిమ్మల ప్రేమ్రాజ్కు జైలుశిక్ష, జరిమానా విధిస్తూ మంగళగిరి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి శుక్రవారం తీర్పు చెప్పారు.