రాజధానిలో ఇసుక దందా
రాజధానిలో ఇసుక అక్రమ రవాణా ఆగడం లేదు. రాజధాని గ్రామం ఉద్దండరాయునిపాలెంలో ముళ్లపొదల చాటున కొందరు వ్యక్తులు అక్రమంగా ఇసుక నిల్వ చేసి రాత్రి వేళ గుట్టు చప్పుడు కాకుండా అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు.
మాజీ ఎంపీ నందిగం సురేష్ సోదరుడు, అనుచరుల అక్రమాలు
శంకుస్థాపన ప్రాంతానికి సమీపంలో నిల్వ చేసిన ఇసుక
తుళ్లూరు, న్యూస్టుడే: రాజధానిలో ఇసుక అక్రమ రవాణా ఆగడం లేదు. రాజధాని గ్రామం ఉద్దండరాయునిపాలెంలో ముళ్లపొదల చాటున కొందరు వ్యక్తులు అక్రమంగా ఇసుక నిల్వ చేసి రాత్రి వేళ గుట్టు చప్పుడు కాకుండా అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ పెదనాన్న కుమారుడు (వరుసకు సోదరుడు) నందిగం ప్రభుదాస్ అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తూ ఆదివారం అర్ధరాత్రి పోలీసులకు పట్డుబడ్డారు. ఆయనతోపాటు పాటు లారీ ఓనరు సుధీర్, ఇద్దరు డ్రైవర్లను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వారిని మంగళవారం స్టేషన్ బెయిల్పై విడుదల చేశారు. ఈ ఘటనలో ఇసుక లారీని, దాని వెనుక రక్షణగా వస్తున్న మరో కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సురేష్ అనుచరులైన వీరు గతంలో పెద్ద ఎత్తున అక్రమ ఇసుక తవ్వకాలకు పాల్పడ్డారు. పోలీసులు చర్యలు తీసుకోకుండా వారిపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చారు. ఎన్టీయే కూటమి అధికారంలోకి వచ్చినా వారి ఆగడాలకు అంతులేకుండా పోతుందని, పవిత్రమైన రాజధాని శంకుస్థాపన ప్రాంతాన్ని గత వైకాపా ప్రభుత్వం ఇసుక మాఫియాకు అడ్డాగా మార్చిందని రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చుట్టూ నిల్వలే..
అధికార పార్టీ అండదండలతో అప్పట్లో గ్రామంలో నివాసం ఉన్న ఓ ప్రజా ప్రతినిధి అనుచరులు యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు జరిపారు. ప్రభుత్వానికి ఒక్క పైసా చెల్లించకుండా అక్రమ మార్గంలో వందల సంఖ్యలో లారీల్లో ఇసుక అమ్మి సొమ్ము చేసుకున్నారు. ప్రస్తుతం గ్రామంలో ఎక్కడ చూసినా గుట్టలుగా ఇసుక నిల్వలు దర్శనమిస్తున్నాయి. అప్పట్లో పనిచేసిన అధికారులు వైకాపా నాయకులతో అంట కాగి అక్రమార్కులకు సహకరించారన్న ఆరోపణలు ఉన్నాయి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాలుగేళ్లయినా.. ఒక్కటీ పూర్తి చేయలేదాయె!
[ 05-07-2024]
ఏదైనా ఒక భవనం నిర్మించేందుకు గట్టిగా రెండు నుంచి నాలుగు నెలల సమయం పడుతుంది. గత ప్రభుత్వంలో అంగన్వాడీ కేంద్రాల భవనాల నిర్మాణ పనులను పూర్తి చేయడానికి ఏకంగా అయిదేళ్లు చాలకపోవడం విశేషం. -
జీఎస్టీ ఎగవేసి సిగరెట్ల అక్రమ రవాణా
[ 05-07-2024]
జీఎస్టీ చెల్లించకుండా కొరియర్ ద్వారా విజయవాడకు అక్రమంగా తరలించిన రూ.2.46 కోట్ల విలువైన సిగరెట్లను సెంట్రల్ జీఎస్టీ అధికారులు పట్టుకున్నారు. -
ఆ జీవోలు రద్దు చేయండి
[ 05-07-2024]
ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సగం సీట్లను సెల్ఫ్ ఫైనాన్స్, ఎన్ఆర్ఐ కేటగిరి సీట్ల పేరుతో అమ్మకానికి వీలుగా గత ప్రభుత్వం తెచ్చిన జీవో 107, 108లు రద్దు చేయాలని ఏపీ మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు కోరారు. -
వైద్యశాలకు చికిత్స తప్పదిక!
[ 05-07-2024]
గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలను తక్షణం ప్రక్షాళన చేయాల్సిన ఆవశ్యకత ఉందని గుంటూరు ఎంపీ, కేంద్ర సహాయమంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గుర్తించారు -
ఇక మార్గం సుగమం
[ 05-07-2024]
గుంటూరు నుంచి హైదరాబాద్ మార్గంలో పేరేచర్ల నుంచి కొండమోడు వరకు నాలుగు వరుసల రహదారిగా విస్తరణకు మార్గం సుగమమైంది. -
పాత్రదారులు సరే.. సూత్రధారులు ఎక్కడ?
[ 05-07-2024]
ఉమ్మడి గుంటూరులో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పరిధిలో నకిలీ పాసుపుస్తకాలు, అడంగల్, 1బీ, నకిలీ చిరునామా ధ్రువపత్రాలు పెట్టి రూ.కోట్లు కొల్లగొట్టారు. -
ముందస్తు బెయిల్కు నిందితుల ప్రయత్నాలు!
[ 05-07-2024]
తెదేపా కేంద్ర కార్యాలయంపై విధ్వంసానికి తెగబడిన వైకాపా అల్లరిమూకలు పోలీసుల కంటపడకుండా అజ్ఞాతంలోకి జారుకున్నారు. బుధవారం ఐదుగురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించడంతో మిగిలిన నిందితుల్లో భయం పట్టుకుంది. -
మాట వినకుంటే గంజాయి కేసు పెడతా
[ 05-07-2024]
కౌలు రైతుపై నల్లపాడు పోలీసులు గురువారం జులుం ప్రదర్శించారు. అదేమని ప్రశ్నించిన అతనిపై ఏకంగా గంజాయి కేసు పెడతామని బెదిరించారు. -
నాడు.. ప్రభుత్వ నిర్వాకం.. నేడు.. పిల్లలకు శాపం
[ 05-07-2024]
గత వైకాపా ప్రభుత్వం సర్కారీ బడుల రూపురేఖలు మార్చేస్తామని ఎంతో ఆర్భాటం చేసింది. పాఠశాలల్లో మరమ్మతులు.. అదనపు గదుల నిర్మాణాలు చేపట్టి పిల్లల చదువులకు ఆటంకం, అసౌకర్యం లేకుండా చూస్తామన్న జగన్ తాను అధికారం నుంచి దిగిపోయే నాటికి మన బడి నాడు-నేడు కింద రెండో విడతలో ఎంపికైన పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన పూర్తిస్థాయిలో పట్టుమని పది శాతం పాఠశాలల్లో పూర్తి చేయలేదు -
మారాలి.. అంటకాగిన ఖాకీలు
[ 05-07-2024]
తనను సొంత మామ లైంగిక వేధింపులు గురిచేస్తున్నాడని, స్థానిక పోలీసులకు చెప్పినా పట్టించుకోలేదని, మామ నుంచి తనను రక్షించాలని బొల్లాపల్లి మండలం లాలిపురం గ్రామానికి చెందిన ఓ మహిళ ఎస్పీకి మొరపెట్టుకుంది. -
విస్తరణతోనే ప్రగతి బాట
[ 05-07-2024]
గుంటూరు-బాపట్ల-చీరాల(జీబీసీ) రాష్ట్ర రహదారిని నాలుగు వరుసల మార్గంగా విస్తరించాలని దశాబ్దాలుగా ప్రతిపాదనలు ఉన్నాయి. నిత్యం వేలాది వాహనాల రాకపోకలతో అత్యంత రద్దీగా ఉండే మార్గమిది -
ఇంటర్ విద్యార్థులకు తీపికబురు
[ 05-07-2024]
‘ఇంటర్ విద్యార్థులకు గతంలో ఉచిత పుస్తకాలు అందజేసేవారు... వైకాపా ప్రభుత్వ హయాంలో ఒక్క ఏడాది మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకొంది.. -
మేనమామనని చెప్పి చిన్నారుల పొట్ట కొట్టాడా?: అధికారులతో మంత్రి లోకేశ్
[ 05-07-2024]
మధ్యాహ్న భోజన పథకం, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలపై మంత్రి నారా లోకేశ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘అదానీ’పై హిండెన్బర్గ్ ఆరోపణల్లో చైనా హస్తం?.. మహేశ్ జెఠ్మలానీ సంచలన ఆరోపణలు!
-
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ
-
‘మీర్జాపూర్’ ఎంతో ప్రేక్షకాదరణ పొందింది.. వాటిని పట్టించుకోవద్దు: విజయ్ వర్మ
-
అమరావతి నిర్మాణానికి తెదేపా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు విరాళం
-
బుమ్రాను ఎనిమిదో వింతగా గుర్తించాలి: పిటిషన్పై సంతకం చేస్తానన్న కోహ్లీ
-
పెద్ద అంబర్పేట సమీపంలో పోలీసుల కాల్పులు