గుంటూరు ఛానల్ అభివృద్ధికి అధిక ప్రాధాన్యం
దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న గుంటూరు ఛానల్ అభివృద్ధికి తెదేపా కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు స్పష్టం చేశారు.
మాట్లాడుతున్న ఎమ్మెల్యే రామాంజనేయులు
పట్టాభిపురం, న్యూస్టుడే: దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న గుంటూరు ఛానల్ అభివృద్ధికి తెదేపా కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు స్పష్టం చేశారు. గుంటూరులోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘గుంటూరు ఛానల్ను పొడిగించేందుకు మొదట విడతగా రూ.110 కోట్లు బడ్జెట్లో కేటాయించాలని నిర్ణయించాం. ప్రస్తుతం 47 కిలోమీటర్లు 600 క్యూసెక్కుల సామర్థ్యం ఉన్న గుంటూరు ఛానల్ను రాబోయే రోజుల్లో 74 కిలోమీటర్లు పొడిగించి 750 క్యూసెక్కుల సామర్థ్యానికి పెంచి రైతుల ఇబ్బందులను తొలగిస్తాం. ఇందుకు మొత్తం రూ.376 కోట్లు వెచ్చించాల్సి వస్తుంది. రాబోయే అయిదేళ్లలో ఇది పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అయిదేళ్లుగా వైకాపా ప్రభుత్వం కనీసం కాల్వల్లో పూడికతీత, గుర్రపుడెక్కను తొలగించకపోవడంతో పంటలకు సాగునీరందక రైతులు ఇబ్బందులు పడ్డారు. వీటిని తొలగించేందుకు తక్షణమే రూ.1.73 కోట్లు మంజూరు చేయాలని కోరాం. షార్ట్ టెండర్ ద్వారా పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. గుత్తేదారులు ఎవరైనా అత్యాశకు పోయి 50 శాతం లెస్కు టెండర్లు వేస్తే సహించేది లేదు. గత వైకాపా ప్రభుత్వంలో ఈవిధంగానే జరిగింది. పనుల్లోనూ నాణ్యత, ప్రమాణాలు పాటించాలి. పనులు చేసిన వెంటనే బిల్లులు మంజూరయ్యేలా చూస్తాం. గత ప్రభుత్వం గుత్తేదార్లకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో పనులు జరగలేదు. రోడ్లు వేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. నియోజకవర్గంలో యుద్ధ ప్రాతిపదికన గుంతలు పూడ్చి మరమ్మతులు చేసేందుకు రూ.3.75 కోట్లు మంజూరయ్యాయి’.. అని పేర్కొన్నారు. ‘నూతన ప్రభుత్వం ఏర్పడిన పక్షం రోజుల్లోనే మొదటి తేదీనే ఉద్యోగులకు జీతాలు, విశ్రాంత ఉద్యోగులకు, పేదలకు పింఛన్లు అందజేసి చంద్రబాబు చరిత్ర సృష్టించారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో 92,138 మందికి రూ.63 కోట్లు పింఛన్లు పంపిణీ చేశాం. విద్య, ఆరోగ్యం విషయంలో ఎవరైనా తప్పు చేస్తే రాజీ పడే ప్రసక్తే లేదు. పంచాయతీ నిధుల్ని ఇష్టం వచ్చినట్లు గత పాలకులు దారి మళ్లించారు. అన్నీ లెక్కలు తీసి చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఉద్యోగుల బదిలీల్లోనూ పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తాం. మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దు’.. అని సూచించారు. సమావేశంలో డీపీఓ శ్రీదేవి, డీఐఓ సుబ్బరాజు, పలువురు తెదేపా నాయకులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఒకే ఒక్క నిర్ణయం.. ఆరు జీవితాలకు వరప్రసాదం!
[ 06-07-2024]
పుట్టెడు దుఃఖంలోనూ పలువురి ప్రాణాలు కాపాడేందుకు ఆ కుటుంబం ముందుకు వచ్చింది. -
నాడు గొప్పలు.. నేడు తిప్పలు..
[ 06-07-2024]
బడుల రూపురేఖలు మార్చేస్తామని నాడు వైకాపా సర్కారు చెప్పింది నిజమే.. వాటి రూపును దారుణంగా మార్చేసి విద్యార్థులు, ఉపాధ్యాయులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. -
పాత్రధారులు సరే.. సూత్రధారులు ఎక్కడ?
[ 06-07-2024]
ఉమ్మడి గుంటూరులో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పరిధిలో నకిలీ పాసుపుస్తకాలు, అడంగల్, 1బీ, నకిలీ చిరునామా ధ్రువపత్రాలు పెట్టి రూ.కోట్లు కొల్లగొట్టారు. -
ఉల్లంఘనలు దండి.. ఆదాయానికి గండి..
[ 06-07-2024]
గుంటూరు నగర పట్టణ ప్రణాళిక విభాగం అవినీతి, అక్రమాల్లో మునిగితేలుతోంది. భవన అనుమతుల ఫీజుల రూపేణా నగరపాలికకు రావాల్సిన ఆదాయానికి ప్రణాళికాధికారులే గండికొట్టి తమ సొంత జేబులు నింపుకొంటున్నారు. -
నాణ్యత డొల్ల.. కష్టాలు నిలువెల్లా
[ 06-07-2024]
‘నాడు-నేడు’ పనులతో పాఠశాలల రూపురేఖలు మార్చేశాం.. మునుపెన్నడూ లేనిరీతిలో తరగతి గదులు నిర్మించాం.. సకల సౌకర్యాలు కల్పించాం’ అంటూ ఊదరగొట్టిన మాజీ సీఎం జగన్ మాటలన్నీ బూటకాలేనని నాటి లోపాలు నేడు ఒక్కొకటిగా బయటపడుతున్నాయి. -
పిన్నెల్లి అరాచకాలపై చర్చిద్దామా?
[ 06-07-2024]
‘మీకు ధైర్యముంటే మాచర్లలో ఒక వేదిక ఏర్పాటు చేద్దాం.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎన్ని ఆస్తులు దోపిడీ చేశాడో, ఎంత గ్రానైట్ తరలించాడో.. ఎంత గ్రావెల్ అమ్ముకున్నాడో చర్చిద్దామా?’ అంటూ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి మాజీ సీఎం జగన్కు సవాల్ విసిరారు. -
లక్ష్యం 100 రోజులు.. 3,600 ఇళ్లు
[ 06-07-2024]
జిల్లాలో గృహ నిర్మాణాలను వేగవంతం చేసి లబ్ధిదారులకు అందజేసేలా చూడాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. -
జలవనరులకు జవసత్వాలు
[ 06-07-2024]
ఐదేళ్ల వైకాపా పాలనలో జలవనరుల కనీస నిర్వహణకు నిధులు కేటాయించకపోవడంతో నిర్వీర్యమయ్యాయి. -
బాలికలూ.. ఇబ్బందులు ఎదురైతే చెప్పండి
[ 06-07-2024]
లైంగిక వేధింపులకు గురైన విద్యార్థినులు వెంటనే తమకు జరిగిన అన్యాయం ఇంట్లో తల్లిదండ్రులు, పోలీసులకు తెలియజేయడం ద్వారా అటువంటి నేరాలకు అడ్డుకట్ట వేయవచ్చని జిల్లా బాలికా పరిరక్షణ అధికారులు శ్రీప్రియ, కృష్ణ పేర్కొన్నారు. -
ఓపీకి వెళితే బీపీ ఖాయం!
[ 06-07-2024]
గుంటూరులోని సర్వజన ఆసుపత్రిలో ఓపీ సేవలందించేందుకు 11 కౌంటర్లున్నాయి. 70 మందికిపైగా నర్సింగ్ విద్యార్థులను నియమించారు. -
‘పిన్నెల్లిని జగన్ పరామర్శించడం సిగ్గుచేటు’
[ 06-07-2024]
ప్రజలు తమ పవిత్రమైన ఓటు వేసే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం)ను ధ్వంసం చేసి జైలులో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి జైలుకు వెళ్లి పరామర్శించడం సిగ్గుచేటని -
జల్సాలకు అలవాటు పడ్డారు.. దొంగతనాల వైపు మళ్లారు
[ 06-07-2024]
జల్సాలకు అలవాటు పడిన యువకులు ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతూ పొలీసులకు దొరికిపోయారు. -
హైకోర్టు న్యాయవాదికి జైలుశిక్ష, జరిమానా
[ 06-07-2024]
భార్యను వేధించిన కేసులో హైకోర్టు న్యాయవాది నిమ్మల ప్రేమ్రాజ్కు జైలుశిక్ష, జరిమానా విధిస్తూ మంగళగిరి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి శుక్రవారం తీర్పు చెప్పారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘ఎట్టకేలకు 400 సీట్లు.. కానీ’: భాజపాపై థరూర్ సెటైర్
-
సంస్కరణవాదికే పట్టం.. ఇరాన్ కొత్త అధ్యక్షుడిగా మసౌద్ పెజెష్కియాన్..!
-
కొడాలి నాని, వాసుదేవరెడ్డిపై గుడివాడలో కేసు
-
రాజమౌళిపై నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
-
ఓపెనర్గా రావాలనుకుంటున్నా.. రోహిత్, కోహ్లీ స్థానంపై కన్నేసిన శుభ్మన్ గిల్
-
భారాసనే ఫిరాయింపులను ప్రోత్సహించింది: జీహెచ్ఎంసీ మేయర్