ఆనందం కనిపింఛెన్
‘పెద్దకొడుకులా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావ్.. మా దీవెనలు అందుకుని నిండునూరేళ్లు జీవించి పేదల అభ్యున్నతికి పాటుపడుతూ రాష్ట్ర ప్రగతికి బాటలు వేయాల’ంటూ అవ్వాతాతలు సీఎం చంద్రబాబును ఆశీర్వదించారు.
లబ్ధిదారులకు పెంచిన నగదుతో కలిపి రూ.7వేలు అందజేత
అవ్వాతాతల ముఖాల్లో రెట్టింపైన సంతోషం
ఊరూవాడా సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకాలు
ఈ చిత్రంలోని వృద్ధురాలు సన్నబోయిన లక్ష్మమ్మ. ఊరు గురజాల. సోమవారం చేతిలోకి రూ.ఏడు వేలు పింఛను నగదు అందడంతో ఆనందంతో సీఎం చంద్రబాబుకు జై అంటూ నినాదాలు చేసింది. ఆమెకు ఎవరూ లేరు. ఒంటరిగా ఉంటోంది. వచ్చే పింఛనుతోనే రోజు గడిచేది. గతంలో అనారోగ్యం వస్తే ఖరీదైన మందులు కొనుగోలు చేయడానికి ఇబ్బందిపడేది. మంచి పౌష్టికాహారం తీసుకోవాలన్నా కష్టమే. అలాంటిది రూ.ఏడు వేలు అందడంతో సమస్యలు కొంతమేర తీర్చుకోవచ్చని చెబుతోంది.
ఈ చిత్రంలోని వృద్ధురాలు కురవడి మరియమ్మ. ఊరు నరసరావుపేట మండలం రావిపాడు. ఈమెకు ఇద్దరు కుమారులు. ఒకరు వేరేచోట ఉంటే, స్థానికంగా ఉండే కుమారుడు కూడా బాగోగులు పట్టించుకోడు. దీంతో ఆమె ఒంటరిగా ఉంటోంది. సీఎం చంద్రబాబు పుణ్యాన మొదటిసారిగా రూ.ఏడు వేలు అందుకున్నానని, చాలా ఆనందంగా ఉందని, ఇంత మొత్తం అందుకుంటానని అనుకోలేదని అంటోంది. మంచి ఆహారం కొనుగోలు చేయడానికి వినియోగిస్తానని చెబుతోంది. చంద్రబాబు చల్లగా ఉండాలని దీవించింది.
ఈ చిత్రంలోని వృద్ధురాలు పూర్ణమ్మ. శావల్యాపురం మండలం కారుమంచి ఎస్టీకాలనీ. ఈమెకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె. రేకుల షెడ్డులో ఒంటరిగా ఉంటోంది. పెద్ద కుమారుడిలా సీఎం చంద్రబాబు పింఛను సొమ్ము రూ.ఏడు వేలు అందజేశారని, ఆనందంగా ఉందని చెప్పింది. నగదుతో నెల హాయిగా గడిచిపోతుందని చెబుతోంది. చంద్రన్న చల్లని చూపుతో వృద్ధులు హాయిగా కాలం వెళ్లదీస్తారని పేర్కొంది.
ఈనాడు డిజిటల్, నరసరావుపేట: ‘పెద్దకొడుకులా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావ్.. మా దీవెనలు అందుకుని నిండునూరేళ్లు జీవించి పేదల అభ్యున్నతికి పాటుపడుతూ రాష్ట్ర ప్రగతికి బాటలు వేయాల’ంటూ అవ్వాతాతలు సీఎం చంద్రబాబును ఆశీర్వదించారు. ఎన్నికల ప్రచారంలో పింఛను రూ.వెయ్యి పెంచుతున్నట్లు ప్రకటించినప్పుడు వైకాపా విమర్శించింది. హామీ ఇచ్చినప్పటి నుంచి కలిపి మూడునెలల బకాయిలతో రూ.ఏడు వేలు ఇస్తానన్నప్పుడు కూడా బాబు మాటలు నమ్మకండి అంటూ ఓటర్లను తప్పుదోవ పట్టించారు. కానీ వైకాపా కల్లబొల్లి మాటలను ఓటర్లు నమ్మలేదు. కూటమికి అఖండ మెజార్టీ సీట్లతో అధికారం కట్టబెట్టారు. అధికారంలోకి రాగానే సంక్షేమ పండగల్లో తొలి హామీని సీఎం చంద్రబాబు నెరవేర్చారు. సోమవారం ఒకటో తేదీన ఉదయం 6 గంటల నుంచే ఇంటివద్దే సచివాలయ ఉద్యోగులతో ఎన్టీఆర్ భరోసా పింఛను నగదు పంపిణీ చేయించారు. దీంతో రూ.ఏడు వేలు అందుకున్న అవ్వాతాతలు, రూ.ఆరువేలు అందుకున్న దివ్యాంగులు సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు.
పలుచోట్ల ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి..
నరసరావుపేట మండలం ఇక్కుర్రులో ఉదయం 6 గంటలకే కలెక్టర్ శ్రీకేశ్ బాలాజీరావ్, ఎమ్మెల్యే అరవిందబాబు, డీఆర్డీఏ పీడీ బాలూనాయక్ ఓ దివ్యాంగుడికి రూ.6వేలు అందజేశారు. అనంతరం అల్లూరివారిపాలెంలోని ఓ వృద్ధుడికి రూ.ఏడు వేలు అందజేశారు. మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి వెల్దుర్తిలో లబ్ధిదారులకు పింఛను పంపిణీ చేశారు. శావల్యాపురం బీసీకాలనీలో పింఛను పంపిణీలో జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జున్రావు పాల్గొన్నారు. పిడుగురాళ్లలో ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పింఛను నగదు లబ్ధిదారులకు అందజేశారు. అమరావతి మండలం లేమల్లెలో పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పాల్గొని పింఛను నగదు పంపిణీ చేశారు. మాజీమంత్రి, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు చిలకలూరిపేట రజక కాలనీలో లబ్ధిదారులకు పింఛను అందజేశారు. మొదటిరోజు సాయంత్రంలోపు 90.89 శాతం పింఛను పంపిణీ చేశామని డీఆర్డీఏ పీడీ బాలూనాయక్ అన్నారు.
గురజాల మండలం సమాధానం పేటలో కేకు కోస్తున్న కూటమి నేతలు
చిత్రపటాలకు పాలాభిషేకాలు..
అధికారంలోకి రాగానే ఇచ్చిన మాటకు కట్టుబడి సామాజిక పింఛన్లను పెంచి, పండుటాకుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసేలా చేసిన సీఎం చంద్రబాబుకు వాడవాడలా కృతజ్ఞతలు తెలిపారు. ఏడు నియోజకవర్గాల్లో కూటమి శ్రేణులు పెద్దసంఖ్యలో పాల్గొని సీఎం చంద్రబాబు చిత్రపటాలకు పాలాభిషేకాలు చేశారు. ఉదయాన్నే తమ ఇళ్లల్లోకి పండగను తీసుకొచ్చిన చంద్రబాబును తలుచుకుని దివ్యాంగులు, వృద్ధులు నమస్కరించారు. చేతికందిన పింఛను నగదు ఆదుకుంటోందని, ఎవరూ లేని తమకు ఇవే జీవనాధారమని పలువురు తెలుపుతూ కన్నీటిపర్యంతమయ్యారు. మంచానికే పరిమితమైన రోగులు, నడవలేని దివ్యాంగులు, కుమారులు వదిలేసిన వృద్ధులు ఇలా పింఛను అందుకున్న పలువురు పెంచిన నగదుతో హాయిగా నిశ్చింతంగా బతకొచ్చని ధైర్యంగా చెప్పారు.
రొంపిచర్లలో చంద్రబాబు చిత్ర పటానికి పాలాభిషేకం
ఆనందంగా ఉంది
భర్త చనిపోయి పదేళ్లు అయింది. కుమారుడు ఒక్కడు పొట్టకూటి కోసం పట్టణంలో ఉంటాడు. నాకు ఆదరవు ప్రభుత్వ పింఛను మాత్రమే. చంద్రన్న వచ్చి పింఛను రూ.4వేలకు పెంచాడు. అంతేకాక గత మూడు నెలలు, ఈనెలవి కలిపి రూ.7 వేలు ఇచ్చాడు. వచ్చేనెల నుంచి రూ.4 వేలు వస్తుంది. ఇబ్బంది లేకుండా కుమారుడిపై ఆధారపడకుండా జీవనం సాగిస్తా.
కోట ఎమేలమ్మ, లింగంగుంట్ల
చంద్రబాబుకు రుణపడి ఉంటాం
మాది సత్తెనపల్లి పట్టణంలోని 22వ వార్డు. నాకు ఇద్దరు కుమారులు. పుట్టుకతో ఇద్దరూ దివ్యాంగులే. 18 ఏళ్ల వయసులో ఓ కుమారుడు మృతి చెందాడు. ఇప్పుడున్న కుమారుడు మణికంఠకు 23 ఏళ్లు. సొంతంగా ఏ పని చేసుకోలేడు. నాతోపాటు సతీమణి శివకుమారి అనారోగ్యం బారినపడ్డాం. గత నెల వరకు నాకు, కుమారుడికి కలిపి నెలకు రూ.6 వేలు పింఛను అందేది. అందులో రూ.3 వేలు కుమారుడి ఔషధ ఖర్చులకే సరిపోయేవి. పింఛను పెంచిన చంద్రబాబుకు రుణపడి ఉంటాం.
కుంచనపల్లి శ్రీనివాసరావు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కన్నబిడ్డ కసిరింది.. కన్నపేగు కుమిలింది
[ 04-07-2024]
కన్నకుమార్తె పెళ్లి చేసుకుని రావడంతో ఆమెపై ఉన్న మమకారంతో కన్నపేగు రోదించింది. మైనార్టీ తీరిన యువతి ఓ యువకుడిని ప్రేమించి పెళ్లిచేసుకుని నేరుగా గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణ పోలీసుస్టేషన్ చేరుకుంది. -
ఆరు నెలల చిన్నారి చికిత్సకు.. ఇంజక్షన్ ఖరీదు రూ.16 కోట్లు
[ 04-07-2024]
ఊహ తెలియని పసిప్రాయం.. బోసినవ్వులతో అలరిస్తుంటే తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు మురిసిపోయారు. మా బంగారు కొండ అంటూ ముద్దు చేశారు. -
జడ్పీ భూముల్లో.. వైకాపా రాబందులు
[ 04-07-2024]
ఉమ్మడి గుంటూరులో జిల్లా పరిషత్తు భూములను అయినవారికి పంచి పెట్టేందుకు వైకాపా ప్రజాప్రతినిధులు పోటీ పడ్డారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని నిబంధనలకు నీళ్లొదిలి వాటిని చెరబట్టారు. -
జలవనరులకు జవసత్వాలు
[ 04-07-2024]
ఐదేళ్ల వైకాపా పాలనలో జలవనరుల కనీస నిర్వహణకు నిధులు కేటాయించకపోవడంతో నిర్వీర్యమయ్యాయి. వర్షాలకు వచ్చిన నీరు వచ్చినట్లే లీకేజీల ద్వారా వాగుల్లోకి వెళ్లిపోవడంతో ఆయకట్టుకు సాగు నీరు అందని పరిస్థితి. -
వీఆర్కు తుళ్లూరు సీఐ
[ 04-07-2024]
రాజధాని ప్రాంతంలోని తుళ్లూరు స్టేషన్కు గత నెల 27న సీఐగా నియామకమైన మాతంగి శ్రీనివాసరావును వీఆర్కు పంపుతూ పోలీస్ శాఖ ఉన్నతాధికారులు బుధవారం ఆదేశాలు జారీ చేశారు. -
తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో
[ 04-07-2024]
మంగళగిరిలో తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి ఘటనలో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. వైకాపా మూకలు 70 మందికి పైగా దౌర్జన్యంగా ప్రధాన గేటును ధ్వంసం చేసి లోపలికి ప్రవేశించినట్లు పోలీసులు చెబుతున్నారు. -
విత్తన లోపం.. రైతుకు శాపం
[ 04-07-2024]
2022లో దుగ్గిరాల.. 2023లో పొన్నూరు మండలాల్లో వరిలో కేళీలు వచ్చి రైతులు నష్టపోయారు. గతేడాది పొన్నూరు మండలంలోని సౌపాడు, జడవల్లి, వడ్డిముక్కల, నిడుబ్రోలు గ్రామాల్లో వరి పంటలో కేళీలు బయటపడ్డాయి. -
సైకో కిల్లర్కు జీవిత ఖైదు
[ 04-07-2024]
అమాయకమైన పసిపిల్లలను కిడ్నాప్ చేసి వారిపై దారుణంగా వ్యవహరించి హతమార్చిన సైకో కిల్లర్కు జీవిత ఖైదు, జరిమానా విధిస్తూ గుంటూరు పొక్సో కోర్టు ఇన్ఛార్జి, ఐదో అదనపు జిల్లా జడ్జి కె.నీలిమ బుధవారం తీర్పు చెప్పారు. -
నేనూ సాధారణ విద్యార్థినే..
[ 04-07-2024]
విద్యార్థి దశలో అత్తెసరు మార్కులే వచ్చేవి. పాఠశాలలో అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయా. కళాశాల నుంచి కూడా సాధారణ విద్యార్థిగానే బయటకొచ్చా. మా దగ్గరి బంధువు వ్యవసాయ శాస్త్రవేత్త. -
ఇంటర్ విద్యార్థినులకు మినీ వాహనం వితరణ
[ 04-07-2024]
వట్టిచెరుకూరు మండలంలోని పుల్లడిగుంట గ్రామానికి చెందిన ప్రవాసాంధ్రుడు ఉప్పుటూరి రామ్చౌదరి కొర్నెపాడు గ్రామంలోని జడ్పీ స్కూల్ ఇంటర్ విద్యార్థినుల సౌకర్యార్థం రూ.8 లక్షల విలువైన మినీ వాహనాన్ని (టాటా మ్యాజిక్) ఆయన తల్లి మాజీ జడ్పీటీసీ సభ్యురాలు ఉప్పుటూరి సీతామహాలక్ష్మి జ్ఞాపకార్థం వితరణగా ఇచ్చారు. -
అక్షర యోధుడు రామోజీరావుకు నివాళులర్పిద్దాం
[ 04-07-2024]
రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్, అక్షర యోధుడు, పద్మవిభూషణ్ రామోజీరావు సంస్మరణ సభకు అందరూ హాజరై నివాళులర్పిద్దామని జనచైతన్య వేదిక అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి పిలుపునిచ్చారు. -
సకుటుంబ సపరివార సమేతం!
[ 04-07-2024]
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో నియామకాల్లో నాటి వైకాపా ప్రభుత్వ హయాంలో పూర్తిగా రాజకీయ జోక్యమే రాజ్యమేలింది. -
త్వరలో రాజధానుల మధ్య రయ్రయ్!
[ 04-07-2024]
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కీలకమైన బీబీనగర్(పగిడిపల్లి) - నల్లపాడు మధ్య రెండో రైల్వే లైను నిర్మాణం, విద్యుదీకరణ పనులు ఎట్టకేలకు పట్టాలెక్కాయి. ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్టు తొలి దశ పనులు ప్రారంభమయ్యాయి. -
శ్రద్ధగా వింటూ.. భరోసా ఇస్తూ..
[ 04-07-2024]
విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి, మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేశ్ గుంటూరు జిల్లా ఉండవల్లి నివాసంలో నిర్వహిస్తున్న ‘ప్రజాదర్బార్’కు బుధవారం రాష్ట్రం నలుమూలల నుంచి అర్జీదారులతో తరలివచ్చారు. -
పేదల బియ్యాన్ని బొక్కేశారు
[ 04-07-2024]
పేదల బియ్యాన్ని వైకాపా రేషన్ డీలర్లు బొక్కేశారు. క్వింటాళ్ల కొద్దీ నల్లబజారులో తెగ నమ్ముకున్నారు. ఆన్లైన్లో నిల్వ చూపిస్తున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం కనిపించడం లేదు. -
అమరావతి దిగ్విజయంగా వెలుగొందాలి
[ 04-07-2024]
ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో ప్రపంచ స్థాయిలో గుర్తింపు లభించేలా అమరావతి శరవేగంగా రూపుదిద్దుకుంటుందని గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్కుమార్ పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఘనంగా వరలక్ష్మీ శరత్కుమార్ రిసెప్షన్.. తారల సందడి
-
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ
-
అన్లిమిటెడ్ క్లెయిం మొత్తంతో ఐసీఐసీఐ ఆరోగ్య బీమా పాలసీ!
-
వాయు కాలుష్యంతో భారత్లో ఏటా 33 వేల మరణాలు: లాన్సెట్
-
రికార్డు గరిష్ఠాలకు సూచీలు.. 24,350 ఎగువన నిఫ్టీ
-
మత్తు ఊబిలో ఎంబీఏ విద్యార్థులు.. డ్రగ్ రాకెట్ను ఛేదించిన టీజీ న్యాబ్ పోలీసులు