అర్జీలు సత్వరం పరిష్కరించాల్సిందే
ప్రజల నుంచి వచ్చిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి అధికారులకు సూచించారు.
ప్రజల నుంచి అర్జీలు తీసుకుని మాట్లాడుతున్న కలెక్టర్ నాగలక్ష్మి, జేసీ రాజకుమారి తదితరులు
కలెక్టరేట్(గుంటూరు), న్యూస్టుడే: ప్రజల నుంచి వచ్చిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని ఎస్.ఆర్.శంకరన్ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం జరిగింది. కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ అర్జీలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. శాఖాపరమైన దస్త్రాలు ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో 142 మంది అర్జీదారులు వినతిపత్రాలు అందించారు. కార్యక్రమంలో జేసీ జి.రాజకుమారి, డీఆర్వో పెద్ది రోజా, గుంటూరు ఆర్డీవో శ్రీకర్, ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
భూమి ఆన్లైన్లో నమోదు చేయడం లేదు
మా అమ్మ సామ్రాజ్యం పేరుతో ఎకరం పొలం ఉండగా.. 80 సెంట్లు మాత్రమే ఆన్లైన్లో కనిపిస్తుంది. రెవెన్యూ అధికారులను అడిగితే సర్వే చేయించుకోమన్నారు. మిగిలిన 20 సెంట్లు భూమి కూడా ఉందని వారే తేల్చినా ఆన్లైన్లో నమోదు చేయమంటే రెండేళ్లుగా పట్టించుకోవడం లేదు. అమ్మ పెద్ద వయసు కావడంతో తిరగలేరు. నేనే అధికారుల చుట్టూ తిరుగుతున్నా. ఇప్పటికైనా ఆన్లైన్లో భూమిని నమోదు చేయాలి.
బొద్దులూరి సత్యనారాయణ, తక్కెళ్లపాడు
సదరం శిబిరానికెళ్తే వైకల్యం లేదన్నారు
తిరుమలశెట్టి శ్రీనివాసరావు ఏడేళ్ల నుంచి పక్షవాతంతో కాళ్లు, చేతులు కదిలించడం లేదు. అన్నపానీయాలన్నీ మంచంలోనే. భార్య రమణ ఆయన్ను కనిపెట్టుకుంటూ ఉండాల్సిన పరిస్థితి. పొన్నూరులో వైద్యుల వద్దకు తీసుకెళ్తే అంతా బాగానే ఉందని చెప్పి, సదరం ధ్రువపత్రంలో వైకల్యం శాతం ‘0’ అని నమోదు చేశారు. ఇళ్ల వద్ద పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారామె. అధికారులు స్పందించి పింఛను ఇప్పించాలని కోరుతున్నారు. పక్షవాతంతో మంచం పట్టిన శ్రీనవాసరావును కుటుంబ సభ్యులు కలెక్టరేట్కు తీసుకొచ్చి అధికారులకు గోడు వెళ్లబోసుకున్నారు.
పది నెలలుగా పింఛను ఆపేశారు: అప్పారావు, రాజీవ్గాంధీనగర్
కాలికి పోలియో సోకింది. ఎన్టీఆర్ పింఛను ప్రారంభించిన సమయంలో రూ.75 ఇచ్చేవారు. వాలంటీరు వచ్చి కరెంటు బిల్లు ఎక్కువగా వస్తుందని, మీ పేరుతో చాలా ఆస్తులున్నాయని చెప్పి పింఛను ఆపేశారు. కొడుకు వద్దే ఉంటున్న నాకు కనీసం మందులు, చిన్నపాటి అవసరాలకు పింఛను ఎంతో ఉపయోగపడుతుంది. పది నెలలుగా నిలిచిపోవడంతో ఇబ్బందులు పడుతున్నా. అధికారులు స్పందించి పునరుద్ధరించాలి.
తక్కువకు పాడుకున్నవారికి కట్టబెట్టేందుకు యత్నం
దేవాదాయ శాఖకు చెందిన పొలాలను కౌలు బహిరంగ వేలంపాటను నిబంధనల ప్రకారం నిర్వహించాలని తక్కెళ్లపాడు, ఉప్పలపాడుకు చెందిన రైతులు అమ్మిశెట్టి దేవేంద్రరావు, అమ్మిశెట్టి శివకోటేశ్వరరావు, అమ్మిశెట్టి మల్లికార్జునరావు పి.శంకరరావు తదితరులు సోమవారం కలెక్టరేట్లో అధికారులకు వినతిపత్రం అందించారు. పాతగుంటూరు అగస్తేశ్వర ఆలయం పరిధిలో ఉప్పలపాడులో 6.70 ఎకరాల భూమికి గత నెల 28న బహిరంగ వేలంపాట నిర్వహించగా తక్కువకు పాడిన వారికి కట్టబెట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారన్నారు. పెదకాకాని ఆలయ భూములకు వేలంపాట సరిగా నిర్వహించలేదన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కన్నబిడ్డ కసిరింది.. కన్నపేగు కుమిలింది
[ 04-07-2024]
కన్నకుమార్తె పెళ్లి చేసుకుని రావడంతో ఆమెపై ఉన్న మమకారంతో కన్నపేగు రోదించింది. మైనార్టీ తీరిన యువతి ఓ యువకుడిని ప్రేమించి పెళ్లిచేసుకుని నేరుగా గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణ పోలీసుస్టేషన్ చేరుకుంది. -
ఆరు నెలల చిన్నారి చికిత్సకు.. ఇంజక్షన్ ఖరీదు రూ.16 కోట్లు
[ 04-07-2024]
ఊహ తెలియని పసిప్రాయం.. బోసినవ్వులతో అలరిస్తుంటే తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు మురిసిపోయారు. మా బంగారు కొండ అంటూ ముద్దు చేశారు. -
జడ్పీ భూముల్లో.. వైకాపా రాబందులు
[ 04-07-2024]
ఉమ్మడి గుంటూరులో జిల్లా పరిషత్తు భూములను అయినవారికి పంచి పెట్టేందుకు వైకాపా ప్రజాప్రతినిధులు పోటీ పడ్డారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని నిబంధనలకు నీళ్లొదిలి వాటిని చెరబట్టారు. -
జలవనరులకు జవసత్వాలు
[ 04-07-2024]
ఐదేళ్ల వైకాపా పాలనలో జలవనరుల కనీస నిర్వహణకు నిధులు కేటాయించకపోవడంతో నిర్వీర్యమయ్యాయి. వర్షాలకు వచ్చిన నీరు వచ్చినట్లే లీకేజీల ద్వారా వాగుల్లోకి వెళ్లిపోవడంతో ఆయకట్టుకు సాగు నీరు అందని పరిస్థితి. -
వీఆర్కు తుళ్లూరు సీఐ
[ 04-07-2024]
రాజధాని ప్రాంతంలోని తుళ్లూరు స్టేషన్కు గత నెల 27న సీఐగా నియామకమైన మాతంగి శ్రీనివాసరావును వీఆర్కు పంపుతూ పోలీస్ శాఖ ఉన్నతాధికారులు బుధవారం ఆదేశాలు జారీ చేశారు. -
తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో
[ 04-07-2024]
మంగళగిరిలో తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి ఘటనలో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. వైకాపా మూకలు 70 మందికి పైగా దౌర్జన్యంగా ప్రధాన గేటును ధ్వంసం చేసి లోపలికి ప్రవేశించినట్లు పోలీసులు చెబుతున్నారు. -
విత్తన లోపం.. రైతుకు శాపం
[ 04-07-2024]
2022లో దుగ్గిరాల.. 2023లో పొన్నూరు మండలాల్లో వరిలో కేళీలు వచ్చి రైతులు నష్టపోయారు. గతేడాది పొన్నూరు మండలంలోని సౌపాడు, జడవల్లి, వడ్డిముక్కల, నిడుబ్రోలు గ్రామాల్లో వరి పంటలో కేళీలు బయటపడ్డాయి. -
సైకో కిల్లర్కు జీవిత ఖైదు
[ 04-07-2024]
అమాయకమైన పసిపిల్లలను కిడ్నాప్ చేసి వారిపై దారుణంగా వ్యవహరించి హతమార్చిన సైకో కిల్లర్కు జీవిత ఖైదు, జరిమానా విధిస్తూ గుంటూరు పొక్సో కోర్టు ఇన్ఛార్జి, ఐదో అదనపు జిల్లా జడ్జి కె.నీలిమ బుధవారం తీర్పు చెప్పారు. -
నేనూ సాధారణ విద్యార్థినే..
[ 04-07-2024]
విద్యార్థి దశలో అత్తెసరు మార్కులే వచ్చేవి. పాఠశాలలో అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయా. కళాశాల నుంచి కూడా సాధారణ విద్యార్థిగానే బయటకొచ్చా. మా దగ్గరి బంధువు వ్యవసాయ శాస్త్రవేత్త. -
ఇంటర్ విద్యార్థినులకు మినీ వాహనం వితరణ
[ 04-07-2024]
వట్టిచెరుకూరు మండలంలోని పుల్లడిగుంట గ్రామానికి చెందిన ప్రవాసాంధ్రుడు ఉప్పుటూరి రామ్చౌదరి కొర్నెపాడు గ్రామంలోని జడ్పీ స్కూల్ ఇంటర్ విద్యార్థినుల సౌకర్యార్థం రూ.8 లక్షల విలువైన మినీ వాహనాన్ని (టాటా మ్యాజిక్) ఆయన తల్లి మాజీ జడ్పీటీసీ సభ్యురాలు ఉప్పుటూరి సీతామహాలక్ష్మి జ్ఞాపకార్థం వితరణగా ఇచ్చారు. -
అక్షర యోధుడు రామోజీరావుకు నివాళులర్పిద్దాం
[ 04-07-2024]
రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్, అక్షర యోధుడు, పద్మవిభూషణ్ రామోజీరావు సంస్మరణ సభకు అందరూ హాజరై నివాళులర్పిద్దామని జనచైతన్య వేదిక అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి పిలుపునిచ్చారు. -
సకుటుంబ సపరివార సమేతం!
[ 04-07-2024]
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో నియామకాల్లో నాటి వైకాపా ప్రభుత్వ హయాంలో పూర్తిగా రాజకీయ జోక్యమే రాజ్యమేలింది. -
త్వరలో రాజధానుల మధ్య రయ్రయ్!
[ 04-07-2024]
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కీలకమైన బీబీనగర్(పగిడిపల్లి) - నల్లపాడు మధ్య రెండో రైల్వే లైను నిర్మాణం, విద్యుదీకరణ పనులు ఎట్టకేలకు పట్టాలెక్కాయి. ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్టు తొలి దశ పనులు ప్రారంభమయ్యాయి. -
శ్రద్ధగా వింటూ.. భరోసా ఇస్తూ..
[ 04-07-2024]
విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి, మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేశ్ గుంటూరు జిల్లా ఉండవల్లి నివాసంలో నిర్వహిస్తున్న ‘ప్రజాదర్బార్’కు బుధవారం రాష్ట్రం నలుమూలల నుంచి అర్జీదారులతో తరలివచ్చారు. -
పేదల బియ్యాన్ని బొక్కేశారు
[ 04-07-2024]
పేదల బియ్యాన్ని వైకాపా రేషన్ డీలర్లు బొక్కేశారు. క్వింటాళ్ల కొద్దీ నల్లబజారులో తెగ నమ్ముకున్నారు. ఆన్లైన్లో నిల్వ చూపిస్తున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం కనిపించడం లేదు. -
అమరావతి దిగ్విజయంగా వెలుగొందాలి
[ 04-07-2024]
ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో ప్రపంచ స్థాయిలో గుర్తింపు లభించేలా అమరావతి శరవేగంగా రూపుదిద్దుకుంటుందని గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్కుమార్ పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రికార్డు గరిష్ఠాలకు సూచీలు.. 24,350 ఎగువన నిఫ్టీ
-
మత్తు ఊబిలో ఎంబీఏ విద్యార్థులు.. డ్రగ్ రాకెట్ణు ఛేదించిన టీజీ న్యాబ్ పోలీసులు
-
వరంగల్ నిట్ విద్యార్థికి రూ.88 లక్షల వార్షిక వేతన ప్యాకేజీ
-
ఉద్యోగులు పనివేళలు పాటించాల్సిందే
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
వంచకుడు అంజాద్పై కేసు.. పెళ్లి చేసుకుంటానని బలవంతాన తీసుకెళ్లినట్లు తేజస్విని స్టేట్మెంట్