పింఛన్ పండగొచ్చింది
అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛను రూ.4వేలు ఇస్తామని చెప్పిన చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన రోజునే పింఛన్ల పెంపుపై సంతకం చేసి ఇచ్చిన మాట నెలబెట్టుకున్నారు.
పెనుమాకలో ఇద్దరు పింఛనుదారులకు నగదు అందజేయనున్న సీఎం చంద్రబాబు
ఇంటికే వెళ్లి ఒక్క రోజులో పంపిణీకి ఏర్పాట్లు
జిల్లాపరిషత్తు(గుంటూరు), తాడేపల్లి, న్యూస్టుడే
అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛను రూ.4వేలు ఇస్తామని చెప్పిన చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన రోజునే పింఛన్ల పెంపుపై సంతకం చేసి ఇచ్చిన మాట నెలబెట్టుకున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో పెంచిన పింఛన్లు మొత్తాన్ని ఇంటింటికీ పంపిణీ చేసేందుకు అధికారులు కార్యాచరణ చేపట్టారు. ఒకటో తేదీ ఎప్సుడొస్తుందా అని ఆశగా ఎదురుచూసున్న అవ్వా, తాతలు పింఛన్ల పండగ చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛను పథకాన్ని సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించనున్నారు.ఇందుకు గుంటూరు జిల్లా మంగళగరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్లో విలీనమైన పెనుమాక వేదిక కానున్నది. ఎంపిక చేసిన లబ్ధిదారుల ఇంటికి స్వయంగా చంద్రబాబు వెళ్లి పింఛను మొత్తాన్ని వారికి అందజేయనున్నారు. సీఎం తమ ఇంటికి వస్తుండడంతో వారు ఆనందంతో ఉబ్బితబ్బిబవుతున్నారు.ఈమేరకు అవసరమైన అన్ని ఏర్పాట్లు అధికారులు చేశారు.
ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి రూ.3 వేలు కూడా కలిపి జులై ఒకటో తేదీన ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేయనుండడంతో లబ్ధిదారులు మొత్తంగా రూ.7 వేలు అందుకోనున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ద్వారా పింఛను నగదు పంపిణీ చేయనున్నారు. ప్రతి 50 మంది లబ్ధిదారులకు ఓ ఉద్యోగి నగదు అందజేసేలా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఉద్యోగులకు లబ్ధిదారుల వివరాలను పంపి వారి మొబైల్ ఫోన్లకు అనుసంధానం చేస్తున్నారు.
కార్యక్రమం వివరాలు ఇలా..
తొలుత ముఖ్యమంత్రి కాలినడకన వెళ్లి ఎస్టీ కాలనీలోని వృద్ధ, వితంతు పింఛన్లను స్వయంగా ఇద్దరు లబ్ధిదారులకు అందజేయనున్నారు. రచ్చబండ వేదిక వద్దకు కాలినడకన వచ్చి పింఛనుదారులతో మాట్లాడతారు. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించనున్నారు. ఆదివారం సాయంత్రం ఏర్పాట్లను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్కుమార్, గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, జాయింట్ కలెక్టర్ రాజకుమారి, సబ్ కలెక్టర్ ప్రఖర్జైన్, ఎస్పీ తుషార్దూడి, ఆర్డీవో శ్రీకర్ పరిశీలించారు. సీఎం నుంచి పింఛను అందుకునే లబ్ధిదారులతో మాట్లాడారు. ఉదయం 5:55 గంటలకు సీఎం చంద్రబాబు పెనుమాక చేరుకుని కార్యక్రమంలో పాల్గొంటారు. 7:15 గంటలకు తిరిగి బయలుదేరి వెళతారు.
లబ్ధిదారుల్లో సంతోషం
పింఛన్ల నగదు పెంచడంతో లబ్ధిదారుల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. దివ్యాంగుల పింఛన్లు రూ.3 వేల నుంచి రూ.6 వేలకు, పక్షవాతం, కండరాల బాధితులకురూ.5 వేల నుంచి రూ.15 వేలకు, కిడ్నీ వ్యాధిగ్రస్థుల్లో డయాలసిస్ చేయించుకుంటున్న వారికి రూ.5 వేల నుంచి రూ.10 వేలకు ప్రభుత్వం పెంచింది. మొత్తం 2,61,588 మంది పింఛనుదారులు ఉంటే వీరిలో 2,39,953 మందికి పెన్షన్ పెంచారు. గత వైకాపా ప్రభుత్వం హయాంలో రూ.2 వేల నుంచి రూ.250 చొప్పున అయిదేళ్లలో రూ.3 వేలకు పెంచారు. తెదేపా ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన 18 రోజుల్లోనే రూ.1000 చొప్పున పెంచి పంపిణీ చేయనుండడం విశేషం. దీనికి తోడు ఎన్నికల కోడ్ కారణంగా చూపి ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఎండ తీవ్రతలు ఎక్కువుగా ఉన్నప్పటికీ లబ్ధిదారులకు ఇళ్ల వద్ద గాకుండా సచివాలయాల వద్ద, బ్యాంకు ఖాతాల్లో నగదు పంపిణీ చేయడంతో నగదు తీసుకోవడానికి అవ్వా తాతలు, పింఛనుదారులు ఇబ్బందులు పడ్డారు. రాష్ట్రంలో 50 మంది వరకు మృత్యువాత పడ్డారు. దాంతో లబ్ధిదారులకు ఇళ్ల వద్దనే ప్రభుత్వ ఉద్యోగులతో పింఛన్లు పంపిణీ చేస్తామని చంద్రబాబు, జనసేన అధినేత పవన్కల్యాణ్ ఎన్నికల సభల్లో ప్రకటించిన విధంగానే ఇప్పుడు అమలు చేస్తుండటంతో ఇబ్బందులు తొలిగాయని సంతోషిస్తున్నారు. సోమవారం ఉదయం 6 గంటలకు వారికి కేటాయించిన లబ్ధిదారులకు పింఛను సొమ్ము పంపిణీ చేయనున్నారు. దీని కోసం 5,231 మంది గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులతో పాటు ఇతర ప్రభుత్వ ఉద్యోగుల సేవలను వినియోగించుకోనున్నారు. ఎంపిక చేసిన లబ్ధిదారులు ఏమంటున్నారంటే..
పెనుమాకలో కార్యక్రమం ఏర్పాట్లపై కలెక్టర్, జేసీ తదితరులకు సూచనలు ఇస్తున్న ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్కుమార్
జీవితంలో మరిచిపోలేని రోజు
- బాణావత్ పాముల నాయక్, పెనుమాక
నాకు వృద్ధాప్య పింఛను వస్తోంది. రాష్ట్రంలోనే ఎన్టీఆర్ భరోసా పింఛను పథకం నుంచి రూ.4 వేలు అందుకోవడం ఆనందంగా ఉంది. గతంలో మూడు నెలలకు సంబంధించి మరో రూ.3 వేలు కలిపి మొత్తం రూ.ఏడు వేలు ఇస్తారు. ఆ డబ్బులతో వైద్యం చేయించుకుంటాను. జీవితంలో ఏనాడూ ఇలాంటి అవకాశం వస్తుందని అనుకోలేదు. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అంతటి వారే మాఇంటికి వస్తారని కలలో కూడా ఊహించలేదు. జీవితంలో మరచిపోలేని రోజు.
ముఖ్యమంత్రి మా ఇంటికొస్తున్నారంటే నమ్మలేదు
- ఇస్లావత్ సాయి, మహిళ, పెనుమాక
నా భర్త రాము అయిదేళ్ల కిందట గుండెపోటుతో చనిపోయారు. నాకు వితంతు పింఛను వస్తోంది. నాకు ఇద్దరు కుమారులు. వారిని చదివించుకుంటూ పండ్లు విక్రయిస్తూ జీవిస్తున్నాను. చంద్రబాబు రూ.4 వేల పింఛను ఇస్తానన్నప్పుడే ఎంతో ఆనందపడ్డాను. ఆ డబ్బులు నా పిల్లల చదువులకు ఉపయోగపడతాయి. ఏప్రిల్ నెల నుంచి పెంచిన డబ్బులతో కలిపి మొత్తం రూ.7 వేలు ఇస్తున్నారు. ఎంతో ఆనందంగా ఉంది. నేరుగా ముఖ్యమంత్రి మా ఇంటికి వస్తున్నారంటే ముందుగా నమ్మలేకపోయాను. అది నిజమని తెలిశాక ఆనందం పట్టలేకపోయాను. అంతటి వ్యక్తి నా ఇంటికి వచ్చి పింఛను అందజేయడం..ఎవరికీ లేని అవకాశం నాకు రావడం ఆనందంగా ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మల్లెపూల నుంచి ఆయిల్ ఉత్పత్తి
[ 03-07-2024]
-
త్వరలో రాజధానుల మధ్య రయ్రయ్!
[ 03-07-2024]
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కీలకమైన బీబీనగర్(పగిడిపల్లి) - నల్లపాడు మధ్య రెండో రైల్వే లైను నిర్మాణం, విద్యుదీకరణ పనులు ఎట్టకేలకు పట్టాలెక్కాయి. -
జడ్పీ భూముల్లో రాబందులు
[ 03-07-2024]
ప్రజాప్రతినిధులు అంటే ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడంతో పాటు ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలి. ఇందుకు భిన్నంగా ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్తుకు చెందిన భూములను అయిన వారికి పంచి పెట్టేందుకు వైకాపా ప్రజాప్రతినిధులు పోటీపడ్డారు. -
డెల్టాకు పట్టిసీమ నీళ్లు
[ 03-07-2024]
ఐదేళ్ల తర్వాత మళ్లీ పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు కృష్ణా డెల్టాకు పుష్కలంగా పారనున్నాయి. వైకాపా ప్రభుత్వ హయాంలో నాలుగేళ్లు పట్టిసీమను వట్టిసీమగా మార్చి గతేడాది మాత్రం 33 టీఎంసీలు అత్యవసరంగా తీసుకున్నారు. -
ఓట్ల తొలగింపు కథ కంచికేనా..!
[ 03-07-2024]
జిల్లాలో పర్చూరు నియోజకవర్గంలో తెదేపా, ఆ పార్టీ సానుభూతిపరుల ఓట్లు తొలగించాలని ఉద్దేశపూర్వకంగా ఫారం-7 దరఖాస్తులు చేసిన వైకాపా నాయకులు, కార్యకర్తలపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. -
మట్టిని మింగిన ఘనులు
[ 03-07-2024]
అడిగేవారు లేరని... అడ్డుకునేందుకు ఎవరూ రారని... పర్యవేక్షించాల్సిన వారు పట్టించుకోరని.. మట్టి మాఫియా చెలరేగిపోతోంది. నిరుపేదల సొంతింటి కలను నిర్దాక్షిణ్యంగా చిదిమేస్తోంది. -
అర్జీ ఒకటైతే.. రసీదులో మరోలా నమోదు
[ 03-07-2024]
ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వస్తున్న అర్జీల నమోదులో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వీటిని ఆన్లైన్లో నమోదు చేస్తున్నప్పుడు ఆ సమస్యను పూర్తిగా చదవకుండానే రసీదుపై ఏదో ఒకటి రాసిచ్చేస్తున్నారు. -
సకుటుంబ సపరివార సమేతం!
[ 03-07-2024]
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో నియామకాల్లో నాటి వైకాపా ప్రభుత్వ హయాంలో పూర్తిగా రాజకీయ జోక్యమే రాజ్యమేలింది. -
వీరు మారరా?
[ 03-07-2024]
గత వైకాపా ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ నేతలతో అంటకాగిన కొందరు సీనియర్ పోలీసు అధికారులు తెదేపా కూటమి అధికారంలోకి వచ్చాక కూడా తమ తీరు మార్చుకోవడం లేదు. -
ప్చ్.. ఫలించని శివశంకర్ ప్రయత్నాలు
[ 03-07-2024]
పల్నాడు జిల్లా గేయం సృష్టికర్తలో భాగస్వామినయ్యా.. నవోదయం పేరిట వినూత్న కార్యక్రమం తీసుకొచ్చా. -
రాజధానిలో ఇసుక దందా
[ 03-07-2024]
రాజధానిలో ఇసుక అక్రమ రవాణా ఆగడం లేదు. రాజధాని గ్రామం ఉద్దండరాయునిపాలెంలో ముళ్లపొదల చాటున కొందరు వ్యక్తులు అక్రమంగా ఇసుక నిల్వ చేసి రాత్రి వేళ గుట్టు చప్పుడు కాకుండా అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. -
నిబంధనల మేరకే ఉపాధ్యాయుల బదిలీలు: మంత్రి లోకేశ్
[ 03-07-2024]
విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ ఉండవల్లి నివాసంలో మంగళవారం నిర్వహించిన ‘ప్రజాదర్బార్’కు రాష్ట్రం నలుమూలల నుంచి వినతులు వెల్లువెత్తాయి. -
గుంటూరు ఛానల్ అభివృద్ధికి అధిక ప్రాధాన్యం
[ 03-07-2024]
దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న గుంటూరు ఛానల్ అభివృద్ధికి తెదేపా కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు స్పష్టం చేశారు. -
రైతుల ముసుగులో వైకాపా నాయకుడి దోపిడీ
[ 03-07-2024]
రైతుల ముసుగులో వైకాపా నాయకుడు దోపిడీకి పాల్పడుతున్నారు. పెదకాకాని మండలం వెంకటకృష్ణాపురం గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా వరి విత్తనాల బస్తాలను స్థానిక నాయకుడు అధిక ధరలకు విక్రయిస్తున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఎమ్మెల్యే కొలికపూడి అత్యుత్సాహం
-
తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో.. పోలీసుల అదుపులో పలువురు నిందితులు
-
జగన్ బినామీ స్వరూపానందేంద్ర: పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి
-
మల్రెడ్డి.. దానం.. ఎవరో ఒకరికి స్థానం!
-
మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి వీరంగం
-
వైకాపా నిర్వాకంతో ఆర్థిక సంక్షోభంలో ఆంధ్రప్రదేశ్: ఎంపీ బైరెడ్డి శబరి