కేంద్రం నిధులిస్తే రహ‘దారి’
గుంటూరు నుంచి హైదరాబాద్ మార్గంలో పేరేచర్ల నుంచి కొండమోడు వరకు నాలుగు వరుసల రహదారిగా విస్తరణకు మార్గం సుగమమైంది. అద్దంకి-నార్కట్పల్లి రాష్ట్ర రహదారికి అనుసంధానంగా ఉండే ఈమార్గం రహదారి ప్రమాదాలు,..
నాలుగు వరుసలు... అభివృద్ధికి బాటలు
పేరేచర్ల నుంచి కొండమోడు వరకు విస్తరణ
రాజుపాలెం మండలంలో రహదారి భూసేకరణకు సర్వే చేసి పాతిన హద్దురాయి
ఈనాడు-అమరావతి: గుంటూరు నుంచి హైదరాబాద్ మార్గంలో పేరేచర్ల నుంచి కొండమోడు వరకు నాలుగు వరుసల రహదారిగా విస్తరణకు మార్గం సుగమమైంది. అద్దంకి-నార్కట్పల్లి రాష్ట్ర రహదారికి అనుసంధానంగా ఉండే ఈమార్గం రహదారి ప్రమాదాలు, ప్రయాణ సమయం, ఇంధనం ఆదా వంటి లక్ష్యాలతో విస్తరించనున్నారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల సమీపంలోని కొండమోడు నుంచి గుంటూరు సమీపంలోని పేరేచర్ల వరకు జాతీయ రహదారి(167ఏజీ)గా కేంద్రం గుర్తించింది. ఈ మార్గం ప్రాధాన్యత దృష్ట్యా విస్తరణకు కేంద్రం ఆమోదం తెలిపింది. గతేడాది ఆగస్టులో 50కిలోమీటర్ల రహదారి అభివృద్ధికి రూ.1032 కోట్లతో టెండరు పిలిచారు. ఈ పనులను రాజేంద్రసింగ్ బేంబూ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ దక్కించుకుంది. భారత్మాల పరియోజన కింద రహదారి విస్తరణ చేపట్టారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలోనే మంజూరైనా కేంద్రం నిధులు విడుదల చేయకపోవడంతో పనులు ముందుకు సాగలేదు. పల్నాడు జిల్లా నుంచి పార్లమెంటు సభ్యులుగా ఎన్నికైన లావు శ్రీకృష్ణదేవరాయలు ఈమార్గానికి నిధులు విడుదల చేసి వెంటనే పనులు ప్రారంభించాలని కేంద్ర మంత్రిని కోరారు. దీంతో త్వరలోనే ఈప్రాజెక్టు పట్టా లెక్కనుంది.
234 హెక్టార్ల భూసేకరణ
పేరేచర్ల నుంచి కొండమోడు మార్గాన్ని నాలుగు వరుసలుగా విస్తరించడానికి గుంటూరు, సత్తెనపల్లి ఆర్డీవోల పరిధిలో 234 హెక్టార్ల భూమి సేకరించాలి. సర్వే పూర్తిచేసి ప్రభుత్వ, ప్రైవేటు, అసైన్డు, పోరంబోకు భూములను విభాగాలుగా విభజించి నివేదిక సిద్ధం చేశారు. రహదారి విస్తరణకు ఏ రైతు నుంచి ఎంత భూమి సేకరిస్తారు? ఎంత పరిహారం లభిస్తుందన్న వివరాలు సిద్ధమయ్యాయి. భూసేకరణకు సంబంధించిన ప్రక్రియ మొత్తం పూర్తిచేసి కేంద్రానికి రాష్ట్రం నివేదిక అందించింది. కేంద్రం భూసేకరణకు నిధులు విడుదల చేసిన వెంటనే రైతుల ఖాతాల్లో సొమ్ము చేసి గుత్తేదారుకు భూమి అప్పగిస్తారు. నాలుగు వరుసల విస్తరణలో ఒక్కొక్క వైపు 8.75మీటర్ల వెడల్పు రహదారి, డివైడర్ 1.5మీటర్లు, రెండువైపులా మార్జిన్లు కలిపి 22.5మీటర్ల వెడల్పుతో నిర్మిస్తారు. మేడికొండూరులో 4 నుంచి 5కిలోమీటర్లు బైపాస్, సత్తెనపల్లిలో 11కిలోమీటర్ల బైపాస్ నిర్మించాల్సి ఉంది. ప్రస్తుతం 7 నుంచి 10మీటర్ల వెడల్పుతో రహదారి ఉండడంతో వాహనాల రద్దీ పెరిగి ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రయాణ సమయం పెరుగుతోంది. ఈ సమస్యను పరిష్కరించడానికి నాలుగు వరుసలుగా విస్తరించనున్నారు. ఈ మార్గం విస్తరణ పూర్తయి అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నుంచి నూతన రాజధాని అమరావతికి ప్రయాణ సమయం తగ్గడంతో పాటు ఇంధనం ఆదా అవుతుంది. సీఆర్డీఏ నిర్మించే బాహ్యవలయ రహదారికి కూడా సత్తెనపల్లి వద్ద ఈమార్గం అనుసంధానం కానుంది.
నిధుల విడుదలకు కృషి
- లావుశ్రీకృష్ణదేవరాయలు, ఎంపీ, నరసరావుపేట
కొండమోడు-పేరేచర్ల రహదారి విస్తరణ ఆవశ్యకతను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి విస్తరణకు నిధులు మంజూరు చేయించాం. 2023లో టెండర్లు పిలిచినా అప్పట్లో కేంద్రం నిధుల విడుదల చేయకపోవడంతో పనులు ప్రారంభం కాలేదు. ఈవిషయమై ఇటీవలే కేంద్ర మంత్రిని కలిసి వెంటనే నిధులు విడుదల చేయాలని కోరాం. భూసేకరణకు నిధులు వచ్చిన వెంటనే రైతుల ఖాతాల్లో వేసి పనులు ప్రారంభిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి అవసరమైన ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. దీనిని అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకుని నిధులు విడుదల చేయించి పనులు ప్రారంభమయ్యేలా చూస్తాను.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మల్లెపూల నుంచి ఆయిల్ ఉత్పత్తి
[ 03-07-2024]
-
త్వరలో రాజధానుల మధ్య రయ్రయ్!
[ 03-07-2024]
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కీలకమైన బీబీనగర్(పగిడిపల్లి) - నల్లపాడు మధ్య రెండో రైల్వే లైను నిర్మాణం, విద్యుదీకరణ పనులు ఎట్టకేలకు పట్టాలెక్కాయి. -
జడ్పీ భూముల్లో రాబందులు
[ 03-07-2024]
ప్రజాప్రతినిధులు అంటే ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడంతో పాటు ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలి. ఇందుకు భిన్నంగా ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్తుకు చెందిన భూములను అయిన వారికి పంచి పెట్టేందుకు వైకాపా ప్రజాప్రతినిధులు పోటీపడ్డారు. -
డెల్టాకు పట్టిసీమ నీళ్లు
[ 03-07-2024]
ఐదేళ్ల తర్వాత మళ్లీ పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు కృష్ణా డెల్టాకు పుష్కలంగా పారనున్నాయి. వైకాపా ప్రభుత్వ హయాంలో నాలుగేళ్లు పట్టిసీమను వట్టిసీమగా మార్చి గతేడాది మాత్రం 33 టీఎంసీలు అత్యవసరంగా తీసుకున్నారు. -
ఓట్ల తొలగింపు కథ కంచికేనా..!
[ 03-07-2024]
జిల్లాలో పర్చూరు నియోజకవర్గంలో తెదేపా, ఆ పార్టీ సానుభూతిపరుల ఓట్లు తొలగించాలని ఉద్దేశపూర్వకంగా ఫారం-7 దరఖాస్తులు చేసిన వైకాపా నాయకులు, కార్యకర్తలపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. -
మట్టిని మింగిన ఘనులు
[ 03-07-2024]
అడిగేవారు లేరని... అడ్డుకునేందుకు ఎవరూ రారని... పర్యవేక్షించాల్సిన వారు పట్టించుకోరని.. మట్టి మాఫియా చెలరేగిపోతోంది. నిరుపేదల సొంతింటి కలను నిర్దాక్షిణ్యంగా చిదిమేస్తోంది. -
అర్జీ ఒకటైతే.. రసీదులో మరోలా నమోదు
[ 03-07-2024]
ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వస్తున్న అర్జీల నమోదులో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వీటిని ఆన్లైన్లో నమోదు చేస్తున్నప్పుడు ఆ సమస్యను పూర్తిగా చదవకుండానే రసీదుపై ఏదో ఒకటి రాసిచ్చేస్తున్నారు. -
సకుటుంబ సపరివార సమేతం!
[ 03-07-2024]
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో నియామకాల్లో నాటి వైకాపా ప్రభుత్వ హయాంలో పూర్తిగా రాజకీయ జోక్యమే రాజ్యమేలింది. -
వీరు మారరా?
[ 03-07-2024]
గత వైకాపా ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ నేతలతో అంటకాగిన కొందరు సీనియర్ పోలీసు అధికారులు తెదేపా కూటమి అధికారంలోకి వచ్చాక కూడా తమ తీరు మార్చుకోవడం లేదు. -
ప్చ్.. ఫలించని శివశంకర్ ప్రయత్నాలు
[ 03-07-2024]
పల్నాడు జిల్లా గేయం సృష్టికర్తలో భాగస్వామినయ్యా.. నవోదయం పేరిట వినూత్న కార్యక్రమం తీసుకొచ్చా. -
రాజధానిలో ఇసుక దందా
[ 03-07-2024]
రాజధానిలో ఇసుక అక్రమ రవాణా ఆగడం లేదు. రాజధాని గ్రామం ఉద్దండరాయునిపాలెంలో ముళ్లపొదల చాటున కొందరు వ్యక్తులు అక్రమంగా ఇసుక నిల్వ చేసి రాత్రి వేళ గుట్టు చప్పుడు కాకుండా అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. -
నిబంధనల మేరకే ఉపాధ్యాయుల బదిలీలు: మంత్రి లోకేశ్
[ 03-07-2024]
విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ ఉండవల్లి నివాసంలో మంగళవారం నిర్వహించిన ‘ప్రజాదర్బార్’కు రాష్ట్రం నలుమూలల నుంచి వినతులు వెల్లువెత్తాయి. -
గుంటూరు ఛానల్ అభివృద్ధికి అధిక ప్రాధాన్యం
[ 03-07-2024]
దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న గుంటూరు ఛానల్ అభివృద్ధికి తెదేపా కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు స్పష్టం చేశారు. -
రైతుల ముసుగులో వైకాపా నాయకుడి దోపిడీ
[ 03-07-2024]
రైతుల ముసుగులో వైకాపా నాయకుడు దోపిడీకి పాల్పడుతున్నారు. పెదకాకాని మండలం వెంకటకృష్ణాపురం గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా వరి విత్తనాల బస్తాలను స్థానిక నాయకుడు అధిక ధరలకు విక్రయిస్తున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో.. పోలీసుల అదుపులో పలువురు నిందితులు
-
జగన్ బినామీ స్వరూపానందేంద్ర: పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి
-
మల్రెడ్డి.. దానం.. ఎవరో ఒకరికి స్థానం!
-
మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి వీరంగం
-
వైకాపా నిర్వాకంతో ఆర్థిక సంక్షోభంలో ఆంధ్రప్రదేశ్: ఎంపీ బైరెడ్డి శబరి
-
త్వరలో రాజధానుల మధ్య రయ్రయ్!