logo

అమరావతిని శరవేగంగా పూర్తి చేస్తాం

ప్రజలందరి సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ సారధ్యంలో అయిదు కోట్ల ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని శరవేగంగా నిర్మిస్తామని తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌ తెలిపారు.

Published : 01 Jul 2024 04:54 IST

శాఖమూరులో రాజధాని రైతును సన్మానిస్తున్న తెనాలి శ్రావణ్‌కుమార్‌

తుళ్లూరు, న్యూస్‌టుడే: ప్రజలందరి సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ సారధ్యంలో అయిదు కోట్ల ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని శరవేగంగా నిర్మిస్తామని తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌ తెలిపారు. రాష్ట్రంలో ఎన్డీయే కూటమి తిరుగు లేని విజయం సాధించడం..నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం..తాడికొండ ఎమ్మెల్యేగా తెనాలి శ్రావణ్‌కుమార్, గుంటూరు ఎంపీగా పెమ్మసాని చంద్రశేఖర్‌ అత్యధిక మెజారిటీతో గెలుపొందిన నేపథ్యంలో శాఖమూరు గ్రామానికి చెందిన రైతు ఇక్కుర్తి వెంకటేశ్వర్లు ఆదివారం సహపంక్తి భోజనాలు పెట్టి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌ ముఖ్యఅతిథిగా పాల్గొని రాజధాని రైతులను ఘనంగా సన్మానించి మాట్లాడారు. ఎన్డీయే కూటమికి ఓట్లు వేసి అఖండ విజయాన్ని అందించిన రాష్ట్ర ప్రజలకు రాజధాని రైతులతో కలిసి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వైకాపాను ఓడించి అమరావతిని గెలిపించడానికి రాష్ట్ర ప్రజలందరూ చేతులు కలిపారన్నారు. ప్రవాస భారతీయులు వ్యయప్రయాసలకోర్చి ఖండాంతరాలు దాటి వచ్చి మరీ కూటమి గెలుపునకు ఓట్లు వేశారని చెప్పారు. తొలుత శ్రావణ్‌కుమార్‌ గ్రామంలోని అంబేద్కర్, ఎన్టీఆర్‌ విగ్రహాలకు నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు ఇక్కుర్తి సాంబశివరావు, ఎ.సదాశివరావు, ధనేకుల వెంకట సుభ్బారావు, తలతోటి సురేంద్ర, వెంకటేశ్వర్లు, కుమారస్వామి రెడ్డి, సాంబిరెడ్డి, వలపర్ల ఏసుదాసు, శంకర్రావు, యర్రగోపు నాగరాజు తదతరులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని