అమరావతిని శరవేగంగా పూర్తి చేస్తాం
ప్రజలందరి సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ సారధ్యంలో అయిదు కోట్ల ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని శరవేగంగా నిర్మిస్తామని తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్కుమార్ తెలిపారు.
శాఖమూరులో రాజధాని రైతును సన్మానిస్తున్న తెనాలి శ్రావణ్కుమార్
తుళ్లూరు, న్యూస్టుడే: ప్రజలందరి సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ సారధ్యంలో అయిదు కోట్ల ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని శరవేగంగా నిర్మిస్తామని తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్కుమార్ తెలిపారు. రాష్ట్రంలో ఎన్డీయే కూటమి తిరుగు లేని విజయం సాధించడం..నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం..తాడికొండ ఎమ్మెల్యేగా తెనాలి శ్రావణ్కుమార్, గుంటూరు ఎంపీగా పెమ్మసాని చంద్రశేఖర్ అత్యధిక మెజారిటీతో గెలుపొందిన నేపథ్యంలో శాఖమూరు గ్రామానికి చెందిన రైతు ఇక్కుర్తి వెంకటేశ్వర్లు ఆదివారం సహపంక్తి భోజనాలు పెట్టి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రావణ్కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొని రాజధాని రైతులను ఘనంగా సన్మానించి మాట్లాడారు. ఎన్డీయే కూటమికి ఓట్లు వేసి అఖండ విజయాన్ని అందించిన రాష్ట్ర ప్రజలకు రాజధాని రైతులతో కలిసి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వైకాపాను ఓడించి అమరావతిని గెలిపించడానికి రాష్ట్ర ప్రజలందరూ చేతులు కలిపారన్నారు. ప్రవాస భారతీయులు వ్యయప్రయాసలకోర్చి ఖండాంతరాలు దాటి వచ్చి మరీ కూటమి గెలుపునకు ఓట్లు వేశారని చెప్పారు. తొలుత శ్రావణ్కుమార్ గ్రామంలోని అంబేద్కర్, ఎన్టీఆర్ విగ్రహాలకు నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు ఇక్కుర్తి సాంబశివరావు, ఎ.సదాశివరావు, ధనేకుల వెంకట సుభ్బారావు, తలతోటి సురేంద్ర, వెంకటేశ్వర్లు, కుమారస్వామి రెడ్డి, సాంబిరెడ్డి, వలపర్ల ఏసుదాసు, శంకర్రావు, యర్రగోపు నాగరాజు తదతరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మల్లెపూల నుంచి ఆయిల్ ఉత్పత్తి
[ 03-07-2024]
-
త్వరలో రాజధానుల మధ్య రయ్రయ్!
[ 03-07-2024]
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కీలకమైన బీబీనగర్(పగిడిపల్లి) - నల్లపాడు మధ్య రెండో రైల్వే లైను నిర్మాణం, విద్యుదీకరణ పనులు ఎట్టకేలకు పట్టాలెక్కాయి. -
జడ్పీ భూముల్లో రాబందులు
[ 03-07-2024]
ప్రజాప్రతినిధులు అంటే ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడంతో పాటు ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలి. ఇందుకు భిన్నంగా ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్తుకు చెందిన భూములను అయిన వారికి పంచి పెట్టేందుకు వైకాపా ప్రజాప్రతినిధులు పోటీపడ్డారు. -
డెల్టాకు పట్టిసీమ నీళ్లు
[ 03-07-2024]
ఐదేళ్ల తర్వాత మళ్లీ పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు కృష్ణా డెల్టాకు పుష్కలంగా పారనున్నాయి. వైకాపా ప్రభుత్వ హయాంలో నాలుగేళ్లు పట్టిసీమను వట్టిసీమగా మార్చి గతేడాది మాత్రం 33 టీఎంసీలు అత్యవసరంగా తీసుకున్నారు. -
ఓట్ల తొలగింపు కథ కంచికేనా..!
[ 03-07-2024]
జిల్లాలో పర్చూరు నియోజకవర్గంలో తెదేపా, ఆ పార్టీ సానుభూతిపరుల ఓట్లు తొలగించాలని ఉద్దేశపూర్వకంగా ఫారం-7 దరఖాస్తులు చేసిన వైకాపా నాయకులు, కార్యకర్తలపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. -
మట్టిని మింగిన ఘనులు
[ 03-07-2024]
అడిగేవారు లేరని... అడ్డుకునేందుకు ఎవరూ రారని... పర్యవేక్షించాల్సిన వారు పట్టించుకోరని.. మట్టి మాఫియా చెలరేగిపోతోంది. నిరుపేదల సొంతింటి కలను నిర్దాక్షిణ్యంగా చిదిమేస్తోంది. -
అర్జీ ఒకటైతే.. రసీదులో మరోలా నమోదు
[ 03-07-2024]
ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వస్తున్న అర్జీల నమోదులో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వీటిని ఆన్లైన్లో నమోదు చేస్తున్నప్పుడు ఆ సమస్యను పూర్తిగా చదవకుండానే రసీదుపై ఏదో ఒకటి రాసిచ్చేస్తున్నారు. -
సకుటుంబ సపరివార సమేతం!
[ 03-07-2024]
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో నియామకాల్లో నాటి వైకాపా ప్రభుత్వ హయాంలో పూర్తిగా రాజకీయ జోక్యమే రాజ్యమేలింది. -
వీరు మారరా?
[ 03-07-2024]
గత వైకాపా ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ నేతలతో అంటకాగిన కొందరు సీనియర్ పోలీసు అధికారులు తెదేపా కూటమి అధికారంలోకి వచ్చాక కూడా తమ తీరు మార్చుకోవడం లేదు. -
ప్చ్.. ఫలించని శివశంకర్ ప్రయత్నాలు
[ 03-07-2024]
పల్నాడు జిల్లా గేయం సృష్టికర్తలో భాగస్వామినయ్యా.. నవోదయం పేరిట వినూత్న కార్యక్రమం తీసుకొచ్చా. -
రాజధానిలో ఇసుక దందా
[ 03-07-2024]
రాజధానిలో ఇసుక అక్రమ రవాణా ఆగడం లేదు. రాజధాని గ్రామం ఉద్దండరాయునిపాలెంలో ముళ్లపొదల చాటున కొందరు వ్యక్తులు అక్రమంగా ఇసుక నిల్వ చేసి రాత్రి వేళ గుట్టు చప్పుడు కాకుండా అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. -
నిబంధనల మేరకే ఉపాధ్యాయుల బదిలీలు: మంత్రి లోకేశ్
[ 03-07-2024]
విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ ఉండవల్లి నివాసంలో మంగళవారం నిర్వహించిన ‘ప్రజాదర్బార్’కు రాష్ట్రం నలుమూలల నుంచి వినతులు వెల్లువెత్తాయి. -
గుంటూరు ఛానల్ అభివృద్ధికి అధిక ప్రాధాన్యం
[ 03-07-2024]
దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న గుంటూరు ఛానల్ అభివృద్ధికి తెదేపా కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు స్పష్టం చేశారు. -
రైతుల ముసుగులో వైకాపా నాయకుడి దోపిడీ
[ 03-07-2024]
రైతుల ముసుగులో వైకాపా నాయకుడు దోపిడీకి పాల్పడుతున్నారు. పెదకాకాని మండలం వెంకటకృష్ణాపురం గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా వరి విత్తనాల బస్తాలను స్థానిక నాయకుడు అధిక ధరలకు విక్రయిస్తున్నారు.