23 నెలలు.. రూ.1000 కోట్ల నష్టం
బహుళార్థ సాధక జలాశయం గుండ్లకమ్మ. ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణ వాసులకు మంచినీరు.. 1.40 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ఏర్పాటు చేయబడిన ప్రాజెక్టు.
గుండ్లకమ్మ గేట్లు కొట్టుకుపోవడంతో సమస్య
అప్రమత్తం కాకపోతే నీటి వృథానే
ఏర్పాటుకు మరో రెండు నెలల గడువు
జలాశయం రెండో గేటు లేకుండా ఇలా..
న్యూస్టుడే, అద్దంకి : బహుళార్థ సాధక జలాశయం గుండ్లకమ్మ. ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణ వాసులకు మంచినీరు.. 1.40 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ఏర్పాటు చేయబడిన ప్రాజెక్టు. రెండేళ్ల క్రితం ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయాయి. వాటిని తిరిగి ఏర్పాటు చేయడంలో నాటి పాలకులు ఆసక్తి కనబరచలేదు. గుండ్లకమ్మ నదిలో ఇసుక తవ్వకాల కోసమే గేట్ల గురించి పట్టించుకోలేదని నాటి తెదేపా నాయకులు ఆరోపించారు. వారి ఆరోపణలు తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో దెబ్బతిన్న రెండు గేట్లతో పాటు మెతకగా ఉన్న మిగిలిన గేట్లను మార్చేందుకు నీటిపారుదలశాఖ అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. దీనిలో భాగంగా గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్లో తయారైన నాలుగు గేట్లను అమర్చారు. మిగిలిన వాటిని ఆగస్టు నెలాఖరు నాటికి బిగిస్తామని చెబుతున్నారు. 2022 ఆగస్టు 31న మూడో నంబరు గేటు, 2023 జూన్ 6న రెండో నంబరు గేటు కొట్టుకుపోయాయి. ఈ కారణంగా జలాశయంలోని నీరు మొత్తం సముద్రం పాలైంది. పడవలు, వలలు, చేపలు మొత్తం కొట్టుకుపోయాయి. ప్రస్తుతం జలాశయం వెనుక నీరు లేకపోవటంతో ఖాళీ భూముల్లో నిర్వాసితులు పశుగ్రాసం సాగు చేస్తున్నారు.
గుండక్లమ్మ జలాశయం ఆధారంగా సుమారు రెండు వేలమంది జాలర్లు చేపల వేట ఆధారంగా జీవనం సాగించారు. రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన జాలర్లు కుటుంబాలతో సహా ఇక్కడే దీనిపై ఆధారపడ్డారు. ఒక్కో జాలరి సుమారు రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టి వల, పడవ ఏర్పాటు చేసుకున్నారు. ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోవటంతో వారి పెట్టుబడి మొత్తం సముద్రం పాలైంది. చేసేది లేక వారంతా సొంత ప్రాంతాలకు తరలివెళ్లారు. స్థానికంగా ఉన్న జాలర్లు చేపలవేట వృత్తికి దూరమై కట్టెలు కొట్టుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మరికొంత మంది దినసరి కూలీలుగా మారారు. 70 వేల ఎకరాల ఆయకట్టుకు రెండు పర్యాయాలు కలిపి 1.40 లక్షల ఎకరాలకు నీరు అందించడం అనేది రెండేళ్లుగా జరగలేదు. ఆయకట్టులోని భూములున్న రైతులు అధికశాతం వాణిజ్య పంటల వైపు దృష్టి సారించాల్సి వచ్చింది. ఒంగోలు పట్టణానికి మంచినీటి సమస్య ఏర్పడింది. భూగర్భజలం అడుగంటడంతో పరివాహకంలోని రైతులు నీళ్లకోసం ఇబ్బందులు పడ్డారు.
నష్టం అంచనా ఇలా..: ఒక్కో జాలరి చేపలు పట్టుకోవటం, విక్రయం ద్వారా నెలకు రూ.25 వేల వరకు ఆదాయం సమకూర్చుకుంటాడు. మొత్తం రెండు వేల మంది జాలర్లు కలిపి రూ.5 కోట్ల వరకు నష్టపోయారు. 23 నెలలకు రూ.115 కోట్ల వరకు నష్టపోయినట్లే. అలాగే ఆయకట్టులోని రైతులు ఒక్కొక్కరూ ఏడాదికి ఎకరాకు గరిష్ఠంగా రూ.30 వేల వరకు ఆదాయం సమకూర్చుకుంటున్నారు. ప్రస్తుతం జలాశయంలో నీరు లేకపోవటంతో కేవలం ఒక పంటకు మాత్రమే పరిమితమవుతున్నారు. రెండేళ్ల కాలపరిమితితో ఒక్కో రైతు సుమారు రూ.60 వేల వరకు నష్టపోయినట్లు లెక్కేస్తే మొత్తంగా 1.40 లక్షల ఎకరాలకు గాను రూ.840 కోట్ల వరకు నష్టపోయినట్లు స్థానికులు అంచనా వేస్తున్నారు.
ఆగస్టు ఆఖరుకు బిగించే అవకాశం
- రామాంజనేయులు, ఏఈ, గుండ్లకమ్మ రిజర్వాయరు
గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ నుంచి గేట్లు తయారై, రవాణా ద్వారా జలాశయం వద్దకు చేరుతున్నాయి. ప్రస్తుతం నాలుగు గేట్లు బిగించారు. దెబ్బతిన్న మూడో నంబరు గేటు బిగించారు, రెండో నంబరుది బిగిస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 0.4 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఇప్పటికిపుడు ఎగువన భారీవర్షం కురిస్తే జలాశయంలో 21.6 మీటర్ల ఎత్తు వరకు నీరు నిలిచే అవకాశం ఉంది. అంటే 1.3 టీఎంసీల నీరు నిలిచేందుకు గేట్లు బిగించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మల్లెపూల నుంచి ఆయిల్ ఉత్పత్తి
[ 03-07-2024]
-
త్వరలో రాజధానుల మధ్య రయ్రయ్!
[ 03-07-2024]
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కీలకమైన బీబీనగర్(పగిడిపల్లి) - నల్లపాడు మధ్య రెండో రైల్వే లైను నిర్మాణం, విద్యుదీకరణ పనులు ఎట్టకేలకు పట్టాలెక్కాయి. -
జడ్పీ భూముల్లో రాబందులు
[ 03-07-2024]
ప్రజాప్రతినిధులు అంటే ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడంతో పాటు ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలి. ఇందుకు భిన్నంగా ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్తుకు చెందిన భూములను అయిన వారికి పంచి పెట్టేందుకు వైకాపా ప్రజాప్రతినిధులు పోటీపడ్డారు. -
డెల్టాకు పట్టిసీమ నీళ్లు
[ 03-07-2024]
ఐదేళ్ల తర్వాత మళ్లీ పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు కృష్ణా డెల్టాకు పుష్కలంగా పారనున్నాయి. వైకాపా ప్రభుత్వ హయాంలో నాలుగేళ్లు పట్టిసీమను వట్టిసీమగా మార్చి గతేడాది మాత్రం 33 టీఎంసీలు అత్యవసరంగా తీసుకున్నారు. -
ఓట్ల తొలగింపు కథ కంచికేనా..!
[ 03-07-2024]
జిల్లాలో పర్చూరు నియోజకవర్గంలో తెదేపా, ఆ పార్టీ సానుభూతిపరుల ఓట్లు తొలగించాలని ఉద్దేశపూర్వకంగా ఫారం-7 దరఖాస్తులు చేసిన వైకాపా నాయకులు, కార్యకర్తలపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. -
మట్టిని మింగిన ఘనులు
[ 03-07-2024]
అడిగేవారు లేరని... అడ్డుకునేందుకు ఎవరూ రారని... పర్యవేక్షించాల్సిన వారు పట్టించుకోరని.. మట్టి మాఫియా చెలరేగిపోతోంది. నిరుపేదల సొంతింటి కలను నిర్దాక్షిణ్యంగా చిదిమేస్తోంది. -
అర్జీ ఒకటైతే.. రసీదులో మరోలా నమోదు
[ 03-07-2024]
ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వస్తున్న అర్జీల నమోదులో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వీటిని ఆన్లైన్లో నమోదు చేస్తున్నప్పుడు ఆ సమస్యను పూర్తిగా చదవకుండానే రసీదుపై ఏదో ఒకటి రాసిచ్చేస్తున్నారు. -
సకుటుంబ సపరివార సమేతం!
[ 03-07-2024]
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో నియామకాల్లో నాటి వైకాపా ప్రభుత్వ హయాంలో పూర్తిగా రాజకీయ జోక్యమే రాజ్యమేలింది. -
వీరు మారరా?
[ 03-07-2024]
గత వైకాపా ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ నేతలతో అంటకాగిన కొందరు సీనియర్ పోలీసు అధికారులు తెదేపా కూటమి అధికారంలోకి వచ్చాక కూడా తమ తీరు మార్చుకోవడం లేదు. -
ప్చ్.. ఫలించని శివశంకర్ ప్రయత్నాలు
[ 03-07-2024]
పల్నాడు జిల్లా గేయం సృష్టికర్తలో భాగస్వామినయ్యా.. నవోదయం పేరిట వినూత్న కార్యక్రమం తీసుకొచ్చా. -
రాజధానిలో ఇసుక దందా
[ 03-07-2024]
రాజధానిలో ఇసుక అక్రమ రవాణా ఆగడం లేదు. రాజధాని గ్రామం ఉద్దండరాయునిపాలెంలో ముళ్లపొదల చాటున కొందరు వ్యక్తులు అక్రమంగా ఇసుక నిల్వ చేసి రాత్రి వేళ గుట్టు చప్పుడు కాకుండా అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. -
నిబంధనల మేరకే ఉపాధ్యాయుల బదిలీలు: మంత్రి లోకేశ్
[ 03-07-2024]
విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ ఉండవల్లి నివాసంలో మంగళవారం నిర్వహించిన ‘ప్రజాదర్బార్’కు రాష్ట్రం నలుమూలల నుంచి వినతులు వెల్లువెత్తాయి. -
గుంటూరు ఛానల్ అభివృద్ధికి అధిక ప్రాధాన్యం
[ 03-07-2024]
దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న గుంటూరు ఛానల్ అభివృద్ధికి తెదేపా కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు స్పష్టం చేశారు. -
రైతుల ముసుగులో వైకాపా నాయకుడి దోపిడీ
[ 03-07-2024]
రైతుల ముసుగులో వైకాపా నాయకుడు దోపిడీకి పాల్పడుతున్నారు. పెదకాకాని మండలం వెంకటకృష్ణాపురం గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా వరి విత్తనాల బస్తాలను స్థానిక నాయకుడు అధిక ధరలకు విక్రయిస్తున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
టీషర్ట్, చిరిగిన జీన్స్తో కళాశాలకు రావొద్దు
-
రైలు ఢీకొని వృద్ధుడి మృతి.. ఇంజిన్కు వేలాడుతూ వచ్చిన మృతదేహం
-
మదుపర్లకు మెయిల్ ద్వారానే ఖాతా స్టేట్మెంట్లు
-
ఆగస్టు 15 నుంచి వందే భారత్ స్లీపర్.. సికింద్రాబాద్, కాచిగూడ నుంచి నడపాలని ప్రతిపాదన
-
వందలో మరో చిరుత.. ఉసేన్ బోల్ట్ను గుర్తుచేస్తూ..
-
పిన్నెల్లితో ములాఖత్ కోసం 4న నెల్లూరు జైలుకు జగన్