అయిదేళ్లుగా జీజీహెచ్ని నిర్లక్ష్యం చేశారు
సర్వజనాసుపత్రిలో గత అయిదేళ్లలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదని, చాలా సమస్యలు ఉన్నాయని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.
దశల వారీగా అన్నీ చక్కదిద్దుతాం
పనివేళల్లో వైద్యులంతా విధుల్లో ఉండాల్సిందే
కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్
ఆస్పత్రిని సందర్శిస్తున్న చంద్రశేఖర్. చిత్రంలో కలెక్టర్ నాగలక్ష్మి, ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్, రామాంజనేయులు తదితరులు
గుంటూరు వైద్యం, న్యూస్టుడే: సర్వజనాసుపత్రిలో గత అయిదేళ్లలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదని, చాలా సమస్యలు ఉన్నాయని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. జీజీహెచ్లో అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి శనివారం సమీక్ష నిర్వహించిన అనంతరం మంత్రి చంద్రశేఖర్ విలేకరులతో మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్య వైఖరితో ఆసుపత్రిలో పనులన్నీ నిలిచిపోయాయన్నారు. రోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రాధాన్య క్రమంలో పనులను గుర్తించి దశల వారీగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఆసుపత్రి పనివేళల్లో వైద్యులంతా విధిగా విధుల్లో ఉండాలని సూచించామన్నారు. ఆసుపత్రి అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. బొంగరాలబీడులో జీజీహెచ్కు కేటాయించిన 6 ఎకరాల స్థలంలో ఏఏ విభాగాలు ఏర్పాటు చేయాలనుకుంటున్నారో ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. శాసనసభ్యులు మహమ్మద్ నసీర్, గళ్లా మాధవి, రామాంజనేయులు, తెనాలి శ్రావణకుమార్, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపల్ టీటీకే రెడ్డి, సూపరింటెండెంట్ కిరణ్కుమార్, డీఎంహెచ్వో విజయలక్ష్మి పాల్గొన్నారు.
ఆసుపత్రిలో నాయకుల జన్మదిన వేడుకలా..? ఆసుపత్రిలో రాజకీయ నాయకుల జన్మదిన వేడుకల పేరుతో సమయాన్ని ఎందుకు వృధా చేసుకుంటున్నారని మంత్రి చంద్రశేఖర్ ప్రశ్నించారు. ఇది మంచి సంప్రదాయం కాదన్నారు.
సేవలపై ఆరా.. జీజీహెచ్లోని పలు విభాగాల్లోకి వెళ్లి రోగులకు అందుతున్న సేవలు.. వసతులను మంత్రి చంద్రశేఖర్ పరిశీలించారు. కలెక్టర్, ఆసుపత్రి సూపరింటెండెంట్, ఆయా విభాగాధిపతులను విభాగాల వారీగా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాన్పులు, రోగుల ప్రవేశాలు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు తక్కువగా ఉండడాన్ని గుర్తించి బాధ్యులైన వైద్యులను ప్రశ్నించారు.ఆస్పత్రికి వచ్చే ఆదాయవనరులపై ఎందుకు దృష్టి సారించడంలేదని సూపరింటెండెంట్ని ప్రశ్నించారు. నాట్కో ట్రస్టు ఆధ్వర్యంలో క్యాన్సర్ ఆసుపత్రి చాలా బాగా నడుస్తోంది ఆసుపత్రి అభివృద్ధి కమిటీలో సభ్యులుగా వారిని భాగస్వాములను చేయాలని సూచించారు.
జయదేవ్ నిర్మించినట్లు మీరెందుకు కట్టలేకపోయారు? ఆసుపత్రిలో రాజన్న ట్రస్టు ద్వారా అప్పటి గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ రూ.కోటి నిధులు వెచ్చించి రోగుల సహాయకులకు విశ్రాంతి మందిరాన్ని నిర్మించారు. అదే రూ.కోటితో ప్రభుత్వం కూడా భవనం పనులు ప్రారంభించి అసంపూర్తిగా వదిలేసింది. ఎంపీ జయదేవ్ కట్టగా మీరెందుకు ఆ భవనం పూర్తి చేయలేకపోయారు? దీనికి కారణాలేమిటని ఏపీఎంఎస్ఐడీసీ అధికారులను ప్రశ్నించి దీనిపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ను ఆదేశించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంటికే పింఛను.. నవ్వులు విరబూసెను..
[ 02-07-2024]
పెనుమాకకు పండగొచ్చింది. తెల్లారింది లేవండోయ్ అంటూ ఇంకా సూరీడు ఉదయించకముందే ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ గ్రామంలో లబ్ధిదారుల ఇంటి వద్దకే పింఛన్ల పంపిణీకి వెళ్లడంతో సందడి నెలకొంది. -
లబ్ధిదారుల ఇంటికి చంద్రన్న.. పులకించిన పెనుమాక
[ 02-07-2024]
పెనుమాకకు పండగొచ్చింది. తెల్లారింది లేవండోయ్ అంటూ ఇంకా సూరీడు ఉదయించక ముందే ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ గ్రామంలో లబ్ధిదారుల ఇంటి వద్దకే పింఛన్ల పంపిణీకి వెళ్లడంతో సందడి నెలకొంది. -
ఆనందం కనిపింఛెన్
[ 02-07-2024]
‘పెద్దకొడుకులా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావ్.. మా దీవెనలు అందుకుని నిండునూరేళ్లు జీవించి పేదల అభ్యున్నతికి పాటుపడుతూ రాష్ట్ర ప్రగతికి బాటలు వేయాల’ంటూ అవ్వాతాతలు సీఎం చంద్రబాబును ఆశీర్వదించారు. -
అడుగడుగునా ఆప్యాయంగా పలకరిస్తూ..
[ 02-07-2024]
బాణావత్ పాములు కుటుంబానికి పింఛను పంపిణీ తర్వాత గ్రామంలోని కూడలిలో అంగన్వాడీ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన ప్రజావేదికకు కాలినడకన చంద్రబాబు బయలుదేరారు. -
మంగళగిరి ప్రజల రుణం తీర్చుకోవాలి
[ 02-07-2024]
మంత్రి లోకేశ్ మంగళగిరి నియోజకవర్గ సమస్యలు పరిష్కరించాలని చంద్రబాబును కోరారు. -
తమ్ముడు వైకాపా సర్పంచి.. అన్న తుళ్లూరు సీఐ
[ 02-07-2024]
గుంటూరు జిల్లాలో అత్యంత ప్రాధాన్యం కలిగిన తుళ్లూరు సర్కిల్ ఇన్స్పెక్టర్గా నియమితులైన మాతంగి శ్రీనివాసరావు సొంత తమ్ముడు రవిబాబు వైకాపా సర్పంచిగా కొనసాగుతున్నారు. -
పింఛన్ల పంపిణీలో చేతివాటం
[ 02-07-2024]
ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీలో మాచర్లలోని 9వ వార్డు సచివాలయ వెల్ఫేర్ సెక్రటరీ బాణావత్ బాలూనాయక్ చేతివాటం ప్రదర్శించాడు. -
మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి రూ.50 లక్షలు తీసుకుని మోసం
[ 02-07-2024]
నరసరావుపేట వైకాపా నేత, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో పాటు ఆయన అనుచరుడు దానారెడ్డి తనను మోసగించి తీసుకున్న డబ్బు తిరిగి ఇప్పించాలని కోరుతూ ఈపూరు మండలం ఊడిచెర్ల తండాకు చెందిన స్థిరాస్తి వ్యాపారి కొడావత్ లక్ష్మణ నాయక్ ఎస్పీ మలికా గార్గ్కు ఫిర్యాదు చేశారు. -
వివాదాస్పద సీఐకి కీలక పోస్టింగ్
[ 02-07-2024]
గుంటూరు జిల్లాలో అత్యంత ప్రాధాన్యం కలిగిన తుళ్లూరు సర్కిల్ ఇన్స్పెక్టర్గా నియమితులైన మాతంగి శ్రీనివాసరావు సొంత తమ్ముడు రవిబాబు వైకాపా సర్పంచిగా కొనసాగుతున్నారు. -
దారి మారాలి.. దశ తిరగాలి..
[ 02-07-2024]
కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా మంగళగిరిలో నిర్మించిన ఎయిమ్స్ ఆసుపత్రికి రోగులు చేరుకోవడానికి గత వైకాపా ప్రభుత్వం ఐదేళ్లలో సరైన రహదారి నిర్మించలేకపోయింది. -
అర్జీలు సత్వరం పరిష్కరించాల్సిందే
[ 02-07-2024]
ప్రజల నుంచి వచ్చిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి అధికారులకు సూచించారు. -
పల్లెకోనలో బీపీటీ కొత్తరకం విత్తనాల పంపిణీ
[ 02-07-2024]
మండలంలోని పల్లెకోన గ్రామంలో ముగ్గురు రైతులకు బీపీటీ-2858 విత్తనాలకు సంబంధించిన రెండు కిలోలను ఏరువాక కేంద్రానికి చెందిన శాస్త్రవేత్తలు డాక్టరు ఆô్.బాలమురళీధô్నాయÚ్, డాక్టరు జె.రాధాకృష్ణ సోమవారం పంపిణీ చేశారు. -
బాధిత బాలికలపైనే అక్రమ కేసు
[ 02-07-2024]
బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం ప్రాసంగులపాడులో తమ్మిశెట్టి నాగదేవి, రాజేంద్ర తమపై దాడి చేసి అసభ్య పదజాలంతో దూషిస్తే బాధితులమైన తమపై కొరిశపాడు ఎస్సై అక్రమంగా కేసు కట్టారని అక్కాచెల్లెళ్లయిన బాలికలు ఎస్పీ వకుల్ జిందాల్కు ఫిర్యాదు చేశారు. -
ప్రయాణికుల ఆకాంక్షలకు అనుగుణంగా సేవలు
[ 02-07-2024]
ప్రయాణికుల ఆకాంక్షలకు అనుగుణంగా సదుపాయాలు కల్పించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని ద.మ.రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ సూచించారు. -
సస్పెండ్ చేసినా విధుల్లోనే వేమెన్లు
[ 02-07-2024]
‘ఎన్నికల సమయంలో నిబంధనలకు విరుద్ధంగా గుంటూరు మార్కెట్ యార్డులోని ట్రేడ్ యూనియన్ కార్యాలయంలో అప్పటి వైకాపా ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. -
రెప్పపాటులో మృత్యు కాటు
[ 02-07-2024]
కుటుంబమంతా కలిసి సరదాగా కబుర్లు చెప్పుకొంటూ కారులో వెళ్తున్నారు.