ఎయిమ్స్కు నీటి కష్టాలు తీరినట్లే
మంగళగిరి ఎయిమ్స్లో నీటి సమస్య పరిష్కారానికి తెదేపా కూటమి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ అంశంపై ఆసుపత్రి డైరెక్టర్ మాధవానంద కార్ శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కలిసిన నేపథ్యంలో అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది.
అధికార యంత్రాంగంలో కదలిక
పనుల పూర్తికి యుద్ధప్రాతిపదికన చర్యలు
ఎయిమ్స్ ఆసుపత్రి
ఈనాడు - అమరావతి: మంగళగిరి ఎయిమ్స్లో నీటి సమస్య పరిష్కారానికి తెదేపా కూటమి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ అంశంపై ఆసుపత్రి డైరెక్టర్ మాధవానంద కార్ శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కలిసిన నేపథ్యంలో అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. ఆ పనులను పర్యవేక్షిస్తున్న మున్సిపల్ ప్రజారోగ్య ఇంజినీరింగ్ విభాగం గుంటూరు సర్కిల్ అధికారులు అటవీ, పర్యావరణ శాఖల జాతీయ అధికారులతో శనివారం సంప్రదింపులు జరిపారు. ఆపై గుత్తేదారుతో మాట్లాడారు. పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని ఇంకా అప్లోడ్ చేయాల్సిన వాటిని వెంటనే సీఎఫ్ఎంఎస్కు పంపుతామని, గతంలో నిలిపేసిన పైపులైను అనుసంధాన పనులు, సంపుల నిర్మాణం వంటివి వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈసారి ఎలాగైనా...
కేంద్ర అటవీ పర్యావరణశాఖ, జాతీయ రహదారుల విభాగం నుంచి స్టేజ్-1 అనుమతులతో ఆసుపత్రికి జాతీయ రహదారి నుంచి (కొలనుకొండ వద్ద) లోపలికి ఆర్అండ్బీ అధికారులు రోడ్డు నిర్మించారు. ప్రస్తుతం కొలనుకొండ నుంచి అటవీశాఖ భూములు మీదుగా 850 మీటర్ల మేర పైపులైను నిర్మాణానికి అనుమతులు కోరుతూ దస్త్రాన్ని చెన్నై అధికారులకు పంపించారు. గతంలో రహదారిని నిర్మించినప్పుడు రోడ్డు కటింగ్ ఛార్జీలు రూ. 3 లక్షలను జాతీయ రహదారుల సంస్థకు బకాయి ఉంది. ఈ మొత్తాన్ని చెల్లించి స్టేజ్-1 అనుమతితో పైపులైను పనులు ప్రారంభించాలన్నది ఆలోచన. ఆమోదం రాకపోతే స్టేజ్-2 అనుమతి పొంది పైపులైన్ పనులు వెంటనే చేపట్టేలా మరో దస్త్రం రూపొందించారు. ఆత్మకూరు ఛానల్ నుంచి రోజుకు 2.5 మిలియన్ లీటర్ల నీటిని పైపులైన్ ద్వారా ఆసుపత్రికి తరలించి సంపుల్లో నిల్వ చేసే పనులకు 2022 అక్టోబరులో గుత్తేదారుతో అధికారులు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఏడాది వ్యవధిలోనే పనులు పూర్తి చేయాలన్నది లక్ష్యం. అప్పట్లో రూ. 7.74 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించగా.. సకాలంలో పూర్తికాక రూ. 8.94 కోట్లకు పెరిగింది. ఇప్పటికే మూడుసార్లు గడువు పొడిగించారు. ఆగస్టునాటికి పూర్తి చేయాలని అనుకున్నా... అప్పటికి కష్టమని భావిస్తున్న అధికారులు మరో రెండు నెలల సమయం కోరాలని యోచిస్తున్నారు. గతంలో చేసిన రూ. 2.97 కోట్ల పనులకు బిల్లులు చెల్లించేశారు. రూ. 2.05 కోట్ల బిల్లులు అప్లోడ్ చేయాల్సి ఉంది. ఇంకా రూ. 5.96 కోట్లు అవసరమవుతాయని ఈ బడ్జెట్ విడుదల చేస్తే వెంటనే పనులను పూర్తి చేస్తామని తాజాగా ఉన్నతాధికారులను కోరుతూ దస్త్రం పంపించారు.
అసంపూర్తిగా సంపు నిర్మాణం
నాటి జగన్ సర్కారు హయాంలో
- 2019కు ముందు తెదేపా ప్రభుత్వ హయాంలో మంగళగిరి ఎయిమ్స్ నిర్మాణం సాకారమైంది. నిర్మాణాలకు అనుమతులు, భూముల కేటాయింపు వంటి విషయాల్లో అప్పట్లో ప్రభుత్వం వేగంగా స్పందించి పనులను శరవేగంగా పూర్తి చేసి వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ తరువాత అధికారంలోకొచ్చిన వైకాపా ప్రభుత్వం నీటి సమస్యను పరిష్కరించకుండా ఐదేళ్లు నాన్చింది. నీళ్లు లేక రోగులు సహా వైద్యులు, సిబ్బంది, వైద్య, నర్సింగ్ విద్యార్థులు పడ్డ ఇబ్బందులెన్నో. అయినా జగన్ మనసు కరగలేదు.
- విజయవాడ, మంగళగిరి - తాడేపల్లి కార్పొరేషన్ల నుంచి ట్యాంకర్ల ద్వారా నీటిని తెచ్చుకోవాల్సి వచ్చేది. నిత్యం ఏడు మిలియన్ లీటర్ల (ఎంఎల్డీ) నీరు అవసరం కాగా.. కేవలం రెండు మిలియన్ లీటర్లే వచ్చేవి. వైకాపా హయాంలో ఐదేళ్లపాటు ఇదే పరిస్థితి. కిరాయిల రూపేణా భారీగా బిల్లులు చెల్లించాల్సి వచ్చేది.
- సంపులు, నీటిశుద్ధి ప్లాంట్లకు సంబంధించి సివిల్ పనులు పూర్తయ్యాయి. మెకానికల్, ఫిల్టర్బెడ్ల పనులు అసంపూర్తిగా ఉన్నాయి. జాతీయ రహదారి క్రాసింగ్ వద్ద పనులు కొంతమేర పెండింగ్లో ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంటికే పింఛను.. నవ్వులు విరబూసెను..
[ 02-07-2024]
పెనుమాకకు పండగొచ్చింది. తెల్లారింది లేవండోయ్ అంటూ ఇంకా సూరీడు ఉదయించకముందే ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ గ్రామంలో లబ్ధిదారుల ఇంటి వద్దకే పింఛన్ల పంపిణీకి వెళ్లడంతో సందడి నెలకొంది. -
లబ్ధిదారుల ఇంటికి చంద్రన్న.. పులకించిన పెనుమాక
[ 02-07-2024]
పెనుమాకకు పండగొచ్చింది. తెల్లారింది లేవండోయ్ అంటూ ఇంకా సూరీడు ఉదయించక ముందే ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ గ్రామంలో లబ్ధిదారుల ఇంటి వద్దకే పింఛన్ల పంపిణీకి వెళ్లడంతో సందడి నెలకొంది. -
ఆనందం కనిపింఛెన్
[ 02-07-2024]
‘పెద్దకొడుకులా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావ్.. మా దీవెనలు అందుకుని నిండునూరేళ్లు జీవించి పేదల అభ్యున్నతికి పాటుపడుతూ రాష్ట్ర ప్రగతికి బాటలు వేయాల’ంటూ అవ్వాతాతలు సీఎం చంద్రబాబును ఆశీర్వదించారు. -
అడుగడుగునా ఆప్యాయంగా పలకరిస్తూ..
[ 02-07-2024]
బాణావత్ పాములు కుటుంబానికి పింఛను పంపిణీ తర్వాత గ్రామంలోని కూడలిలో అంగన్వాడీ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన ప్రజావేదికకు కాలినడకన చంద్రబాబు బయలుదేరారు. -
మంగళగిరి ప్రజల రుణం తీర్చుకోవాలి
[ 02-07-2024]
మంత్రి లోకేశ్ మంగళగిరి నియోజకవర్గ సమస్యలు పరిష్కరించాలని చంద్రబాబును కోరారు. -
తమ్ముడు వైకాపా సర్పంచి.. అన్న తుళ్లూరు సీఐ
[ 02-07-2024]
గుంటూరు జిల్లాలో అత్యంత ప్రాధాన్యం కలిగిన తుళ్లూరు సర్కిల్ ఇన్స్పెక్టర్గా నియమితులైన మాతంగి శ్రీనివాసరావు సొంత తమ్ముడు రవిబాబు వైకాపా సర్పంచిగా కొనసాగుతున్నారు. -
పింఛన్ల పంపిణీలో చేతివాటం
[ 02-07-2024]
ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీలో మాచర్లలోని 9వ వార్డు సచివాలయ వెల్ఫేర్ సెక్రటరీ బాణావత్ బాలూనాయక్ చేతివాటం ప్రదర్శించాడు. -
మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి రూ.50 లక్షలు తీసుకుని మోసం
[ 02-07-2024]
నరసరావుపేట వైకాపా నేత, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో పాటు ఆయన అనుచరుడు దానారెడ్డి తనను మోసగించి తీసుకున్న డబ్బు తిరిగి ఇప్పించాలని కోరుతూ ఈపూరు మండలం ఊడిచెర్ల తండాకు చెందిన స్థిరాస్తి వ్యాపారి కొడావత్ లక్ష్మణ నాయక్ ఎస్పీ మలికా గార్గ్కు ఫిర్యాదు చేశారు. -
వివాదాస్పద సీఐకి కీలక పోస్టింగ్
[ 02-07-2024]
గుంటూరు జిల్లాలో అత్యంత ప్రాధాన్యం కలిగిన తుళ్లూరు సర్కిల్ ఇన్స్పెక్టర్గా నియమితులైన మాతంగి శ్రీనివాసరావు సొంత తమ్ముడు రవిబాబు వైకాపా సర్పంచిగా కొనసాగుతున్నారు. -
దారి మారాలి.. దశ తిరగాలి..
[ 02-07-2024]
కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా మంగళగిరిలో నిర్మించిన ఎయిమ్స్ ఆసుపత్రికి రోగులు చేరుకోవడానికి గత వైకాపా ప్రభుత్వం ఐదేళ్లలో సరైన రహదారి నిర్మించలేకపోయింది. -
అర్జీలు సత్వరం పరిష్కరించాల్సిందే
[ 02-07-2024]
ప్రజల నుంచి వచ్చిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి అధికారులకు సూచించారు. -
పల్లెకోనలో బీపీటీ కొత్తరకం విత్తనాల పంపిణీ
[ 02-07-2024]
మండలంలోని పల్లెకోన గ్రామంలో ముగ్గురు రైతులకు బీపీటీ-2858 విత్తనాలకు సంబంధించిన రెండు కిలోలను ఏరువాక కేంద్రానికి చెందిన శాస్త్రవేత్తలు డాక్టరు ఆô్.బాలమురళీధô్నాయÚ్, డాక్టరు జె.రాధాకృష్ణ సోమవారం పంపిణీ చేశారు. -
బాధిత బాలికలపైనే అక్రమ కేసు
[ 02-07-2024]
బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం ప్రాసంగులపాడులో తమ్మిశెట్టి నాగదేవి, రాజేంద్ర తమపై దాడి చేసి అసభ్య పదజాలంతో దూషిస్తే బాధితులమైన తమపై కొరిశపాడు ఎస్సై అక్రమంగా కేసు కట్టారని అక్కాచెల్లెళ్లయిన బాలికలు ఎస్పీ వకుల్ జిందాల్కు ఫిర్యాదు చేశారు. -
ప్రయాణికుల ఆకాంక్షలకు అనుగుణంగా సేవలు
[ 02-07-2024]
ప్రయాణికుల ఆకాంక్షలకు అనుగుణంగా సదుపాయాలు కల్పించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని ద.మ.రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ సూచించారు. -
సస్పెండ్ చేసినా విధుల్లోనే వేమెన్లు
[ 02-07-2024]
‘ఎన్నికల సమయంలో నిబంధనలకు విరుద్ధంగా గుంటూరు మార్కెట్ యార్డులోని ట్రేడ్ యూనియన్ కార్యాలయంలో అప్పటి వైకాపా ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. -
రెప్పపాటులో మృత్యు కాటు
[ 02-07-2024]
కుటుంబమంతా కలిసి సరదాగా కబుర్లు చెప్పుకొంటూ కారులో వెళ్తున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
యాప్ ద్వారా పరిచయమై యువతిపై అత్యాచారం.. కేసు నమోదు
-
విధులు మరిచి ఈల వేసి గోల చేసి.. మందుబాబులతో ఏఎస్సై నిర్వాకం
-
అంతస్తుకో ధర.. గజానికో లెక్క
-
రోజూ దేవుణ్ని ప్రార్థిస్తున్నాడని మరణశిక్ష జీవితఖైదుగా మార్పు
-
ఎమ్మెల్సీ అభ్యర్థులుగా సి.రామచంద్రయ్య, హరిప్రసాద్
-
లోక్సభ ప్యానెల్ స్పీకర్గా తెదేపా ఎంపీ కృష్ణప్రసాద్