అక్షర యోధుడు రామోజీరావు
చివరి క్షణం వరకు సమాజ శ్రేయస్సు కోసం పరితపించిన రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు సేవలు చిరస్మరణీయమని రాజధాని రైతులు, మహిళలు పేర్కొన్నారు.
అమరావతికి రూ.10 కోట్ల భారీ విరాళంపై హర్షం
తుళ్లూరులో నివాళులర్పిస్తూ..
తుళ్లూరు, న్యూస్టుడే: చివరి క్షణం వరకు సమాజ శ్రేయస్సు కోసం పరితపించిన రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు సేవలు చిరస్మరణీయమని రాజధాని రైతులు, మహిళలు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరులో శనివారం జోహార్ రామోజీరావు, జై అమరావతి అని నినాదాలు చేస్తూ నివాళులర్పించారు. ఇటీవల విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన ఆయన సంస్మరణ కార్యక్రమంలో రామోజీరావు కుమారుడు సీహెచ్ కిరణ్ అమరావతి నిర్మాణానికి రూ. 10 కోట్లు భారీ విరాళం అందించడంపై కృతజ్ఞతలు తెలిపారు. రాజధానికి అమరావతి అని నామకరణం చేయడమే కాక పరిరక్షణకు అనుక్షణం కృషి చేసిన అక్షర యోధుడని కొనియాడారు. ఆయన ప్రజలకు చేసిన సేవల చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోతుందన్నారు.
రైతు కుటుంబం నుంచి మహోన్నత శిఖరాలకు..
కృష్ణా జిల్లాలో ఒక చిన్న రైతు కుటుంబంలో జన్మించిన రామోజీరావు జీవితంలో అంచెలంచెలుగా ఎదిగి మహోన్నత శిఖరాలను అధిరోహించారు. తెలుగు వారికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చారు. ఆయన మృతి దేశానికి తీరని లోటు.
ఆలూరి పావని, రాజధాని మహిళా రైతు, తుళ్లూరు
సేవలు మరువలేనివి
రామోజీ గ్రూప్ సంస్థల ద్వారా వేలాది మందికి ఉపాధి కల్పించడమే కాకుండా పలు సేవా కార్యక్రమాలు చేసిన మహనీయుడు రామోజీరావు. అమరావతి నిర్మాణంలో భాగస్వాములవుతూ రూ.10 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించడం గొప్ప విషయం.
భరత్, తుళ్లూరు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి రూ.50 లక్షలు తీసుకుని మోసం
[ 02-07-2024]
నరసరావుపేట వైకాపా నేత, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో పాటు ఆయన అనుచరుడు దానారెడ్డి తనను మోసగించి తీసుకున్న డబ్బు తిరిగి ఇప్పించాలని కోరుతూ ఈపూరు మండలం ఊడిచెర్ల తండాకు చెందిన స్థిరాస్తి వ్యాపారి కొడావత్ లక్ష్మణ నాయక్ ఎస్పీ మలికా గార్గ్కు ఫిర్యాదు చేశారు. -
తమ్ముడు వైకాపా సర్పంచి.. అన్న తుళ్లూరు సీఐ
[ 02-07-2024]
గుంటూరు జిల్లాలో అత్యంత ప్రాధాన్యం కలిగిన తుళ్లూరు సర్కిల్ ఇన్స్పెక్టర్గా నియమితులైన మాతంగి శ్రీనివాసరావు సొంత తమ్ముడు రవిబాబు వైకాపా సర్పంచిగా కొనసాగుతున్నారు. -
ఇంటికే పింఛను.. నవ్వులు విరబూసెను..
[ 02-07-2024]
పెనుమాకకు పండగొచ్చింది. తెల్లారింది లేవండోయ్ అంటూ ఇంకా సూరీడు ఉదయించకముందే ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ గ్రామంలో లబ్ధిదారుల ఇంటి వద్దకే పింఛన్ల పంపిణీకి వెళ్లడంతో సందడి నెలకొంది. -
లబ్ధిదారుల ఇంటికి చంద్రన్న.. పులకించిన పెనుమాక
[ 02-07-2024]
పెనుమాకకు పండగొచ్చింది. తెల్లారింది లేవండోయ్ అంటూ ఇంకా సూరీడు ఉదయించక ముందే ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ గ్రామంలో లబ్ధిదారుల ఇంటి వద్దకే పింఛన్ల పంపిణీకి వెళ్లడంతో సందడి నెలకొంది. -
ఆనందం కనిపింఛెన్
[ 02-07-2024]
‘పెద్దకొడుకులా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావ్.. మా దీవెనలు అందుకుని నిండునూరేళ్లు జీవించి పేదల అభ్యున్నతికి పాటుపడుతూ రాష్ట్ర ప్రగతికి బాటలు వేయాల’ంటూ అవ్వాతాతలు సీఎం చంద్రబాబును ఆశీర్వదించారు. -
అడుగడుగునా ఆప్యాయంగా పలకరిస్తూ..
[ 02-07-2024]
బాణావత్ పాములు కుటుంబానికి పింఛను పంపిణీ తర్వాత గ్రామంలోని కూడలిలో అంగన్వాడీ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన ప్రజావేదికకు కాలినడకన చంద్రబాబు బయలుదేరారు. -
మంగళగిరి ప్రజల రుణం తీర్చుకోవాలి
[ 02-07-2024]
మంత్రి లోకేశ్ మంగళగిరి నియోజకవర్గ సమస్యలు పరిష్కరించాలని చంద్రబాబును కోరారు. -
పింఛన్ల పంపిణీలో చేతివాటం
[ 02-07-2024]
ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీలో మాచర్లలోని 9వ వార్డు సచివాలయ వెల్ఫేర్ సెక్రటరీ బాణావత్ బాలూనాయక్ చేతివాటం ప్రదర్శించాడు. -
వివాదాస్పద సీఐకి కీలక పోస్టింగ్
[ 02-07-2024]
గుంటూరు జిల్లాలో అత్యంత ప్రాధాన్యం కలిగిన తుళ్లూరు సర్కిల్ ఇన్స్పెక్టర్గా నియమితులైన మాతంగి శ్రీనివాసరావు సొంత తమ్ముడు రవిబాబు వైకాపా సర్పంచిగా కొనసాగుతున్నారు. -
దారి మారాలి.. దశ తిరగాలి..
[ 02-07-2024]
కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా మంగళగిరిలో నిర్మించిన ఎయిమ్స్ ఆసుపత్రికి రోగులు చేరుకోవడానికి గత వైకాపా ప్రభుత్వం ఐదేళ్లలో సరైన రహదారి నిర్మించలేకపోయింది. -
అర్జీలు సత్వరం పరిష్కరించాల్సిందే
[ 02-07-2024]
ప్రజల నుంచి వచ్చిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి అధికారులకు సూచించారు. -
పల్లెకోనలో బీపీటీ కొత్తరకం విత్తనాల పంపిణీ
[ 02-07-2024]
మండలంలోని పల్లెకోన గ్రామంలో ముగ్గురు రైతులకు బీపీటీ-2858 విత్తనాలకు సంబంధించిన రెండు కిలోలను ఏరువాక కేంద్రానికి చెందిన శాస్త్రవేత్తలు డాక్టరు ఆô్.బాలమురళీధô్నాయÚ్, డాక్టరు జె.రాధాకృష్ణ సోమవారం పంపిణీ చేశారు. -
బాధిత బాలికలపైనే అక్రమ కేసు
[ 02-07-2024]
బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం ప్రాసంగులపాడులో తమ్మిశెట్టి నాగదేవి, రాజేంద్ర తమపై దాడి చేసి అసభ్య పదజాలంతో దూషిస్తే బాధితులమైన తమపై కొరిశపాడు ఎస్సై అక్రమంగా కేసు కట్టారని అక్కాచెల్లెళ్లయిన బాలికలు ఎస్పీ వకుల్ జిందాల్కు ఫిర్యాదు చేశారు. -
ప్రయాణికుల ఆకాంక్షలకు అనుగుణంగా సేవలు
[ 02-07-2024]
ప్రయాణికుల ఆకాంక్షలకు అనుగుణంగా సదుపాయాలు కల్పించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని ద.మ.రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ సూచించారు. -
సస్పెండ్ చేసినా విధుల్లోనే వేమెన్లు
[ 02-07-2024]
‘ఎన్నికల సమయంలో నిబంధనలకు విరుద్ధంగా గుంటూరు మార్కెట్ యార్డులోని ట్రేడ్ యూనియన్ కార్యాలయంలో అప్పటి వైకాపా ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. -
రెప్పపాటులో మృత్యు కాటు
[ 02-07-2024]
కుటుంబమంతా కలిసి సరదాగా కబుర్లు చెప్పుకొంటూ కారులో వెళ్తున్నారు.