ఇష్టానుసారం తోడేస్తున్నారు!
గుండ్లకమ్మ నదిలో ఇసుక తవ్వకాలు పునః ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో కూటమి అధికారం చేపట్టింది. ఇసుక విధానం గురించి ప్రభుత్వం నిర్ణయం తీసుకునేందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉంది.
గుండ్లకమ్మ పరివాహకంలో ఆగని ఇసుక తవ్వకాలు
పాతకొటికలపూడి ఎదుట తవ్విన ఇసుక
అద్దంకి, న్యూస్టుడే: గుండ్లకమ్మ నదిలో ఇసుక తవ్వకాలు పునః ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో కూటమి అధికారం చేపట్టింది. ఇసుక విధానం గురించి ప్రభుత్వం నిర్ణయం తీసుకునేందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఇసుక అక్రమ తవ్వకందార్లు ఏమాత్రం ఓర్పు వహించే పరిస్థితి లేకుండా పోయింది. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ తవ్వకాలు జరుపుతున్నారు. గుండ్లకమ్మ నది పరివాహకంలో రామాయపాలెం, తిమ్మాయపాలెం, వేలమూరిపాడు, కొటికలపూడి, మోదేపల్లి, పేరాయపాలెం, ధేనువకొండ గ్రామాల సరిహద్దుల్లో తవ్వేస్తున్నారు. గతంలో రూ.4,500 నుంచి రూ.5 వేలకు ట్రక్కు ఇసుక లభించేది. ఇపుడు మాత్రం రూ.2,500 నుంచి రూ.3,500 వరకు విక్రయిస్తున్నారు. గతంలో మాదిరిగా కాకుండా ఇసుక తవ్వకాలను ప్రత్యేకించి కొందరు మాత్రమే కొనసాగిస్తున్నట్లు సమాచారం. అందువల్లనే గ్రామాల్లో వాదనలు చోటు చేసుకుంటున్నాయి.
జాతీయ గ్రీన్ ట్రైబ్యునల్ను ఆశ్రయించిన ప్రజాసంఘాలు: అద్దంకి సమీపంలోని గుండ్లకమ్మ పరిసరాల్లో ఇసుక తవ్వకాలు పెద్దఎత్తున జరుగుతున్నాయంటూ ప్రజాసంఘాల తరఫున మన్నం త్రిమూర్తులు గ్రీన్ ట్రైబ్యునల్ను ఆశ్రయించారు. ఆమేరకు స్థానికంగా పనిచేసే అధికార యంత్రాంగానికి తాకీదులు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే గుండ్లకమ్మ నది పరివాహకంలో పూర్వం తవ్వకాలు జరిపిన ఇసుక కుప్పల్ని అధికారుల బృందం వారానికి ఒక పర్యాయం పరిశీలించి వెళుతోంది. తవ్వకందార్లు తామేమీ తక్కువ తినలేదంటూ వాటిని వదిలి వేసి కొత్తప్రదేశాల్లో తవ్వకాలు ప్రారంభించారు. కొంతమంది గ్రామస్థాయి నాయకులు భవిష్యత్తులో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఇసుక తవ్వకాలను ప్రోత్సహిస్తున్నట్లు సమాచారం. ఈ విషయమై అద్దంకి సీఐ పి.కృష్ణయ్యను వివరణ కోరగా ఇసుక తవ్వకాలు జరుపుతున్న వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. రాత్రి పూట పహారా ఉంచినట్లు స్పష్టం చేశారు. ఇసుకపై ప్రభుత్వ విధానం వెలువడే వరకు ఎవరూ తవ్వరాదని హెచ్చరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి రూ.50 లక్షలు తీసుకుని మోసం
[ 02-07-2024]
నరసరావుపేట వైకాపా నేత, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో పాటు ఆయన అనుచరుడు దానారెడ్డి తనను మోసగించి తీసుకున్న డబ్బు తిరిగి ఇప్పించాలని కోరుతూ ఈపూరు మండలం ఊడిచెర్ల తండాకు చెందిన స్థిరాస్తి వ్యాపారి కొడావత్ లక్ష్మణ నాయక్ ఎస్పీ మలికా గార్గ్కు ఫిర్యాదు చేశారు. -
తమ్ముడు వైకాపా సర్పంచి.. అన్న తుళ్లూరు సీఐ
[ 02-07-2024]
గుంటూరు జిల్లాలో అత్యంత ప్రాధాన్యం కలిగిన తుళ్లూరు సర్కిల్ ఇన్స్పెక్టర్గా నియమితులైన మాతంగి శ్రీనివాసరావు సొంత తమ్ముడు రవిబాబు వైకాపా సర్పంచిగా కొనసాగుతున్నారు. -
ఇంటికే పింఛను.. నవ్వులు విరబూసెను..
[ 02-07-2024]
పెనుమాకకు పండగొచ్చింది. తెల్లారింది లేవండోయ్ అంటూ ఇంకా సూరీడు ఉదయించకముందే ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ గ్రామంలో లబ్ధిదారుల ఇంటి వద్దకే పింఛన్ల పంపిణీకి వెళ్లడంతో సందడి నెలకొంది. -
లబ్ధిదారుల ఇంటికి చంద్రన్న.. పులకించిన పెనుమాక
[ 02-07-2024]
పెనుమాకకు పండగొచ్చింది. తెల్లారింది లేవండోయ్ అంటూ ఇంకా సూరీడు ఉదయించక ముందే ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ గ్రామంలో లబ్ధిదారుల ఇంటి వద్దకే పింఛన్ల పంపిణీకి వెళ్లడంతో సందడి నెలకొంది. -
ఆనందం కనిపింఛెన్
[ 02-07-2024]
‘పెద్దకొడుకులా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావ్.. మా దీవెనలు అందుకుని నిండునూరేళ్లు జీవించి పేదల అభ్యున్నతికి పాటుపడుతూ రాష్ట్ర ప్రగతికి బాటలు వేయాల’ంటూ అవ్వాతాతలు సీఎం చంద్రబాబును ఆశీర్వదించారు. -
అడుగడుగునా ఆప్యాయంగా పలకరిస్తూ..
[ 02-07-2024]
బాణావత్ పాములు కుటుంబానికి పింఛను పంపిణీ తర్వాత గ్రామంలోని కూడలిలో అంగన్వాడీ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన ప్రజావేదికకు కాలినడకన చంద్రబాబు బయలుదేరారు. -
మంగళగిరి ప్రజల రుణం తీర్చుకోవాలి
[ 02-07-2024]
మంత్రి లోకేశ్ మంగళగిరి నియోజకవర్గ సమస్యలు పరిష్కరించాలని చంద్రబాబును కోరారు. -
పింఛన్ల పంపిణీలో చేతివాటం
[ 02-07-2024]
ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీలో మాచర్లలోని 9వ వార్డు సచివాలయ వెల్ఫేర్ సెక్రటరీ బాణావత్ బాలూనాయక్ చేతివాటం ప్రదర్శించాడు. -
వివాదాస్పద సీఐకి కీలక పోస్టింగ్
[ 02-07-2024]
గుంటూరు జిల్లాలో అత్యంత ప్రాధాన్యం కలిగిన తుళ్లూరు సర్కిల్ ఇన్స్పెక్టర్గా నియమితులైన మాతంగి శ్రీనివాసరావు సొంత తమ్ముడు రవిబాబు వైకాపా సర్పంచిగా కొనసాగుతున్నారు. -
దారి మారాలి.. దశ తిరగాలి..
[ 02-07-2024]
కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా మంగళగిరిలో నిర్మించిన ఎయిమ్స్ ఆసుపత్రికి రోగులు చేరుకోవడానికి గత వైకాపా ప్రభుత్వం ఐదేళ్లలో సరైన రహదారి నిర్మించలేకపోయింది. -
అర్జీలు సత్వరం పరిష్కరించాల్సిందే
[ 02-07-2024]
ప్రజల నుంచి వచ్చిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి అధికారులకు సూచించారు. -
పల్లెకోనలో బీపీటీ కొత్తరకం విత్తనాల పంపిణీ
[ 02-07-2024]
మండలంలోని పల్లెకోన గ్రామంలో ముగ్గురు రైతులకు బీపీటీ-2858 విత్తనాలకు సంబంధించిన రెండు కిలోలను ఏరువాక కేంద్రానికి చెందిన శాస్త్రవేత్తలు డాక్టరు ఆô్.బాలమురళీధô్నాయÚ్, డాక్టరు జె.రాధాకృష్ణ సోమవారం పంపిణీ చేశారు. -
బాధిత బాలికలపైనే అక్రమ కేసు
[ 02-07-2024]
బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం ప్రాసంగులపాడులో తమ్మిశెట్టి నాగదేవి, రాజేంద్ర తమపై దాడి చేసి అసభ్య పదజాలంతో దూషిస్తే బాధితులమైన తమపై కొరిశపాడు ఎస్సై అక్రమంగా కేసు కట్టారని అక్కాచెల్లెళ్లయిన బాలికలు ఎస్పీ వకుల్ జిందాల్కు ఫిర్యాదు చేశారు. -
ప్రయాణికుల ఆకాంక్షలకు అనుగుణంగా సేవలు
[ 02-07-2024]
ప్రయాణికుల ఆకాంక్షలకు అనుగుణంగా సదుపాయాలు కల్పించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని ద.మ.రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ సూచించారు. -
సస్పెండ్ చేసినా విధుల్లోనే వేమెన్లు
[ 02-07-2024]
‘ఎన్నికల సమయంలో నిబంధనలకు విరుద్ధంగా గుంటూరు మార్కెట్ యార్డులోని ట్రేడ్ యూనియన్ కార్యాలయంలో అప్పటి వైకాపా ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. -
రెప్పపాటులో మృత్యు కాటు
[ 02-07-2024]
కుటుంబమంతా కలిసి సరదాగా కబుర్లు చెప్పుకొంటూ కారులో వెళ్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆధ్యాత్మిక కార్యక్రమంలో తొక్కిసలాట.. 60కి చేరిన మృతులు
-
ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్.. 11 మంది మావోయిస్టులు మృతి
-
ఈపీఎస్లో మార్పులు.. 6 నెలల సర్వీసు లేకున్నా విత్డ్రా ప్రయోజనాలు
-
ఏపీలో భారీగా ఐఏఎస్ల బదిలీ..పలు జిల్లాలకు కొత్త కలెక్టర్లు
-
ప్రధాని నరేంద్ర మోదీకి రాహుల్ గాంధీ లేఖ
-
ప్రజా సమస్యలు పరిష్కరించాలి.. పాలనలో మార్పు కనిపించాలి: చంద్రబాబు