బాధ్యతలు చేపట్టిన యంత్రాంగం
సహకార రంగం ప్రక్షాళనకు కూటమి ప్రభుత్వం వడివడిగా చర్యలు చేపట్టింది. 2018లో సహకార సొసైటీల పాలకవర్గాల సమయం ముగిసింది.
గుంటూరు, మాచర్ల, న్యూస్టుడే: సహకార రంగం ప్రక్షాళనకు కూటమి ప్రభుత్వం వడివడిగా చర్యలు చేపట్టింది. 2018లో సహకార సొసైటీల పాలకవర్గాల సమయం ముగిసింది. ఆ తర్వాత కొద్దికాలం పాటు వారినే కొనసాగించారు. తర్వాతి ఎన్నికల్లో ప్రభుత్వం మారడంతో వైకాపా పాలనలో సహకార సంఘాల బాధ్యతలను నామినేటెడ్గా భర్తీ చేశారు. దీంతో ఈ పదవులను అడ్డు పెట్టుకుని కొందరు ఆదాయ వనరుగా మార్చుకున్నారు. ఏడుగురు సభ్యులతో సహకార బ్యాంకు పాలకమండలిని, ముగ్గురు సభ్యులతో ఒక్కొక్క సొసైటీకి కమిటీని ఏర్పాటు చేసింది. వీరిది ఆడిందే ఆట అన్నట్లుగా గత అయిదు సంవత్సరాలు గడిచాయి. అదే స్థాయిలో పలుచోట్ల భారీ కుంభకోణాలు జరిగాయి.
పాలకమండళ్ల రద్దు...
కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పాలకమండలి రాజీనామా చేసి వైదొలిగింది. సొసైటీల త్రిసభ్య కమిటీలు వైదొలగాలని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చినా మాచర్ల, గురజాల ప్రాంతాల్లోని కొన్ని సంఘాల్లోని కమిటీ సభ్యులు రాజీనామా చేయలేదు. ప్రస్తుతం ప్రభుత్వం ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని 167 సంఘాలకు కూడా ప్రత్యేకాధికారులను నియమించాలని ఉత్తర్వులు జారీ చేసింది. సహకార బ్యాంకు అఫీషియల్ పర్సన్ ఇన్ఛార్జిగా జిల్లా సంయుక్త కలెక్టర్ జి.రాజకుమారి ఇప్పటికే బాద్యతలు స్వీకరించారు. శుక్రవారం వెలువడిన ఉత్తర్వులతో శనివారం రోజున ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని అన్ని సొసైటీలలో ప్రత్యేకాధికారులు బాధ్యతలు కేటాయించారు. వీరంతా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించే వరకు ప్రత్యేకాధికారులుగా బాధ్యతల్లో కొనసాగనున్నారు.
రూ.కోట్లు కొల్లగొట్టినా.. కితాబులా..
వైకాపా సర్కారు డీసీసీబీకి ఎన్నికలు జరపకుండా నామినేటెడ్ విధానంలో పాలకవర్గాన్ని ఏర్పాటు చేసింది. సొసైటీలకు త్రిసభ్య కమిటీని నియమించింది. పాలకవర్గాలు చక్కగా పనిచేస్తున్నాయి. అందువల్లనే సహకార సొసైటీలకు ఎన్నికలు నిర్వహించ లేదని అప్పట్లో మంత్రిగా పనిచేసిన కాకాణి గోవర్దన్ రెడ్డి గుంటూరు సహకార భవన్లో జరిగిన సమావేశంలో అన్నారు. అయితే అప్పటికే ప్రత్తిపాడు పరిధిలో నకిలీ పాసు పుస్తకాలతో పొందిన కోట్ల రూపాయల రుణాల అవకతవకలు బయటపడినా మంత్రి కనీసం ఆ ఊసెత్తకపోగా..పాలన బాగుందని కితాబిచ్చారు. సహకార వ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చారని చెప్పుకుంటూ సొసైటీలు, సహకార బ్యాంకుల్లో కోట్ల రూపాయలను వైకాపా పాలనలో నియమితులైన పాలకవర్గాలు బొక్కేశాయి. దీనిపై విచారణకు ఆదేశించినా.. ఒక్కరిపై కూడా చర్యలు చేపట్టిన సందర్భం లేదు.
అన్నింటా ప్రత్యేకాధికారులు
జిల్లా కేంద్ర సహకార బ్యాంకు, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీలకు అఫీషియల్ పర్సన్ ఇన్ఛార్జిలుగా జిల్లా సంయుక్త కలెక్టర్ను నియమించారు. ఈమేరకు వారు బాధ్యతలు స్వీకరించారు. తాజాగా పీఏసీఎస్లకు కూడా ప్రత్యేకాధికారులను నియమించాలని ఉత్తర్వులిచ్చారు. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని అన్ని సహకార సంఘాలకు కూడా ప్రత్యేకాధికారులను నియమించాం. ఒకవేళ ఎవరైనా ఆయా పదవి నుంచి వైదొలగకపోయినా ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం వైదొలగినట్లే. ఆయా సొసైటీలకు కూడా ప్రత్యేక అధికారులను నియమించాం.
వీరాచారి, జిల్లా సహకారశాఖ అధికారి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంటికే పింఛను.. నవ్వులు విరబూసెను..
[ 02-07-2024]
పెనుమాకకు పండగొచ్చింది. తెల్లారింది లేవండోయ్ అంటూ ఇంకా సూరీడు ఉదయించకముందే ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ గ్రామంలో లబ్ధిదారుల ఇంటి వద్దకే పింఛన్ల పంపిణీకి వెళ్లడంతో సందడి నెలకొంది. -
లబ్ధిదారుల ఇంటికి చంద్రన్న.. పులకించిన పెనుమాక
[ 02-07-2024]
పెనుమాకకు పండగొచ్చింది. తెల్లారింది లేవండోయ్ అంటూ ఇంకా సూరీడు ఉదయించక ముందే ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ గ్రామంలో లబ్ధిదారుల ఇంటి వద్దకే పింఛన్ల పంపిణీకి వెళ్లడంతో సందడి నెలకొంది. -
ఆనందం కనిపింఛెన్
[ 02-07-2024]
‘పెద్దకొడుకులా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావ్.. మా దీవెనలు అందుకుని నిండునూరేళ్లు జీవించి పేదల అభ్యున్నతికి పాటుపడుతూ రాష్ట్ర ప్రగతికి బాటలు వేయాల’ంటూ అవ్వాతాతలు సీఎం చంద్రబాబును ఆశీర్వదించారు. -
అడుగడుగునా ఆప్యాయంగా పలకరిస్తూ..
[ 02-07-2024]
బాణావత్ పాములు కుటుంబానికి పింఛను పంపిణీ తర్వాత గ్రామంలోని కూడలిలో అంగన్వాడీ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన ప్రజావేదికకు కాలినడకన చంద్రబాబు బయలుదేరారు. -
మంగళగిరి ప్రజల రుణం తీర్చుకోవాలి
[ 02-07-2024]
మంత్రి లోకేశ్ మంగళగిరి నియోజకవర్గ సమస్యలు పరిష్కరించాలని చంద్రబాబును కోరారు. -
తమ్ముడు వైకాపా సర్పంచి.. అన్న తుళ్లూరు సీఐ
[ 02-07-2024]
గుంటూరు జిల్లాలో అత్యంత ప్రాధాన్యం కలిగిన తుళ్లూరు సర్కిల్ ఇన్స్పెక్టర్గా నియమితులైన మాతంగి శ్రీనివాసరావు సొంత తమ్ముడు రవిబాబు వైకాపా సర్పంచిగా కొనసాగుతున్నారు. -
పింఛన్ల పంపిణీలో చేతివాటం
[ 02-07-2024]
ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీలో మాచర్లలోని 9వ వార్డు సచివాలయ వెల్ఫేర్ సెక్రటరీ బాణావత్ బాలూనాయక్ చేతివాటం ప్రదర్శించాడు. -
మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి రూ.50 లక్షలు తీసుకుని మోసం
[ 02-07-2024]
నరసరావుపేట వైకాపా నేత, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో పాటు ఆయన అనుచరుడు దానారెడ్డి తనను మోసగించి తీసుకున్న డబ్బు తిరిగి ఇప్పించాలని కోరుతూ ఈపూరు మండలం ఊడిచెర్ల తండాకు చెందిన స్థిరాస్తి వ్యాపారి కొడావత్ లక్ష్మణ నాయక్ ఎస్పీ మలికా గార్గ్కు ఫిర్యాదు చేశారు. -
వివాదాస్పద సీఐకి కీలక పోస్టింగ్
[ 02-07-2024]
గుంటూరు జిల్లాలో అత్యంత ప్రాధాన్యం కలిగిన తుళ్లూరు సర్కిల్ ఇన్స్పెక్టర్గా నియమితులైన మాతంగి శ్రీనివాసరావు సొంత తమ్ముడు రవిబాబు వైకాపా సర్పంచిగా కొనసాగుతున్నారు. -
దారి మారాలి.. దశ తిరగాలి..
[ 02-07-2024]
కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా మంగళగిరిలో నిర్మించిన ఎయిమ్స్ ఆసుపత్రికి రోగులు చేరుకోవడానికి గత వైకాపా ప్రభుత్వం ఐదేళ్లలో సరైన రహదారి నిర్మించలేకపోయింది. -
అర్జీలు సత్వరం పరిష్కరించాల్సిందే
[ 02-07-2024]
ప్రజల నుంచి వచ్చిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి అధికారులకు సూచించారు. -
పల్లెకోనలో బీపీటీ కొత్తరకం విత్తనాల పంపిణీ
[ 02-07-2024]
మండలంలోని పల్లెకోన గ్రామంలో ముగ్గురు రైతులకు బీపీటీ-2858 విత్తనాలకు సంబంధించిన రెండు కిలోలను ఏరువాక కేంద్రానికి చెందిన శాస్త్రవేత్తలు డాక్టరు ఆô్.బాలమురళీధô్నాయÚ్, డాక్టరు జె.రాధాకృష్ణ సోమవారం పంపిణీ చేశారు. -
బాధిత బాలికలపైనే అక్రమ కేసు
[ 02-07-2024]
బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం ప్రాసంగులపాడులో తమ్మిశెట్టి నాగదేవి, రాజేంద్ర తమపై దాడి చేసి అసభ్య పదజాలంతో దూషిస్తే బాధితులమైన తమపై కొరిశపాడు ఎస్సై అక్రమంగా కేసు కట్టారని అక్కాచెల్లెళ్లయిన బాలికలు ఎస్పీ వకుల్ జిందాల్కు ఫిర్యాదు చేశారు. -
ప్రయాణికుల ఆకాంక్షలకు అనుగుణంగా సేవలు
[ 02-07-2024]
ప్రయాణికుల ఆకాంక్షలకు అనుగుణంగా సదుపాయాలు కల్పించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని ద.మ.రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ సూచించారు. -
సస్పెండ్ చేసినా విధుల్లోనే వేమెన్లు
[ 02-07-2024]
‘ఎన్నికల సమయంలో నిబంధనలకు విరుద్ధంగా గుంటూరు మార్కెట్ యార్డులోని ట్రేడ్ యూనియన్ కార్యాలయంలో అప్పటి వైకాపా ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. -
రెప్పపాటులో మృత్యు కాటు
[ 02-07-2024]
కుటుంబమంతా కలిసి సరదాగా కబుర్లు చెప్పుకొంటూ కారులో వెళ్తున్నారు.