అయిదేళ్లలో తప్పుడు కేసులెన్నో!
బాపట్ల జిల్లాలో కొందరు పోలీసులు గత వైకాపా ప్రభుత్వంతో బాగా అంటకాగారు. ఆ పార్టీ నేతలు చెప్పిందే వేదంగా భావించి తెదేపా, జనసేన నాయకులు, కార్యకర్తలపై ఉక్కుపాదం మోపారు.
వైకాపా నేతలతో అంటకాగిన పోలీసులు
తెదేపా ఎమ్మెల్యేల ఫిర్యాదులను పట్టించుకోని ఎస్పీ
ఈనాడు, బాపట్ల
బాపట్ల జిల్లాలో కొందరు పోలీసులు గత వైకాపా ప్రభుత్వంతో బాగా అంటకాగారు. ఆ పార్టీ నేతలు చెప్పిందే వేదంగా భావించి తెదేపా, జనసేన నాయకులు, కార్యకర్తలపై ఉక్కుపాదం మోపారు. చిన్నాచితక ఫిర్యాదులకు స్టేషన్లకు పిలిపించి వేధించారు. సాక్షాత్తు తెదేపాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుపైనే నామినేషన్ల సమయంలో పర్చూరులో ఎస్సై శివనాగిరెడ్డి చాలా దురుసుగా ప్రవర్తించారు. బాపట్ల తెదేపా బాధ్యుడు వేగేశన నరేంద్ర వర్మపై బాపట్ల సీఐ కృష్ణయ్య సైతం నోరుపారేసుకున్నారు. ఎస్పీ వకుల్ జిందాల్ పనితీరుపైనా ఆరోపణలు వచ్చాయి. తెదేపా నాయకులు, కార్యకర్తలపై ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తున్నారని ఎస్పీకి ఫిర్యాదు చేయటానికి వెళ్లిన అప్పటి ఎమ్మెల్యేలు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్కు సకాలంలో అపాయింట్మెంట్ ఇవ్వలేదు. పోలింగ్ రోజున చీరాల తెదేపా అభ్యర్థి కొండయ్యపై దాడి, కారంచేడు మండలంలో తెదేపా ఏజెంట్లను కొట్టి తరిమేశారని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదు.
- కర్లపాలెంలో ఎస్సై జనార్దన్ అడుగడుగునా వైకాపాకు కొమ్ముకాశారు. రాజేష్ అనే దళిత యువకుడు వైకాపా నుంచి తెదేపాలో చేరగా అతనిపై ఎస్సై దాడి చేశారు. స్టేషన్కు పిలిపించి తిరిగి వైకాపాలోకి రావాలని చావబాదారు. అప్పటి ఎమ్మెల్యే కోన రఘుపతి అన్నకుమారుడు కోన వెంకట్, ఇతర వైకాపా నేతలు స్టేషన్లోకి వచ్చి రాజేష్పై దాడి చేసినా ఎస్సై పట్టించుకోలేదు. ప్రస్తుతం అతను సస్పెన్షన్లో ఉన్నారు.
- బల్లికురవలో తెదేపా వార్డు సభ్యురాలిని వైకాపాలో చేరాలని ఆ పార్టీ నాయకులు ఒత్తిడి చేశారు. దానికి ఆమె ససేమిరా అనడంతో ఎస్సై శివనాగిరెడ్డి ఆమెకు చెందిన షాపులో తనిఖీలకు వెళ్లారు. అక్రమంగా మద్యం కలిగి ఉన్నారని అందులో పనిచేసే ఓ వృద్ధుడిపై ఎస్సై చేయిచేసుకోవటం అప్పట్లో సంచలనమైంది. ఎన్నికల సంఘం తప్పుబట్టి లూప్లైన్కు పంపగా మరోసారి పర్చూరులో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుపై దురుసుగా ప్రవర్తించి సస్పెండ్ అయ్యారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో ఉన్నారు.
- చెరుకుపల్లి రూరల్ సీఐ శివశంకర్ వైకాపాకు అండగా నిలిచారు. ఆ సర్కిల్ పరిధిలో ఉప్పాల అమరనాథ్ గౌడ్ అనే బాలుడిని పెట్రోలు పోసి వైకాపా కార్యకర్త దారుణంగా హతమార్చినా సకాలంలో ఘటనా ప్రదేశానికి వెళ్లలేదు. నిందితుడిపై కేసు నమోదులో ఉదాశీనంగా వ్యవహరించారు. తీవ్రమైన సెక్షన్లు పెట్టకుండా కేసును తేల్చేయటంతో వెంటనే నిందితుడు బెయిల్పై బయటకొచ్చేశాడు. ఎంపీ మోపిదేవితో సన్నిహితంగా ఉంటారనే ఆరోపణలు సీఐ శివశంకర్పై ఉన్నాయి.
- బాపట్ల టౌన్ సీఐగా పనిచేసిన కృష్ణయ్య తెదేపా నాయకులు, కార్యకర్తలపై అనేక అక్రమ కేసులు పెట్టి ఇబ్బందిపెట్టారు. బాపట్లలో జరిగే తెదేపా ఆందోళనల్లో తెలుగు యువత నాయకుడు కుర్రా ధనేంద్ర చురుగ్గా పాల్గొంటున్నారని ఏకంగా రౌడీషీట్ ఓపెన్ చేశారు. దాన్ని ప్రశ్నించినందుకు తెదేపా బాధ్యుడు వేగేశన నరేంద్ర వర్మపై సీఐ కృష్ణయ్య చిందులు తొక్కారు. ప్రస్తుతం అతను అద్దంకి టౌన్ స్టేషన్లో పనిచేస్తున్నారు. ఆయనకు ముందు టౌన్ సీఐగా పనిచేసిన అశోక్ తెదేపా నాయకులు, కార్యకర్తలను అణచివేశారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో పనిచేస్తున్నారు.
- బాపట్ల రూరల్ సీఐ శ్రీహరి తెదేపా వారిని బాగా ఇబ్బంది పెట్టారు. పోలింగ్ రోజున పడమట పిల్లిబోయినవారిపాలెంలో వైకాపా వాళ్లు రాళ్ల దాడిచేసి పోలింగ్ కేంద్రాల వద్ద హడావుడి చేస్తుంటే పట్టించుకోలేదు. వారు జరిపిన దాడిలో పలువురు తెదేపా కార్యకర్తలు గాయపడితే తిరిగి వారిపైనే కేసులు పెట్టారు. వైకాపాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి కుమార్తె పొన్నూరు వద్ద కారు ప్రమాదకరంగా నడపటంతో ఓ మహిళపైకి దూసుకెళ్లి ఆమె చావుకు కారణమైనా ఎలాంటి కేసు లేకుండా చేశారు. ఇసుక మాఫియా ఆగడాలకు కళ్లెం వేయలేదు. ప్రస్తుతం ఎస్బీలో ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పింఛన్ పండగొచ్చింది
[ 01-07-2024]
అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛను రూ.4వేలు ఇస్తామని చెప్పిన చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన రోజునే పింఛన్ల పెంపుపై సంతకం చేసి ఇచ్చిన మాట నెలబెట్టుకున్నారు. -
కేంద్రం నిధులిస్తే రహ‘దారి’
[ 01-07-2024]
గుంటూరు నుంచి హైదరాబాద్ మార్గంలో పేరేచర్ల నుంచి కొండమోడు వరకు నాలుగు వరుసల రహదారిగా విస్తరణకు మార్గం సుగమమైంది. అద్దంకి-నార్కట్పల్లి రాష్ట్ర రహదారికి అనుసంధానంగా ఉండే ఈమార్గం రహదారి ప్రమాదాలు,.. -
విజయవాడలో అత్యున్నత శ్రేణి డయాగ్నోస్టిక్ సేవలు
[ 01-07-2024]
మహా నగరాలకు మాత్రమే పరిమితమైన అత్యున్నతశ్రేణి డయాగ్నోస్టిక్ సేవలను ప్రజలందరికీ చేరువ చేయాలన్న లక్ష్యంతో నీజెన్ డయాగ్నోస్టిక్స్ను విజయవాడలో ప్రారంభించడం అభినందనీయమని రెయిన్ బో హాస్పిటల్స్ సీఎండీ డాక్టర్ రమేష్ కంచర్ల పేర్కొన్నారు. -
సహకార బ్యాంకులో అవకతవకలపై విచారించండి
[ 01-07-2024]
గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో నకిలీ పాసు పుస్తకాలతో పొందిన రుణాలు పొందడం, ఇతర అవకతవకలపై విచారించాలని బ్యాంకు పర్సన్ ఇన్ఛార్జి, జేసీ జి.రాజకుమారికి కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఆదేశించారు. -
అమరావతిని శరవేగంగా పూర్తి చేస్తాం
[ 01-07-2024]
ప్రజలందరి సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ సారధ్యంలో అయిదు కోట్ల ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని శరవేగంగా నిర్మిస్తామని తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్కుమార్ తెలిపారు. -
గురుకులాల సిబ్బంది ఉద్యోగ విరమణ వయసు 62కు పెంచండి
[ 01-07-2024]
తమ ఉద్యోగ విరమణ వయసును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ప్రభుత్వ గురుకులాల ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమాఖ్య సంస్థల (ఎఫ్జీఆర్టీఈవో) ఛైర్మన్ బి.సాల్మన్ విజ్ఞప్తి చేశారు. -
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు
[ 01-07-2024]
వ్యవసాయ శాఖ జారీ చేసిన లైసెన్సులు లేకుండా జిల్లాలోని వ్యాపారులు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అమ్మకూడదని విజిలెన్స్ ఎస్పీ ఈశ్వరరావు తెలిపారు. -
23 నెలలు.. రూ.1000 కోట్ల నష్టం
[ 01-07-2024]
బహుళార్థ సాధక జలాశయం గుండ్లకమ్మ. ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణ వాసులకు మంచినీరు.. 1.40 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ఏర్పాటు చేయబడిన ప్రాజెక్టు. -
నేటి నుంచి స్టాప్ డయేరియా
[ 01-07-2024]
పిల్లల్లో నీళ్ల విరేచనాలను ఎదుర్కోవడానికి ‘స్టాప్ డయేరియా’ అనే పేరుతో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. దీన్ని జులై ఒకటి నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు రెండు నెలలు కొనసాగించనుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఫ్లాట్గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 24,020
-
‘టాప్లో భారత్.. దక్షిణాఫ్రికా తడబాటు’: వరల్డ్ కప్ విజయంపై అంతర్జాతీయ మీడియా
-
‘మీ నుంచి మర్యాద, నిజాయతీ ఆశిస్తున్నాం’.. జైరాం రమేశ్ పోస్టుపై ఘాటుగా స్పందించిన లోకేశ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
కృష్ణా జలాల్లో కొత్త ద్వీపం.. అందం అదరహో..!
-
ఎంపీ లాడ్స్ ఆన్లైన్లో!