ఎన్నాళ్లీ ఇక్కట్లు?
రోగులు వైద్య చికిత్సను పొందేందుకు సర్వజనాసుపత్రికి గుంటూరుతో పాటు పొరుగునున్న అయిదారు జిల్లాల నుంచి ప్రజలు వస్తుంటారు. జీజీహెచ్లోని మిలీనియం బ్లాక్లో గుండె, నరాలు, ట్రామాకేర్ విభాగాలు ఉన్నాయి.
జీజీహెచ్లో రోగులకు తప్పని పాట్లు
అయిదు లిఫ్టులున్నా మూడు పని చేయని వైనం
నగరంపాలెం, న్యూస్టుడే
మిలీనియం బ్లాక్లో ఒకే లిఫ్ట్ పని చేయడంతో వార్డుకు వెళ్లేందుకు స్ట్రెచర్పై ఎదురు చూస్తున్న రోగులు, సహాయకులు
రోగులు వైద్య చికిత్సను పొందేందుకు సర్వజనాసుపత్రికి గుంటూరుతో పాటు పొరుగునున్న అయిదారు జిల్లాల నుంచి ప్రజలు వస్తుంటారు. జీజీహెచ్లోని మిలీనియం బ్లాక్లో గుండె, నరాలు, ట్రామాకేర్ విభాగాలు ఉన్నాయి. రోగులను ఇక్కడి వార్డులకు చేర్చాలంటే తప్పకుండా లిఫ్టులు ఉపయోగించాల్సిందే. జీజీహెచ్లో మొత్తం ఐదు లిఫ్ట్లు ఉన్నా రెండు మాత్రమే పని చేస్తున్నాయి. మరో మూడు ఏళ్ల తరబడి పని చేయకపోవడంతో రోగులు ఆయా వార్డులకు వెళ్లేందుకు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో రోగులు నానా అవస్థలు పడాల్సి వస్తోంది.
సర్వజనాసుపత్రిలో గుండె విభాగానికి సంబంధించి రోగులకు ఎక్కువగా 2డి-ఎకో పరీక్షను వైద్యులు సూచిస్తారు. ఆ పరీక్ష చేయించుకునేందుకు వచ్చే రోగికి తోడుగా సహాయకులు వస్తుంటారు. వీరంతా ఆయా విభాగాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఓవైపు అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చే రోగులకు కనీసం స్ట్రెచర్లు, వీల్ఛైర్స్ సైతం అందుబాటులో లేకుండా పోతున్నాయి. మరోవైపు ఆ లిఫ్టుల్లోనే ఆయాలు, నర్సింగ్ సిబ్బంది వైద్య పరికరాలు తరలిస్తుండడంతో రోగులను తీసుకుని వెళ్లడానికి వేచి చూడాల్సి వస్తోందని సహాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర వైద్య సేవలు పొందేందుకు ఎన్నో వ్యయప్రయాసలు పడి వస్తే కనీసం ఆసుపత్రిలో ఉన్న లిఫ్ట్లు కూడా అందుబాటులో లేకపోవడం బాధాకరమని రోగులు, సహాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కీలకమైన గుండె, నరాలు, ట్రామా కేర్ యూనిట్లకు రోగులను తరలించేందుకు ఐదు లిఫ్టుల్లో కేవలం ఒక్కటే అందుబాటులో ఉండటం పెద్దాసుపత్రికి చెడ్డపేరు తీసుకోస్తుంది. పని చేస్తున్న రెండింటిలో వైద్యులకు ఒకటి, రోగులకు మరొకటి అంటూ సిబ్బంది ఆంక్షలు పెడుతున్న తీరు విమర్శలకు దారి తీస్తోంది.
ఏళ్ల తరబడి పని చేయక..
జీజీహెచ్ ఆవరణలోని పొదిల ప్రసాద్ మిలీనియం బ్లాక్ సుమారు పదేళ్ల కిందల దాతల సహకారంతో నిర్మించారు. ప్రారంభ సమయంలో ఆసుపత్రి నిర్వహణ బాగుండేది. ప్రతి వార్డు ఆధునికంగా, శీతలీకరణ యంత్రాలు రోగికి ఎంతో వెసులుబాటుగా ఉండేవి. గత అయిదేళ్లలో మిలీనియం బ్లాక్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. నిర్వహణ లోపంతో పారిశుద్ధ్యం, విద్యుత్తు వంటి సమస్యలు రోగులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. పదేళ్ల కిందట ఏర్పాటు చేసిన పొదిల ప్రసాద్ మిలీనియం బ్లాక్లోని ఐదు లిఫ్టుల్లో మూడు పని చేయడంలేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు పని చేయని లిఫ్టులను వినియోగంలోకి తీసుకురావాలని రోగులు, వారి సహాయకులు కోరుతున్నారు.
మరమ్మతులు చేయిస్తాం
పని చేయని లిఫ్టులను మరమ్మతులు చేయించేందుకు ఇప్పటికే నగదు చెల్లించామని సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్కుమార్ తెలిపారు. త్వరలోనే వాటిని బాగుచేయించి అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు.
ఐసీయూ సమీపంలో పని చేయని లిఫ్ట్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పింఛన్ పండగొచ్చింది
[ 01-07-2024]
అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛను రూ.4వేలు ఇస్తామని చెప్పిన చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన రోజునే పింఛన్ల పెంపుపై సంతకం చేసి ఇచ్చిన మాట నెలబెట్టుకున్నారు. -
కేంద్రం నిధులిస్తే రహ‘దారి’
[ 01-07-2024]
గుంటూరు నుంచి హైదరాబాద్ మార్గంలో పేరేచర్ల నుంచి కొండమోడు వరకు నాలుగు వరుసల రహదారిగా విస్తరణకు మార్గం సుగమమైంది. అద్దంకి-నార్కట్పల్లి రాష్ట్ర రహదారికి అనుసంధానంగా ఉండే ఈమార్గం రహదారి ప్రమాదాలు,.. -
విజయవాడలో అత్యున్నత శ్రేణి డయాగ్నోస్టిక్ సేవలు
[ 01-07-2024]
మహా నగరాలకు మాత్రమే పరిమితమైన అత్యున్నతశ్రేణి డయాగ్నోస్టిక్ సేవలను ప్రజలందరికీ చేరువ చేయాలన్న లక్ష్యంతో నీజెన్ డయాగ్నోస్టిక్స్ను విజయవాడలో ప్రారంభించడం అభినందనీయమని రెయిన్ బో హాస్పిటల్స్ సీఎండీ డాక్టర్ రమేష్ కంచర్ల పేర్కొన్నారు. -
సహకార బ్యాంకులో అవకతవకలపై విచారించండి
[ 01-07-2024]
గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో నకిలీ పాసు పుస్తకాలతో పొందిన రుణాలు పొందడం, ఇతర అవకతవకలపై విచారించాలని బ్యాంకు పర్సన్ ఇన్ఛార్జి, జేసీ జి.రాజకుమారికి కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఆదేశించారు. -
అమరావతిని శరవేగంగా పూర్తి చేస్తాం
[ 01-07-2024]
ప్రజలందరి సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ సారధ్యంలో అయిదు కోట్ల ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని శరవేగంగా నిర్మిస్తామని తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్కుమార్ తెలిపారు. -
గురుకులాల సిబ్బంది ఉద్యోగ విరమణ వయసు 62కు పెంచండి
[ 01-07-2024]
తమ ఉద్యోగ విరమణ వయసును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ప్రభుత్వ గురుకులాల ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమాఖ్య సంస్థల (ఎఫ్జీఆర్టీఈవో) ఛైర్మన్ బి.సాల్మన్ విజ్ఞప్తి చేశారు. -
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు
[ 01-07-2024]
వ్యవసాయ శాఖ జారీ చేసిన లైసెన్సులు లేకుండా జిల్లాలోని వ్యాపారులు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అమ్మకూడదని విజిలెన్స్ ఎస్పీ ఈశ్వరరావు తెలిపారు. -
23 నెలలు.. రూ.1000 కోట్ల నష్టం
[ 01-07-2024]
బహుళార్థ సాధక జలాశయం గుండ్లకమ్మ. ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణ వాసులకు మంచినీరు.. 1.40 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ఏర్పాటు చేయబడిన ప్రాజెక్టు. -
నేటి నుంచి స్టాప్ డయేరియా
[ 01-07-2024]
పిల్లల్లో నీళ్ల విరేచనాలను ఎదుర్కోవడానికి ‘స్టాప్ డయేరియా’ అనే పేరుతో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. దీన్ని జులై ఒకటి నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు రెండు నెలలు కొనసాగించనుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘తంగలాన్’ అప్డేట్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్..
-
జైల్లో ఉన్న ఇంజినీర్ రషీద్ ప్రమాణ స్వీకారానికి ఎన్ఐఏ అనుమతి
-
గవర్నర్ సీపీ రాధాకృష్ణన్తో సీఎం రేవంత్రెడ్డి భేటీ
-
ఎన్టీఆర్ భవన్పై దాడి ఘటన.. విచారణ చేపట్టిన పోలీసులు
-
రివ్యూ: ‘గురువాయూర్ అంబలనాదయిల్’.. మలయాళ బ్లాక్ బస్టర్ ఎలా ఉంది?
-
యుద్ధం చేస్తామంటే విడుదల చేస్తాం.. ఖైదీలకు ఆఫర్