ప్రత్తిపాడు సీఐ, ఎస్సైల సస్పెన్షన్
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు సీˆఐ నిసార్బాషా, ఎస్సై సోమేశ్వరరావులను పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ప్రత్తిపాడు మండలం గొట్టిపాడు ఎస్సీ కాలనీలో ఈ నెల 23న వైకాపా కార్యకర్త ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై వివాదం రేగింది.
విధి నిర్వహణలో అలసత్వమే కారణం
ప్రత్తిపాడు, న్యూస్టుడే: గుంటూరు జిల్లా ప్రత్తిపాడు సీˆఐ నిసార్బాషా, ఎస్సై సోమేశ్వరరావులను పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ప్రత్తిపాడు మండలం గొట్టిపాడు ఎస్సీ కాలనీలో ఈ నెల 23న వైకాపా కార్యకర్త ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై వివాదం రేగింది. ఈ నెల 27న చెరువు కట్టపై ఉన్న ఆక్రమణలను తొలగించాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడన్న అక్కసుతో తెదేపా నాయకుడు కమ్మా శివప్రసాద్పై వైకాపా మూకలు కత్తితో దాడి చేశాయి. ఆయా ఘటనలపై తగిన రీతిలో స్పందించకపోవడం, ఆ వివరాలను ఉన్నతాధికారులకు తెలియజేయకుండా దాచి పెట్టారనే ఆరోపణలపై ఇరువురినీ సస్పెండ్ చేశారు. వివరాల్లోకెళితే.. కాలనీలో ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు శుభాకాంక్షలు తెలియజేస్తూ జనసేన కార్యకర్త పిల్లి రాజేశ్ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. దాన్ని తొలగించాలని అతడిపై ఎస్సై సోమేశ్వరరావు ఒత్తిడి తెచ్చారు. కొద్ది రోజులకు అదే కాలనీకి చెందిన వైకాపా కార్యకర్త పిల్లి జయరావు తన పిల్లల పుట్టిన రోజుకు అదే ఫ్రేమ్లో ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకుంటానని కోరడంతో రాజేశ్ అప్పటికే ఉన్న దాన్ని తొలగించారు. ఈ క్రమంలో జయరావు వైకాపా మాజీ మంత్రి, మరో ఇద్దరు నేతల చిత్రాలతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు రాసి డిప్యూటీ సీˆఎంను అసభ్యకరంగా, అవమానించేలా ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. తీసివేయాలని కోరినా పట్టించుకోకపోవడంతో రాజేశ్ దాన్ని బ్లేడుతో కోసేశారు. దీంతో జయరావు తిరిగి అలాంటి మరొక ఫ్లెక్సీని ఈ నెల 23న ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసి ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు గ్రామానికి చేరుకుని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పదుల సంఖ్యలో వైకాపా సానుభూతిపరులైన యువకులు చుట్టుముట్టి వాగ్వాదానికి దిగారు. సవాళ్లు విసురుతూ పోలీసులను ఎదిరించి ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అనంతరం ఎస్సై సోమేశ్వరరావు అక్కడకు చేరుకుని యువకులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పరిస్థితి చేయిదాటి పోతుందని గ్రహించిన ఎస్సై సోమేశ్వరరావు పెదనందిపాడు ఎస్సై రాజ్కుమార్కు సమాచారం ఇచ్చారు. 24వ తేదీ ఉదయం వరకు ఇద్దరు ఎస్సైలు, సిబ్బంది గ్రామంలోనే ఉండి పంచాయతీ కార్యదర్శి నాగిరెడ్డి సూచనలతో పంచాయతీ కార్మికులతో వైకాపా ఫ్లెక్సీని తీయించేశారు. ఇంత జరిగినా ఆ వివరాలను పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి ఎస్సై సోమేశ్వరరావు తీసుకెళ్లలేదు. వరస ఘటనల నేపథ్యంలో విధి నిర్వహణలో అలసత్వం వహించడంతో ఇద్దరినీ సస్పెండ్ చేశారు. సీˆఐ, ఎస్సైలు సార్వత్రిక ఎన్నికలకు ముందు బదిలీపై ప్రత్తిపాడు వచ్చారు. కాకుమాను ఎస్సై రవీంద్రకు ప్రత్తిపాడు ఎస్సైగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ డీఎస్పీ మహబూబ్ బాషా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పింఛన్ పండగొచ్చింది
[ 01-07-2024]
అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛను రూ.4వేలు ఇస్తామని చెప్పిన చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన రోజునే పింఛన్ల పెంపుపై సంతకం చేసి ఇచ్చిన మాట నెలబెట్టుకున్నారు. -
కేంద్రం నిధులిస్తే రహ‘దారి’
[ 01-07-2024]
గుంటూరు నుంచి హైదరాబాద్ మార్గంలో పేరేచర్ల నుంచి కొండమోడు వరకు నాలుగు వరుసల రహదారిగా విస్తరణకు మార్గం సుగమమైంది. అద్దంకి-నార్కట్పల్లి రాష్ట్ర రహదారికి అనుసంధానంగా ఉండే ఈమార్గం రహదారి ప్రమాదాలు,.. -
విజయవాడలో అత్యున్నత శ్రేణి డయాగ్నోస్టిక్ సేవలు
[ 01-07-2024]
మహా నగరాలకు మాత్రమే పరిమితమైన అత్యున్నతశ్రేణి డయాగ్నోస్టిక్ సేవలను ప్రజలందరికీ చేరువ చేయాలన్న లక్ష్యంతో నీజెన్ డయాగ్నోస్టిక్స్ను విజయవాడలో ప్రారంభించడం అభినందనీయమని రెయిన్ బో హాస్పిటల్స్ సీఎండీ డాక్టర్ రమేష్ కంచర్ల పేర్కొన్నారు. -
సహకార బ్యాంకులో అవకతవకలపై విచారించండి
[ 01-07-2024]
గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో నకిలీ పాసు పుస్తకాలతో పొందిన రుణాలు పొందడం, ఇతర అవకతవకలపై విచారించాలని బ్యాంకు పర్సన్ ఇన్ఛార్జి, జేసీ జి.రాజకుమారికి కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఆదేశించారు. -
అమరావతిని శరవేగంగా పూర్తి చేస్తాం
[ 01-07-2024]
ప్రజలందరి సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ సారధ్యంలో అయిదు కోట్ల ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని శరవేగంగా నిర్మిస్తామని తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్కుమార్ తెలిపారు. -
గురుకులాల సిబ్బంది ఉద్యోగ విరమణ వయసు 62కు పెంచండి
[ 01-07-2024]
తమ ఉద్యోగ విరమణ వయసును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ప్రభుత్వ గురుకులాల ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమాఖ్య సంస్థల (ఎఫ్జీఆర్టీఈవో) ఛైర్మన్ బి.సాల్మన్ విజ్ఞప్తి చేశారు. -
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు
[ 01-07-2024]
వ్యవసాయ శాఖ జారీ చేసిన లైసెన్సులు లేకుండా జిల్లాలోని వ్యాపారులు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అమ్మకూడదని విజిలెన్స్ ఎస్పీ ఈశ్వరరావు తెలిపారు. -
23 నెలలు.. రూ.1000 కోట్ల నష్టం
[ 01-07-2024]
బహుళార్థ సాధక జలాశయం గుండ్లకమ్మ. ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణ వాసులకు మంచినీరు.. 1.40 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ఏర్పాటు చేయబడిన ప్రాజెక్టు. -
నేటి నుంచి స్టాప్ డయేరియా
[ 01-07-2024]
పిల్లల్లో నీళ్ల విరేచనాలను ఎదుర్కోవడానికి ‘స్టాప్ డయేరియా’ అనే పేరుతో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. దీన్ని జులై ఒకటి నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు రెండు నెలలు కొనసాగించనుంది.