గీత దాటితే వేటే
విధి నిర్వహణలో అలసత్వం వహించిన పోలీసులు మూల్యం చెల్లించుకోక తప్పని పరిస్థితి. ఇటీవల గుంటూరు రేంజి పరిధిలో చోటుచేసుకున్న పలు ఉదంతాల్లో కొంతమంది అధికారుల వైఖరిపై ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి కన్నెర్ర చేశారు.
నలుగురు సీఐలు, ఎస్సైల సస్పెన్షన్
కొందరికి ఛార్జి మెమోల జారీ
ఈనాడు - అమరావతి: విధి నిర్వహణలో అలసత్వం వహించిన పోలీసులు మూల్యం చెల్లించుకోక తప్పని పరిస్థితి. ఇటీవల గుంటూరు రేంజి పరిధిలో చోటుచేసుకున్న పలు ఉదంతాల్లో కొంతమంది అధికారుల వైఖరిపై ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి కన్నెర్ర చేశారు. బాధ్యులైన ఇద్దరు సీఐలు, ఇద్దరు ఎస్సైలను రోజుల వ్యవధిలోనే సస్పెండ్ చేశారు. మరికొందరికి ఛార్జి మెమోలిచ్చి వివరణ కోరడం పోలీసువర్గాల్లో చర్చనీయాంశమైంది. గతంలో మాదిరిగా ఉదాసీనంగా వ్యవహరించే పరిస్థితి లేదని తన చర్యల ద్వారా ఐజీ స్పష్టమైన సంకేతాలిచ్చారు.
శాంతిభద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్ ఇప్పటికే స్పష్టం చేశారు. గత ఎన్నికల ప్రచారంలోనూ ఇదే విషయాన్ని వారు ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కీలకమైన పోలీసు యంత్రాంగంలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. కిందిస్థాయి యంత్రాంగం పనితీరును నిశితంగా పరిశీలిస్తూ.. నిర్లక్ష్యంగా ఉన్నవారిపై చర్యలకు ఉపక్రమిస్తున్నారు. ఇటీవల చీరాల రూరల్ స్టేషన్ పరిధిలో ఓ యువతిపై హత్యాచారం ఘటనను తెదేపా కూటమి ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. సీఎం చంద్రబాబునాయుడు వెంటనే స్పందించి హోంమంత్రి అనితను సంఘటన ప్రదేశానికి పంపించారు. ప్రత్యేక బృందాలు నిందితులను రోజుల వ్యవధిలోనే పట్టుకున్నాయి. రెండు రోజుల క్రితం గొట్టిపాడులో ఫ్లెక్సీ వివాదం రేగింది. దీన్ని నియంత్రించడంలో ప్రత్తిపాడు సీఐ నిస్సార్బాషా, ఎస్సై సోమేశ్వరరావు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఐజీ నిర్ధారించుకుని వారిని సస్పెండ్ చేశారు. జనసేన కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ దీక్షలో ఉండగా బూట్లతో లోపలికి చొచ్చుకెళ్లడం, అక్కడ సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించినందుకు మంగళగిరి పట్టణ సీఐ ఎం.శ్రీనివాసరావును వీఆర్కు పంపించారు. బాపట్ల జిల్లా చీరాల రూరల్, ఒకటో పట్టణ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న హత్యలకు పోలీసు అధికారులతోపాటు కొందరు కానిస్టేబుళ్లు విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉండడమే కారణమని గుర్తించి ఛార్జిమెమోలిచ్చారు. పల్నాడు జిల్లా నకరికల్లు ఎస్సై రాంబాబు విధుల్లో అప్రమత్తంగా ఉండడం లేదని, ప్రకాశం జిల్లా చీమకుర్తి సీఐ ఒ.దుర్గాప్రసాద్ నమోదు చేసిన కేసుల్లో డొల్లతనం ఉందని గుర్తించి సస్పెండ్ చేశారు. రోజుల వ్యవధిలోనే వీరందరిపైనా చర్యలు తీసుకోవడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పింఛన్ పండగొచ్చింది
[ 01-07-2024]
అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛను రూ.4వేలు ఇస్తామని చెప్పిన చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన రోజునే పింఛన్ల పెంపుపై సంతకం చేసి ఇచ్చిన మాట నెలబెట్టుకున్నారు. -
కేంద్రం నిధులిస్తే రహ‘దారి’
[ 01-07-2024]
గుంటూరు నుంచి హైదరాబాద్ మార్గంలో పేరేచర్ల నుంచి కొండమోడు వరకు నాలుగు వరుసల రహదారిగా విస్తరణకు మార్గం సుగమమైంది. అద్దంకి-నార్కట్పల్లి రాష్ట్ర రహదారికి అనుసంధానంగా ఉండే ఈమార్గం రహదారి ప్రమాదాలు,.. -
విజయవాడలో అత్యున్నత శ్రేణి డయాగ్నోస్టిక్ సేవలు
[ 01-07-2024]
మహా నగరాలకు మాత్రమే పరిమితమైన అత్యున్నతశ్రేణి డయాగ్నోస్టిక్ సేవలను ప్రజలందరికీ చేరువ చేయాలన్న లక్ష్యంతో నీజెన్ డయాగ్నోస్టిక్స్ను విజయవాడలో ప్రారంభించడం అభినందనీయమని రెయిన్ బో హాస్పిటల్స్ సీఎండీ డాక్టర్ రమేష్ కంచర్ల పేర్కొన్నారు. -
సహకార బ్యాంకులో అవకతవకలపై విచారించండి
[ 01-07-2024]
గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో నకిలీ పాసు పుస్తకాలతో పొందిన రుణాలు పొందడం, ఇతర అవకతవకలపై విచారించాలని బ్యాంకు పర్సన్ ఇన్ఛార్జి, జేసీ జి.రాజకుమారికి కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఆదేశించారు. -
అమరావతిని శరవేగంగా పూర్తి చేస్తాం
[ 01-07-2024]
ప్రజలందరి సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ సారధ్యంలో అయిదు కోట్ల ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని శరవేగంగా నిర్మిస్తామని తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్కుమార్ తెలిపారు. -
గురుకులాల సిబ్బంది ఉద్యోగ విరమణ వయసు 62కు పెంచండి
[ 01-07-2024]
తమ ఉద్యోగ విరమణ వయసును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ప్రభుత్వ గురుకులాల ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమాఖ్య సంస్థల (ఎఫ్జీఆర్టీఈవో) ఛైర్మన్ బి.సాల్మన్ విజ్ఞప్తి చేశారు. -
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు
[ 01-07-2024]
వ్యవసాయ శాఖ జారీ చేసిన లైసెన్సులు లేకుండా జిల్లాలోని వ్యాపారులు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అమ్మకూడదని విజిలెన్స్ ఎస్పీ ఈశ్వరరావు తెలిపారు. -
23 నెలలు.. రూ.1000 కోట్ల నష్టం
[ 01-07-2024]
బహుళార్థ సాధక జలాశయం గుండ్లకమ్మ. ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణ వాసులకు మంచినీరు.. 1.40 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ఏర్పాటు చేయబడిన ప్రాజెక్టు. -
నేటి నుంచి స్టాప్ డయేరియా
[ 01-07-2024]
పిల్లల్లో నీళ్ల విరేచనాలను ఎదుర్కోవడానికి ‘స్టాప్ డయేరియా’ అనే పేరుతో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. దీన్ని జులై ఒకటి నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు రెండు నెలలు కొనసాగించనుంది.
తాజా వార్తలు (Latest News)
-
నీట్ రీ-టెస్ట్ ఫలితాలు విడుదల.. మారిన ర్యాంకుల జాబితా
-
కేసీఆర్కు హైకోర్టులో చుక్కెదురు
-
దిగొచ్చిన వాణిజ్య సిలిండర్ ధర.. రూ.32 తగ్గింపు
-
మొరాయించిన శ్రీశైలం దేవస్థానం వెబ్సైట్.. నిలిచిన ఆన్లైన్ టికెట్ల జారీ
-
రో.. ఈ వీడ్కోలు బాధగా ఉంది: రితికా సజ్దే ఎమోషనల్ పోస్ట్
-
వైకాపా మాజీ ఎంపీ నందిగం సురేశ్ సోదరుడు అరెస్ట్