ఎంబుక్ రికార్డుపై గందరగోళం
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో పనులు చేసిన గుత్తేదారులకు బిల్లుల చెల్లింపు సంగతి దేవుడెరుక.. అసలు వారు చేసిన పనులకు ఎంబుక్ రికార్డు ఎవరు చేయాలన్నదానిపై ఇంజినీరింగ్వర్గాల్లో గందరగోళం నెలకొంది.
ఏఈలతో చేయిస్తే వెనక్కి పంపిన కమిషనర్
నగరపాలక సంస్థ తీరుపై గుత్తేదారుల గరంగరం
ఈనాడు - అమరావతి
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో పనులు చేసిన గుత్తేదారులకు బిల్లుల చెల్లింపు సంగతి దేవుడెరుక.. అసలు వారు చేసిన పనులకు ఎంబుక్ రికార్డు ఎవరు చేయాలన్నదానిపై ఇంజినీరింగ్వర్గాల్లో గందరగోళం నెలకొంది. ఈ విభాగం తన ఏఈలతో ఎంబుక్ రికార్డు చేసి బిల్లుల కోసం పంపిన దస్త్రాలను కమిషనర్ అంగీకరించలేదు. వాటిని ఎమినిటీ సెక్రటరీలు రికార్డు చేయాలంటూ వెనక్కి పంపేశారు. ఈ వ్యవహారం నగరపాలక సంస్థలో చర్చనీయాంశంగా మారింది. పనులు చేశాక బిల్లులు ఎన్నాళ్లకు మంజూరవుతాయో గత వైకాపా హయాంలో అయోమయంగా ఉండేది. చివరకు గుత్తేదారులు కోర్టులను ఆశ్రయించాల్సి వచ్చేది. అసలు చేసిన పనులను ఎంబుక్ రికార్డు చేయడానికే నెలల తరబడి సమయం తీసుకుంటున్నారు. ఇక చెల్లింపులకు ఎంతకాలం పడుతుందోనని వారంతా ఆందోళన చెందుతున్నారు.
ఏఈలకే ఆ ఆధికారం
గత కొన్నేళ్లుగా పనుల వివరాలను తొలుత ఆ ప్రాంత ఏఈలు ఎంబుక్లో నమోదు చేస్తున్నారు. అసలు ఈ రికార్డు ఎవరు చేయాలన్నదానిపై ప్రస్తుతం ఇంజినీరింగ్ అధికారులకు స్పష్టత లేకుండాపోయింది. గత జనవరి, ఫిబ్రవరిలో చేసిన పనులను నగరపాలక సంస్థ ఏఈలు రికార్డు చేయగా.. వాటిని డీఈలు చెక్ మెజర్మెంట్ చేశారు. వీటిల్లో 30 శాతం పనులను ఈఈలు చెక్ చేసి ఎస్ఈకి పంపించారు. ఎస్ఈ నిర్ధారించాక కమిషనర్ లాగిన్కు పంపారు. చాలారోజుల తరువాత పరిశీలించిన కమిషనర్.. ఎంబుక్ రికార్డు ఏఈలు చేయడమేమిటంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ అధికారం సచివాలయాల్లో ఉండే ఎమినిటీ సెక్రటరీలకు అప్పగించారని, వారితో రికార్డు చేయించి ప్రాసెస్ చేయాలని ఆదేశించి.. రూ. 5 కోట్ల నుంచి రూ. 7 కోట్ల వరకు విలువైన 60 బిల్లులను పెండింగ్లో పెట్టారు. దీంతో గుత్తేదారులు లబోదిబోమంటున్నారు.
ఇదీ గుత్తేదారుల వాదన
ఏఈ స్థాయి అధికారి ఎంబుక్ రికార్డు చేస్తే చెల్లదంటున్నారు... ఏమాత్రం అర్హతల్లేని ఎమినిటీస్ సెక్రటరీలకు ఆ బాధ్యత అప్పగించడం సరికాదని గుత్తేదారులు చెబుతున్నారు. ఉన్నతాధికారులు చెప్పినట్టు ఎమినిటీస్ సెక్రటరీలు రికార్డు చేశాక కూడా.. ఆ బిల్లులను సీఎఫ్ఎంఎస్కు పంపడమో లేక చెక్కులు రాసి ఇవ్వడమో చేయకుండా పెండింగ్లో ఎందుకు పెడుతున్నారని ప్రశ్నిస్తున్నారు. వాటిని ప్రాసెస్ చేయకుండా ఇంజినీరింగ్ అధికారులు మిన్నకుండిపోయారని ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలని వారు కోరుతున్నారు.
- ఒక్కో పని విలువ సగటున రూ. 10 లక్షల నుంచి రూ. 40 లక్షల వరకు ఉంది. వీటిని చిన్న గుత్తేదారులు చేశారు. ఒక్క ఎంబుక్ రికార్డు చేయడానికే యంత్రాంగం నాలుగు నెలలుగా దోబూచులాడుతోందని, ఇలాగైతే తామెలా పనులు చేస్తామని గుత్తేదారులు ప్రశ్నిస్తున్నారు.
- వైకాపా హయాంలో గడపగడపకు మన ప్రభుత్వం కింద చేసిన పనులకు వెంటనే బిల్లులు చెల్లిస్తామని, ఆ నిధులు కలెక్టరు ఖాతాలో ఉన్నాయని నమ్మించారు. తీరా పనులు పూర్తయ్యాక పది నెలలైనా బిల్లులివ్వలేదు. దీంతో చాలామంది గుత్తేదారులు గుంటూరు నగరపాలకసంస్థపై కోర్టుకెళ్లారు. తరువాత ఎంబుక్ రికార్డు పేరు చెప్పి బిల్లులను పక్కనబెట్టారని వారు గుర్రుమంటున్నారు. కొంతమంది బిల్లుల విషయంలో మాత్రం ఉన్నతాధికారులు ప్రాధాన్యం ఇస్తున్నారని, మిగిలినవారివి ఎందుకు పక్కన పెడుతున్నారని ప్రశ్నిస్తున్నారు. జీటీ రోడ్డు ప్రాంతంలో రూ. 18 లక్షలతో పైపులైన్ పనులు చేస్తే ఇంతవరకు బిల్లులు ఇవ్వకుండా ముప్పుతిప్పలు పెడుతున్నారని ఓ గుత్తేదారు వాపోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పింఛన్ పండగొచ్చింది
[ 01-07-2024]
అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛను రూ.4వేలు ఇస్తామని చెప్పిన చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన రోజునే పింఛన్ల పెంపుపై సంతకం చేసి ఇచ్చిన మాట నెలబెట్టుకున్నారు. -
కేంద్రం నిధులిస్తే రహ‘దారి’
[ 01-07-2024]
గుంటూరు నుంచి హైదరాబాద్ మార్గంలో పేరేచర్ల నుంచి కొండమోడు వరకు నాలుగు వరుసల రహదారిగా విస్తరణకు మార్గం సుగమమైంది. అద్దంకి-నార్కట్పల్లి రాష్ట్ర రహదారికి అనుసంధానంగా ఉండే ఈమార్గం రహదారి ప్రమాదాలు,.. -
విజయవాడలో అత్యున్నత శ్రేణి డయాగ్నోస్టిక్ సేవలు
[ 01-07-2024]
మహా నగరాలకు మాత్రమే పరిమితమైన అత్యున్నతశ్రేణి డయాగ్నోస్టిక్ సేవలను ప్రజలందరికీ చేరువ చేయాలన్న లక్ష్యంతో నీజెన్ డయాగ్నోస్టిక్స్ను విజయవాడలో ప్రారంభించడం అభినందనీయమని రెయిన్ బో హాస్పిటల్స్ సీఎండీ డాక్టర్ రమేష్ కంచర్ల పేర్కొన్నారు. -
సహకార బ్యాంకులో అవకతవకలపై విచారించండి
[ 01-07-2024]
గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో నకిలీ పాసు పుస్తకాలతో పొందిన రుణాలు పొందడం, ఇతర అవకతవకలపై విచారించాలని బ్యాంకు పర్సన్ ఇన్ఛార్జి, జేసీ జి.రాజకుమారికి కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఆదేశించారు. -
అమరావతిని శరవేగంగా పూర్తి చేస్తాం
[ 01-07-2024]
ప్రజలందరి సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ సారధ్యంలో అయిదు కోట్ల ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని శరవేగంగా నిర్మిస్తామని తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్కుమార్ తెలిపారు. -
గురుకులాల సిబ్బంది ఉద్యోగ విరమణ వయసు 62కు పెంచండి
[ 01-07-2024]
తమ ఉద్యోగ విరమణ వయసును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ప్రభుత్వ గురుకులాల ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమాఖ్య సంస్థల (ఎఫ్జీఆర్టీఈవో) ఛైర్మన్ బి.సాల్మన్ విజ్ఞప్తి చేశారు. -
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు
[ 01-07-2024]
వ్యవసాయ శాఖ జారీ చేసిన లైసెన్సులు లేకుండా జిల్లాలోని వ్యాపారులు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అమ్మకూడదని విజిలెన్స్ ఎస్పీ ఈశ్వరరావు తెలిపారు. -
23 నెలలు.. రూ.1000 కోట్ల నష్టం
[ 01-07-2024]
బహుళార్థ సాధక జలాశయం గుండ్లకమ్మ. ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణ వాసులకు మంచినీరు.. 1.40 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ఏర్పాటు చేయబడిన ప్రాజెక్టు. -
నేటి నుంచి స్టాప్ డయేరియా
[ 01-07-2024]
పిల్లల్లో నీళ్ల విరేచనాలను ఎదుర్కోవడానికి ‘స్టాప్ డయేరియా’ అనే పేరుతో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. దీన్ని జులై ఒకటి నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు రెండు నెలలు కొనసాగించనుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
సీఎం, డిప్యూటీ సీఎం మార్పు వ్యవహారం.. హస్తిన చేరిన ‘కర్ణాటక’ పంచాయితీ
-
ఏపీలో పింఛన్ల పండుగ.. లబ్ధిదారుకు స్వయంగా అందజేసిన సీఎం చంద్రబాబు
-
బంగారం అక్రమ రవాణాపై పోలీసు అధికారి దాడి.. రూ.6 లక్షలు తీసుకొని వదిలేసిన వైనం
-
పులకించిన పెద్దపోతులపాడు
-
లద్దాఖ్ మృతుల్లో ఏపీకి చెందిన మరో ఇద్దరు సైనికులు
-
ఈ ఊరు.. వైద్యుల పుట్టినిల్లు..!