కాన్వాయ్ ఆపి.. ప్రసాదం స్వీకరించిన సీఎం
రాజధాని మహిళలు అందించిన గ్రామ దేవత పోలేరమ్మ ప్రసాదం, తిరుమల శ్రీవారి శేష వస్త్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వీకరించారు.
అభివాదం చేస్తూ ప్రసాదాలు స్వీకరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
తుళ్లూరు, న్యూస్టుడే: రాజధాని మహిళలు అందించిన గ్రామ దేవత పోలేరమ్మ ప్రసాదం, తిరుమల శ్రీవారి శేష వస్త్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వీకరించారు. రాజధాని గ్రామం మందడంలో శుక్రవారం అమ్మవారి ఆలయ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాజధాని మహిళలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని హోమాలు, అభిషేకాలు నిర్వహించారు. ఎన్డీయే కూటమి పాలనలో అమరావతి నిర్మాణం శరవేగంగా కొనసాగాలని, రాష్ట్రం సుభిÅక్షంగా ఉండాలని వేడుకున్నారు. సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి సచివాలయానికి వెళ్తుండగా ప్రసాదాలు అందజేసేందుకు మహిళలంతా రహదారి వెంబడి నిల్చున్నారు. దీన్ని గమనించిన చంద్రబాబు వాహన శ్రేణిని ఆపి వారు అందించిన ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ‘జై అమరావతి.. జై చంద్రబాబు.. ఐదు కోట్ల కలల రాజధాని అమరావతి’ అని మహిళలు పెద్దఎత్తున నినాదాలు చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ తమ అభ్యర్థనను మన్నించినందుకు మహిళా రైతులు ఆలూరి రాగలత తదితరులు సంతోషం వ్యక్తం చేశారు. మాజీ సీఎం జగన్ పరదాల మాటున తప్పించుకుని తిరిగే వారని, కానీ చంద్రబాబు ప్రజా ముఖ్యమంత్రి అని మరోసారి నిరూపితమైందని కొనియాడారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జులై 4న దిల్లీ పర్యటనకు సీఎం చంద్రబాబు
[ 01-07-2024]
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు జులై 4న దిల్లీకి వెళ్లనున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఆయన హస్తిన పర్యటనకు వెళ్తున్నారు. -
ఆ ఎమ్మెల్యేలిద్దరినీ విప్లుగా ప్రకటించండి: సీఎం చంద్రబాబుకు పవన్ లేఖ
[ 01-07-2024]
తమ పార్టీకి చెందిన ఇద్దరు శాసన సభ్యుల్ని ప్రభుత్వ విప్లుగా ప్రకటించాలని కోరుతూ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోరారు. -
ఏఎన్యూ వీసీ రాజీనామా.. వర్సిటీలో సంబరాలు
[ 01-07-2024]
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ఏఎన్యూ) వీసీ రాజశేఖర్ ఎట్టకేలకు పదవి నుంచి తప్పుకొన్నారు. -
పింఛన్ పండగొచ్చింది
[ 01-07-2024]
అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛను రూ.4వేలు ఇస్తామని చెప్పిన చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన రోజునే పింఛన్ల పెంపుపై సంతకం చేసి ఇచ్చిన మాట నెలబెట్టుకున్నారు. -
కేంద్రం నిధులిస్తే రహ‘దారి’
[ 01-07-2024]
గుంటూరు నుంచి హైదరాబాద్ మార్గంలో పేరేచర్ల నుంచి కొండమోడు వరకు నాలుగు వరుసల రహదారిగా విస్తరణకు మార్గం సుగమమైంది. అద్దంకి-నార్కట్పల్లి రాష్ట్ర రహదారికి అనుసంధానంగా ఉండే ఈమార్గం రహదారి ప్రమాదాలు,.. -
విజయవాడలో అత్యున్నత శ్రేణి డయాగ్నోస్టిక్ సేవలు
[ 01-07-2024]
మహా నగరాలకు మాత్రమే పరిమితమైన అత్యున్నతశ్రేణి డయాగ్నోస్టిక్ సేవలను ప్రజలందరికీ చేరువ చేయాలన్న లక్ష్యంతో నీజెన్ డయాగ్నోస్టిక్స్ను విజయవాడలో ప్రారంభించడం అభినందనీయమని రెయిన్ బో హాస్పిటల్స్ సీఎండీ డాక్టర్ రమేష్ కంచర్ల పేర్కొన్నారు. -
సహకార బ్యాంకులో అవకతవకలపై విచారించండి
[ 01-07-2024]
గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో నకిలీ పాసు పుస్తకాలతో పొందిన రుణాలు పొందడం, ఇతర అవకతవకలపై విచారించాలని బ్యాంకు పర్సన్ ఇన్ఛార్జి, జేసీ జి.రాజకుమారికి కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఆదేశించారు. -
అమరావతిని శరవేగంగా పూర్తి చేస్తాం
[ 01-07-2024]
ప్రజలందరి సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ సారధ్యంలో అయిదు కోట్ల ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని శరవేగంగా నిర్మిస్తామని తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్కుమార్ తెలిపారు. -
గురుకులాల సిబ్బంది ఉద్యోగ విరమణ వయసు 62కు పెంచండి
[ 01-07-2024]
తమ ఉద్యోగ విరమణ వయసును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ప్రభుత్వ గురుకులాల ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమాఖ్య సంస్థల (ఎఫ్జీఆర్టీఈవో) ఛైర్మన్ బి.సాల్మన్ విజ్ఞప్తి చేశారు. -
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు
[ 01-07-2024]
వ్యవసాయ శాఖ జారీ చేసిన లైసెన్సులు లేకుండా జిల్లాలోని వ్యాపారులు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అమ్మకూడదని విజిలెన్స్ ఎస్పీ ఈశ్వరరావు తెలిపారు. -
23 నెలలు.. రూ.1000 కోట్ల నష్టం
[ 01-07-2024]
బహుళార్థ సాధక జలాశయం గుండ్లకమ్మ. ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణ వాసులకు మంచినీరు.. 1.40 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ఏర్పాటు చేయబడిన ప్రాజెక్టు. -
నేటి నుంచి స్టాప్ డయేరియా
[ 01-07-2024]
పిల్లల్లో నీళ్ల విరేచనాలను ఎదుర్కోవడానికి ‘స్టాప్ డయేరియా’ అనే పేరుతో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. దీన్ని జులై ఒకటి నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు రెండు నెలలు కొనసాగించనుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘నన్ను బహిష్కరిస్తే.. 63 మంది ఎంపీలు ఇంటికెళ్లారు’: భాజపాపై మహువా మొయిత్రా ఫైర్
-
త్వరలో క్యాబినెట్ విస్తరణ.. సీతక్కకు హోంశాఖ దక్కే ఛాన్స్: దామోదర రాజనర్సింహ
-
రోహిత్- కోహ్లీ లేని లోటును భర్తీ చేసేదెవరు?
-
అమల్లోకి కొత్త నేర న్యాయ చట్టాలు.. నిపుణులు ఏమంటున్నారు!
-
ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైతే..: మెలానియా ఏం చేయనున్నారు!
-
ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను? ఆఖరి శ్వాస వరకు ప్రజల కోసమే పనిచేస్తా: పవన్