కొత్త వంతెన వస్తోంది!
గుంటూరు నగరంలో అత్యంత కీలకమైన శంకర్విలాస్ వంతెన స్థానంలో నూతన నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. కొత్త వంతెన నిర్మించాలన్నది దశాబ్దానికిపైగా ఉన్న డిమాండ్.
పాత, కొత్త నగరాల అనుసంధానానికి రెండు ప్రతిపాదనలు
కేంద్ర సహాయ మంత్రి చంద్రశేఖర్ ఆదేశాలతో కదిలిన యంత్రాంగం
ఈనాడు - అమరావతి
గుంటూరు నగరంలో అత్యంత కీలకమైన శంకర్విలాస్ వంతెన స్థానంలో నూతన నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. కొత్త వంతెన నిర్మించాలన్నది దశాబ్దానికిపైగా ఉన్న డిమాండ్. ప్రతిసారీ ఎన్నికల హామీగానే మిగిలిపోయింది. మున్సిపల్, రైల్వే, ఆర్అండ్బీ శాఖల సమన్వయంతో నిర్మించాల్సి ఉంది. ఈ క్రమంలో ట్రాఫిక్ మళ్లింపు, రైల్వేశాఖతో సమన్వయం వంటి సమస్యలతో నిర్మాణం వాయిదా పడుతూ వచ్చింది. కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ నూతన వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించడంతో ఇన్నాళ్లకు కదలిక వచ్చింది. ఈ మేరకు మున్సిపల్, రైల్వే, ఆర్అండ్బీ అధికారులతో సమావేశమై.. వివిధ శాఖల నుంచి రావాల్సిన అనుమతులు, ఎదురవుతున్న అడ్డంకులు, ప్రస్తుత పరిస్థితులపై సమీక్షించారు. కేంద్రం నుంచి నిధులొచ్చే అవకాశం ఉన్నందున యుద్ధప్రాతిపదికన సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను 30 నుంచి 45 రోజుల వ్యవధిలో తయారు చేయాలని ఆదేశించారు. ఈ బాధ్యతను ఆర్అండ్బీ ఇంజినీర్లు ఒక కన్సల్టెంట్ సంస్థకు అప్పగించారు.
నాలుగు వరుసలుగా...
- రెండు వరుసలుగా శంకర్విలాస్ వంతెన నిర్మించి 68 సంవత్సరాలైంది. పెరిగిన రద్దీకి ఇది సరిపోవడం లేదు. ఉదయం, సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ భారీగా స్తంభించిపోతోంది. ఒక్కోసారి వంతెన దాటడానికి 30 నిమిషాల సమయం పడుతోంది.
- ఆర్అండ్బీ ఇంజినీర్ల లెక్క ప్రకారం రోజూ దాదాపు 3 లక్షల మంది ఈ వంతెన మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు.
- పాత, కొత్త నగరాలను అనుసంధానించడంలో ఇది అత్యంత కీలకం.
- ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా కొత్త వంతెనను నాలుగు వరుసలుగా నిర్మించాలని ఆర్అండ్బీ అధికారులు చేసిన ప్రతిపాదన దశాబ్దకాలంగా ఆచరణలోకి రాలేదు.
- రాష్ట్రంలో తెదేపా కూటమి అధికారంలోకి రావడం, కేంద్రంలో ఎన్డీయేలో భాగస్వామి కావడంతో దిల్లీ నుంచి నిధులు తీసుకొచ్చి వంతెన పనులు చేపట్టడానికి కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రయత్నాలు ప్రారంభించారు. కేంద్ర రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ (మోర్త్) నుంచి నిధులొచ్చే అవకాశం ఉంది. ఇందుకోసం రెండు ప్రతిపాదనలను సిద్ధం చేయాలని ఆయన ఇంజినీర్లకు సూచించారు. కేంద్రం అనుమతించిన ప్రతిపాదన ప్రకారం తదుపరి చర్యలు చేపట్టనున్నారు.
తొలి ప్రతిపాదన ఇలా..
పాత వంతెన పూర్తిగా తీసేయాలి. 112 అడుగుల వెడల్పు, 1.05 కిలోమీటర్ల పొడవుతో నాలుగు వరుసలుగా నిర్మించడానికి రూ. 108 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. ఇందులో రూ. 98 కోట్లను కేంద్రం; తాగునీటి పైపులైన్లు, మురుగునీటి పారుదల వ్యవస్థ, విద్యుత్తు, టెలిఫోన్ లైన్ల మార్పిడికి నగరపాలక సంస్థ రూ. 2 కోట్లు; భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 8 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. అరండల్పేట 9వ లైను నుంచి అటువైపు మహిళా కళాశాల రోడ్డు వరకు నిర్మించాలి. ప్రస్తుతం ఉన్న రహదారిని రెండువైపులా సర్వీసు రోడ్డుగా ఉపయోగించుకోవచ్చు.
రెండో ప్రతిపాదన.. ఎలివేటెడ్ ఆర్వోబీ
ప్రస్తుతం ఉన్న పాత వంతెనను అలాగే ఉంచి.. దానిపైన 20 అడుగుల ఎత్తులో ఎలివేటెడ్ ఆర్వోబీ నిర్మించాలి. ఇందుకు సుమారు రూ. 170 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. 120 అడుగుల వెడల్పుతో 1.55 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. నాలుగు వరుసలతో లాడ్జి సెంటర్ నుంచి హిందూ మహిళా కళాశాల కూడలి వరకు నిర్మించాలి. నిధులు మొత్తం కేంద్ర ప్రభుత్వంలోని మోర్త్ నుంచి తెచ్చుకోవాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్న వంతెన, రహదారులను యథావిధిగా ఉపయోగించుకోవచ్చు.
ఈ రెండు ప్రతిపాదనలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఆమోదం లభించిన ప్రతిపాదనకు అనుగుణంగా పనులు చేపడతారు. ఈ నేపథ్యంలో అధికారులు యుద్ధప్రాతిపదికన డీపీఆర్ తయారీపై దృష్టి పెట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పింఛన్ పండగొచ్చింది
[ 01-07-2024]
అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛను రూ.4వేలు ఇస్తామని చెప్పిన చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన రోజునే పింఛన్ల పెంపుపై సంతకం చేసి ఇచ్చిన మాట నెలబెట్టుకున్నారు. -
నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు తప్పవు
[ 01-07-2024]
రైతులకు నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయించి మోసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర సహాయమంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ హెచ్చరించారు. -
కేంద్రం నిధులిస్తే రహ‘దారి’
[ 01-07-2024]
గుంటూరు నుంచి హైదరాబాద్ మార్గంలో పేరేచర్ల నుంచి కొండమోడు వరకు నాలుగు వరుసల రహదారిగా విస్తరణకు మార్గం సుగమమైంది. అద్దంకి-నార్కట్పల్లి రాష్ట్ర రహదారికి అనుసంధానంగా ఉండే ఈమార్గం రహదారి ప్రమాదాలు,.. -
విజయవాడలో అత్యున్నత శ్రేణి డయాగ్నోస్టిక్ సేవలు
[ 01-07-2024]
మహా నగరాలకు మాత్రమే పరిమితమైన అత్యున్నతశ్రేణి డయాగ్నోస్టిక్ సేవలను ప్రజలందరికీ చేరువ చేయాలన్న లక్ష్యంతో నీజెన్ డయాగ్నోస్టిక్స్ను విజయవాడలో ప్రారంభించడం అభినందనీయమని రెయిన్ బో హాస్పిటల్స్ సీఎండీ డాక్టర్ రమేష్ కంచర్ల పేర్కొన్నారు. -
సహకార బ్యాంకులో అవకతవకలపై విచారించండి
[ 01-07-2024]
గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో నకిలీ పాసు పుస్తకాలతో పొందిన రుణాలు పొందడం, ఇతర అవకతవకలపై విచారించాలని బ్యాంకు పర్సన్ ఇన్ఛార్జి, జేసీ జి.రాజకుమారికి కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఆదేశించారు. -
అమరావతిని శరవేగంగా పూర్తి చేస్తాం
[ 01-07-2024]
ప్రజలందరి సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ సారధ్యంలో అయిదు కోట్ల ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని శరవేగంగా నిర్మిస్తామని తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్కుమార్ తెలిపారు. -
గురుకులాల సిబ్బంది ఉద్యోగ విరమణ వయసు 62కు పెంచండి
[ 01-07-2024]
తమ ఉద్యోగ విరమణ వయసును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ప్రభుత్వ గురుకులాల ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమాఖ్య సంస్థల (ఎఫ్జీఆర్టీఈవో) ఛైర్మన్ బి.సాల్మన్ విజ్ఞప్తి చేశారు. -
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు
[ 01-07-2024]
వ్యవసాయ శాఖ జారీ చేసిన లైసెన్సులు లేకుండా జిల్లాలోని వ్యాపారులు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అమ్మకూడదని విజిలెన్స్ ఎస్పీ ఈశ్వరరావు తెలిపారు. -
23 నెలలు.. రూ.1000 కోట్ల నష్టం
[ 01-07-2024]
బహుళార్థ సాధక జలాశయం గుండ్లకమ్మ. ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణ వాసులకు మంచినీరు.. 1.40 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ఏర్పాటు చేయబడిన ప్రాజెక్టు. -
నేటి నుంచి స్టాప్ డయేరియా
[ 01-07-2024]
పిల్లల్లో నీళ్ల విరేచనాలను ఎదుర్కోవడానికి ‘స్టాప్ డయేరియా’ అనే పేరుతో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. దీన్ని జులై ఒకటి నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు రెండు నెలలు కొనసాగించనుంది.