జగనన్న కాలనీల్లో రూ.కోట్ల దోపిడీ
జగనన్న కాలనీ పేరిట ఊళ్లకు ఊళ్లు నిర్మిస్తున్నామని గొప్పలు చెప్పిన మాజీ సీఎం జగన్.. దాని వెనక రూ.లక్షలకు లక్షలు వైకాపా నాయకులకు దోచిపెట్టారనే మోసాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి.
వైకాపా నేతల చేతివాటం
రైతులకు చేసిన మోసాలు వెలుగులోకి
సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల జగనన్న కాలనీ
ఈనాడు డిజిటల్, నరసరావుపేట: జగనన్న కాలనీ పేరిట ఊళ్లకు ఊళ్లు నిర్మిస్తున్నామని గొప్పలు చెప్పిన మాజీ సీఎం జగన్.. దాని వెనక రూ.లక్షలకు లక్షలు వైకాపా నాయకులకు దోచిపెట్టారనే మోసాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. భూములిచ్చిన రైతుల ద్వారా ఇప్పుడవన్నీ బయటపడుతున్నాయి. జిల్లాలో జగనన్న కాలనీ లేఔట్ పేరిట ఇళ్లు నిర్మిస్తాం అంటూ ప్రైవేట్ వ్యక్తులు, రైతుల నుంచి తక్కువ ధరకే కొనుగోలు చేసి గత ప్రభుత్వానికి మాత్రం మార్కెట్ కంటే రెండింతల అధిక ధరకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. ఇప్పుడా రైతులంతా మా డబ్బు మాకిప్పించాలంటూ ఎమ్మెల్యేలు, ఎస్పీకి విన్నవించుకుంటున్నారు. తాజాగా చిలకలూరిపేట పసుమర్రు రైతులు అప్పట్లో మాజీమంత్రి రజినికి ఇచ్చిన డబ్బులను తిరిగి వసూలు చేయించుకోవడంలో సఫలీకృతులయ్యారు. పసుమర్రు శివారు గ్రామం గుదేవారిపాలెం రైతులు కూడా మాజీమంత్రి అనుచరులు చేసిన మోసాన్ని సోమవారం ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు.
ఇవిగో మోసాలు..
వినుకొండ పట్టణానికి దూరంగా 7 కిలోమీటర్ల దూరంలోని వెంకుపాలెం, జాలలపాలెం మధ్యలో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు చెందిన సుమారు 125 ఎకరాల్లో జగనన్న లేఔట్ వేశారు. ఇక్కడ గతంలో ఆయన ఎకరా రూ.4.5 లక్షలకు కొనుగోలు చేశారు. ప్రస్తుతం మార్కెట్ ప్రకారం కూడా ధర అంతే ఉంది. వ్యవసాయానికి పనికిరాని భూములు. కానీ ఎకరా రూ.18 లక్షలు చొప్పున గత ప్రభుత్వం ఆయన వద్ద కొనుగోలు చేసింది.
నూజండ్లలో ఎకరం రూ.14 లక్షలకు కొనుగోలు చేశారు. కానీ మార్కెట్ ప్రకారం రూ.6 లక్షలే. ఎకరం అరవై సెంట్లు ఇక్కడ కొనుగోలు చేశారు. అంబాపురంలో ఎకరం రూ.12 లక్షలకు కొనుగోలు చేశారు. కానీ మార్కెట్ ప్రకారం రూ.6 లక్షలే. 3 ఎకరాల లేఔట్ ఉంది ఇక్కడ. పమిడిపాడులో రూ.10 లక్షలకు కొనుగోలు చేశారు. కానీ ఇక్కడ మార్కెట్ ధర రూ.5 లక్షలే. ఇలా ఐదు ఎకరాలను గత ప్రభుత్వానికి అమ్మారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏఎన్యూ వీసీ రాజీనామా.. వర్సిటీలో సంబరాలు
[ 01-07-2024]
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ఏఎన్యూ) వీసీ రాజశేఖర్ ఎట్టకేలకు పదవి నుంచి తప్పుకొన్నారు. -
పింఛన్ పండగొచ్చింది
[ 01-07-2024]
అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛను రూ.4వేలు ఇస్తామని చెప్పిన చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన రోజునే పింఛన్ల పెంపుపై సంతకం చేసి ఇచ్చిన మాట నెలబెట్టుకున్నారు. -
కేంద్రం నిధులిస్తే రహ‘దారి’
[ 01-07-2024]
గుంటూరు నుంచి హైదరాబాద్ మార్గంలో పేరేచర్ల నుంచి కొండమోడు వరకు నాలుగు వరుసల రహదారిగా విస్తరణకు మార్గం సుగమమైంది. అద్దంకి-నార్కట్పల్లి రాష్ట్ర రహదారికి అనుసంధానంగా ఉండే ఈమార్గం రహదారి ప్రమాదాలు,.. -
విజయవాడలో అత్యున్నత శ్రేణి డయాగ్నోస్టిక్ సేవలు
[ 01-07-2024]
మహా నగరాలకు మాత్రమే పరిమితమైన అత్యున్నతశ్రేణి డయాగ్నోస్టిక్ సేవలను ప్రజలందరికీ చేరువ చేయాలన్న లక్ష్యంతో నీజెన్ డయాగ్నోస్టిక్స్ను విజయవాడలో ప్రారంభించడం అభినందనీయమని రెయిన్ బో హాస్పిటల్స్ సీఎండీ డాక్టర్ రమేష్ కంచర్ల పేర్కొన్నారు. -
సహకార బ్యాంకులో అవకతవకలపై విచారించండి
[ 01-07-2024]
గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో నకిలీ పాసు పుస్తకాలతో పొందిన రుణాలు పొందడం, ఇతర అవకతవకలపై విచారించాలని బ్యాంకు పర్సన్ ఇన్ఛార్జి, జేసీ జి.రాజకుమారికి కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఆదేశించారు. -
అమరావతిని శరవేగంగా పూర్తి చేస్తాం
[ 01-07-2024]
ప్రజలందరి సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ సారధ్యంలో అయిదు కోట్ల ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని శరవేగంగా నిర్మిస్తామని తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్కుమార్ తెలిపారు. -
గురుకులాల సిబ్బంది ఉద్యోగ విరమణ వయసు 62కు పెంచండి
[ 01-07-2024]
తమ ఉద్యోగ విరమణ వయసును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ప్రభుత్వ గురుకులాల ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమాఖ్య సంస్థల (ఎఫ్జీఆర్టీఈవో) ఛైర్మన్ బి.సాల్మన్ విజ్ఞప్తి చేశారు. -
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు
[ 01-07-2024]
వ్యవసాయ శాఖ జారీ చేసిన లైసెన్సులు లేకుండా జిల్లాలోని వ్యాపారులు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అమ్మకూడదని విజిలెన్స్ ఎస్పీ ఈశ్వరరావు తెలిపారు. -
23 నెలలు.. రూ.1000 కోట్ల నష్టం
[ 01-07-2024]
బహుళార్థ సాధక జలాశయం గుండ్లకమ్మ. ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణ వాసులకు మంచినీరు.. 1.40 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ఏర్పాటు చేయబడిన ప్రాజెక్టు. -
నేటి నుంచి స్టాప్ డయేరియా
[ 01-07-2024]
పిల్లల్లో నీళ్ల విరేచనాలను ఎదుర్కోవడానికి ‘స్టాప్ డయేరియా’ అనే పేరుతో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. దీన్ని జులై ఒకటి నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు రెండు నెలలు కొనసాగించనుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ధన్ఖడ్, ఖర్గే సంభాషణ.. సభలో నవ్వులే నవ్వులు!
-
భారాస ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అరెస్ట్
-
ఏఎన్యూ వీసీ రాజీనామా.. వర్సిటీలో సంబరాలు
-
సమాచారం కావాలంటే.. ఇక వాట్సప్లో సెర్చ్ చేయొచ్చు!
-
ఆర్సీబీలోకి దినేశ్ కార్తిక్ రీఎంట్రీ.. కీలక బాధ్యతలు అప్పగించిన ఫ్రాంఛైజీ
-
‘తంగలాన్’ అప్డేట్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్..