ముద్దగా అన్నం.. అర్ధాకలితో సతమతం
ముప్పాళ్ల మండలం గోళ్లపాడు కేజీబీవీలో గతేడాది విద్యార్థినులు అర్ధాకలితోనే విద్యాసంవత్సరాన్ని పూర్తి చేశారు. ఆహారంలో నాణ్యత ఉండడం లేదని, అరకొరగా అందిస్తున్నారని విద్యార్థినుల తల్లిదండ్రులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
రుచి లేకుండా వంటలు
కస్తూర్బా విద్యాలయాల్లో విద్యార్థినుల అవస్థలు
ఈనాడు డిజిటల్, నరసరావుపేట
ఆహారం బాగా లేదని చెబుతున్న బొల్లాపల్లి కేజీబీవీ విద్యార్థినులు
ముప్పాళ్ల మండలం గోళ్లపాడు కేజీబీవీలో గతేడాది విద్యార్థినులు అర్ధాకలితోనే విద్యాసంవత్సరాన్ని పూర్తి చేశారు. ఆహారంలో నాణ్యత ఉండడం లేదని, అరకొరగా అందిస్తున్నారని విద్యార్థినుల తల్లిదండ్రులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. డీఈవో వచ్చి విచారణ చేపట్టారు. సరకుల సరఫరాలో గుత్తేదారు చేతివాటంతో అరకొరగా నిత్యావసర వస్తువులు వస్తున్నాయని, అందుకే సరిపడా వండడం లేదని అప్పట్లో గుర్తించారు.
తాజాగా బొల్లాపల్లి మండలంలోని కస్తూర్బాలో తమకు సరైన అన్నం పెట్టడం లేదని విద్యార్థినులంతా బోరున విలపించడం.. అదీ ఎమ్మెల్యే విద్యాకానుక కిట్ల పంపిణీకి వచ్చిన సమయంలో సమస్యలేమైనా ఉంటే చెప్పండని అడిగినప్పుడు ఒక విద్యార్థిని ధైర్యంగా నిల్చోని అన్నం సరిగా ఉండడం లేదని ఏడుస్తూ చెప్పింది. అంతేకాకుండా ఆమె చెబుతున్నప్పుడు మిగతా విద్యార్థినులు కూడా విలపించడంతో అక్కడున్న వారంతా బాధపడ్డారు. పై రెండు ఘటనలు కేవలం వెలుగులోకి వచాయి. కానీ బయటకు రాని ఘటనలెన్నో. చెబితే ఏమవుతుందోనని భయం. వేధింపులుంటే తట్టుకోవడం కష్టం. చేసేదిలేక తమలో తామే కష్టాల్ని దిగమింగుకుంటూ చాలీచాలని ఆహారాన్ని, ముద్దగా ఉన్నా, ఉడికీ ఉడక్కపోయినా భరిస్తూ ఆకలి తీర్చుకుని తరగతి గదులకు వెళ్తున్న విద్యార్థినులు ఎందరో ఉన్నారు. కస్తూర్బా విద్యాలయాలకు కొన్ని నియమాలు ఉండడంతో బయటవ్యక్తుల్ని లోపలకు రానివ్వరు. దీంతో లోపల ఏం జరుగుతుందో బయటకు తెలియదు. అంతేకాకుండా అధికారులు వచ్చినప్పుడు ఏమైనా బయటకు చెబితే ఆ తర్వాత వాళ్లకు తరగతిగదుల్లో కక్షసాధింపు చర్యలుంటాయి. దీంతో ఎందుకొచ్చిన తంటా అని బాలికలంతా పెట్టింది ఎలా ఉన్నా కళ్లుమూసుకుని తింటున్నారు. ఒక్కో విద్యార్థిని ఆహారానికి సంబంధించి ప్రభుత్వం నెలకు రూ.1400 ఖర్చుపెడుతోంది. ఇవీ సరిపోవడం లేదు. మరోపక్క ఇచ్చేదే తక్కువ అయితే అందులో గుత్తేదారులు కొంత నొక్కుతున్నారు. డబ్బులు మిగుల్చుకోవడానికి కొంతమంది తక్కువ రకం సరకులు సరఫరా చేస్తుంటారు. దీనికితోడు వంట మనుషులు. తమకు ఏమీ దక్కనివ్వడం లేదనే ధోరణిలో ఉంటూ రుచీపచీలేకుండా వండుతుంటారు. ఏమైనా అంటే సరిపడా సరకులు ఇవ్వరని, తామేం చేసేది అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. తక్కువ సరకులు ఇచ్చి ఎక్కువ మందికి వండమంటే ఎలా? అంటూ ఉపాధ్యాయుల వైపు వేలు చూపే పరిస్థితి. ఉపాధ్యాయులకు, వంట వారికి చాలా కస్తూర్బాల్లో పొసగదు. మధ్యలో విద్యార్థినులు నష్టపోతున్నారు. ఉపాధ్యాయులు కూడా విద్యార్థినులు కూడా తమ పిల్లల వంటివారేనని భావించరు. పెట్టింది తినాలంటూ కసురుకుంటారు. ముఖ్యఅతిథులు ఎవరైనా పాఠశాలకు వచ్చినప్పుడు గట్టిగా అడిగితే ఏడుస్తూ అసలు విషయం బయట పెడుతున్నారు.
ఎమ్మెల్యే జీవీ తనిఖీతో సమస్య వెలుగులోకి...
‘‘విద్యాకానుక కిట్ల పంపిణీకి వచ్చిన ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు విద్యార్థినుల కష్టాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఏం పరవాలేదు.. ధైర్యంగా చెప్పండని ప్రోత్సహించడంతో ఒక బాలిక ధైర్యంగా ఎమ్మెల్యే వద్దకు వెళ్లి అన్నం సరిగా పెట్టడం లేదని, బాగుండడం లేదని ఏడుస్తూ చెప్పింది. ఆ బాలిక చెప్పడంతో అక్కడే ఉన్న మిగతా విద్యార్థినులు కూడా ముక్తకంఠంతో అవునంటూ ముందుకొచ్చారు. ఆ సమయంలో బాలికల్లో దుఃఖం ఒక్కసారిగా పొంగుకొచ్చింది’’ ఆహార నాణ్యతపై కస్తూర్బా అధికారులను వివరణ అడగ్గా ‘సరకుల్లో కొరత లేదని, గుత్తేదారులు కూడా సక్రమంగానే సరఫరా చేస్తున్నారని, కొత్తబియ్యం కావడం వల్ల అన్నం మాత్రమే ముద్దగా అవుతోందని జీసీడీవో రేవతి ‘ఈనాడు’తో చెప్పారు. ఇప్పటికైనా అధికారులు, ఉపాధ్యాయులు ఆలోచించి బాలికల బాగోగులకు కృషి చేయాలని కోరుకుందాం. ప్రజాప్రతినిధులు సైతం తమ పరిధిలోని పాఠశాలలను తరచూ సందర్శించి సమస్యలు తెలుసుకుంటే విద్యార్థులకు మేలు జరుగుతుంది.
- పిడుగురాళ్ల కేజీబీవీలో సెప్టింగ్ ట్యాంకు సమస్య ఎప్పటికప్పుడు ఉత్పన్నమవుతోంది. దీంతో వసతిగృహాల్లో విద్యార్థినులు భరించలేని దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ మోటారు పదేపదే మొరాయిస్తోంది. నీటి సమస్య నెలకొంది.
- 2 దుర్గి మండలం కేజీబీవీలో తాగునీటి సమస్య వేధిస్తోంది. మోటారు లేదు. పంచాయతీ నుంచి కొళాయి కనెక్షన్ ఇచ్చారు. దీని ద్వారా వచ్చేనీరే గతి. ఎప్పుడైనా సరఫరాలో అంతరాయం కలిగితే చాలాకష్టం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పింఛన్ పండగొచ్చింది
[ 01-07-2024]
అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛను రూ.4వేలు ఇస్తామని చెప్పిన చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన రోజునే పింఛన్ల పెంపుపై సంతకం చేసి ఇచ్చిన మాట నెలబెట్టుకున్నారు. -
కేంద్రం నిధులిస్తే రహ‘దారి’
[ 01-07-2024]
గుంటూరు నుంచి హైదరాబాద్ మార్గంలో పేరేచర్ల నుంచి కొండమోడు వరకు నాలుగు వరుసల రహదారిగా విస్తరణకు మార్గం సుగమమైంది. అద్దంకి-నార్కట్పల్లి రాష్ట్ర రహదారికి అనుసంధానంగా ఉండే ఈమార్గం రహదారి ప్రమాదాలు,.. -
విజయవాడలో అత్యున్నత శ్రేణి డయాగ్నోస్టిక్ సేవలు
[ 01-07-2024]
మహా నగరాలకు మాత్రమే పరిమితమైన అత్యున్నతశ్రేణి డయాగ్నోస్టిక్ సేవలను ప్రజలందరికీ చేరువ చేయాలన్న లక్ష్యంతో నీజెన్ డయాగ్నోస్టిక్స్ను విజయవాడలో ప్రారంభించడం అభినందనీయమని రెయిన్ బో హాస్పిటల్స్ సీఎండీ డాక్టర్ రమేష్ కంచర్ల పేర్కొన్నారు. -
సహకార బ్యాంకులో అవకతవకలపై విచారించండి
[ 01-07-2024]
గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో నకిలీ పాసు పుస్తకాలతో పొందిన రుణాలు పొందడం, ఇతర అవకతవకలపై విచారించాలని బ్యాంకు పర్సన్ ఇన్ఛార్జి, జేసీ జి.రాజకుమారికి కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఆదేశించారు. -
అమరావతిని శరవేగంగా పూర్తి చేస్తాం
[ 01-07-2024]
ప్రజలందరి సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ సారధ్యంలో అయిదు కోట్ల ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని శరవేగంగా నిర్మిస్తామని తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్కుమార్ తెలిపారు. -
గురుకులాల సిబ్బంది ఉద్యోగ విరమణ వయసు 62కు పెంచండి
[ 01-07-2024]
తమ ఉద్యోగ విరమణ వయసును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ప్రభుత్వ గురుకులాల ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమాఖ్య సంస్థల (ఎఫ్జీఆర్టీఈవో) ఛైర్మన్ బి.సాల్మన్ విజ్ఞప్తి చేశారు. -
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు
[ 01-07-2024]
వ్యవసాయ శాఖ జారీ చేసిన లైసెన్సులు లేకుండా జిల్లాలోని వ్యాపారులు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అమ్మకూడదని విజిలెన్స్ ఎస్పీ ఈశ్వరరావు తెలిపారు. -
23 నెలలు.. రూ.1000 కోట్ల నష్టం
[ 01-07-2024]
బహుళార్థ సాధక జలాశయం గుండ్లకమ్మ. ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణ వాసులకు మంచినీరు.. 1.40 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ఏర్పాటు చేయబడిన ప్రాజెక్టు. -
నేటి నుంచి స్టాప్ డయేరియా
[ 01-07-2024]
పిల్లల్లో నీళ్ల విరేచనాలను ఎదుర్కోవడానికి ‘స్టాప్ డయేరియా’ అనే పేరుతో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. దీన్ని జులై ఒకటి నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు రెండు నెలలు కొనసాగించనుంది.