బెదిరించి రూ.కోట్లు వసూలు చేశారు
మాజీ మంత్రి విడదల రజిని, ఆమె మరిది విడదల గోపి, పీఏ రామకృష్ణ అప్పటి విజిలెన్స్ ఎస్పీ జాషువా తమను భయభ్రాంతులకు గురిచేసి రూ.2.20 కోట్లు బలవంతంగా వసూలు చేశారని.. వాటిని ఇప్పించి, చట్టపరంగా వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా అడిషనల్ ఎస్పీ లక్ష్మీపతిని కలిసి యడ్లపాడు స్టోన్ క్రషర్స్ బాధితులు శుక్రవారం వినతిపత్రం అందజేశారు.
మాజీ మంత్రి రజిని, ఆమె మరిది గోపి, పీఏ రామకృష్ణపై ఫిర్యాదు
అడిషనల్ ఎస్పీ లక్ష్మీపతికి ఫిర్యాదు చేస్తున్న బాధితులు
చిలకలూరిపేట గ్రామీణ, న్యూస్టుడే : మాజీ మంత్రి విడదల రజిని, ఆమె మరిది విడదల గోపి, పీఏ రామకృష్ణ అప్పటి విజిలెన్స్ ఎస్పీ జాషువా తమను భయభ్రాంతులకు గురిచేసి రూ.2.20 కోట్లు బలవంతంగా వసూలు చేశారని.. వాటిని ఇప్పించి, చట్టపరంగా వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా అడిషనల్ ఎస్పీ లక్ష్మీపతిని కలిసి యడ్లపాడు స్టోన్ క్రషర్స్ బాధితులు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. బాధితుల వివరాల మేరకు.. 2010 నుంచి నంబూరి శ్రీనివాసరావు, కట్టా శ్రీనివాసరావు, రావిపాటి వేణుగోపాలకృష్ణ కలిసి స్టోన్ క్రషర్ వ్యాపారం చేసుకుంటున్నాం. 2020 సెప్టెంబరు 4న రజిని పీఏ మా క్రషర్ వద్దకు వచ్చి రూ.5 కోట్లు ఎమ్మెల్యేకు ఇవ్వాలని చెప్పారు. అన్ని అనుమతులతో నడుపుతున్నామని, కరోనా వల్ల వ్యాపారాలు లేవని, నగదు ఇవ్వలేమని చెప్పగా భయభ్రాంతులకు గురి చేశారు. అదే సంవత్సరం సెప్టెంబరు 11న విజిలెన్స్ ఎస్పీ జాషువా సిబ్బందితో వచ్చి మా క్రషర్లో అవకతవకలు జరిగాయని రూ.50 కోట్లు కట్టాలని బెదిరించి వెళ్లారు. నెల తర్వాత జాషువా ఫోన్ చేసి ఎమ్మెల్యే రజినితో మాట్లాడుకోండి లేకపోతే రూ.50 కోట్లు జరిమానా వేస్తామని, క్రషర్ సీజ్ చేస్తామని బెదిరించారు. విధిలేక ఎమ్మెల్యేను కార్యాలయానికి వెళ్లి కలవగా తన పీఏ రామకృష్ణను సంప్రదించమని సూచించారు. అతను రూ.5 కోట్లకు సెటిల్ చేస్తానని చెప్పగా.. అంత ఇచ్చుకోలేమని సంస్థలో కొంత వాటా ఇస్తామని ప్రాధేయపడ్డాం. అయినా వినకుండా డబ్బులు మాత్రమే కావాలని బెదిరించారు.. దీంతో కొంత గడువు కోరగా సరే అని చెప్పి పంపారు. మార్చి 2021లో విజిలెన్స్ ఎస్పీ జాషువా మమ్మల్ని పిలిపించి విడదల గోపిని కలిసి త్వరగా విషయం సెటిల్ చేసుకోమని బెదిరించారు. వారం రోజుల్లో చేసుకోకపోతే జరిమానా రాసి కేసు ఫైల్ చేస్తానని చెప్పారు. భయపడి విడదల గోపిని కలిసి ప్రాధేయపడగా తనకు రూ.10 లక్షలు, ఎస్పీ జాషువాకు రూ.10 లక్షలు, ఎమ్మెల్యే రజినికి రూ.2 కోట్లు ఇవ్వాలని బెదిరించారు. దీంతో బంధువులు, మిత్రుల వద్ద అప్పు తీసుకుని 2021 ఏప్రిల్ 4న పురుషోత్తమపట్నంలోని విడదల గోపికి ఇంటి వద్ద ఆ మొత్తం ఇచ్చాం. విషయం ఎవరికైనా చెబితే క్రిమినల్ కేసులు పెట్టడమే కాకుండా వ్యాపారం పూర్తిగా నిలిపివేస్తామని, ప్రాణహాని కలిగిస్తామని బెదిరించారు. దీంతో భయపడి ఏమీ చేయలేకపోయాం. ప్రస్తుతం అధికారం మారడంతో న్యాయం జరగుతుందనే ధైర్యంతో ఫిర్యాదు చేశామని బాధితులు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పింఛన్ పండగొచ్చింది
[ 01-07-2024]
అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛను రూ.4వేలు ఇస్తామని చెప్పిన చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన రోజునే పింఛన్ల పెంపుపై సంతకం చేసి ఇచ్చిన మాట నెలబెట్టుకున్నారు. -
కేంద్రం నిధులిస్తే రహ‘దారి’
[ 01-07-2024]
గుంటూరు నుంచి హైదరాబాద్ మార్గంలో పేరేచర్ల నుంచి కొండమోడు వరకు నాలుగు వరుసల రహదారిగా విస్తరణకు మార్గం సుగమమైంది. అద్దంకి-నార్కట్పల్లి రాష్ట్ర రహదారికి అనుసంధానంగా ఉండే ఈమార్గం రహదారి ప్రమాదాలు,.. -
విజయవాడలో అత్యున్నత శ్రేణి డయాగ్నోస్టిక్ సేవలు
[ 01-07-2024]
మహా నగరాలకు మాత్రమే పరిమితమైన అత్యున్నతశ్రేణి డయాగ్నోస్టిక్ సేవలను ప్రజలందరికీ చేరువ చేయాలన్న లక్ష్యంతో నీజెన్ డయాగ్నోస్టిక్స్ను విజయవాడలో ప్రారంభించడం అభినందనీయమని రెయిన్ బో హాస్పిటల్స్ సీఎండీ డాక్టర్ రమేష్ కంచర్ల పేర్కొన్నారు. -
సహకార బ్యాంకులో అవకతవకలపై విచారించండి
[ 01-07-2024]
గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో నకిలీ పాసు పుస్తకాలతో పొందిన రుణాలు పొందడం, ఇతర అవకతవకలపై విచారించాలని బ్యాంకు పర్సన్ ఇన్ఛార్జి, జేసీ జి.రాజకుమారికి కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఆదేశించారు. -
అమరావతిని శరవేగంగా పూర్తి చేస్తాం
[ 01-07-2024]
ప్రజలందరి సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ సారధ్యంలో అయిదు కోట్ల ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని శరవేగంగా నిర్మిస్తామని తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్కుమార్ తెలిపారు. -
గురుకులాల సిబ్బంది ఉద్యోగ విరమణ వయసు 62కు పెంచండి
[ 01-07-2024]
తమ ఉద్యోగ విరమణ వయసును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ప్రభుత్వ గురుకులాల ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమాఖ్య సంస్థల (ఎఫ్జీఆర్టీఈవో) ఛైర్మన్ బి.సాల్మన్ విజ్ఞప్తి చేశారు. -
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు
[ 01-07-2024]
వ్యవసాయ శాఖ జారీ చేసిన లైసెన్సులు లేకుండా జిల్లాలోని వ్యాపారులు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అమ్మకూడదని విజిలెన్స్ ఎస్పీ ఈశ్వరరావు తెలిపారు. -
23 నెలలు.. రూ.1000 కోట్ల నష్టం
[ 01-07-2024]
బహుళార్థ సాధక జలాశయం గుండ్లకమ్మ. ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణ వాసులకు మంచినీరు.. 1.40 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ఏర్పాటు చేయబడిన ప్రాజెక్టు. -
నేటి నుంచి స్టాప్ డయేరియా
[ 01-07-2024]
పిల్లల్లో నీళ్ల విరేచనాలను ఎదుర్కోవడానికి ‘స్టాప్ డయేరియా’ అనే పేరుతో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. దీన్ని జులై ఒకటి నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు రెండు నెలలు కొనసాగించనుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఎంపీ లాడ్స్ ఆన్లైన్లో!
-
ఆస్తి తగాదాలు.. తల్లీబిడ్డలను గదిలో బంధించి గోడ కట్టేశారు!
-
చదువుతూ సాగిపోదాం.. బస్సులో!
-
విజయవాడ హైవేపై ఎన్హెచ్ఏఐ టోల్ వసూళ్లు.. ఏడాది ముందే వైదొలిగిన జీఎమ్మార్
-
ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే నిజమైన సంక్షేమం: సీఎం చంద్రబాబు
-
ధరణి లాగిన్.. డిప్యూటీ తహసీల్దార్లకు!