అరాచకాలు చేసి.. అడ్డంగా దొరికేసి..
ఇరవై ఏళ్లు అక్రమాలు.. అరాచకాలతో మాచర్లను ఏలిన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పతనం ఈవీఎం యంత్రం ధ్వంసంతో ప్రారంభమైంది.
ఈవీఎం ధ్వంసంతో పిన్నెల్లి పతనం ప్రారంభం
మహిళలని చూడకుండా అసభ్యపదజాలంతో దూషణలు
మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అరెస్టు
అరెస్టు అనంతరం వైద్య పరీక్షలకు ప్రభుత్వ ఆసుపత్రికి పిన్నెల్లి తరలింపు
ఈనాడు డిజిటల్, నరసరావుపేట: ఇరవై ఏళ్లు అక్రమాలు.. అరాచకాలతో మాచర్లను ఏలిన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పతనం ఈవీఎం యంత్రం ధ్వంసంతో ప్రారంభమైంది. అంతవరకూ అతని అరాచకాలను ప్రపంచం వినడమే తప్పించి చూసింది లేదు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజు రెంటచింతల మండలం పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రం 202లో ఈవీఎం యంత్రాన్ని ధ్వంసం చేసే దృశ్యాలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమవ్వడం పోలింగ్ ముగిసిన కొన్నిరోజుల తర్వాత అవీ బయకు రావడంతో పిన్నెల్లి అరాచకాన్ని యావత్తు దేశం కళ్లారా చూసింది. అధికారంలో ఉన్న అప్పటి ఎమ్మెల్యే ఇలా చేయడం ఏంటని అందరూ విస్తుపోయారు. అప్పటివరకూ అతని అరాచకాన్ని వినడమే తప్ప కళ్లారా చూడలేదని ఎంతోమంది అనంతరం చర్చించుకున్నారు.
నిలదీసిన తెదేపా ఏజెంటుపై దాడి..
పోలింగ్ కేంద్రంలో ఈవీఎం యంత్రాన్ని ఎందుకు ధ్వంసం చేశావని నిలదీసిన తెదేపా ఏజెంటు నంబూరి శేషగిరిరావుపై గొడ్డలితో దాడి చేశారు. బయటకు వస్తున్న ఎమ్మెల్యేను ఇద్దరు మహిళలు కూడా ధైర్యంగా అడ్డుకుని ఎందుకు ధ్వంసం చేశారని నిలదీశారు. మహిళలకు వేలు చూపిస్తూ అసభ్యపదజాలం వాడుతూ బెదిరింపులకు దిగారు. ఇవన్నీ సీసీ కెమెరాల ద్వారా రికార్డయి ప్రపంచానికి అతని అరాచకత్వాన్ని కళ్లకు కట్టాయి.
మహిళలనూ దూషించి..
ఒక ప్రజాప్రతినిధి ఈవీఎం ధ్వంసం చేయడమే కాకుండా మహిళలను అసభ్యపదజాలంతో దూషించడంతో సమాజం అతన్ని చీదరించుకుంది. ఇప్పటివరకూ ఏవైనా కేసులుంటే వాటి నుంచి తప్పించుకోవడం అరెస్టు కాకుండా బయటపడడం చేశారు. కానీ సీసీ కెమెరాల్లోనే సాక్ష్యం రికార్డు కావడంతో తప్పించుకోవడం పిన్నెల్లి వల్ల కాలేదు. పోలింగ్ రోజున చేసిన అరాచకం సరిపోలేదని మరుసటి రోజు అంటే మే 14న కూడా కారంపూడిలో విధ్వంసం సృష్టించారు. పోలింగ్ చరిత్రలోనే ఇంతవరకూ కారంపూడిలో ఒక్క గొడవ కూడా జరగలేదని, అలాంటిది ఈసారి పోలింగ్ అనంతరం అరాచకవాదులు చేలరేగిపోయారని స్థానికులు పేర్కొన్నారు. తన కార్యకర్తలను పరామర్శిస్తానని వెళ్లి.. ముందస్తు ప్రణాళిక ప్రకారమే తెలంగాణ నుంచి 300 మందిని కార్లలో రప్పించుకుని కర్రలు, మారణాయుధాలతో కారంపూడిలో దాడులకు తెగబడ్డారు. ‘తెలుగుదేశం పార్టీకి చెందిన ఎవరో ఒకరిని చంపితే కానీ మా జోలికి రాకుండా ఉంటారు’ అంటూ అరుస్తూ వీధుల్లో రాడ్లతో దొరికిన వారిపై దాడి చేశారు. అప్పుడు కారులో పిన్నెల్లి ఉండి అల్లరిమూకను దాడులకు ప్రోత్సహించారు. దాడుల్ని అడ్డుకోబోయిన అప్పటి కారంపూడి సీఐ నారాయణస్వామిపై కూడా తెగబడ్డారు. సీఐ మెడపై నుంచి రక్తం కారుతున్న వీడియోలు వైరల్ అయ్యాయి. ఇలా సామాన్యులు, పోలీసులు అని చూడకుండా ఎవరు అడ్డొచ్చినా వారిపై దాడులకు తెగబడుతూ చేసిన అరాచకానికి నేడు అరెస్టు అయ్యారు.
నెల తర్వాత అరెస్టు
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నెల తర్వాత అరెస్టు చేశారు. మే 28న ఆయన హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. అంతేకాకుండా ఇప్పటివరకూ కోర్టు పొడిగిస్తుండడంతో ఆయన అరెస్టు కాకుండా తప్పించుకోగలిగారు. ఎట్టకేలకు హైకోర్టు బెయిల్ రద్దు చేయడంతో పోలీసులు అరెస్టు చేశారు. మాచర్ల నియోజకవర్గాన్ని నియంతలా ఏలుతూ తనకు అడ్డేలేదనుకున్న పిన్నెల్లి చివరకు జైలుపాలయ్యారు.
నాడు తప్పించుకుని..
- పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎన్నో అక్రమాలు, అరాచకాలకు పాల్పడినా కేసులు నమోదైనా అరెస్టు కాకుండా ఇప్పటివరకూ తప్పించుకున్నాడు. కానీ చివరకు పూర్తి సాక్ష్యాలతో అడ్డంగా దొరికిపోయాడు.
- 2004-05 సమయంలో వెల్తుర్తి మండలంలో పంచలోహాల విగ్రహాలు చోరీకి గురయ్యాయి. ఈ కేసులో నిందితుడు అని మాచర్ల వాసులందరికీ తెలుసు కానీ ఎఫ్ఐఆర్లో పేరు లేకుండా జాగ్రత్తపడ్డాడు.
- 2014లో మాచవరం మండలంలో సరస్వతీ భూముల వివాదంలో రైతులపై దాడి చేసి గాయపరిచాడు. అప్పట్లో 120 మందిపై కేసు నమోదైంది. ఇందులో ప్రధాన నిందితుడిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నాడు. కానీ అరెస్టు కాలేదు.
- 2016లో వెల్దుర్తి మండలం కండ్లకుంట గ్రామంలో తెదేపా నేత పాపిరెడ్డి హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుడు. కానీ ఇతని తమ్ముడు వెంకట్రామిరెడ్డి మాత్రమే జైలుకెళ్లి వచ్చాడు. అప్పుడూ ఆయన తప్పించుకున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజకీయ పీడ వదిలింది
[ 30-06-2024]
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయాన్ని రాజకీయాలకు కేంద్ర బిందువుగా మార్చిన వీసీ పి.రాజశేఖర్ ఉపకులపతి పదవికి రాజీనామా చేశారు. -
లోక్ అదాలత్లో 1,454 కేసుల పరిష్కారం
[ 30-06-2024]
జిల్లాలో శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్లో 1,454 కేసులు పరిష్కరించారు. జిల్లా వ్యాప్తంగా న్యాయస్థానాల్లో న్యాయమూర్తులు నిర్వహించిన లోక్ అదాలత్లో -
అయిదేళ్లుగా జీజీహెచ్ని నిర్లక్ష్యం చేశారు
[ 30-06-2024]
సర్వజనాసుపత్రిలో గత అయిదేళ్లలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదని, చాలా సమస్యలు ఉన్నాయని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. -
ఎయిమ్స్కు నీటి కష్టాలు తీరినట్లే
[ 30-06-2024]
మంగళగిరి ఎయిమ్స్లో నీటి సమస్య పరిష్కారానికి తెదేపా కూటమి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ అంశంపై ఆసుపత్రి డైరెక్టర్ మాధవానంద కార్ శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కలిసిన నేపథ్యంలో అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. -
పింఛను పండగకు సర్వం సిద్ధం
[ 30-06-2024]
సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చుతూ దూసుకుపోతోంది. జూలై ఒకటో తేదీన ఇంటి వద్దకే వెళ్లి పెంచిన మొత్తాన్ని అందించాలని నిర్ణయించింది. -
అక్షర యోధుడు రామోజీరావు
[ 30-06-2024]
చివరి క్షణం వరకు సమాజ శ్రేయస్సు కోసం పరితపించిన రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు సేవలు చిరస్మరణీయమని రాజధాని రైతులు, మహిళలు పేర్కొన్నారు. -
ఇష్టానుసారం తోడేస్తున్నారు!
[ 30-06-2024]
గుండ్లకమ్మ నదిలో ఇసుక తవ్వకాలు పునః ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో కూటమి అధికారం చేపట్టింది. ఇసుక విధానం గురించి ప్రభుత్వం నిర్ణయం తీసుకునేందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉంది. -
సముద్ర తీరం.. నిర్మానుష్యం
[ 30-06-2024]
వారాంతపు సెలవులు వస్తే చాలు తీరం వెంట ప్రధానంగా తెలంగాణ, విజయవాడ, తిరుపతి, నెల్లూరు తదితర ప్రాంతాల నుంచి పర్యాటకులు చీరాల నియోజవర్గంలోని వాడరేవు, రామాపురం చేరుకుని కుటుంబ సభ్యులతో సరదాగా గడిపేవారు. -
బాధ్యతలు చేపట్టిన యంత్రాంగం
[ 30-06-2024]
సహకార రంగం ప్రక్షాళనకు కూటమి ప్రభుత్వం వడివడిగా చర్యలు చేపట్టింది. 2018లో సహకార సొసైటీల పాలకవర్గాల సమయం ముగిసింది. -
మళ్లీ నీటి పరీక్షలు..
[ 30-06-2024]
జిల్లాలో చాలాచోట్ల చెరువుల్లో నీరు అడుగంటడం, నీటి శుద్ధి సక్రమంగా లేకపోవడంతో పలుచోట్ల అతిసార కేసులు బయటపడుతున్నాయి. -
డిప్యూటీ డెమో పోస్టు వారెలా భర్తీ చేస్తారు?
[ 30-06-2024]
ప్రాంతీయ వైద్య ఆరోగ్య సంచాలకులు(ఆర్డీ) జోన్-3 పరిధిలోని డిప్యూటీ డెమో పోస్టును కడప ప్రధాన కేంద్రంగా ఉన్న జోన్-4 అధికారులు భర్తీ చేయడంపై వివాదం జరుగుతోంది. -
‘మాజీ సీఎస్ జవహర్రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయండి’
[ 30-06-2024]
దళితుడైన పల్నాడు జిల్లా మాజీ కలెక్టర్ శివశంకర్పై తప్పుడు నివేదిక ఇచ్చిన వైకాపా హయాంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన జవహర్రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసు నమోదు చేయాలని డాక్టర్ బీఆర్ ఆంబేడ్కర్ లిటరేచర్ ఫౌండేషన్ అధ్యక్షుడు బి.విల్సన్ డిమాండ్ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘అమ్మ పేరుతో ఒక మొక్క’.. దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు
-
‘పిచ్’ టేస్ట్.. రోబో వాక్.. సూపర్ ఎండింగ్.. ఫన్ మూమెంట్స్!
-
ప్రశ్నించే విద్యార్థులు, నిరుద్యోగులపై కేసులా?: హరీశ్రావు
-
దేశ అత్యున్నత అధికారులుగా..చిన్ననాటి స్నేహితులు
-
తితిదే ఈవో ఆగ్రహం.. అందుబాటులోకి గత పాలకమండలి తీర్మానాలు
-
పైసా వసూల్.. మ్యాచ్ ప్రతి దశలో నరాలు తెగే ఉత్కంఠ..!