ఆలకిస్తే వరం.. అన్నదాతకు ఫలం
అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఏర్పాటు చేయాలనుకున్న ప్రయోగశాలకు బాలారిష్టాలు తప్పడం లేదు. భవనాల నిర్మాణం పూర్తయి స్వాధీనం చేసుకోవడంలో అంతులేని జాప్యం జరుగుతోంది.
ఖాళీగా డీఎన్ఏ ప్రయోగశాల, జీవఉత్పత్తుల పరీక్షకేంద్రాలు
రూ.5 కోట్లతో నిర్మించిన భవనాలు నిరుపయోగం
ప్రారంభానికి నోచుకోని డీఏన్ఏ ప్రయోగశాల
ఈనాడు, అమరావతి: అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఏర్పాటు చేయాలనుకున్న ప్రయోగశాలకు బాలారిష్టాలు తప్పడం లేదు. భవనాల నిర్మాణం పూర్తయి స్వాధీనం చేసుకోవడంలో అంతులేని జాప్యం జరుగుతోంది. భవనాలు ప్రారంభం కాక ముందే టైల్స్ కుంగిపోవడం, సీలింగ్ జారిపోవడం, గోడలు నెర్రెలు రావడం నిర్మాణ పనుల లోపాలకు అద్దంపడుతున్నాయి. ఈ భవనాలను స్వాధీనం చేసుకోవడానికి వ్యవసాయశాఖ వెనకడుగు వేస్తోంది. ఉమ్మడి గుంటూరులోని అమరావతిలో రాష్ట్ర వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రూ.5కోట్లతో నిర్మించిన డీఎన్ఏ ప్రయోగశాల, జీవఉత్పత్తుల పరీక్ష కేంద్రం, ఎరువులు, పురుగుమందుల పరీక్ష కేంద్రాల భవనాల దుస్థితి ఇది. గత తెదేపా ప్రభుత్వ హయాంలో నిర్మాణాలు మొదలై వైకాపా ప్రభుత్వంలో పూర్తయ్యాయి. పర్యవేక్షణలోపం, సకాలంలో స్వాధీనం చేసుకోకపోవడం, ప్రయోగశాలకు అవసరమైన సామగ్రి కొనుగోలు చేసి అందుబాటులోకి తీసుకురావడంలో చేసిన జాప్యం రైతులకు శాపంగా మారింది. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఇప్పటికైనా వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు దృష్టిసారించి ప్రయోగశాలను అందుబాటులోకి తెస్తే ప్రయోగాల ఫలితాలు రైతులకు అందనున్నాయి.
అమరావతి వ్యవసాయ క్షేత్రంలో నిర్మించిన భవనం
మూడేళ్ల కిందటే పూర్తయినా..
రాష్ట్రంలో వ్యవసాయానికి సంబంధించి ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల పరీక్ష కేంద్రాలు, డీఎన్ఏ ప్రయోగశాలతోపాటు డీకోడింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని గత తెదేపా ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా 2018లో మొత్తం 8 భవనాల నిర్మాణానికి అమరావతిలో ఒకే ప్రాంగణంలో అప్పట్లో శంకుస్థాపనలు చేసి పనులు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ వైద్య మౌలికవసతుల అభివృద్ధి సంస్థ పర్యవేక్షణలో గుత్తేదారుకు పనులు అప్పగించారు. డిసెంబరు 2021 నాటికి ప్రయోగశాల, ఎరువులు, పురుగుమందుల పరీక్ష కేంద్రాలు, జీవ ఉత్పత్తుల పరీక్ష కేంద్రాల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇందుకు రూ.5కోట్ల సొమ్ము వెచ్చించారు. భవనాల నిర్మాణం పూర్తయిన వెంటనే స్వాధీనం చేసుకోవడానికి అధికారులు పరిశీలించగా అనేక లోపాలు బహిర్గతమయ్యాయి. వీటిని సరిచేయాలని గుత్తేదారుకు సూచిస్తే అరకొరగా మరమ్మతు చేసి సరిపెట్టారు.
నిర్మాణాల్లో నాణ్యతా లోపాలు..
ఇప్పటికే ఒక భవనం స్వాధీనం చేసుకోగా నాణ్యతా లోపాలు వెలుగుచూస్తున్నాయి. ఒక అడుగు మేర టైల్స్ కిందకి కుంగిపోవడంతో గుత్తేదారు మళ్లీ మరమ్మతు చేసి సరిచేశారు. ఇంకా స్వాధీనం చేసుకోని డీఎన్ఏ ప్రయోగశాలలో సీలింగ్ నుంచి పెచ్చులు ఊడిపోయాయి. భవనాల చుట్టూ వేసిన టైల్స్ కూడా కుంగిపోయాయి. మిగిలిన భవనాలు స్వాధీనం చేసుకోకపోవడం, గుత్తేదారు మరమ్మతు చేయకపోవడంతో సందిగ్ధం కొనసాగుతోంది. భవనాల్లో లోపాలపై ఇప్పటికే వ్యవసాయశాఖ అధికారులు ఏపీఎంఐడీసీ విభాగానికి మూడుసార్లు లేఖలు రాశారు. నిర్మాణం పూర్తయిన భవనాలు అందుబాటులోకి తీసుకురాకపోవడంతో రోజురోజుకు పాడవుతున్నాయి. గుత్తేదారుకు ఇంకా 30శాతం సొమ్ము చెల్లించాల్సి ఉంది. ఉన్నతాధికారులు చొరవ తీసుకుని భవనాల మరమ్మతు పూర్తిచేసి భవనాలు అందుబాటులోకి తీసుకురావడం, గుత్తేదారుపై చర్యలు తీసుకోవడం వంటి అంశాలను త్వరగా తేల్చితే ఈ భవనాలు ఉపయోగంలోకి వస్తాయి.
ప్రయోజనాలెన్నో..
గుంటూరులోని డీఎన్ఏ వేలిముద్రలు, జన్యుమార్పిడి పంటల పర్యవేక్షణ ప్రయోగశాలకు కేంద్ర వ్యవసాయశాఖ జాతీయ రెఫెరల్ ప్రయోగశాల హోదా కల్పించింది. ఈ కేంద్రం అందుబాటులోకి వస్తే జన్యుమార్పిడి, జీవనక్రమంలో మార్పిడికి గురైన జీవుల ఉనికి, అంతర్థానం గురించి పరిశోధనలు చేపట్టవచ్చు. విత్తనాలలో జన్యుస్వచ్ఛత, వెరైటీ నిర్ధారణ, జన్యుమార్పిడి పంటల పరీక్షలు, సంకర విత్తనాల్లో తయారీదారులు చెప్పిన లక్షణాలు విత్తనాల్లో ఉన్నాయా? లేదా? నిర్ధారించి నివేదికల ఇచ్చే వెసులుబాటు కలుగుతుంది. దేశవ్యాప్తంగా ఎక్కడైనా విత్తనాల్లో సమస్య వచ్చినప్పుడు ఇక్కడి ప్రయోగశాలలో పరీక్షలు కీలకంగా మారనున్నాయి. ఇప్పటివరకు విత్తనాల్లో జన్యువుల నిర్ధారణ, ఇతర క్లిష్టతరమైన పరీక్షలకు విదేశాలకు పంపాల్సి వచ్చేది. ఇది అందుబాటులోకి వస్తే జన్యుమార్పిడి విత్తనాల్లో ఏదైనా కొత్త సమస్య వచ్చినా ఎదుర్కొనే సామర్థ్యం ప్రయోగశాలకు లభిస్తుంది. ఇంతటి కీలకమైన ప్రయోగశాలకు సంబంధించిన భవనం పూర్తయి మూడేళ్లయినా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రయోగశాలకు అవసరమైన పరికరాల కొనుగోలు చేయలేదు. గుంటూరులో ఒక గదిలో అరకొర సౌకర్యాల నడుమ తాత్కాలికంగా డీఎన్ఏ ప్రయోగశాల నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఎరువులు, పురుగుమందుల పరీక్ష కేంద్రాల భవనాలు సైతం పూర్తయ్యాయి. ఒక భవనం స్వాధీనం చేసుకుని అందులో డీకోడింగ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. మిగిలిన భవనాలన్నీ నిరుపయోగంగా పాడవుతున్నాయి. కృష్ణానది ఒడ్డునే ఉండటంతో ఇక్కడ నీటి వసతి, రాజధాని ప్రాంతానికి దగ్గరగా ఉండటంతో అన్నివిధాలా అత్యంత సౌకర్యంగా ఉన్న కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురావాలని రైతులు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీలో పింఛన్ల పెంపు.. పంపిణీ కార్యక్రమానికి చంద్రబాబు
[ 29-06-2024]
రాష్ట్రవ్యాప్తంగా జులై 1న జరగనున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు (Chandrababu) పాల్గొననున్నారు. -
ప్రజా సమస్యల పరిష్కారం కోసం త్వరలోనే ప్రత్యేక వేదిక: చంద్రబాబు
[ 29-06-2024]
ప్రజా సమస్యల పరిష్కారం కోసం త్వరలోనే ప్రత్యేక వేదిక ఏర్పాటు చేస్తానని సీఎం చంద్రబాబు అన్నారు. -
ఒకటో తేదీనే 90 శాతం పింఛన్లు పంపిణీ చేయాలి: ఏపీ సీఎస్
[ 29-06-2024]
జులై ఒకటో తేదీనే 90 శాతం పింఛన్లు పంపిణీ చేయాలని ఏపీ సీఎస్ నీరభ్కుమార్ ప్రసాద్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. -
వైవీయూ వీసీ, రిజిస్ట్రార్ రాజీనామా.. ఆమోదించిన ప్రభుత్వం
[ 29-06-2024]
యోగి వేమన వర్సిటీ(వైవీయూ) వైస్ ఛాన్సలర్ చింతా సుధాకర్, రిజిస్ట్రార్ వెంకటసుబ్బయ్య రాజీనామా చేశారు. -
మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం.. పోక్సో కేసు నమోదు
[ 29-06-2024]
బాపట్ల జిల్లాలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచార ఘటన కలకలం రేపింది. -
అయిదేళ్లలో తప్పుడు కేసులెన్నో!
[ 29-06-2024]
బాపట్ల జిల్లాలో కొందరు పోలీసులు గత వైకాపా ప్రభుత్వంతో బాగా అంటకాగారు. ఆ పార్టీ నేతలు చెప్పిందే వేదంగా భావించి తెదేపా, జనసేన నాయకులు, కార్యకర్తలపై ఉక్కుపాదం మోపారు. -
ఎన్నాళ్లీ ఇక్కట్లు?
[ 29-06-2024]
రోగులు వైద్య చికిత్సను పొందేందుకు సర్వజనాసుపత్రికి గుంటూరుతో పాటు పొరుగునున్న అయిదారు జిల్లాల నుంచి ప్రజలు వస్తుంటారు. జీజీహెచ్లోని మిలీనియం బ్లాక్లో గుండె, నరాలు, ట్రామాకేర్ విభాగాలు ఉన్నాయి. -
ప్రత్తిపాడు సీఐ, ఎస్సైల సస్పెన్షన్
[ 29-06-2024]
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు సీˆఐ నిసార్బాషా, ఎస్సై సోమేశ్వరరావులను పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ప్రత్తిపాడు మండలం గొట్టిపాడు ఎస్సీ కాలనీలో ఈ నెల 23న వైకాపా కార్యకర్త ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై వివాదం రేగింది. -
గీత దాటితే వేటే
[ 29-06-2024]
విధి నిర్వహణలో అలసత్వం వహించిన పోలీసులు మూల్యం చెల్లించుకోక తప్పని పరిస్థితి. ఇటీవల గుంటూరు రేంజి పరిధిలో చోటుచేసుకున్న పలు ఉదంతాల్లో కొంతమంది అధికారుల వైఖరిపై ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి కన్నెర్ర చేశారు. -
చిన్నారి హితైషికి చేయూత
[ 29-06-2024]
చిన్నారి హితైషిని ఆదుకొనేందుకు పలువురు దాతలు ముందుకు వచ్చారు. గుంటూరుకు చెందిన చిన్నారి హితైషి (9 నెలలు) స్పైనల్ మస్కులర్ అట్రోఫి (ఎస్ఏంఏ) అనే అరుదైన వ్యాధితో బాధపడుతోంది. -
ఎంబుక్ రికార్డుపై గందరగోళం
[ 29-06-2024]
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో పనులు చేసిన గుత్తేదారులకు బిల్లుల చెల్లింపు సంగతి దేవుడెరుక.. అసలు వారు చేసిన పనులకు ఎంబుక్ రికార్డు ఎవరు చేయాలన్నదానిపై ఇంజినీరింగ్వర్గాల్లో గందరగోళం నెలకొంది. -
వెలుగుల మాటున చీకటి దందా!
[ 29-06-2024]
నాటి సీఎం జగన్కు అత్యంత సన్నిహితమైన షిరిడీసాయి ఎలక్ట్రికల్స్ సంస్థ అవసరానికి మించి 2022-23 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్తు నియంత్రికల (ట్రాన్స్ఫార్మర్లు)ను కొనుగోలు చేయించింది. -
కాన్వాయ్ ఆపి.. ప్రసాదం స్వీకరించిన సీఎం
[ 29-06-2024]
రాజధాని మహిళలు అందించిన గ్రామ దేవత పోలేరమ్మ ప్రసాదం, తిరుమల శ్రీవారి శేష వస్త్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వీకరించారు. -
కొత్త వంతెన వస్తోంది!
[ 29-06-2024]
గుంటూరు నగరంలో అత్యంత కీలకమైన శంకర్విలాస్ వంతెన స్థానంలో నూతన నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. కొత్త వంతెన నిర్మించాలన్నది దశాబ్దానికిపైగా ఉన్న డిమాండ్. -
జగనన్న కాలనీల్లో రూ.కోట్ల దోపిడీ
[ 29-06-2024]
జగనన్న కాలనీ పేరిట ఊళ్లకు ఊళ్లు నిర్మిస్తున్నామని గొప్పలు చెప్పిన మాజీ సీఎం జగన్.. దాని వెనక రూ.లక్షలకు లక్షలు వైకాపా నాయకులకు దోచిపెట్టారనే మోసాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. -
ముద్దగా అన్నం.. అర్ధాకలితో సతమతం
[ 29-06-2024]
ముప్పాళ్ల మండలం గోళ్లపాడు కేజీబీవీలో గతేడాది విద్యార్థినులు అర్ధాకలితోనే విద్యాసంవత్సరాన్ని పూర్తి చేశారు. ఆహారంలో నాణ్యత ఉండడం లేదని, అరకొరగా అందిస్తున్నారని విద్యార్థినుల తల్లిదండ్రులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. -
బెదిరించి రూ.కోట్లు వసూలు చేశారు
[ 29-06-2024]
మాజీ మంత్రి విడదల రజిని, ఆమె మరిది విడదల గోపి, పీఏ రామకృష్ణ అప్పటి విజిలెన్స్ ఎస్పీ జాషువా తమను భయభ్రాంతులకు గురిచేసి రూ.2.20 కోట్లు బలవంతంగా వసూలు చేశారని.. వాటిని ఇప్పించి, చట్టపరంగా వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా అడిషనల్ ఎస్పీ లక్ష్మీపతిని కలిసి యడ్లపాడు స్టోన్ క్రషర్స్ బాధితులు శుక్రవారం వినతిపత్రం అందజేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఎన్టీఆర్ పురస్కారాలు.. బేబీ చిత్రానికి 2 అవార్డులు
-
భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో అగ్ని ప్రమాదం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
విద్యాశాఖ ఆర్జేడీ రాఘవరెడ్డిపై విచారణకు ప్రభుత్వ ఆదేశం
-
నీట్ పీజీ-2024 నిర్వహణపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ క్లారిటీ
-
నైతిక ఓటమి ఎదురైనప్పటికీ..! ప్రధానిపై సోనియా విమర్శలు