Cyber Crime: షేర్ మార్కెట్ పేరుతో రూ.59 లక్షలకు టోకరా
షేర్ మార్కెట్లో నగదు పెడితే రెట్టింపు అవుతుందని ఆన్లైన్ ద్వారా నమ్మించి రూ.59 లక్షలు స్వాహా చేసిన ఘటన ఇది.
గుంటూరు జిల్లా చేబ్రోలులో కేసు నమోదు
చేబ్రోలు, న్యూస్టుడే: షేర్ మార్కెట్లో నగదు పెడితే రెట్టింపు అవుతుందని ఆన్లైన్ ద్వారా నమ్మించి రూ.59 లక్షలు స్వాహా చేసిన ఘటన ఇది. చేబ్రోలు ఎస్సై మహేష్ కుమార్ కథనం ప్రకారం... చేబ్రోలు మండలం శేకూరుకు చెందిన గృహిణి రాధిక ఇటీవల స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకుందామని గూగుల్లో శోధిస్తున్న క్రమంలో సీ3 విక్రమ్ ఛటర్జీ స్టాక్ ఎలైట్ సెంటర్ గ్రూప్ను ఎంచుకున్నారు. వారు పంపిన లింక్లో తన చరవాణి నంబరును నమోదు చేయడంతో ఆమె వాట్సప్కు ఐశ్వర్య అనే మహిళ నుంచి మెసేజ్ వచ్చింది. తాను విక్రం చటర్జీ అసిస్టెంట్నని పరిచయం చేసుకున్నారు. ఆయన ప్రతి రోజూ స్టాక్ మార్కెట్పై అప్డేట్స్, తరగతులు నిర్వహిస్తారని ఈ ఏడాది మార్చిలో ఒక లింకు పంపారు. దానిని రోజూ క్లిక్ చేయడం వల్ల రేటింగ్ పెరుగుతుందని, తద్వారా మీకు నగదు బహుమానంగా వస్తుందని ఐశ్వర్య నమ్మబలికింది. రోజు ఆయన తరగతులు వింటూ మే 6వ తేదీన ఈటీఎఫ్ స్టాక్ మార్కెట్లో షేర్లు కొనుగోలు చేసేందుకు రూ.1 లక్ష నగదు పంపగా.. కొన్ని రోజులకు షేర్ల విలువ పెరిగిందని రూ.30 వేలు పంపారు. అలా నమ్మబలుకుతూ మూడు ద]ఫాలుగా రూ.59 లక్షలు ఐశ్వర్య వాట్సప్లో పంపిన ఖాతాకు రాధిక పంపారు. కొన్ని రోజులు తరవాత తమ నగదు వెనక్కి పంపాలని ఐశ్వర్యను కోరడంతో మీ నగదు అంతా రెట్టింపు అయ్యే ప్లాన్లో ఉన్నాయని, ఒకే సారి రూ.1,32,52,000 వస్తాయని, దీనికి గాను ముందుగా 30 శాతం చెల్లించాలని, లేకుంటే నగదు మొత్తం పోతాయని చెప్పడంతో మోసపోయానని గుర్తించిన రాధిక చేబ్రోలు పోలీసులను ఆశ్రయించారు. గురువారం రాత్రి కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు ఎస్సై మహేష్ కుమార్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజకీయ పీడ వదిలింది
[ 30-06-2024]
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయాన్ని రాజకీయాలకు కేంద్ర బిందువుగా మార్చిన వీసీ పి.రాజశేఖర్ ఉపకులపతి పదవికి రాజీనామా చేశారు. -
లోక్ అదాలత్లో 1,454 కేసుల పరిష్కారం
[ 30-06-2024]
జిల్లాలో శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్లో 1,454 కేసులు పరిష్కరించారు. జిల్లా వ్యాప్తంగా న్యాయస్థానాల్లో న్యాయమూర్తులు నిర్వహించిన లోక్ అదాలత్లో -
అయిదేళ్లుగా జీజీహెచ్ని నిర్లక్ష్యం చేశారు
[ 30-06-2024]
సర్వజనాసుపత్రిలో గత అయిదేళ్లలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదని, చాలా సమస్యలు ఉన్నాయని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. -
ఎయిమ్స్కు నీటి కష్టాలు తీరినట్లే
[ 30-06-2024]
మంగళగిరి ఎయిమ్స్లో నీటి సమస్య పరిష్కారానికి తెదేపా కూటమి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ అంశంపై ఆసుపత్రి డైరెక్టర్ మాధవానంద కార్ శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కలిసిన నేపథ్యంలో అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. -
పింఛను పండగకు సర్వం సిద్ధం
[ 30-06-2024]
సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చుతూ దూసుకుపోతోంది. జూలై ఒకటో తేదీన ఇంటి వద్దకే వెళ్లి పెంచిన మొత్తాన్ని అందించాలని నిర్ణయించింది. -
అక్షర యోధుడు రామోజీరావు
[ 30-06-2024]
చివరి క్షణం వరకు సమాజ శ్రేయస్సు కోసం పరితపించిన రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు సేవలు చిరస్మరణీయమని రాజధాని రైతులు, మహిళలు పేర్కొన్నారు. -
ఇష్టానుసారం తోడేస్తున్నారు!
[ 30-06-2024]
గుండ్లకమ్మ నదిలో ఇసుక తవ్వకాలు పునః ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో కూటమి అధికారం చేపట్టింది. ఇసుక విధానం గురించి ప్రభుత్వం నిర్ణయం తీసుకునేందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉంది. -
సముద్ర తీరం.. నిర్మానుష్యం
[ 30-06-2024]
వారాంతపు సెలవులు వస్తే చాలు తీరం వెంట ప్రధానంగా తెలంగాణ, విజయవాడ, తిరుపతి, నెల్లూరు తదితర ప్రాంతాల నుంచి పర్యాటకులు చీరాల నియోజవర్గంలోని వాడరేవు, రామాపురం చేరుకుని కుటుంబ సభ్యులతో సరదాగా గడిపేవారు. -
బాధ్యతలు చేపట్టిన యంత్రాంగం
[ 30-06-2024]
సహకార రంగం ప్రక్షాళనకు కూటమి ప్రభుత్వం వడివడిగా చర్యలు చేపట్టింది. 2018లో సహకార సొసైటీల పాలకవర్గాల సమయం ముగిసింది. -
మళ్లీ నీటి పరీక్షలు..
[ 30-06-2024]
జిల్లాలో చాలాచోట్ల చెరువుల్లో నీరు అడుగంటడం, నీటి శుద్ధి సక్రమంగా లేకపోవడంతో పలుచోట్ల అతిసార కేసులు బయటపడుతున్నాయి. -
డిప్యూటీ డెమో పోస్టు వారెలా భర్తీ చేస్తారు?
[ 30-06-2024]
ప్రాంతీయ వైద్య ఆరోగ్య సంచాలకులు(ఆర్డీ) జోన్-3 పరిధిలోని డిప్యూటీ డెమో పోస్టును కడప ప్రధాన కేంద్రంగా ఉన్న జోన్-4 అధికారులు భర్తీ చేయడంపై వివాదం జరుగుతోంది. -
‘మాజీ సీఎస్ జవహర్రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయండి’
[ 30-06-2024]
దళితుడైన పల్నాడు జిల్లా మాజీ కలెక్టర్ శివశంకర్పై తప్పుడు నివేదిక ఇచ్చిన వైకాపా హయాంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన జవహర్రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసు నమోదు చేయాలని డాక్టర్ బీఆర్ ఆంబేడ్కర్ లిటరేచర్ ఫౌండేషన్ అధ్యక్షుడు బి.విల్సన్ డిమాండ్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
వెంకయ్యనాయుడి వాగ్దాటి ముందు ఎవరూ నిలవలేరు: ప్రధాని మోదీ
-
డీఎస్ కుటుంబానికి కాంగ్రెస్ అండగా ఉంటుంది: సీఎం రేవంత్రెడ్డి
-
‘‘ఆదర్శప్రాయమైన విజయం’’.. టీమ్ఇండియాకు ప్రధాని మోదీ ఫోన్
-
‘మాటలు పడి’లేచిన కెరటం... పాండ్య
-
పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన అంతర్జాతీయ నిపుణులు
-
నేనెప్పుడూ గణాంకాలు చూడను.. భారత్ గెలుపే ముఖ్యం: రోహిత్