Guntur: ఆరు నెలల చిన్నారి చికిత్సకు.. ఇంజక్షన్ ఖరీదు రూ.16 కోట్లు
ఊహ తెలియని పసిప్రాయం.. బోసినవ్వులతో అలరిస్తుంటే తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు మురిసిపోయారు. మా బంగారు కొండ అంటూ ముద్దు చేశారు.
ఆరు నెలల చిన్నారికి ప్రాణాంతక వ్యాధి
ప్రభుత్వం, దాతలపైనే తల్లిదండ్రుల ఆశలు
ఈనాడు డిజిటల్, నరసరావుపేట
ఊహ తెలియని పసిప్రాయం.. బోసినవ్వులతో అలరిస్తుంటే తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు మురిసిపోయారు. మా బంగారు కొండ అంటూ ముద్దు చేశారు. అయితే మూడు నెలల వయసులో మెడ వంగి ఉండటం, కాళ్లు చేతులు ఆడించకపోవడంతో ఆసుపత్రిలో చూపించారు. చివరకు ఆ పసిప్రాణాన్ని జన్యుపరమైన వ్యాధి పీడిస్తోందన్న చేదు నిజం వాళ్లను ఆందోళనకు గురి చేసింది. అంతకంటే ఈ వ్యాధికి ఇచ్చే ఇంజక్షన్ ఖరీదు రూ.16 కోట్లు అనగానే దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఓ సాధారణ ప్రైవేటు ఉద్యోగి అయిన బాలుడి తండ్రి అంత మొత్తం సమకూర్చడం అయ్యేపని కాదు. దీంతో వసివాడని ఆ పసిప్రాణాన్ని దక్కించుకునేందుకు దాతల సాయం అర్థిస్తున్నారు ఆ కన్నవారు.
కళ్ల ముందే ఆరు నెలల బాబు ప్రాణాంతక జన్యుపరమైన వ్యాధి బారిన పడటం ఆ తల్లిదండ్రులను కుంగదీసింది. తండ్రి ఒక్కడే జీవనాధారమైన ఆ కుటుంబానికి అంత ఖర్చు భరించడం వారి వల్ల కాక ప్రభుత్వం, దాతలు ఆదుకోవాలని వేడుకుంటున్నారు. నరసరావుపేట పనసతోటకు చెందిన షేక్ యాఫీన్, షేక్ షీరీన్ దంపతులకు ఇద్దరు కుమారులు. షేక్ యాఫీన్ ఓ ప్రైవేటు ఉద్యోగి. రెండోబాబు జయాన్కు మూడు నెలల సమయంలో మెడ వంగి ఉండటం.. కాళ్లు, చేతులు ఆడించకపోవడం గమనించిన తల్లిదండ్రులు విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చూపించారు. జన్యుపరమైన వ్యాధి ఉందని, కొన్ని పరీక్షలు చేసి అనంతరం హైదరాబాద్కు సిఫార్సు చేశారు. దీంతో అక్కడ మరో ప్రైవేటు ఆసుపత్రిలో జన్యుపరమైన వ్యాధి ఉందని పరీక్షలు చేయగా ప్రాణాంతకమైన ‘‘స్పైనల్ మస్కులర్ అట్రోఫీ (ఎస్ఎంఏ)’’ ఉందని వైద్యులు నిర్ధరించారు. ప్రస్తుతం టైప్ 1లో ఉందని, ఏడాదిలోపు ఖరీదైన ఇంజక్షన్ వాడాలని, ఇందుకు రూ.16 కోట్లు ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు. దీంతో బాబు తల్లిదండ్రులు హతాశులయ్యారు. ఆర్థిక స్థోమత లేక, నిర్లక్ష్యం చేస్తే బాబు ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని కన్నీరు మున్నీరవుతున్నారు. మధ్య తరగతి కుటుంబీకులైన తాము అంత వెచ్చించే పరిస్థితి లేక ప్రభుత్వం, దాతలు ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఇప్పటికే హైదరాబాద్ నిమ్స్లో కూడా చూపించామని, ఆ ఇంజక్షన్ తమ వద్ద లేదని వైద్యులు చెప్పారని, చివరకు దాతలు, ప్రభుత్వం ద్వారా తమ బాబును కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదే వ్యాధితో గుంటూరుకు చెందిన గాయత్రి, ప్రీతమ్ల చిన్నారి హితైషి బాధపడుతూ దాతలు ఆదుకోవాలని వేడుకున్న విషయం ఇటీవలే వెలుగులోకి వచ్చింది. వీరికి విదేశాల నుంచి ఇంజక్షన్లు, ఔషధాలు సమీకరించుకుని చికిత్స అందివ్వాలి ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాడు గొప్పలు.. నేడు తిప్పలు..
[ 06-07-2024]
బడుల రూపురేఖలు మార్చేస్తామని నాడు వైకాపా సర్కారు చెప్పింది నిజమే.. వాటి రూపును దారుణంగా మార్చేసి విద్యార్థులు, ఉపాధ్యాయులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. -
పాత్రధారులు సరే.. సూత్రధారులు ఎక్కడ?
[ 06-07-2024]
ఉమ్మడి గుంటూరులో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పరిధిలో నకిలీ పాసుపుస్తకాలు, అడంగల్, 1బీ, నకిలీ చిరునామా ధ్రువపత్రాలు పెట్టి రూ.కోట్లు కొల్లగొట్టారు. -
ఉల్లంఘనలు దండి.. ఆదాయానికి గండి..
[ 06-07-2024]
గుంటూరు నగర పట్టణ ప్రణాళిక విభాగం అవినీతి, అక్రమాల్లో మునిగితేలుతోంది. భవన అనుమతుల ఫీజుల రూపేణా నగరపాలికకు రావాల్సిన ఆదాయానికి ప్రణాళికాధికారులే గండికొట్టి తమ సొంత జేబులు నింపుకొంటున్నారు. -
నాణ్యత డొల్ల.. కష్టాలు నిలువెల్లా
[ 06-07-2024]
‘నాడు-నేడు’ పనులతో పాఠశాలల రూపురేఖలు మార్చేశాం.. మునుపెన్నడూ లేనిరీతిలో తరగతి గదులు నిర్మించాం.. సకల సౌకర్యాలు కల్పించాం’ అంటూ ఊదరగొట్టిన మాజీ సీఎం జగన్ మాటలన్నీ బూటకాలేనని నాటి లోపాలు నేడు ఒక్కొకటిగా బయటపడుతున్నాయి. -
పిన్నెల్లి అరాచకాలపై చర్చిద్దామా?
[ 06-07-2024]
‘మీకు ధైర్యముంటే మాచర్లలో ఒక వేదిక ఏర్పాటు చేద్దాం.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎన్ని ఆస్తులు దోపిడీ చేశాడో, ఎంత గ్రానైట్ తరలించాడో.. ఎంత గ్రావెల్ అమ్ముకున్నాడో చర్చిద్దామా?’ అంటూ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి మాజీ సీఎం జగన్కు సవాల్ విసిరారు. -
లక్ష్యం 100 రోజులు.. 3,600 ఇళ్లు
[ 06-07-2024]
జిల్లాలో గృహ నిర్మాణాలను వేగవంతం చేసి లబ్ధిదారులకు అందజేసేలా చూడాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. -
జలవనరులకు జవసత్వాలు
[ 06-07-2024]
ఐదేళ్ల వైకాపా పాలనలో జలవనరుల కనీస నిర్వహణకు నిధులు కేటాయించకపోవడంతో నిర్వీర్యమయ్యాయి. -
బాలికలూ.. ఇబ్బందులు ఎదురైతే చెప్పండి
[ 06-07-2024]
లైంగిక వేధింపులకు గురైన విద్యార్థినులు వెంటనే తమకు జరిగిన అన్యాయం ఇంట్లో తల్లిదండ్రులు, పోలీసులకు తెలియజేయడం ద్వారా అటువంటి నేరాలకు అడ్డుకట్ట వేయవచ్చని జిల్లా బాలికా పరిరక్షణ అధికారులు శ్రీప్రియ, కృష్ణ పేర్కొన్నారు. -
ఓపీకి వెళితే బీపీ ఖాయం!
[ 06-07-2024]
గుంటూరులోని సర్వజన ఆసుపత్రిలో ఓపీ సేవలందించేందుకు 11 కౌంటర్లున్నాయి. 70 మందికిపైగా నర్సింగ్ విద్యార్థులను నియమించారు. -
ఆరు జీవితాలకు వరప్రసాదం!
[ 06-07-2024]
పుట్టెడు దుఃఖంలోనూ పలువురి ప్రాణాలు కాపాడేందుకు ఆ కుటుంబం ముందుకు వచ్చింది. -
‘పిన్నెల్లిని జగన్ పరామర్శించడం సిగ్గుచేటు’
[ 06-07-2024]
ప్రజలు తమ పవిత్రమైన ఓటు వేసే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం)ను ధ్వంసం చేసి జైలులో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి జైలుకు వెళ్లి పరామర్శించడం సిగ్గుచేటని -
జల్సాలకు అలవాటు పడ్డారు.. దొంగతనాల వైపు మళ్లారు
[ 06-07-2024]
జల్సాలకు అలవాటు పడిన యువకులు ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతూ పొలీసులకు దొరికిపోయారు. -
హైకోర్టు న్యాయవాదికి జైలుశిక్ష, జరిమానా
[ 06-07-2024]
భార్యను వేధించిన కేసులో హైకోర్టు న్యాయవాది నిమ్మల ప్రేమ్రాజ్కు జైలుశిక్ష, జరిమానా విధిస్తూ మంగళగిరి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి శుక్రవారం తీర్పు చెప్పారు.