logo

East godavari: గ్రామాలను అభివృద్ధి చేస్తాం: ఎమ్మెల్యే

కేంద్ర ప్రభుత్వ నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులను సమకూర్చేలా ప్రత్యేక దృష్టిసారిస్తానని, పార్టీలకు అతీతంగా గ్రామాలను అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు.

Published : 25 Jun 2024 19:54 IST

తాళ్లపూడి: కేంద్ర ప్రభుత్వ నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులను సమకూర్చేలా ప్రత్యేక దృష్టిసారిస్తానని, పార్టీలకు అతీతంగా గ్రామాలను అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. తాళ్లపూడి మండల పరిషత్తు కార్యాలయంలో ఆయా శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో మంగళవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సాధారణ నిధులు తప్ప ప్రభుత్వం నుంచి నిధులు రావడం లేదని అధికారులు చెప్పడం ఆశ్చర్యం వేసిందన్నారు. కేంద్రప్రభుత్వం నుంచి వచ్చే నిధులను గత వైకాపా ప్రభుత్వం లాగేసుకోవడంతో ప్రజా ప్రతినిధులు ఇబ్బందులు పడ్డారన్నారు. ఈ మూడేళ్ల కాలంలో ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఏం చేశారో అర్థం కావడం లేదన్నారు. తాళ్లపూడి మండలంలో ఆర్థిక పరిస్థితి బాగాలేదని, పంచాయతీలకు వచ్చే నిధులు మండలానికి రావడం లేదేని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పోశిరాజు, ఎంపీడీవో రమణ, మండల తెదేపా అధ్యక్షుడు నామన పరమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని