logo

East Godavari: పంచాయతీల్లో గ్రామసభలు

కొయ్యలగూడెం మండలంలోని పలు పంచాయతీల్లో బుధవారం గ్రామసభలను నిర్వహించారు.

Published : 03 Jul 2024 16:17 IST

కొయ్యలగూడెం గ్రామీణం: కొయ్యలగూడెం మండలంలోని పలు పంచాయతీల్లో బుధవారం గ్రామసభలను నిర్వహించారు. పరింపూడి, రామానుజపురం పంచాయతీల్లో జరిగిన కార్యక్రమాల్లో గ్రామస్థులతో పాటు సర్పంచులు, పలువురు వార్డు సభ్యులు పాల్గొన్నారు. గ్రామాల్లో వసూలు కావాల్సిన పన్ను బకాయిలు, పారిశుధ్య నిర్వహణ, చెరువుల నిర్వహణ తదితర అంశాలపై చర్చించి తీర్మానాలు చేసినట్టు కార్యదర్శులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్టాప్ డయేరియా కార్యక్రమం అమలుపై సభ్యులకు అవగాహన కల్పించినట్లు కార్యదర్శులు సత్యనారాయణ, జగదీష్ ప్రసాద్ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని