logo

East godavri: పథకాలపై సస్పెన్షన్‌ ఎత్తివేయాలి

మండలంలోని శెట్టిపేటలో ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాల అమలుపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివెయ్యాలని ధర్నా చేపట్టారు.

Updated : 03 Jul 2024 16:29 IST

నిడదవోలు: మండలంలోని శెట్టిపేటలో ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాల అమలుపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివెయ్యాలని ధర్నా చేపట్టారు. భవన నిర్మాణ కార్మిక సంఘం, శెట్టిపేట యూనియన్ ప్రెసిడెంట్ ఖండవల్లి వీర వెంకట్రావు ధర్నాకు నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులంతా తమ హక్కుల సాధన కోసం ఐక్యంగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు రావి వరహాలస్వామి, కిందా సాయి, క్రొవ్విడి చిన నాగరాజు, ఖండవల్లి దుర్గా రావు, ఎల్లె రాజారావు, చిన్నం మూర్తి, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని