YSRCP: ఆ పోలీసులు.. వైకాపా వీరభక్తులు
వైకాపా పాలనలో కొంతమంది పోలీసు అధికారులు తమ స్వామి భక్తి చాటుకున్నారు. తమ బాధ్యతలను వదిలేసి, వైకాపా నాయకులు ఏం చెప్పినా చేసేందుకు వెనుకడుగు వేయలేదు.
వైకాపా పాలనలో కొంతమంది పోలీసు అధికారులు తమ స్వామి భక్తి చాటుకున్నారు. తమ బాధ్యతలను వదిలేసి, వైకాపా నాయకులు ఏం చెప్పినా చేసేందుకు వెనుకడుగు వేయలేదు. కోరిన చోట పోస్టింగ్, పదోన్నతులు, ఇతర బంధుత్వాల నేపథ్యంలో శాంతి భద్రతలు రక్షించాల్సిన రక్షక భటులే ప్రజలకు నరకం చూపించారు. సాధారణ, సివిల్ వివాదాలతో స్టేషన్కు వెళ్తే స్థానిక వైకాపా నాయకులకు సమాచారం ఇచ్చేవారు. వాళ్లకు అనుకూలంగా పనిచేశారు. నిజాయితీపరులకు బదిలీలు బహుమానంగా లభిస్తే, వైకాపా వీరభక్తులు మాత్రం ప్రయోజనాలు పొందారు.
ఈనాడు, రాజమహేంద్రవరం, కాకినాడ, న్యూస్టుడే బృందం
వారు చెబితే కేసులు..
పెద్దాపురం మండలం తిరుపతి గ్రామంలో 2021 అక్టోబర్1న పంచాయతీ కార్యాలయంలో పింఛన్ల పంపిణీ జరిగింది. తెదేపా గ్రామ సర్పంచి మొయిళ్ల కృష్ణమూర్తి దానికి హాజరయ్యారు. ఇక్కడ నీకేమిటి సంబంధం అంటూ ఆయనతో వైకాపా ఎంపీటీసీ సభ్యుడు బుచ్చిరాజు, కార్యకర్తలు గొడవ పడ్డారు. వైకాపా నాయకుల ఫిర్యాదుపై అప్పటి ఎస్సై బాలాజీ తెదేపా సర్పంచి కృష్ణమూర్తితోసహా నలుగురిపై కేసు నమోదు చేశారు. వైకాపా నాయకుల జోలికి వెళ్లలేదు. ఇదే సర్పంచి, మరో ముగ్గురిపై శ్రీశృంగార వల్లభస్వామి దేవాలయానికి చెందిన ఈవోతో వైకాపా నాయకులు తప్పుడు కేసులు పెట్టించారు. దేవాలయ ఆదాయ, వ్యయాలపై ఈవోను సర్పంచి ప్రశ్నించడంతోనే బలవంతంగా కేసు పెట్టించారు. అప్పటి ఎస్సై మురళీకృష్ణ కేసు నమోదు చేశారు. సర్పంచితోపాటు మరికొందరు గ్రామం విడిచివెళ్లిపోయి 20 రోజుల తర్వాత బెయిల్తో తిరిగి వచ్చారు. వ్యవహారం కోర్టు మెట్లెక్కడంతో పొరపాటున వారిపై కేసులు పెట్టినట్లు ఈవో చెప్పడంతో 2023లో కేసు కొట్టేశారు.
లోకేశ్నూ నిలువరించిన వైనం..
గతేడాది సెప్టెంబరు 9న చంద్రబాబును అరెస్టు చేసిన సమయంలో తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రాజోలు నియోజకవర్గం పొదలాడలో ఉన్నారు. యువగళం పాదయాత్రలో భాగంగా 8న అక్కడికి చేరుకున్నారు. చంద్రబాబు అరెస్టు సమాచారం తెలుసుకుని విజయవాడ వెళ్లేందుకు యత్నించగా ఆయనను బస కేంద్రం నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. గాంధేయ మార్గంలో నిరసన తెలుపుతున్న లోకేశ్ను డీఎస్పీ కె.వి.రమణ బస్సులోకి వెళ్లాలన్నారు. బస్సులోకి వెళ్లి విశ్రాంతి తీసుకోవాలని సీఐ గోవిందరాజు అనడంపై లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘తండ్రిని అరెస్టు చేస్తే, ఆయనను కలిసేందుకు వెళ్తున్న నన్ను అక్రమంగా నిర్బంధించి రెస్టు తీసుకోమని చెబుతావా? నీవసలు మనిషివేనా?’’ అంటూ లోకేశ్ మండిపడ్డారు. ఈ వీడియోలు అప్పట్లో సామాజిక మాధ్యమంలో హల్చల్ చేశాయి.
అంతా ఏకపక్షమే..
సఖినేటిపల్లి మండలం గొందిలో తాగునీటి చెరువు సమీపంలో 2021లో కొందరు వైకాపా నాయకులు ఆక్వా చెరువులు తవ్వారు. దీంతో జలాలు ఉప్పుగా మారుతున్నాయని స్థానికులు అభ్యంతరం తెలిపారు. అధికార పార్టీ నాయకులకు కోపం రావడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అప్పటి ఎస్సై గోపాలకృష్ణ ఇరువర్గాలకు సర్దిచెప్పడంతో వివాదం ముగిసింది. మూడు రోజుల తర్వాత వైకాపా నాయకుల ఒత్తిడితో సదరు ఎస్సై ఓ సామాజిక వర్గమే లక్ష్యంగా కేసులు నమోదుచేయడం విరమ్శలకు తావచ్చింది. అప్పట్లో 11 మంది తెదేపా నాయకులపై కేసులు పెట్టి, జైలుకు పంపారన్న ఆరోపణలు ఉన్నాయి.
సఖినేటిపల్లి, రాజోలు మండలాలకు చెందిన ముగ్గురు 2020లో సామాజిక మాధ్యమంలో వచ్చిన ఓ పోస్టును ఫార్వర్డ్ చేశారు. అది సీఎం జగన్కు వ్యతిరేకంగా ఉందని.. అప్పటి రాజోలు వైకాపా ఇన్ఛార్జి పెదపాటి అమ్మాజీ ఫిర్యాదుతో ఎస్సై గోపాలకృష్ణ కేసు నమోదు చేశారు. స్టేషన్ బెయిల్ ఇచ్చే వీలున్నా రాత్రి వరకు ఇబ్బంది పెట్టి, ఆపై న్యాయస్థానంలో హాజరుపరిచారు.
సీతానగరం ఎస్సై బాద్‘షా’!
ఇసుక అక్రమ రవాణాపై నిలదీసిన ఒక దళిత యువకుడికి శిరోముండనం చేయడం అప్పట్లో సంచలనమైంది. 2020 జులై 20న సీతానగరం మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడ్ని స్టేషన్లో అక్రమంగా నిర్బంధించి వైకాపా నాయకుల ప్రోత్సాహంతో అప్పటి ఎస్సై షేక్ ఫిరోజ్షా స్టేషన్లోనే శిరోముండనం చేయించారు. ఎస్సై చేసిన పనులపై అప్పట్లో బాధితుడు చెప్పిన మాటలు దేశవ్యాప్తంగా సంచలనమయ్యాయి. వైకాపా నాయకులపై బాధితుడు కేసు పెట్టినా పోలీసులు నమోదు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఆవేదన తట్టుకోలేక ఆ బాధితుడు నక్సలైట్గా మారతానని రాష్ట్రపతికి లేఖ రాయడంతో స్పందించిన పోలీసు ఉన్నతాధికారులు ఆ ఎస్సైను రిమాండుకు పంపారు. తర్వాత ఆ ఎస్సై కోరుకున్న కృష్ణా జిల్లాలో పోస్టింగు ఇచ్చారు. సదరు ఎస్సై బాద్షాగా వ్యవహరించేవారనే విమర్శలు గట్టిగా ఉన్నాయి.
జనసేన కార్యకర్తకు బెదిరింపులు..
నిడదవోలు పట్టణంలో ఓ వైకాపా మహిళా కౌన్సిలర్ సమీప బంధువు జనసేనలో చేరారు. దీంతో వ్యక్తిగతంగా, రాజకీయంగా ఇబ్బందులు వస్తాయని అప్పటి సీఐ వెంకటేశ్వరరావుకు ఆమె చెప్పారు. ఆ బంధువు జనసేనలో చేరడానికి కారకుడిగా భావించిన ఓ జనసేన కార్యకర్తను స్టేషన్కు పిలిపించి బెదిరించారు. దీనిపై బాధితుడు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడంతో
విచారణ అనంతరం ఏప్రిల్ 8న ఆ సీఐను వీఆర్కు పంపించారు.
చిత్రహింసలకు యువకుడి బలి..
సామర్లకోటలో వైకాపా నాయకుల ఒత్తిడితో పోలీసులు చిత్రహింస పెట్టిన ఘటనలో 23 ఏళ్ల యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. పట్టణంలోని బలుసుల పేటకు చెందిన ఆలపు గిరీష్బాబు (23) ఆత్మహత్యకు పాల్పడి రెండేళ్లు గడిచినా అతని మృతికి కారకులైన బాధ్యులపై ఇప్పటికీ చర్యలు లేవని, తమకు న్యాయం జరగలేదని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. గిరీష్బాబు సోదరుడు ప్రవీణ్కుమార్ మున్సిపల్ ఎన్నికల్లో వైకాపాకు వ్యతిరేకంగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడమే ఆ కుటుంబం చేసిన నేరమైంది. ఆ అక్కసుతో పింఛను సొమ్ము లాక్కున్నారని, తన చేయి పట్టుకున్నారని వార్డు వాలంటీరుతో వైకాపా నాయకులు ఫిర్యాదు చేయించారు. దీంతో అప్పటి పెద్దాపురం సీఐ జయకుమార్, సామర్లకోట ఎస్సై అభిమన్యు గిరీష్బాబును పదేపదే స్టేషన్కు పిలిచి చిత్రహింసలకు గురిచేయడంతో అవమానం భరించలేక 2022 జనవరి 5న అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని, రూ.8 లక్షల నష్టపరిహారం, ఇంటి స్థలం ఇస్తామన్నారు. ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. ఆ సీఐ, ఎస్సైలను సస్పెండ్ చేసి చేతులు దులుపుకొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పల్లె మురవాలి.. ప్రగతి విరియాలి
[ 01-07-2024]
పిఠాపురం నియోజకవర్గం నుంచి భారీ విజయాన్ని అందుకున్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ- పర్యావరణం, శాస్త్ర-సాంకేతిక శాఖల మంత్రి హోదాలో జిల్లాకు వస్తున్నారు. -
ఎన్నాళ్లో వేచిన ఉదయం్ర కూటమి అభయం
[ 01-07-2024]
పింఛను డబ్బుల కోసం లబ్ధిదారులు ఇకపై ఇబ్బందులు పడాల్సిన పనిలేదు. కూటమి ప్రభుత్వం ఈ నెల నుంచి నేరుగా ఇంటివద్దే అందించేందుకు చర్యలు చేపట్టింది. -
అడుగులు పడేనా?
[ 01-07-2024]
టీ-20 ప్రపంచ కప్ పోటీల్లో భారత్ విజయపతాకం ఎగురవేసింది. 2007 సుదీర్ఘ పోరాటం అనంతరం మళ్లీ 2024లో సత్తాచాటింది. యువ, సీనియర్ల కలయికతో ప్రపంచ కప్ పోటీల్లో అడుగుపెట్టిన భారత్ సెమీఫైనల్ (ఇంగ్లాండ్), ఫైనల్స్ (దక్షిణాఫ్రికా)లో చిరకాల ప్రత్యర్థులను మట్టి కరిపించింది. -
అమృత హస్తాలు
[ 01-07-2024]
అమ్మ జన్మనిస్తే.. వైద్యులు పునర్జన్మనిస్తారు. అందుకే వాళ్లను వైద్యో నారాయణోహరి అంటారు. రోగుల ప్రాణాలు కాపాడేందుకు రాత్రి, పగలు తేడా లేకుండా సేవలందిస్తూ, కుటుంబ జీవితానికి దూరమవుతూ వారు చేసే త్యాగాలు ఎన్నెన్నో. -
ఏడీబీ రోడ్డు పనులు ముమ్మరం
[ 01-07-2024]
ఏడీబీ రోడ్డు విస్తరణ పనులు ఇక పూర్తిస్థాయిలో కొనసాగనున్నాయి. రాజానగరం, రంగంపేట మధ్య అత్యంత దయనీయంగా తయారైన ఈ రోడ్డు మరమ్మతుకు బీఎస్ఆర్ సంస్థ ఆదివారం చర్యలను చేపట్టింది. -
జీఎస్ఎల్కు ప్రముఖ వైద్యులు దత్తాత్రేయుడు రాక నేడు
[ 01-07-2024]
జీఎస్ఎల్ వైద్య కళాశాల, జనరల్ ఆస్పత్రి 20వ వార్షికోత్సవం సందర్భంగా కృష్ణాజిల్లాకు చెందిన, న్యూయార్క్ నివాసి, సుప్రసిద్ధ రేడియేషన్ అంకాలజిస్ట్ డా.నోరి దత్తాత్రేయుడు ప్రత్యేక అతిథిగా వస్తున్నారని వైద్య విద్యా సంస్థల చైర్మన్ డా.గన్ని భాస్కరరావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. -
మహిళా సాధికారతకు.. శేషకుమారి జీవితం నిదర్శనం
[ 01-07-2024]
మహిళా సాధికారతకు లక్కరాజు శేషకుమారి జీవితమే నిదర్శనమని, అమె గొప్ప వారసత్వ సంపద, స్ఫూర్తి పంచి వెళ్లారని ప్రముఖ వక్త, ఎడెల్గివ్ ఫౌండేషన్ సీఈవో, డైరక్టర్ నగ్మా ముల్లా అన్నారు. -
పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళిక
[ 01-07-2024]
విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలను తొలి దశలో పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. -
ఆనందంగా గడపాలని.. అంతలోనే అనంతలోకాలకు
[ 01-07-2024]
సెలవురోజు కావడంతో మనుమడితో ఆనందంగా గడపాలని ఆ తాతయ్య అనుకున్నారు. ఇంకొన్ని నిమిషాల్లో ఇంటికి వెళ్లిపోతామనగా ఊహించని ప్రమాదంలో ఇద్దరూ మృతిచెందారు. -
ఎన్నాళ్లో వేచిన ఉదయం కూటమి అభయం
[ 01-07-2024]
జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ పండగకు వేళయ్యింది. ఉదయం 6 గంటల నుంచే గ్రామ/వార్డు సచివాలయ సిబ్బందితో వీటిని లబ్ధిదారుల చెంతకు చేర్చనున్నారు. -
పవన్ రాకకు భారీ ఏర్పాట్లు
[ 01-07-2024]
పిఠాపురం ఎమ్మెల్యే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కల్యాణ్ జిల్లాలో మూడు రోజులు పర్యటించానున్నారు. ఇందులో భాగంగా సోమవారం పిఠాపురం రానున్నారు. -
పోలీసులు అప్రమత్తంగా ఉండాలి
[ 01-07-2024]
జిల్లాలో ప్రతి పోలీసు అధికారి అప్రమత్తంగా ఉండాలని, నమోదైన కేసును వెంటనే పరిష్కరించాలని ఎస్పీ సుసారపు శ్రీధర్ ఆదేశించారు. -
ఊరూరికీ.. అయిదేళ్ల మురికి..
[ 01-07-2024]
అయిదేళ్ల వైకాపా పాలనలో స్థానిక సంస్థలను పూర్తిగా అచేతనం చేసేశారు. కేంద్ర ప్రభుత్వం అందించే ఆర్థిక సంఘం నిధులను దారి మళ్లించారు. గ్రామాల్లో కుళాయి వేయాలన్నా, బ్లీచింగ్ చల్లించాలన్నా.. నిధుల కొరతతో ఇబ్బందిపడే దుస్థితి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
సీఎం, డిప్యూటీ సీఎం మార్పు వ్యవహారం.. హస్తిన చేరిన ‘కర్ణాటక’ పంచాయితీ
-
ఏపీలో పింఛన్ల పండుగ.. లబ్ధిదారుకు స్వయంగా అందజేసిన సీఎం చంద్రబాబు
-
బంగారం అక్రమ రవాణాపై పోలీసు అధికారి దాడి.. రూ.6 లక్షలు తీసుకొని వదిలేసిన వైనం
-
పులకించిన పెద్దపోతులపాడు
-
లద్దాఖ్ మృతుల్లో ఏపీకి చెందిన మరో ఇద్దరు సైనికులు
-
ఈ ఊరు.. వైద్యుల పుట్టినిల్లు..!