మేం వింటాం.. నిధులూ ఇస్తాం
గత అయిదేళ్లలో సాగునీటి పారుదల వ్యవస్థను వైకాపా సర్కారు పూర్తిగా విస్మరించింది. గోదావరి వరదల నుంచి రక్షణకు అవసరమైన పనులనూ పక్కనబెట్టింది.
వరద రక్షణ పనులకు రూ.2 కోట్లు కేటాయించిన కూటమి సర్కారు
కాట్రేనికోన బూలావారి మొండిగట్టు వద్ద రక్షణ పనులు(పాతచిత్రం)
ఈనాడు, రాజమహేంద్రవరం: గత అయిదేళ్లలో సాగునీటి పారుదల వ్యవస్థను వైకాపా సర్కారు పూర్తిగా విస్మరించింది. గోదావరి వరదల నుంచి రక్షణకు అవసరమైన పనులనూ పక్కనబెట్టింది. ఏటిగట్ల నిర్వహణ, ఇతర మరమ్మతులు గాలిలో దీపంలా చేసింది. ప్రతిపాదనలు వెళ్లడమే తప్ప నిధులు విదల్చని దుస్థితి. ప్రస్తుతం వరదల కాలం వచ్చేసింది. తెదేపా అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రాధాన్య క్రమంలో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. తాజాగా జలవనరులశాఖ హెడ్వర్క్స్ విభాగం పంపిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదించి రూ.2 కోట్ల నిధులు విడుదలచేసింది. ప్రధానంగా అఖండ గోదావరి, గౌతమీ, వశిష్ఠ పరిధిలో ఏటిగట్ల వద్ద రక్షణ సామగ్రి, నిర్వహణకు అవసరమైన పనులకు అధికారులు టెండర్లు పిలిచారు.
వారం రోజుల గడువుతో టెండర్లు
అత్యవసర పనుల నేపథ్యంలో నిబంధనల మేరకు ఈనెల 2, 3 తేదీల్లో వారం గడువుతో ఆన్లైన్లో టెండర్లు పిలిచామని జలవనరులశాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 8తో గడువు ముగుస్తుందన్నారు. ఆ తరువాత గుత్తేదార్లతో ఒప్పందం చేసుకుని పనులు ప్రారంభిస్తామన్నారు.
ఏ పనులకు ఎంత నిధులంటే..
- రాజోలు సబ్ డివిజన్ పరిధిలో వశిష్ఠ ఎడమ ఏటిగట్టు (లోయర్ సెక్షన్) వద్ద రక్షణ చర్యలకు రూ.14.04 లక్షలు, అప్పర్ సెక్షన్లో 47 కి.మీ మేర నిర్వహణ పనులు రూ.4.71 లక్షలతో చేపట్టనున్నారు.
- కోటిపల్లి వద్ద గౌతమి ఎడమ ఏటిగట్టు 34 కి.మీ నుంచి 63 కి.మీ వరకు నిర్వహణ, మరమ్మతులకు రూ.13.35 లక్షలు మంజూరు చేశారు.
- అఖండగోదావరి ఎడమ ఏటిగట్టు 40 కి.మీ మేర రక్షణ చర్యలకు రూ.10.92 లక్షలు..గట్టు పొడవునా నిర్వహణకు రూ.5.47 లక్షలతో టెండర్లు పిలిచారు.
- ఐ.పోలవరం మండలం మురమళ్ల పరిధిలో గౌతమి ఎడమ ఏటిగట్టు 51 కి.మీ నుంచి 85.10 కి.మీ వరకు నిర్వహణ, రక్షణ చర్యలకు రూ.4.08 లక్షలు, పీఐపీ ఫ్లడ్ బ్యాంక్కు 40 కి.మీ మేర నిర్వహణ పనులకు రూ.3.17 లక్షలు కేటాయించారు.
- కొత్తపేట మండలంలో గౌతమి కుడి ఏటిగట్టు 51 కి.మీ వద్ద నిర్వహణకు రూ.2.06 లక్షలు విడుదల చేశారు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దేశం కోసం.. ధర్మం
[ 08-07-2024]
భారతీయ జనతా పార్టీ రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశాలకు చారిత్రక నగరి రాజమహేంద్రవరం సిద్ధమైంది. మంజీరా కన్వెన్షన్ వేదికగా సోమవారం జరగనున్న సమావేశానికి విస్తృత ఏర్పాట్లు చేశారు. -
ఇసుమంతైనా ఇబ్బంది లేకుండా ఇసుక
[ 08-07-2024]
అయిదేళ్ల వైకాపా పాలనలో సామాన్యుడికి ఇసుక అందని దుస్థితి వేధించింది. రూ.వేలకు వేలు చెల్లించాల్సిన పరిస్థితి. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. -
అలంకరణమూర్తి.. ఆధ్యాత్మిక దీప్తి
[ 08-07-2024]
ఆషాఢమాస ఉత్సవాల్లో భాగంగా తుని నియోజకవర్గంలోని లోవ తలుపులమ్మ అమ్మవారిని ఆదివారం గాజులతో సుందరంగా అలంకరించారు. వేకువ జాము నుంచే ఆలయ ప్రాంగణం భక్తజనంతో నిండిపోయింది. -
మారని రోడ్డు.. తీరని వ్యథ!
[ 08-07-2024]
రాజమహేంద్రవరం, సీతానగరం రహదారి విస్తరణ అసంపూర్ణ పనులతో రాకపోకలకు నరకయాతన తప్పడం లేదని ప్రజలు వాపోతున్నారు. -
జలవనరులకు జవసత్వాలు
[ 08-07-2024]
అయిదేళ్ల జగన్ జమానాలో జలవనరుల శాఖ పరిధిలో చెప్పుకోదగిన స్థాయిలో పనులేం జరగలేదు. ఏటిగట్లు, కాలువలు, స్లూయిస్ల నిర్వహణ లాంటి అతి ముఖ్యమైన పనులనూ చేయలేదు. -
విశాఖ ఉక్కును కాపాడండి..
[ 08-07-2024]
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్)లో విలీనం జరిగేలా కృషిచేయాలని విశాఖ ఉక్కు అధికారుల సంఘ నాయకులు భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరికి విజ్ఞప్తి చేశారు. -
ఆకర్షణీయ నగర ప్రాజెక్టులు సాకారమయ్యేనా..?
[ 08-07-2024]
జిల్లా కేంద్రం కాకినాడలో స్మార్ట్సిటీ కార్పొరేషన్ ప్రాజెక్టును కేంద్ర మరో 9 నెలలు పొడిగించింది. పెండింగ్ ప్రాజెక్టులన్నీ ఈ గడువులోగా పూర్తి చేయాలని కేంద్ర గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఇటీవల ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. -
వైకాపాను వీడిన మాజీ కార్పొరేటర్లు
[ 08-07-2024]
గతంలో వైకాపాలో చేరిన ఇద్దరు భాజపా మాజీ కార్పొరేటర్లు తాజాగా సొంతగూటికి చేరారు. కూటమి అధికారంలోకి రావడంతో వైకాపాను వీడి వారు భాజపాలో చేరారు. -
ప్రాజెక్టులతో ప్రేరణ పొందుదాం..
[ 08-07-2024]
చిన్నారుల్లో శాస్త్ర సాంకేతికత విజ్ఞానాన్ని పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కేంద్ర శాస్త్ర, సాంకేతిక మండలి, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ సంయుక్తంగా ఏటా ఇన్స్పైర్ మనక్ కార్యక్రమం నిర్వహిస్తున్నాయి. -
ఉద్యాన పంటలకు ఉపాధి ఊతం
[ 08-07-2024]
ఉపాధిహామీ పథకం ద్వారా అత్యధికంగా కేవలం కూలీలకు పనులు కల్పించడానికే ప్రాధాన్యం ఇచ్చేవారు. గత వైకాపా ప్రభుత్వం ఈ పథకాన్ని కేవలం ఇళ్ల స్థలాల్లో మెరక చేసేపనులకు, గ్రామాల్లో సచివాలయం, రైతు భరోసా, వెల్నెస్ కేంద్రాల నిర్మాణాలకే అత్యధికంగా వినియోగించింది.