నిత్య స్మరణీయుడు.. అల్లూరి: మంత్రి దుర్గేష్
రాజమహేంద్రవరం సాంస్కృతికం, న్యూస్టుడే: స్వాతంత్య్రం నా జన్మ హక్కు అంటూ పోరాటం సాగించిన అల్లూరి సీతారామరాజు నిత్య స్మరణీయుడని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కందుల దుర్గేష్ అన్నారు.
అల్లూరికి నివాళి అర్పించిన మంత్రి దుర్గేష్, ఎమ్మెల్యేలు బుచ్చయ్య చౌదరి, బలరామకృష్ణ, కలెక్టర్ ప్రశాంతి, అధికారులు
రాజమహేంద్రవరం సాంస్కృతికం, న్యూస్టుడే: స్వాతంత్య్రం నా జన్మ హక్కు అంటూ పోరాటం సాగించిన అల్లూరి సీతారామరాజు నిత్య స్మరణీయుడని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. అల్లూరి జయంతి సందర్భంగా గురువారం గోదావరి గట్టున ఉన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా జయంతి వేడుకలు జరపాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ నిర్ణయం తీసుకోవడం గర్వకారణమన్నారు. అల్లూరి స్ఫూర్తితో రాష్ట్ర అభివృద్ధికి అందరం పునరంకితం కావాలని ఆకాంక్షించారు. కలెక్టర్ పి.ప్రశాంతి మాట్లాడుతూ అల్లూరితో ఈ ప్రాంతానికి ప్రత్యేకమైన అనుబంధం ఉండటం అదృష్టమన్నారు. గోదావరి తీరంలో బాల్యం గడిచిందని, ఆయన స్మృతులు పదిలంగా ఉన్నాయన్నారు. శాసనసభ్యుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి మాట్లాడుతూ సాయుధ పోరాటం ద్వారా స్వాతంత్య్రం సాధ్యమని నమ్మి ప్రాణాలర్పించిన పోరాట యోధుడు అల్లూరి అని కొనియాడారు. ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ ఆయన పోరాట స్ఫూర్తిని భావితరాలకు పదిలంగా అందించాలన్నారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ కె.దినేష్కుమార్, ఆర్డీవో చైత్రవర్షిణి, పర్యాటకశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకుడు వి.స్వామినాయుడు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడికి సత్కారం
[ 08-07-2024]
కాకినాడ జిల్లా తెదేపా బీసీ సెల్ అధ్యక్షుడు పైలా సాంబశివరావును శ్రీ భవానీ చిన్న వర్తకుల సంక్షేమ సంఘ సభ్యులు సోమవారం ఘనంగా సత్కరించారు. -
దేశం కోసం.. ధర్మం
[ 08-07-2024]
భారతీయ జనతా పార్టీ రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశాలకు చారిత్రక నగరి రాజమహేంద్రవరం సిద్ధమైంది. మంజీరా కన్వెన్షన్ వేదికగా సోమవారం జరగనున్న సమావేశానికి విస్తృత ఏర్పాట్లు చేశారు. -
ఇసుమంతైనా ఇబ్బంది లేకుండా ఇసుక
[ 08-07-2024]
అయిదేళ్ల వైకాపా పాలనలో సామాన్యుడికి ఇసుక అందని దుస్థితి వేధించింది. రూ.వేలకు వేలు చెల్లించాల్సిన పరిస్థితి. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. -
అలంకరణమూర్తి.. ఆధ్యాత్మిక దీప్తి
[ 08-07-2024]
ఆషాఢమాస ఉత్సవాల్లో భాగంగా తుని నియోజకవర్గంలోని లోవ తలుపులమ్మ అమ్మవారిని ఆదివారం గాజులతో సుందరంగా అలంకరించారు. వేకువ జాము నుంచే ఆలయ ప్రాంగణం భక్తజనంతో నిండిపోయింది. -
మారని రోడ్డు.. తీరని వ్యథ!
[ 08-07-2024]
రాజమహేంద్రవరం, సీతానగరం రహదారి విస్తరణ అసంపూర్ణ పనులతో రాకపోకలకు నరకయాతన తప్పడం లేదని ప్రజలు వాపోతున్నారు. -
జలవనరులకు జవసత్వాలు
[ 08-07-2024]
అయిదేళ్ల జగన్ జమానాలో జలవనరుల శాఖ పరిధిలో చెప్పుకోదగిన స్థాయిలో పనులేం జరగలేదు. ఏటిగట్లు, కాలువలు, స్లూయిస్ల నిర్వహణ లాంటి అతి ముఖ్యమైన పనులనూ చేయలేదు. -
విశాఖ ఉక్కును కాపాడండి..
[ 08-07-2024]
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్)లో విలీనం జరిగేలా కృషిచేయాలని విశాఖ ఉక్కు అధికారుల సంఘ నాయకులు భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరికి విజ్ఞప్తి చేశారు. -
ఆకర్షణీయ నగర ప్రాజెక్టులు సాకారమయ్యేనా..?
[ 08-07-2024]
జిల్లా కేంద్రం కాకినాడలో స్మార్ట్సిటీ కార్పొరేషన్ ప్రాజెక్టును కేంద్ర మరో 9 నెలలు పొడిగించింది. పెండింగ్ ప్రాజెక్టులన్నీ ఈ గడువులోగా పూర్తి చేయాలని కేంద్ర గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఇటీవల ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. -
వైకాపాను వీడిన మాజీ కార్పొరేటర్లు
[ 08-07-2024]
గతంలో వైకాపాలో చేరిన ఇద్దరు భాజపా మాజీ కార్పొరేటర్లు తాజాగా సొంతగూటికి చేరారు. కూటమి అధికారంలోకి రావడంతో వైకాపాను వీడి వారు భాజపాలో చేరారు. -
ప్రాజెక్టులతో ప్రేరణ పొందుదాం..
[ 08-07-2024]
చిన్నారుల్లో శాస్త్ర సాంకేతికత విజ్ఞానాన్ని పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కేంద్ర శాస్త్ర, సాంకేతిక మండలి, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ సంయుక్తంగా ఏటా ఇన్స్పైర్ మనక్ కార్యక్రమం నిర్వహిస్తున్నాయి. -
ఉద్యాన పంటలకు ఉపాధి ఊతం
[ 08-07-2024]
ఉపాధిహామీ పథకం ద్వారా అత్యధికంగా కేవలం కూలీలకు పనులు కల్పించడానికే ప్రాధాన్యం ఇచ్చేవారు. గత వైకాపా ప్రభుత్వం ఈ పథకాన్ని కేవలం ఇళ్ల స్థలాల్లో మెరక చేసేపనులకు, గ్రామాల్లో సచివాలయం, రైతు భరోసా, వెల్నెస్ కేంద్రాల నిర్మాణాలకే అత్యధికంగా వినియోగించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అరుదైన మైలురాయికి అడుగు దూరంలో ‘కల్కి 2898 ఏడీ’
-
డీఎస్సీని వాయిదా వేయాలని ఆందోళన.. విద్యాశాఖ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
-
కాలుష్యం పెరిగితే.. భవిష్యత్తు తరాలు మనల్ని క్షమించవు: మంత్రి పొన్నం ప్రభాకర్
-
జెరోదాలో మళ్లీ సాంకేతిక సమస్య.. సోషల్ మీడియా వేదికగా యూజర్ల అసహనం!
-
బల పరీక్షలో నెగ్గిన హేమంత్ సోరెన్
-
స్కైడాన్స్ చేతికి హాలీవుడ్ ఐకాన్ పారామౌంట్ గ్లోబల్..!