సొమ్ము ఉన్నట్టా.. లేనట్టా..?
గత వైకాపా సర్కారు పుణ్యామా అని వ్యవస్థలన్నీ తలకిందులయ్యాయి. కొన్ని నిర్వీర్యంగా మారాయి. దీనికి తోడు ప్రజల అవసరాలు తీర్చాల్సిన పన్నులు పక్కదారి పట్టాయి.
వైకాపా పాలనలో నిరుపయోగంగా మారిన వ్యసాయ మార్కెటింగ్ శాఖ
గోపాలపురం, న్యూస్టుడే: గత వైకాపా సర్కారు పుణ్యామా అని వ్యవస్థలన్నీ తలకిందులయ్యాయి. కొన్ని నిర్వీర్యంగా మారాయి. దీనికి తోడు ప్రజల అవసరాలు తీర్చాల్సిన పన్నులు పక్కదారి పట్టాయి. వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా రూ.కోట్ల ఆదాయం వస్తుంది. ఆ మొత్తంతో మార్కెటింగ్ శాఖ రైతుల అవసరాలు తీర్చాలి. వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారా వచ్చిన సొమ్ము ఆన్లైన్లో మాత్రమే కనిపిస్తోంది. వారి అవసరం తీర్చింది ఒక్కటీ లేదు. అయిదేళ్లగా అభివృద్ధి జాడే లేదు. తెదేపా ప్రభుత్వంలో మార్కెట్ కమిటీ ద్వార వచ్చిన ఆదాయంతో రైతుల అవసరాలకు వినియోగించేవారు. వసతులు కల్పించేవారు. వైకాపా పాలనలో అలంకారప్రాయంగా మారాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో వ్యవసాయ మార్కెట్ కమిటీలకు పూర్వవైభవం వస్తుందని రైతులు ఆశిస్తున్నారు.
గతంలో ఎంతో ఉపయోగం..
వ్యవసాయ మార్కెటింగ్ శాఖకు వ్యవసాయ ఉత్పత్తులు రవాణా, విక్రయాల ద్వారా రూ కోట్లలో ఆదాయం లభిస్తుంది. ఆ సొమ్మును పుంత రోడ్లు, రైతుబజార్లు, పంటలు నిల్వ చేసే గోదాములు తదితరాలకు ఉపయోగిస్తారు. మార్కెట్ కమిటీ గోదాములో నిల్వ ఉంచి, రూ.రెండు లక్షల వరకు రుణం పొందేవారు. ఈ మొత్తంతో గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు పెట్టేవారు. గత అయిదేళ్లలో అలాంటివి ఏం జరగలేదు.
ఆన్లైన్లో మాత్రమే కనిపిస్తాయి..
జిల్లాలో ఆరు వ్యవసాయ మార్కెట్ కమిటీలకు 2023-24 ఏడాదికి సుమారు రూ.26.36 కోట్లు లక్ష్యం ఇచ్చారు. దానికి మించి రూ. 30.69కోట్లు ఆదాయం వచ్చింది. ఈ లెక్కన గత అయిదేళ్లల్లో రూ.100కోట్లకు పైగా వచ్చాయి. ఆ మొత్తం ఆన్లైన్లో కనిపించడమే తప్ప రైతులకు ఉపయోగించిన సందర్భాలు లేవు. వినియోగించాలని మార్కెట్ కమిటీ ఛైర్మన్లు మొరపెట్టుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. 2022లో గ్రామీణ ప్రాంతాల్లో పుంత, బీటీ రోడ్ల నిర్మాణానికి పంచాయతీరాజ్ శాఖ అనుసంధానంతో ప్రతిపాదనలు చేశారు. ఆ తర్వాత పనుల మాటే లేదు. ఈ సొమ్మును దారి మళ్లించారనే ఆరోపణలు ఉన్నాయి.
తెదేపా ప్రభుత్వం నిర్మించిన గోదాములు
ప్రతిపాదనలు పంపించాం..
జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారా ఏటా లక్ష్యానికి మించి ఆదాయం వస్తుంది. 2022లో ఆయా కమిటీల పరిధిలో పుంత, బీటీ రోడ్డు నిర్మాణానికి పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో ప్రతిపాదనలు పంపించాం. అవి వచ్చిన తర్వాత రైతులకు అవసరమైన పనులు చేపడతాం.
ఎం సునీల్వినయ్, జిల్లా వాణిజ్య, మార్కెటింగ్ అధికారి, తూర్పుగోదావరి జిల్లా
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడికి సత్కారం
[ 08-07-2024]
కాకినాడ జిల్లా తెదేపా బీసీ సెల్ అధ్యక్షుడు పైలా సాంబశివరావును శ్రీ భవానీ చిన్న వర్తకుల సంక్షేమ సంఘ సభ్యులు సోమవారం ఘనంగా సత్కరించారు. -
దేశం కోసం.. ధర్మం
[ 08-07-2024]
భారతీయ జనతా పార్టీ రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశాలకు చారిత్రక నగరి రాజమహేంద్రవరం సిద్ధమైంది. మంజీరా కన్వెన్షన్ వేదికగా సోమవారం జరగనున్న సమావేశానికి విస్తృత ఏర్పాట్లు చేశారు. -
ఇసుమంతైనా ఇబ్బంది లేకుండా ఇసుక
[ 08-07-2024]
అయిదేళ్ల వైకాపా పాలనలో సామాన్యుడికి ఇసుక అందని దుస్థితి వేధించింది. రూ.వేలకు వేలు చెల్లించాల్సిన పరిస్థితి. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. -
అలంకరణమూర్తి.. ఆధ్యాత్మిక దీప్తి
[ 08-07-2024]
ఆషాఢమాస ఉత్సవాల్లో భాగంగా తుని నియోజకవర్గంలోని లోవ తలుపులమ్మ అమ్మవారిని ఆదివారం గాజులతో సుందరంగా అలంకరించారు. వేకువ జాము నుంచే ఆలయ ప్రాంగణం భక్తజనంతో నిండిపోయింది. -
మారని రోడ్డు.. తీరని వ్యథ!
[ 08-07-2024]
రాజమహేంద్రవరం, సీతానగరం రహదారి విస్తరణ అసంపూర్ణ పనులతో రాకపోకలకు నరకయాతన తప్పడం లేదని ప్రజలు వాపోతున్నారు. -
జలవనరులకు జవసత్వాలు
[ 08-07-2024]
అయిదేళ్ల జగన్ జమానాలో జలవనరుల శాఖ పరిధిలో చెప్పుకోదగిన స్థాయిలో పనులేం జరగలేదు. ఏటిగట్లు, కాలువలు, స్లూయిస్ల నిర్వహణ లాంటి అతి ముఖ్యమైన పనులనూ చేయలేదు. -
విశాఖ ఉక్కును కాపాడండి..
[ 08-07-2024]
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్)లో విలీనం జరిగేలా కృషిచేయాలని విశాఖ ఉక్కు అధికారుల సంఘ నాయకులు భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరికి విజ్ఞప్తి చేశారు. -
ఆకర్షణీయ నగర ప్రాజెక్టులు సాకారమయ్యేనా..?
[ 08-07-2024]
జిల్లా కేంద్రం కాకినాడలో స్మార్ట్సిటీ కార్పొరేషన్ ప్రాజెక్టును కేంద్ర మరో 9 నెలలు పొడిగించింది. పెండింగ్ ప్రాజెక్టులన్నీ ఈ గడువులోగా పూర్తి చేయాలని కేంద్ర గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఇటీవల ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. -
వైకాపాను వీడిన మాజీ కార్పొరేటర్లు
[ 08-07-2024]
గతంలో వైకాపాలో చేరిన ఇద్దరు భాజపా మాజీ కార్పొరేటర్లు తాజాగా సొంతగూటికి చేరారు. కూటమి అధికారంలోకి రావడంతో వైకాపాను వీడి వారు భాజపాలో చేరారు. -
ప్రాజెక్టులతో ప్రేరణ పొందుదాం..
[ 08-07-2024]
చిన్నారుల్లో శాస్త్ర సాంకేతికత విజ్ఞానాన్ని పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కేంద్ర శాస్త్ర, సాంకేతిక మండలి, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ సంయుక్తంగా ఏటా ఇన్స్పైర్ మనక్ కార్యక్రమం నిర్వహిస్తున్నాయి. -
ఉద్యాన పంటలకు ఉపాధి ఊతం
[ 08-07-2024]
ఉపాధిహామీ పథకం ద్వారా అత్యధికంగా కేవలం కూలీలకు పనులు కల్పించడానికే ప్రాధాన్యం ఇచ్చేవారు. గత వైకాపా ప్రభుత్వం ఈ పథకాన్ని కేవలం ఇళ్ల స్థలాల్లో మెరక చేసేపనులకు, గ్రామాల్లో సచివాలయం, రైతు భరోసా, వెల్నెస్ కేంద్రాల నిర్మాణాలకే అత్యధికంగా వినియోగించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మహిళపై కారుతో దూసుకెళ్లి.. గర్ల్ఫ్రెండ్ ఇంట్లో నక్కి: శివసేన యువనేతపై లుక్ఔట్ నోటీసు
-
ఓటీటీలోకి విజయ్ సేతుపతి యాక్షన్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!
-
ఆ స్నేహాన్ని మరింత బలోపేతం చేసుకుంటాం: రష్యా పర్యటనకు బయల్దేరిన మోదీ
-
దొంగను పట్టుకోకుండా ఇసుక పంచితే సాక్ష్యం తొలగించినట్లవుతుంది: అయ్యన్నపాత్రుడు
-
టీమ్ఇండియాకు రూ. 125 కోట్ల నజరానా.. ఎవరికి ఎంతంటే?
-
అస్సాంలోని వరద బాధిత ప్రాంతాల్లో రాహుల్ పర్యటన