తీపి బతుకుల్లో చేదు నిజాలు
మామిడితాండ్ర.. ఈ పేరు చెప్పగానే ఎవరికైనా ఠక్కున నోరూరుతుంది.. అంతలా జనంతో అనుబంధం పెనవేసుకుంది ఈ పదార్థం..
మామిడితాండ్ర తయారీదారులకు తప్పని కష్టాలు
ధరల పతనంతో వెత: మార్కెటింగ్ లేక గిడ్డంగుల్లో ఉత్పత్తులు
చాపలపై మామిడితాండ్ర తయారు చేస్తున్న కూలీలు
న్యూస్టుడే, సర్పవరం జంక్షన్: మామిడితాండ్ర.. ఈ పేరు చెప్పగానే ఎవరికైనా ఠక్కున నోరూరుతుంది.. అంతలా జనంతో అనుబంధం పెనవేసుకుంది ఈ పదార్థం.. అయితే, తయారీదారులకు మాత్రం ఇది తీపిని పంచలేకపోతోంది. ధరల పతనం ఓవైపు, మార్కెటింగ్ సౌకర్యం సరిలేక గిడ్డంగుల్లో ఉత్పత్తులు మూలుగుతూ మరోవైపు కునారిల్లుతూ కనిపిస్తోంది. ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తోంది.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అనేక గ్రామాలు నోరూరించే మామిడితాండ్ర తయారీలో పేరెన్నికగన్నాయి. 17 మధ్య, చిన్నతరహా, 10 కుటీర పరిశ్రమలు దీనిపైనే ఆధారపడ్డాయి. తూర్పు, పశ్చిమ, కృష్ణ, ఖమ్మం, విశాఖ జిల్లాల నుంచి మామిడి కాయలను తీసుకుని వచ్చి వేసవి సీజన్లో సంప్రదాయ పద్ధతిలో తాండ్రను తయారు చేస్తుంటారు. కాకినాడ గ్రామీణంలోని పండూరు, తమ్మవరం, సర్పవరం గ్రామాలతో పాటు గొల్లప్రోలు మండలంలో కత్తిపూడి, తొండంగి, జగ్గంపేట, పి.చిన్నాయపాలెం, చేబ్రోలు, ధర్మవరం, కొమ్మనాపల్లి, మల్లిసాల.. తూర్పుగోదావరి జిల్లాలోని మెట్ట ప్రాంతాలు, కోనసీమ జిల్లాలోని ఆత్రేయపురంలో ఈ తయారీ సాగుతోంది. కుటీర పరిశ్రమల్లో 3 నెలలు, మిగిలిన పరిశ్రమల్లో సుమారు 9 నెలలు పాటు ఉత్పత్తి చేస్తున్నారు. వ్యవసాయంపై ఆధారపడిన కూలీలు సీజన్లో ఈ తయారీలో పాలుపంచుకుంటూ కుటుంబాలను పోషించుకోవడం పరిపాటైంది. దేశంలోని అనేక
రాష్ట్రాలకు ఎగుమతులు జరుగుతున్నాయి.
నిత్యావసర వస్తువుగా...
తమ్మవరంలో మామిడితాండ్ర తయారీకి కాయలు గ్రేడింగ్ చేస్తున్న కూలీలు
మన రాష్ట్రంలో మామిడితాండ్రను ఒక మిఠాయిగానే తింటారు. కానీ ఒడిశా, బిహార్, పశ్చిమబంగ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో దీన్ని నిత్యావసర వస్తువుగా వాడుతున్నారు. రోజూ మూడు పూటలా తినేలా అలవాటు చేసుకున్నారు. కొందరు అల్పాహారంలో చట్నీలుగా, బర్గర్ మధ్యలో మామిడితాండ్ర పొరలను పెట్టి తినడం అలవాటు చేసుకున్నారు. సుమారు 25 రోజుల పాటు మామిడితాండ్ర తయారీకి పడుతుంది. అయితే, ముడిపదార్థాల పెరుగుదల, కూలీల కొరత, మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడం.. ఇలా అనేక కారణాలతో తయారీదారులు ఉత్పత్తిని అమ్ముకోలేక శీతల గిడ్డంగుల్లో పెట్టి ఎదురుచూస్తున్నారు.
ముడి సరకుల ధరలు పెరిగాయి
ఉమ్మడి జిల్లాలో మామిడితాండ్ర రైతులు తీవ్ర నష్టాలతో ఇబ్బందులు పడుతున్నాం. తాతల కాలం నుంచి అలవాటు అయిన వ్యాపారం మానలేక పోతున్నాం. గత కొంతకాలంగా సరకు కొనుగోలుచేసే హోల్సేల్ వ్యాపారులు లేక ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు కరవయ్యాయి. తయారైన తాండ్రను కోల్డుస్టోరేజ్లో పెట్టడం వల్ల తయారీదారులకు అదనపు భారంగా మారింది.
వలవల వెంకటేశ్వరరావు, వ్యాపారి, పండూరు, కాకినాడ గ్రామీణం
నష్టాలు వెంటాడుతున్నాయి
ఈ సీజన్లో మామిడి కాయల పంట సరిగా లేదు. దీంతో సుమారు రూ.12 వేలు ఉండే ధరలు రూ.26వేలకు విపరీతంగా పెరిగాయి. ఆ మేరకు తాండ్ర ధరలు పెరగడం లేదు. కూలీలకు రోజుకు రూ.600 వరకు ఇస్తున్నాం. కేజీ రూ.100 కంటే ఎక్కువ అమ్మితేనే నష్టాల నుంచి బయట పడగలం. కానీ రూ.70కి కూడా అమ్మకం జరగడం లేదు. ప్రభుత్వం దృష్టి పెట్టాలి.
మామిడాల వెంకటసుబ్రహ్మణ్య పాపారావు, తాండ్ర తయారీదారు, తమ్మవరం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడికి సత్కారం
[ 08-07-2024]
కాకినాడ జిల్లా తెదేపా బీసీ సెల్ అధ్యక్షుడు పైలా సాంబశివరావును శ్రీ భవానీ చిన్న వర్తకుల సంక్షేమ సంఘ సభ్యులు సోమవారం ఘనంగా సత్కరించారు. -
దేశం కోసం.. ధర్మం
[ 08-07-2024]
భారతీయ జనతా పార్టీ రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశాలకు చారిత్రక నగరి రాజమహేంద్రవరం సిద్ధమైంది. మంజీరా కన్వెన్షన్ వేదికగా సోమవారం జరగనున్న సమావేశానికి విస్తృత ఏర్పాట్లు చేశారు. -
ఇసుమంతైనా ఇబ్బంది లేకుండా ఇసుక
[ 08-07-2024]
అయిదేళ్ల వైకాపా పాలనలో సామాన్యుడికి ఇసుక అందని దుస్థితి వేధించింది. రూ.వేలకు వేలు చెల్లించాల్సిన పరిస్థితి. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. -
అలంకరణమూర్తి.. ఆధ్యాత్మిక దీప్తి
[ 08-07-2024]
ఆషాఢమాస ఉత్సవాల్లో భాగంగా తుని నియోజకవర్గంలోని లోవ తలుపులమ్మ అమ్మవారిని ఆదివారం గాజులతో సుందరంగా అలంకరించారు. వేకువ జాము నుంచే ఆలయ ప్రాంగణం భక్తజనంతో నిండిపోయింది. -
మారని రోడ్డు.. తీరని వ్యథ!
[ 08-07-2024]
రాజమహేంద్రవరం, సీతానగరం రహదారి విస్తరణ అసంపూర్ణ పనులతో రాకపోకలకు నరకయాతన తప్పడం లేదని ప్రజలు వాపోతున్నారు. -
జలవనరులకు జవసత్వాలు
[ 08-07-2024]
అయిదేళ్ల జగన్ జమానాలో జలవనరుల శాఖ పరిధిలో చెప్పుకోదగిన స్థాయిలో పనులేం జరగలేదు. ఏటిగట్లు, కాలువలు, స్లూయిస్ల నిర్వహణ లాంటి అతి ముఖ్యమైన పనులనూ చేయలేదు. -
విశాఖ ఉక్కును కాపాడండి..
[ 08-07-2024]
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్)లో విలీనం జరిగేలా కృషిచేయాలని విశాఖ ఉక్కు అధికారుల సంఘ నాయకులు భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరికి విజ్ఞప్తి చేశారు. -
ఆకర్షణీయ నగర ప్రాజెక్టులు సాకారమయ్యేనా..?
[ 08-07-2024]
జిల్లా కేంద్రం కాకినాడలో స్మార్ట్సిటీ కార్పొరేషన్ ప్రాజెక్టును కేంద్ర మరో 9 నెలలు పొడిగించింది. పెండింగ్ ప్రాజెక్టులన్నీ ఈ గడువులోగా పూర్తి చేయాలని కేంద్ర గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఇటీవల ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. -
వైకాపాను వీడిన మాజీ కార్పొరేటర్లు
[ 08-07-2024]
గతంలో వైకాపాలో చేరిన ఇద్దరు భాజపా మాజీ కార్పొరేటర్లు తాజాగా సొంతగూటికి చేరారు. కూటమి అధికారంలోకి రావడంతో వైకాపాను వీడి వారు భాజపాలో చేరారు. -
ప్రాజెక్టులతో ప్రేరణ పొందుదాం..
[ 08-07-2024]
చిన్నారుల్లో శాస్త్ర సాంకేతికత విజ్ఞానాన్ని పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కేంద్ర శాస్త్ర, సాంకేతిక మండలి, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ సంయుక్తంగా ఏటా ఇన్స్పైర్ మనక్ కార్యక్రమం నిర్వహిస్తున్నాయి. -
ఉద్యాన పంటలకు ఉపాధి ఊతం
[ 08-07-2024]
ఉపాధిహామీ పథకం ద్వారా అత్యధికంగా కేవలం కూలీలకు పనులు కల్పించడానికే ప్రాధాన్యం ఇచ్చేవారు. గత వైకాపా ప్రభుత్వం ఈ పథకాన్ని కేవలం ఇళ్ల స్థలాల్లో మెరక చేసేపనులకు, గ్రామాల్లో సచివాలయం, రైతు భరోసా, వెల్నెస్ కేంద్రాల నిర్మాణాలకే అత్యధికంగా వినియోగించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
టీమ్ఇండియాతో టీ20, వన్డే సిరీస్.. శ్రీలంక హెడ్ కోచ్గా జయసూర్య
-
మంచు విష్ణుని కలిసిన హేమ.. నిర్దోషినంటూ లేఖ
-
భారీ వర్షాల ఎఫెక్ట్.. 27 విమానాల దారి మళ్లింపు..!
-
కష్టపడిన కార్యకర్తలకు గుర్తింపు ఇస్తాం: సీఎం రేవంత్రెడ్డి
-
‘బడ్జెట్’లో సొంతిల్లు.. ప్రభుత్వ సహకారం అందేనా?
-
తెలంగాణలో వివిధ కార్పొరేషన్లకు నూతన ఛైర్మన్ల నియామకం