పేద విద్యార్థులపై కపట ప్రేమ
విద్యాహక్కు చట్టం మేరకు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో 25 శాతం మంది పేద విద్యార్థులను ఉచితంగా చదివించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా.
కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో వివక్ష
ఈనాడు, రాజమహేంద్రవరం: విద్యాహక్కు చట్టం మేరకు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో 25 శాతం మంది పేద విద్యార్థులను ఉచితంగా చదివించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా.. కొన్ని పాఠశాలల యాజమాన్యాలు వివక్ష చూపుతున్నాయని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
ఫీజులకు సంబంధించి గత ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో రూ.6,500, పట్టణాల్లో రూ.8వేలు చొప్పున నిర్ణయించింది. ఈ మొత్తాలు అమ్మఒడి నుంచి ఆయా బడులకు చెల్లించాలన్న నిబంధన పెట్టిందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. దీనిపై తల్లిదండ్రులకు సమగ్ర సమాచారం లేకపోవడం, ప్రభుత్వమే చెల్లిస్తుందనే నేపథ్యంలో సమస్య మరింత జటిలమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటుదనే అంశంపై అంతా ఎదురు చూస్తున్నారు.
- ఈ ఏడాది ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఒకటో తరగతిలో ప్రవేశాలకు పలువురు దరఖాస్తు చేసుకోగా.. జిల్లాల వారీగా లాటరీ విధానంలో రెండు జాబితాలు విడుదలయ్యాయి. మూడోది తాజాగా విడుదల చేశారు. ప్రవేశాల సమయంలో ఇబ్బందులు, తరగతి గదిలో కొన్ని చోట్ల విద్యార్థులపై వివక్ష కనిపిస్తోందన్నది తల్లిదండ్రుల ఆవేదన.
- ట్యూషన్ ఫీజు మినహా అక్కడి యూనిఫాం, పుస్తకాలకు తల్లిదండ్రులు చెల్లిస్తున్నారు. అయినా కొన్ని చోట్ల పాఠశాలల్లో విద్యార్థులకు హోమ్ వర్క్ ఇస్తున్నా, ఉచిత విద్యార్థులకు ఇవ్వడం లేదన్నది వాదన. శుక్రవారం కోనసీమ జిల్లాలోని ఓ పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశం నిర్వహించినా, 25 శాతం ఉచిత విద్యార్థుల తల్లిదండ్రులకు ఆహ్వానం పంపలేదు. దీనిపై ఎంఈవోకు పలువురు ఫిర్యాదులు చేయగా.. యాజమాన్యంతో సమావేశమై పలు సూచనలు చేశారు.
ఉమ్మడి జిల్లాలో ఇలా..
- తూర్పుగోదావరి జిల్లాలో రెండు విడతల్లో 2,265 మందిని ఎంపిక చేస్తే.. 1,509 మంది వివిధ పాఠశాలల్లో ప్రవేశాలు పొందారు. నచ్చిన పాఠశాల రాలేదని, దూరం ఇతర కారణాలతో 750 మంది ప్రవేశాలు పొందలేదు. మూడో విడతలో 121 మందిని ఎంపిక చేయగా ప్రవేశాల ప్రక్రియ సాగుతోందని జిల్లా విద్యాశాఖాధికారి వాసుదేవరావు తెలిపారు. యాజమాన్యాలతో సమావేశం నిర్వహించి సూచనలు చేశామని, ఎక్కడైనా ఇబ్బంది ఉంటే సమస్య పరిష్కరిస్తామన్నారు.
- కాకినాడ జిల్లాలో 3,700 మంది దరఖాస్తు చేయగా.. ఇప్పటికి 2,200 మంది ప్రవేశాలు పొందారు. విద్యార్థులను ఇబ్బంది పెడితే చర్యలు తప్పవని డీఈవో రమేష్ తెలిపారు.
- డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో మొదటి విడతలో 1439, రెండో విడతలో 754, మూడో విడతలో 93 మందిని ఎంపిక చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దేశం కోసం.. ధర్మం
[ 08-07-2024]
భారతీయ జనతా పార్టీ రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశాలకు చారిత్రక నగరి రాజమహేంద్రవరం సిద్ధమైంది. మంజీరా కన్వెన్షన్ వేదికగా సోమవారం జరగనున్న సమావేశానికి విస్తృత ఏర్పాట్లు చేశారు. -
ఇసుమంతైనా ఇబ్బంది లేకుండా ఇసుక
[ 08-07-2024]
అయిదేళ్ల వైకాపా పాలనలో సామాన్యుడికి ఇసుక అందని దుస్థితి వేధించింది. రూ.వేలకు వేలు చెల్లించాల్సిన పరిస్థితి. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. -
అలంకరణమూర్తి.. ఆధ్యాత్మిక దీప్తి
[ 08-07-2024]
ఆషాఢమాస ఉత్సవాల్లో భాగంగా తుని నియోజకవర్గంలోని లోవ తలుపులమ్మ అమ్మవారిని ఆదివారం గాజులతో సుందరంగా అలంకరించారు. వేకువ జాము నుంచే ఆలయ ప్రాంగణం భక్తజనంతో నిండిపోయింది. -
మారని రోడ్డు.. తీరని వ్యథ!
[ 08-07-2024]
రాజమహేంద్రవరం, సీతానగరం రహదారి విస్తరణ అసంపూర్ణ పనులతో రాకపోకలకు నరకయాతన తప్పడం లేదని ప్రజలు వాపోతున్నారు. -
జలవనరులకు జవసత్వాలు
[ 08-07-2024]
అయిదేళ్ల జగన్ జమానాలో జలవనరుల శాఖ పరిధిలో చెప్పుకోదగిన స్థాయిలో పనులేం జరగలేదు. ఏటిగట్లు, కాలువలు, స్లూయిస్ల నిర్వహణ లాంటి అతి ముఖ్యమైన పనులనూ చేయలేదు. -
విశాఖ ఉక్కును కాపాడండి..
[ 08-07-2024]
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్)లో విలీనం జరిగేలా కృషిచేయాలని విశాఖ ఉక్కు అధికారుల సంఘ నాయకులు భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరికి విజ్ఞప్తి చేశారు. -
ఆకర్షణీయ నగర ప్రాజెక్టులు సాకారమయ్యేనా..?
[ 08-07-2024]
జిల్లా కేంద్రం కాకినాడలో స్మార్ట్సిటీ కార్పొరేషన్ ప్రాజెక్టును కేంద్ర మరో 9 నెలలు పొడిగించింది. పెండింగ్ ప్రాజెక్టులన్నీ ఈ గడువులోగా పూర్తి చేయాలని కేంద్ర గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఇటీవల ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. -
వైకాపాను వీడిన మాజీ కార్పొరేటర్లు
[ 08-07-2024]
గతంలో వైకాపాలో చేరిన ఇద్దరు భాజపా మాజీ కార్పొరేటర్లు తాజాగా సొంతగూటికి చేరారు. కూటమి అధికారంలోకి రావడంతో వైకాపాను వీడి వారు భాజపాలో చేరారు. -
ప్రాజెక్టులతో ప్రేరణ పొందుదాం..
[ 08-07-2024]
చిన్నారుల్లో శాస్త్ర సాంకేతికత విజ్ఞానాన్ని పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కేంద్ర శాస్త్ర, సాంకేతిక మండలి, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ సంయుక్తంగా ఏటా ఇన్స్పైర్ మనక్ కార్యక్రమం నిర్వహిస్తున్నాయి. -
ఉద్యాన పంటలకు ఉపాధి ఊతం
[ 08-07-2024]
ఉపాధిహామీ పథకం ద్వారా అత్యధికంగా కేవలం కూలీలకు పనులు కల్పించడానికే ప్రాధాన్యం ఇచ్చేవారు. గత వైకాపా ప్రభుత్వం ఈ పథకాన్ని కేవలం ఇళ్ల స్థలాల్లో మెరక చేసేపనులకు, గ్రామాల్లో సచివాలయం, రైతు భరోసా, వెల్నెస్ కేంద్రాల నిర్మాణాలకే అత్యధికంగా వినియోగించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రెండో మ్యాచ్లోనే సెంచరీ.. అభిషేక్ శర్మ వాడిన బ్యాట్ ఎవరిదంటే?
-
బయట నుంచి చూస్తే కప్బోర్డ్.. లోపల మాత్రం ఉగ్ర స్థావరం
-
రైళ్లలో 3A, 2A గురించి తెలుసు.. మరి ఈ 3E, EA మాటేంటి?
-
బతికుండగానే కన్నకూతురిని సమాధి చేసిన తండ్రి
-
అలా చేయగల ఏకైక నటుడు కమల్హాసన్: బ్రహ్మానందం
-
6 గంటల్లో 300 మి.మి.ల వాన.. ముంబయిని వణికించిన వరుణుడు