పోలవరం ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకున్నారు
ఆంధ్రప్రదేశ్కు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును ప్రభుత్వ పెద్దలు ఏటీఎంలా వాడుకున్నారని మాజీ ఎంపీ జి.వి.హర్షకుమార్ దుయ్యబట్టారు.
మాజీ ఎంపీ హర్షకుమార్
మాట్లాడుతున్న హర్షకుమార్
దేవీచౌక్, న్యూస్టుడే: ఆంధ్రప్రదేశ్కు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును ప్రభుత్వ పెద్దలు ఏటీఎంలా వాడుకున్నారని మాజీ ఎంపీ జి.వి.హర్షకుమార్ దుయ్యబట్టారు. గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోని అన్ని ప్రాజెక్టులు రాతిపొరలపై నిర్మించారని, పోలవరం మాత్రం ఇసుక పొరలపై నిర్మాణం చేపట్టారన్నారు. 1990లో వడ్డి వీరభద్రరావు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఉద్యమం చేయగా 2004లో వైఎస్ రాజశేఖర్రెడ్డి అంకురార్పణ చేశారన్నారు. 2014లో రాష్ట్రం విడిపోవడంతో కాలువల నిర్మాణ పనులను ప్రైవేటు సంస్థలకు అప్పగించారన్నారు. 30 లక్షల క్యూసెక్కుల నిల్వ అంచనావేస్తే దాన్ని 50 లక్షల క్యూసెక్కుల సామర్థ్యంతో చేపట్టారన్నారు. ఇంత కష్టతరమైన డ్యామ్ నిర్మాణానికి డబుల్ డయాఫ్రమ్ వాల్ నిర్మించాలని నిపుణుల కమిటీ సూచించినప్పటికీ ఖర్చు మిగుల్చుకోవడం కోసం ఒక్కటే నిర్మించారని ఆరోపించారు. అదికాస్తా ఇప్పుడు కొట్టుకుపోయిందన్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే భవిష్యత్తులో పోలవరం నుంచి కాకినాడ వరకు ముంపునకు గురై 40 లక్షల మంది ప్రాణాలు గాలిలో దీపంలా మారే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కాపర్డ్యామ్, డయాఫ్రమ్ వాల్ నిర్మాణం తదితర పనులు ఎక్కువ శాతం చంద్రబాబు హయాంలోనే జరిగాయన్నారు. ఇందులో లోపాలు ఏ ముఖ్యమంత్రివని ప్రశ్నించారు. ప్రస్తుతం ప్రాజెక్టు వైఫల్యానికి నిర్మాణ సంస్థలు బాధ్యత వహిస్తాయా లేదా ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా అని నిలదీశారు. ముంపు మండలాల గురించి తెలంగాణ నాయకులు ఇప్పుడు మాట్లాడటం సబబుకాదన్నారు. అలాగనుకుంటే మళ్లీ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను చేయండి.. కేంద్రపాలిత ప్రాంతం చేయండని మనం కూడా డిమాండ్ చేయవచ్చన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దేశం కోసం.. ధర్మం
[ 08-07-2024]
భారతీయ జనతా పార్టీ రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశాలకు చారిత్రక నగరి రాజమహేంద్రవరం సిద్ధమైంది. మంజీరా కన్వెన్షన్ వేదికగా సోమవారం జరగనున్న సమావేశానికి విస్తృత ఏర్పాట్లు చేశారు. -
ఇసుమంతైనా ఇబ్బంది లేకుండా ఇసుక
[ 08-07-2024]
అయిదేళ్ల వైకాపా పాలనలో సామాన్యుడికి ఇసుక అందని దుస్థితి వేధించింది. రూ.వేలకు వేలు చెల్లించాల్సిన పరిస్థితి. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. -
అలంకరణమూర్తి.. ఆధ్యాత్మిక దీప్తి
[ 08-07-2024]
ఆషాఢమాస ఉత్సవాల్లో భాగంగా తుని నియోజకవర్గంలోని లోవ తలుపులమ్మ అమ్మవారిని ఆదివారం గాజులతో సుందరంగా అలంకరించారు. వేకువ జాము నుంచే ఆలయ ప్రాంగణం భక్తజనంతో నిండిపోయింది. -
మారని రోడ్డు.. తీరని వ్యథ!
[ 08-07-2024]
రాజమహేంద్రవరం, సీతానగరం రహదారి విస్తరణ అసంపూర్ణ పనులతో రాకపోకలకు నరకయాతన తప్పడం లేదని ప్రజలు వాపోతున్నారు. -
జలవనరులకు జవసత్వాలు
[ 08-07-2024]
అయిదేళ్ల జగన్ జమానాలో జలవనరుల శాఖ పరిధిలో చెప్పుకోదగిన స్థాయిలో పనులేం జరగలేదు. ఏటిగట్లు, కాలువలు, స్లూయిస్ల నిర్వహణ లాంటి అతి ముఖ్యమైన పనులనూ చేయలేదు. -
విశాఖ ఉక్కును కాపాడండి..
[ 08-07-2024]
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్)లో విలీనం జరిగేలా కృషిచేయాలని విశాఖ ఉక్కు అధికారుల సంఘ నాయకులు భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరికి విజ్ఞప్తి చేశారు. -
ఆకర్షణీయ నగర ప్రాజెక్టులు సాకారమయ్యేనా..?
[ 08-07-2024]
జిల్లా కేంద్రం కాకినాడలో స్మార్ట్సిటీ కార్పొరేషన్ ప్రాజెక్టును కేంద్ర మరో 9 నెలలు పొడిగించింది. పెండింగ్ ప్రాజెక్టులన్నీ ఈ గడువులోగా పూర్తి చేయాలని కేంద్ర గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఇటీవల ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. -
వైకాపాను వీడిన మాజీ కార్పొరేటర్లు
[ 08-07-2024]
గతంలో వైకాపాలో చేరిన ఇద్దరు భాజపా మాజీ కార్పొరేటర్లు తాజాగా సొంతగూటికి చేరారు. కూటమి అధికారంలోకి రావడంతో వైకాపాను వీడి వారు భాజపాలో చేరారు. -
ప్రాజెక్టులతో ప్రేరణ పొందుదాం..
[ 08-07-2024]
చిన్నారుల్లో శాస్త్ర సాంకేతికత విజ్ఞానాన్ని పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కేంద్ర శాస్త్ర, సాంకేతిక మండలి, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ సంయుక్తంగా ఏటా ఇన్స్పైర్ మనక్ కార్యక్రమం నిర్వహిస్తున్నాయి. -
ఉద్యాన పంటలకు ఉపాధి ఊతం
[ 08-07-2024]
ఉపాధిహామీ పథకం ద్వారా అత్యధికంగా కేవలం కూలీలకు పనులు కల్పించడానికే ప్రాధాన్యం ఇచ్చేవారు. గత వైకాపా ప్రభుత్వం ఈ పథకాన్ని కేవలం ఇళ్ల స్థలాల్లో మెరక చేసేపనులకు, గ్రామాల్లో సచివాలయం, రైతు భరోసా, వెల్నెస్ కేంద్రాల నిర్మాణాలకే అత్యధికంగా వినియోగించింది.