పోర్టులో అక్రమాలపై న్యాయ విచారణ చేపట్టాలి
కాకినాడ పోర్టులో గత అయిదేళ్లలో భారీ కుంభకోణం జరిగిందని.. పేదల బియ్యం విదేశాలకు ఎగుమతి చేయడమే గాక అనేక అక్రమాలకు పాల్పడ్డారని కాకినాడ నగర తెదేపా ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు) ఆరోపించారు.
గత అయిదేళ్లలో ద్వారంపూడి భారీ కుంభకోణం
కాకినాడ నగర తెదేపా ఎమ్మెల్యే కొండబాబు ధ్వజం
షాన్ మెరైన్ షిప్ తయారీ యూనిట్ వద్ద ఎమ్మెల్యే కొండబాబు, పోర్టు అధికారి ధర్మశాస్త
ఈనాడు, కాకినాడ: కాకినాడ పోర్టులో గత అయిదేళ్లలో భారీ కుంభకోణం జరిగిందని.. పేదల బియ్యం విదేశాలకు ఎగుమతి చేయడమే గాక అనేక అక్రమాలకు పాల్పడ్డారని కాకినాడ నగర తెదేపా ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు) ఆరోపించారు. న్యాయ విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. కాకినాడ యాంకరేజి పోర్టు లంగరు రేవును గురువారం పోర్టు అధికారులు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, బార్జి యాజమాన్యాలతో కలిసి సందర్శించారు. వైకాపా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి స్వార్థం వల్ల పోర్టుతో పాటు బియ్యం ఎగుమతిదారులు, వ్యాపారులు, 20వేల మంది కార్మికులు నష్టపోయారన్నారు. ద్వారంపూడి కుటుంబీకులు పేదల బియ్యం అక్రమంగా విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ ఇటీవల ప్రకటించి.. తనిఖీల్లో వేల టన్నుల బియ్యాన్ని సీజ్చేశారని గుర్తుచేశారు. రేషన్ మాఫియా అక్రమాలపై వైకాపా ప్రభుత్వం స్పందించలేదని, పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ సమీక్ష చేయలేదన్నారు.
ద్వారంపూడి బినామీ కదా.. వదిలేశారు
మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి అనుచరుడు అలీషా.. షాన్ మెరైన్ కంపెనీ కోసం పోర్టు నుంచి 3,100 చదరపు మీటర్లు అద్దెకు తీసుకుని.. మరో 6 వేల చదరపు మీటర్లు ఆక్రమించుకున్నా చర్యలు లేవని ఎమ్మెల్యే కొండబాబు మండిపడ్డారు. లోడింగ్, అన్లోడ్ జరిగే జట్టీని ఆక్రమించి కార్యకలాపాలు సాగిస్తూ నోటీసులకూ స్పందించలేదన్నారు. అలీషా ద్వారంపూడి బినామీ కావడం వల్లనే పట్టించుకోలేదన్నారు. బకాయిలు వసూలుచేసి, ఆక్రమణలు తొలగించాలని పోర్టు అధికారి ధర్మశాస్తకు సూచించారు. వైకాపా ప్రభుత్వం 337 ఎకరాల కాకినాడ పోర్టు భూములు రూ.1,500 కోట్లకు తాకట్టు పెట్టిందని, ఇందులో ద్వారంపూడి వాటా ఎంతో చెప్పాలని కొండబాబు ప్రశ్నించారు. రూ.73 కోట్ల డ్రెడ్జింగ్ పనులకు ఏపీ మారిటైం బోర్డు ఛైర్మన్ వెంకటరెడ్డి, మంత్రి అమర్నాథ్రెడ్డి రెండుసార్లు శంకుస్థాపన చేసినా పనులు సరిగ్గా జరగలేదన్నారు. డ్రెడ్జింగ్ పేరుతో రూ.కోట్లు కొట్టేశారన్నారు. సమావేశంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు బాబు, రామ్మూర్తి, సూర్యారావు, సత్తిబాబు, విజయ్, తెదేపా నాయకులు వీరు, తుమ్మల రమేష్, ఒమ్మి బాలాజీ, చిన్నా తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దేశం కోసం.. ధర్మం
[ 08-07-2024]
భారతీయ జనతా పార్టీ రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశాలకు చారిత్రక నగరి రాజమహేంద్రవరం సిద్ధమైంది. మంజీరా కన్వెన్షన్ వేదికగా సోమవారం జరగనున్న సమావేశానికి విస్తృత ఏర్పాట్లు చేశారు. -
ఇసుమంతైనా ఇబ్బంది లేకుండా ఇసుక
[ 08-07-2024]
అయిదేళ్ల వైకాపా పాలనలో సామాన్యుడికి ఇసుక అందని దుస్థితి వేధించింది. రూ.వేలకు వేలు చెల్లించాల్సిన పరిస్థితి. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. -
అలంకరణమూర్తి.. ఆధ్యాత్మిక దీప్తి
[ 08-07-2024]
ఆషాఢమాస ఉత్సవాల్లో భాగంగా తుని నియోజకవర్గంలోని లోవ తలుపులమ్మ అమ్మవారిని ఆదివారం గాజులతో సుందరంగా అలంకరించారు. వేకువ జాము నుంచే ఆలయ ప్రాంగణం భక్తజనంతో నిండిపోయింది. -
మారని రోడ్డు.. తీరని వ్యథ!
[ 08-07-2024]
రాజమహేంద్రవరం, సీతానగరం రహదారి విస్తరణ అసంపూర్ణ పనులతో రాకపోకలకు నరకయాతన తప్పడం లేదని ప్రజలు వాపోతున్నారు. -
జలవనరులకు జవసత్వాలు
[ 08-07-2024]
అయిదేళ్ల జగన్ జమానాలో జలవనరుల శాఖ పరిధిలో చెప్పుకోదగిన స్థాయిలో పనులేం జరగలేదు. ఏటిగట్లు, కాలువలు, స్లూయిస్ల నిర్వహణ లాంటి అతి ముఖ్యమైన పనులనూ చేయలేదు. -
విశాఖ ఉక్కును కాపాడండి..
[ 08-07-2024]
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్)లో విలీనం జరిగేలా కృషిచేయాలని విశాఖ ఉక్కు అధికారుల సంఘ నాయకులు భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరికి విజ్ఞప్తి చేశారు. -
ఆకర్షణీయ నగర ప్రాజెక్టులు సాకారమయ్యేనా..?
[ 08-07-2024]
జిల్లా కేంద్రం కాకినాడలో స్మార్ట్సిటీ కార్పొరేషన్ ప్రాజెక్టును కేంద్ర మరో 9 నెలలు పొడిగించింది. పెండింగ్ ప్రాజెక్టులన్నీ ఈ గడువులోగా పూర్తి చేయాలని కేంద్ర గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఇటీవల ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. -
వైకాపాను వీడిన మాజీ కార్పొరేటర్లు
[ 08-07-2024]
గతంలో వైకాపాలో చేరిన ఇద్దరు భాజపా మాజీ కార్పొరేటర్లు తాజాగా సొంతగూటికి చేరారు. కూటమి అధికారంలోకి రావడంతో వైకాపాను వీడి వారు భాజపాలో చేరారు. -
ప్రాజెక్టులతో ప్రేరణ పొందుదాం..
[ 08-07-2024]
చిన్నారుల్లో శాస్త్ర సాంకేతికత విజ్ఞానాన్ని పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కేంద్ర శాస్త్ర, సాంకేతిక మండలి, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ సంయుక్తంగా ఏటా ఇన్స్పైర్ మనక్ కార్యక్రమం నిర్వహిస్తున్నాయి. -
ఉద్యాన పంటలకు ఉపాధి ఊతం
[ 08-07-2024]
ఉపాధిహామీ పథకం ద్వారా అత్యధికంగా కేవలం కూలీలకు పనులు కల్పించడానికే ప్రాధాన్యం ఇచ్చేవారు. గత వైకాపా ప్రభుత్వం ఈ పథకాన్ని కేవలం ఇళ్ల స్థలాల్లో మెరక చేసేపనులకు, గ్రామాల్లో సచివాలయం, రైతు భరోసా, వెల్నెస్ కేంద్రాల నిర్మాణాలకే అత్యధికంగా వినియోగించింది.