వైకాపా పాలనలో.. రైతన్న నిరాశపాలు..
వ్యవసాయం-పశుపోషణ రైతులకు రెండు కళ్లు. ప్రస్తుత పరిస్థితుల్లో అన్నదాతలకు కాడే కాదు పాడి కూడా భారమైంది. ప్రకృతి ఆటుపోట్లు మరింత కుంగదీస్తున్నాయి.
అమలాపురం మండలం నల్లమిల్లిలో మూతపడిన పాలసేకరణ కేంద్రం
వ్యవసాయం-పశుపోషణ రైతులకు రెండు కళ్లు. ప్రస్తుత పరిస్థితుల్లో అన్నదాతలకు కాడే కాదు పాడి కూడా భారమైంది. ప్రకృతి ఆటుపోట్లు మరింత కుంగదీస్తున్నాయి. గ్రాసం కొరత తీవ్రంగా వేధిస్తోంది. పెట్టుబడి క్రమేణా పెరిగిపోతోంది. ఆదాయం మాత్రం ఆశించిన స్థాయిలో రావడం లేదు.
న్యూస్టుడే, అమలాపురం కలెక్టరేట్
మాటలతో మాయ..
ఊరూరా పాలధారలు పొంగేలా చేస్తాం. పాడి పరిశ్రమను లాభసాటిగా మారుస్తాం అంటూ.. అమూల్ సంస్థతో ఒప్పందాలు చేసుకుంటున్నామని ఏవేవో మాయమాటలతో అయిదేళ్లూ గడిపేశారు.
వైకాపా ప్రభుత్వం గొప్పగా చేసిన ప్రచారమిది.
చేతలు లేవాయె..
ఆచరణలోకి వచ్చేసరికి జగన్ సర్కారు చేతులెత్తేసింది. గ్రాసం నుంచి పశువైద్యం, పశువులు చనిపోయిన వారికి పరిహారం.. ఇలా ఏదీ అందించలేని దయనీయత పాడిరైతును కుంగదీసింది.
ఆశలు మొదలాయె..
ప్రస్తుతం ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. స్థిరమైన ఆదాయాన్ని తీసుకొచ్చే పశుపోషణకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొండంత అండగా నిలుస్తారని పశుపోషకుల్లో ఆశలు మొదలయ్యాయి.
జిల్లాలో పాల ఉత్పాదకత పెరిగినా మార్కెట్లో కొందరు ప్రైవేటు వ్యాపారులు పాడి రైతులను నిలువునా దోచేస్తున్నారు. తక్కువ ధర చెల్లించడంతో ఆదాయం పెద్దగా రావడం లేదు. గత వైకాపా పాలనలో పాల సేకరణకు అమూల్ సంస్థతో అవగాహన ఒప్పందం జరిగింది. మొత్తం 22 మండలాల పరిధిలో 385 పంచాయతీల్లోనూ పాల సేకరణకు సర్వే నిర్వహించారు. కానీ జిల్లావ్యాప్తంగా ఒక లీటరు పాలు కూడా సేకరించలేకపోయారు. జిల్లాలో పాలు సేకరించేందుకు అయిదు చోట్ల బల్క్మిల్క్ యూనిట్లు నెలకొల్పారు. వీటికి ఒక్కో దానికి రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఖర్చు చేశారు. చివరి నిమిషంలో అమూల్ సంస్థ అప్పటి వైకాపా ప్రభుత్వంతో పాలసేకరణ ఒప్పందం రద్దు చేసుకోవడంతో చేసేదిలేక జగన్ సర్కారు చేతులెత్తేయడంతో రూ.కోట్ల ప్రజాధనం వృథాపాలైంది.
కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని..
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టడంతో తమ జీవితాలు మెరుగుపడతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ రంగంపై ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం సమీక్ష నిర్వహించి ఐఏఎస్ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి రైతుల సమస్యలపై అధ్యయనం చేయాలని సూచించడంతో తమకు మళ్లీ మంచి రోజులు రాబోతున్నాయని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 2014-19 మధ్యకాలంలో తమకు ఏ విధమైన ప్రోత్సాహం అందించారో అదేవిధంగా ప్రస్తుతం మళ్లీ తమను ఆదుకోవాలని పాడి రైతులు కోరుతున్నారు. వ్యవసాయ రంగానికి అనుబంధంగా ఉన్న పాడి పరిశ్రమ గత అయిదేళ్ల కాలంలో పూర్తిగా నిరాదరణకు గురైంది.
భవనాల నిర్మాణంతో సరి..
గత వైకాపా ప్రభుత్వంలో గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు. వాటికి అనుసంధానంగా ప్రతిచోటా జగనన్న పాలవెల్లువతో బీఎంసీయూ భవనాలు నిర్మించాలని నిర్ణయించారు. ఉపాధి హామీ పథకం పద్దు కింద ఒక్కొక్క భవన నిర్మాణానికి సంబంధించి మొదట రూ.15.74 లక్షలకు అనుమతులు ఇవ్వగా, మళ్లీ అదనంగా మరో రూ.1.94 లక్షలు ఇవ్వాలని ఉత్తర్వులిచ్చారు. జిల్లాలో 5 చోట్ల ఈ భవనాలను నిర్మించారు.
లేనివి ఉన్నట్లుచూపి దగా..
గత జగన్ సర్కారు పశువుల కొనుగోలుకు పెద్దఎత్తున ప్రోత్సాహం అందిస్తామని ప్రకటించింది. మహిళలకు వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా ఆర్థికంగా దన్నుగా నిలుస్తామని మాటిచ్చింది. రైతుల వద్ద అప్పటికే ఉన్న పాత గేదెలు, ఆవుల ఫొటోలు తీసి, మళ్లీ కొత్తగా కొన్నట్లు ప్రచారం చేసుకున్నారు. ఇన్ని అవకతవకలు చోటుచేసుకోవడంతో ఈ పథకం నీరుగారిపోయింది. భవన నిర్మాణాలు, యంత్ర సామగ్రికి చేసిన ఖర్చు వృథాగా మారింది.
మార్గదర్శకాలు రావాల్సిఉంది
పాడి పరిశ్రమకు సంబంధించి కొత్త ప్రభుత్వం నుంచి నూతన మార్గదర్శకాలు రావాల్సిఉంది. గత ప్రభుత్వంలో ప్రారంభించిన ‘జగనన్న పాలవెల్లువ’ పథకాన్ని నిలిపివేయాలని ఆదేశాలొచ్చాయి. త్వరలోనే కొత్త పథకాలు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
వెంకట్రావు, పశుసంవర్థకశాఖ జిల్లా అధికారి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అరాచకంపై అంకుశం
[ 07-07-2024]
గత అయిదేళ్ల వైకాపా ప్రభుత్వ జమానాలో ఆ పార్టీ నేతల అక్రమాలు.. ఆక్రమణలు.. బరితెగింపు చర్యలతో జనం విసిగిపోయారు. ప్రశ్నించినా, ఎదురుతిరిగినా కేసుల చట్రంతో విలవిల్లడారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఓటర్లు తమ తీర్పుతో వైకాపా పాలనకు ముగింపు పలికారు. -
ఆనందమానందమాయే..
[ 07-07-2024]
వర్జీనియా పొగాకు రైతులు సంతోషంలో ఉన్నారు. మార్కెట్లో ధర రోజురోజుకి పెరుగుతూ రికార్డు స్థాయికి చేరుతోంది. వారం రోజుల్లో రూ.25 పెరిగి శనివారం మార్కెట్లో రికార్డు స్థాయిలో కిలో ధర రూ.375 పలికింది. -
అధ్వాన రహదారులు 43 కి.మీ.
[ 07-07-2024]
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో సంవత్సరాల తరబడి అభివృద్ధికి నోచుకోని పంచాయతీరాజ్శాఖ రహదారులను ఆ శాఖ ఇంజినీరింగ్ అధికారులు గుర్తించారు. -
తొర్రిగడ్డ ఎత్తిపోతల నుంచి నీటి విడుదల
[ 07-07-2024]
ఆయకట్టులోని ప్రతి శివారు ఎకరాకు సాగునీరు సరఫరా చేయడంతోపాటు రైతులు నీరొద్దు అనే వరకు అన్ని ఎత్తిపోతల మోటార్లు పనిచేస్తూనే ఉంటాయని రాజానగరం జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అన్నారు. -
‘మడ’కు మూడోసారైనా మోక్షం దక్కేనా!
[ 07-07-2024]
కాకినాడ నగరంలోని దుమ్ములపేట శివారులో ధ్వంసం చేసిన మడ వనాల పునరుద్ధరణకు మరోసారి యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ సమీక్షలో దీనిపై సుదీర్ఘ చర్చ నడిచింది. -
8 నుంచి ఉచిత ఇసుక పంపిణీ
[ 07-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత ఇసుక పంపిణీ పథకాన్ని సోమవారం నుంచి అమలు చేయాలని నిర్ణయించిందని కలెక్టర్ మహేష్కుమార్ తెలిపారు. -
ఆలోచించు.. చిన్నా..
[ 07-07-2024]
వాహన ప్రమాదాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. వీటికి అనేక కారణాలున్నా అందర్నీ కలవర పెడుతోంది. మైనర్ డ్రైవింగ్. పిల్లలు గొడవ పెడుతున్నారని.. ఇంట్లోని పెద్దవాళ్లు ద్విచక్రవాహనం ఇస్తున్నారు. ఏమాత్రం బాధ్యత లేకుండా వారు బండి నడుపుతున్నారు. -
సినీ ప్రొడక్షన్ విభాగ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ ఆత్మహత్య
[ 07-07-2024]
సినీ పరిశ్రమలో ఎగ్జిక్యూటివ్ మేనేజర్గా పనిచేస్తున్న ఓ మహిళ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజమహేంద్రవరం పట్టణం తాడితోట ప్రాంతానికి చెందిన దొమ్మటి రాజా స్వప్న వర్మ(30) కొంతకాలం క్రితం హైదరాబాద్ వచ్చారు. -
భరత్ చిల్లర రాజకీయాలు మానుకోవాలి
[ 07-07-2024]
నగరంలో మాజీ ఎంపీˆ భరత్ చిల్లర రాజకీయాలు మానుకోవాలని అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగ హక్కుల రక్షణే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిందన్నారు. -
మత్స్య విలాపం
[ 07-07-2024]
కె.గంగవరం మండలం కోటిపల్లికి దిగువ నుంచి యానాం ప్రాంతం వరకు గోదావరి నదిలో వేలాదిగా కనగర్త రకం చేపలు చనిపోయి శనివారం తేలాయి. -
ఎంపీ క్యాంపు కార్యాలయ నిర్మాణానికి శ్రీకారం
[ 07-07-2024]
ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యలు తెలుసుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు. -
మార్గదర్శకాల ప్రకారం ఉచిత ఇసుక
[ 07-07-2024]
ఉచిత ఇసుక పంపిణీ (ఫ్రీ సాండ్ పాలసీ) విధానంలో మార్గదర్శకాలు కచ్చితంగా పాటించాలని కలెక్టర్ పి.ప్రశాంతి స్పష్టం చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నా హత్యకు కుట్ర పన్నుతున్నారు.. కాటసానిపై తెదేపా నంద్యాల జిల్లా అధ్యక్షుడి ఫిర్యాదు
-
మూడు నిమిషాలు చర్చించి.. 4 వాయిదాల్లో ముగించేశారు..
-
పాలకోవాకు వెళ్తే ప్రాణాలు పోయాయి.. నలుగురు స్నేహితుల దుర్మరణం
-
నేడు పూరీ జగన్నాథుని విశ్వప్రసిద్ధ రథయాత్ర
-
సమస్య అని వస్తే.. రాత్రి ఫోన్ చేయమన్నారు
-
గ్రామ సచివాలయ భవనాన్ని అద్దెకిచ్చేశారు!