మాత్రల పొడితో నకిలీ ఔషధాలు
పొడిచేసిన మాత్రలతో జ్వరం, తలనొప్పికి ఉపయోగించే, ప్రజారోగ్యానికి హాని కలిగించే ఔషధాలు తయారుచేసి వివిధ రాష్ట్రాలకు సరఫరా చేస్తున్న ముఠా గుట్టును మేడ్చల్ ఎస్వోటీ, పేట్బషీరాబాద్ పోలీసులు, ఔషధ నియంత్రణాధికారులు చేధించారు.
ఇద్దరి అరెస్టు.. పరారీలో ప్రధాన సూత్రధారి
ఈనాడు- హైదరాబాద్, పేట్బషీరాబాద్, న్యూస్టుడే: పొడిచేసిన మాత్రలతో జ్వరం, తలనొప్పికి ఉపయోగించే, ప్రజారోగ్యానికి హాని కలిగించే ఔషధాలు తయారుచేసి వివిధ రాష్ట్రాలకు సరఫరా చేస్తున్న ముఠా గుట్టును మేడ్చల్ ఎస్వోటీ, పేట్బషీరాబాద్ పోలీసులు, ఔషధ నియంత్రణాధికారులు చేధించారు. హైదరాబాద్ శివారు ధూలపల్లిలో పరిశ్రమ ఏర్పాటు చేసి అంతర్జాతీయ కంపెనీల లేబుళ్లు వేసి దేశవ్యాప్తంగా ఈ మాత్రలు సరఫరా చేస్తున్నారు. గురువారం ఇద్దర్ని అదుపులోకి తీసుకుని రూ.50 లక్షల విలువ చేసే నకిలీ మాత్రలు, తయారీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. మేడ్చల్ డీసీపీ కోఠిరెడ్డి గురువారం విలేకర్లకు కేసు వివరాలు వెల్లడించారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పరకలపల్లికి చెందిన గిర్నేని గోపాల్ 2001లో హరిణి ఇండస్ట్రీస్ పేరుతో కూకట్పల్లిలో ప్లాస్టిక్ తయారీ పరిశ్రమ ఏర్పాటు చేశాడు. కొవిడ్తో నష్టాలొచ్చాయి. తన దగ్గర ఉత్పత్తులు కొనుగోలు చేసే దిల్లీకి చెందిన నిహాల్తో ఇతనికి పరిచయం ఉంది. నిహాల్ తాను చెప్పినట్లు చేస్తే త్వరగా డబ్బు వస్తుందని ఆశచూపాడు. మాత్రల తయారీకి ఉపయోగించే పదార్థం, ప్యాకింగ్, లేబుళ్లు, మాత్రలు ఉంచేందుకు అల్యూమినియం పొర, ప్రముఖ ఫార్మా కంపెనీల పేరుతో స్టిక్కర్ డబ్బాలు దిల్లీ నుంచి పంపిస్తానని.. వాటిని ప్యాకింగ్ చేయాలని చెప్పాడు. ఒక్కోమాత్ర తయారీకి 10 పైసల చొప్పున కమీషన్ ఇస్తానని ఆశచూపాడు. అంగీకరించిన గోపాల్.. తయారీ సామగ్రి కొని ధూలపల్లిలో గుట్టుగా పరిశ్రమ ఏర్పాటు చేశాడు. నిహాల్ పంపించే నకిలీ సరకుతో మాత్రలు తయారు చేయడానికి గోపాల్... ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఫార్మా కంపెనీ మాజీ ఉద్యోగి బక్క రామకృష్ణను సంప్రదించాడు. నకిలీ మాత్రలతో బాగా డబ్బు వస్తుందని ఒప్పించి వ్యాపారంలో చేర్చుకున్నాడు. నిందితుల్దిదరూ నిహాల్ పంపించే పదార్థంతో 1.03 కోట్ల ఫెనిటాయిన్, 14.28 లక్షల వాసోగ్రెయిన్ మాత్రలు తయారుచేసి వివిధ కంపెనీల లేబుళ్లు వేశారు. మేడ్చల్ ఎస్వోటీ ఇన్స్పెక్టర్ శ్యాంసుందర్రెడ్డి బృందం గురువారం తనిఖీ చేయగా బండారం బయటపడింది. మాత్రల తయారీకి ఉపయోగించిన పొడిని సేకరించి పరీక్షలకు పంపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దేశం కోసం.. ధర్మం
[ 08-07-2024]
భారతీయ జనతా పార్టీ రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశాలకు చారిత్రక నగరి రాజమహేంద్రవరం సిద్ధమైంది. మంజీరా కన్వెన్షన్ వేదికగా సోమవారం జరగనున్న సమావేశానికి విస్తృత ఏర్పాట్లు చేశారు. -
ఇసుమంతైనా ఇబ్బంది లేకుండా ఇసుక
[ 08-07-2024]
అయిదేళ్ల వైకాపా పాలనలో సామాన్యుడికి ఇసుక అందని దుస్థితి వేధించింది. రూ.వేలకు వేలు చెల్లించాల్సిన పరిస్థితి. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. -
అలంకరణమూర్తి.. ఆధ్యాత్మిక దీప్తి
[ 08-07-2024]
ఆషాఢమాస ఉత్సవాల్లో భాగంగా తుని నియోజకవర్గంలోని లోవ తలుపులమ్మ అమ్మవారిని ఆదివారం గాజులతో సుందరంగా అలంకరించారు. వేకువ జాము నుంచే ఆలయ ప్రాంగణం భక్తజనంతో నిండిపోయింది. -
మారని రోడ్డు.. తీరని వ్యథ!
[ 08-07-2024]
రాజమహేంద్రవరం, సీతానగరం రహదారి విస్తరణ అసంపూర్ణ పనులతో రాకపోకలకు నరకయాతన తప్పడం లేదని ప్రజలు వాపోతున్నారు. -
జలవనరులకు జవసత్వాలు
[ 08-07-2024]
అయిదేళ్ల జగన్ జమానాలో జలవనరుల శాఖ పరిధిలో చెప్పుకోదగిన స్థాయిలో పనులేం జరగలేదు. ఏటిగట్లు, కాలువలు, స్లూయిస్ల నిర్వహణ లాంటి అతి ముఖ్యమైన పనులనూ చేయలేదు. -
విశాఖ ఉక్కును కాపాడండి..
[ 08-07-2024]
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్)లో విలీనం జరిగేలా కృషిచేయాలని విశాఖ ఉక్కు అధికారుల సంఘ నాయకులు భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరికి విజ్ఞప్తి చేశారు. -
ఆకర్షణీయ నగర ప్రాజెక్టులు సాకారమయ్యేనా..?
[ 08-07-2024]
జిల్లా కేంద్రం కాకినాడలో స్మార్ట్సిటీ కార్పొరేషన్ ప్రాజెక్టును కేంద్ర మరో 9 నెలలు పొడిగించింది. పెండింగ్ ప్రాజెక్టులన్నీ ఈ గడువులోగా పూర్తి చేయాలని కేంద్ర గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఇటీవల ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. -
వైకాపాను వీడిన మాజీ కార్పొరేటర్లు
[ 08-07-2024]
గతంలో వైకాపాలో చేరిన ఇద్దరు భాజపా మాజీ కార్పొరేటర్లు తాజాగా సొంతగూటికి చేరారు. కూటమి అధికారంలోకి రావడంతో వైకాపాను వీడి వారు భాజపాలో చేరారు. -
ప్రాజెక్టులతో ప్రేరణ పొందుదాం..
[ 08-07-2024]
చిన్నారుల్లో శాస్త్ర సాంకేతికత విజ్ఞానాన్ని పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కేంద్ర శాస్త్ర, సాంకేతిక మండలి, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ సంయుక్తంగా ఏటా ఇన్స్పైర్ మనక్ కార్యక్రమం నిర్వహిస్తున్నాయి. -
ఉద్యాన పంటలకు ఉపాధి ఊతం
[ 08-07-2024]
ఉపాధిహామీ పథకం ద్వారా అత్యధికంగా కేవలం కూలీలకు పనులు కల్పించడానికే ప్రాధాన్యం ఇచ్చేవారు. గత వైకాపా ప్రభుత్వం ఈ పథకాన్ని కేవలం ఇళ్ల స్థలాల్లో మెరక చేసేపనులకు, గ్రామాల్లో సచివాలయం, రైతు భరోసా, వెల్నెస్ కేంద్రాల నిర్మాణాలకే అత్యధికంగా వినియోగించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించిన జగన్, షర్మిల
-
బాక్సాఫీస్కు రాబోతున్న మరో పెద్ద చిత్రం.. ఓటీటీలో సందడి వీటితో
-
నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 24,294
-
పొలాల్లో, బీడు భూముల్లో సౌర విద్యుత్ ప్లాంట్లు
-
బాలీవుడ్ నటితో పెళ్లి.. స్పందించిన కుల్దీప్ యాదవ్
-
కమల్ హాసన్ వాయిస్ను ఇమిటేట్ చేసిన బ్రహ్మానందం.. వీడియో వైరల్