మోరంపూడి పైవంతెన పనుల వేగవంతానికి ఆదేశాలు
మోరంపూడి పైవంతెన పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశించారు.
ఎన్హెచ్ఏఐ పీడీ నుంచి వివరాలు తెలుసుకుంటున్న కలెక్టర్ ప్రశాంతి
రాజమహేంద్రవరం కలెక్టరేట్, న్యూస్టుడే: మోరంపూడి పైవంతెన పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశించారు. బుధవారం సాయంత్రం తన ఛాంబర్లో ఎన్హెచ్ఏఐ, ఆర్అండ్బీ అధికారులతో పెండింగ్, రహదారుల అభివృద్ధి పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మోరంపూడి పైవంతెన నిర్మాణం పూర్తిచేసి ఆగస్టు చివరి నాటికి ట్రాఫిక్కు అనుమతించేలా సిద్ధం చేయాలన్నారు. రాజానగరంలో ఏడీబీ రోడ్డు పనుల పురోగతిపై సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. భూసేకరణ విషయంలో పెండింగ్ లేకుండా చూడాలని ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా రాజమహేంద్రవరం మీదుగా వెళ్లే జాతీయ రహదారులకు(ఎన్హెచ్-16, ఎన్హెచ్-216) ఇరువైపులా పచ్చదనం అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, జిల్లా సరిహద్దులు ప్రజలకు తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు.
రూ.486 కోట్లతో మరో నాలుగు పైవంతెనలు
జిల్లాలో రూ.486 కోట్లతో మరో నాలుగు పైవంతెన నిర్మాణాలకు ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించినట్లు ఎన్హెచ్ఏఐ ప్రాజెక్టు డైరెక్టర్ డి.సురేంద్రనాధ్ తెలిపారు. జాతీయ రహదారిలోని లాలాచెరువు, బొమ్మూరు, వేమగిరి కూడళ్లలో పైవంతెనలు, సర్వీసు రోడ్లు, విద్యుత్తు దీపాల ఏర్పాటుకు సంబంధించి రూ.345 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. దీంతోపాటు గామన్ బ్రిడ్జి జంక్షన్ నుంచి దివాన్చెరువు వరకు 2.4 కిలోమీటర్ల మేర పైవంతెన నిర్మాణానికి మరో రూ.141 కోట్లతో ప్రతిపాదనలు పంపగా దీనిని ప్రభుత్వం మంజూరు చేసిందని, త్వరలో టెండర్లు ప్రక్రియ కూడా ప్రారంభించనున్నట్లు కలెక్టర్కు ఆయన వివరించారు. ఈ సమావేశంలో సబ్కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, ఆర్అండ్బీ అధికారి ఎస్.బి.వి.రెడ్డి, ఆర్డీబీ ఈఈ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మావయ్య మిగిల్చిన ‘విద్యా అవస్థ’!
[ 06-07-2024]
పాఠశాలల రూపురేఖలే మార్చేస్తామంది.. కార్పొరేట్ను తలదన్నేలా వ్యవస్థ ఉంటుందని గొప్పలు చెప్పింది.. తీరా భావితరానికి అవస్థలు మిగిల్చింది.. వైకాపా ప్రభుత్వం నాడు-నేడు పేరిట చేపట్టిన కార్యక్రమం విద్యాలయాల దశను మార్చలేదు సరికదా సరికొత్త తలనొప్పులు తెచ్చింది. -
సత్యదేవుని చెంత సరిదిద్దడం సవాలే
[ 06-07-2024]
ఎంతో ప్రముఖమైన..నిత్యం వేలాదిమంది భక్తులు దర్శించుకునే సత్యదేవుని ఆలయానికి సంబంధించి పనులంటే ఎంత ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలి.. ఎంత ప్రతిష్టాత్మకంగా చేపట్టాలి.. -
రెండో ప్లాట్ఫాం పైకి ఎక్స్ప్రెస్ రైళ్లు
[ 06-07-2024]
రాజమహేంద్రవరం ప్రధాన రైల్వేస్టేషన్లో రెండో నంబరు ప్లాట్ఫాంపై ఎక్స్ప్రెస్ రైళ్ల హాల్ట్ను ఎట్టకేలకు పునరుద్ధరించారు. -
10 రోజుల ముందుగానే సాగునీరు
[ 06-07-2024]
వైకాపా పాలనలో జలవనరులశాఖ ఆధ్వర్యంలో ఉండే ఎత్తిపోతల పథకాలను నిర్వీర్యంగా మార్చడమే కాకుండా నిర్వహణలో గుత్తేదారులకు రూ.కోట్లు బకాయిలు పెట్టింది. -
వ్యవసాయ, అనుబంధ రంగాలకు ప్రాధాన్యం
[ 06-07-2024]
వ్యవసాయం, అనుబంధ రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తూ మార్గదర్శకాలు జారీ చేసినట్లు కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. -
మహిళల అదృశ్య కేసులపై ప్రత్యేక దృష్టి
[ 06-07-2024]
మహిళల అదృశ్య కేసులపై ప్రత్యేక దృష్టిసారించాలని ఎస్పీ పి.జగదీష్ ఆదేశించారు. -
సముద్రపు ఇసుకనూ వదల్లేదు..
[ 06-07-2024]
కోనసీమలోని తీర గ్రామాల్లో సముద్రపు ఇసుకను ఇష్టారీతిన తవ్వేయడంతో మేటలు కరిగిపోతున్నాయి. -
వాహనాల ప్లేట్లు ఫిరాయింపు
[ 06-07-2024]
నంబరు ప్లేట్లు లేకుండా కొందరు ద్విచక్ర వాహనదారులు రోడ్లపై ఇష్టానుసారంగా వాటిని నడుపుతున్నారు. -
ఇక చాలు.. ఖాళీ చేయండి
[ 06-07-2024]
నగరంలోని సంజయ్నగర్ పిడుగులమ్మ గుడి వద్ద ఆక్రమణలో ఉన్న మున్సిపల్ దుకాణ సముదాయాన్ని అధికారులు శుక్రవారం ఖాళీ చేయించారు. -
ఇసుక దుర్వినియోగం కాకుండా చర్యలు
[ 06-07-2024]
జిల్లాలోని ఏడు ఇసుక డిపోల్లో ఉన్న ఇసుక నిల్వలు దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ మహేష్కుమార్ ఆదేశించారు. -
అభ్యర్థుల ఎన్నికల వ్యయ వివరాలు విడుదల
[ 06-07-2024]
పుదుచ్చేరి పార్లమెంటరీ నియోజకవర్గ ఎన్నికల్లో 26 మంది అభ్యర్థులు చేసిన ఖర్చు వివరాలను ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ కుళోత్తుంగన్ శుక్రవారం విడుదల చేశారు. -
చింతలపూడి.. రైతుల చింత తీరుస్తుందా?
[ 06-07-2024]
ఉభయ గోదావరి జిల్లాలో రూ.4,900 కోట్లతో 4.80 లక్షల ఎకరాలకు సాగునీరందించాలన్న మహోన్నత లక్ష్యంతో 2009లో శ్రీకారం చుట్టిన చింతలపూడి ఎత్తిపోతల పథకంపై అయిదేళ్లలో నిర్లక్ష్యపు నీడ కమ్ముకొంది.