వైద్యవిద్యను వదిలేశారు..
పతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఓ వైద్యకళాశాల కేటాయించి 150 ఎంబీబీఎస్ సీట్లను అందుబాటులోకి తెచ్చామని.. బోధనాసుపత్రులుగా మార్చి రోగులకు ఎంతో మేలు చేశామని గత వైకాపా ప్రభుత్వం గొప్పలు చెబుతూ ఏర్పాటు చేసిన వైద్యకళాశాలలు ఆరంభశూరత్వంతో కొట్టుమిట్టాడుతున్నాయి
రాజమహేంద్రవరం బోధనాసుపత్రిలో ఇదీ పరిస్థితి
రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్యకళాశాల
న్యూస్టుడే, రాజమహేంద్రవరం వైద్యం: పతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఓ వైద్యకళాశాల కేటాయించి 150 ఎంబీబీఎస్ సీట్లను అందుబాటులోకి తెచ్చామని.. బోధనాసుపత్రులుగా మార్చి రోగులకు ఎంతో మేలు చేశామని గత వైకాపా ప్రభుత్వం గొప్పలు చెబుతూ ఏర్పాటు చేసిన వైద్యకళాశాలలు ఆరంభశూరత్వంతో కొట్టుమిట్టాడుతున్నాయి. వైద్యకళాశాల, జీజీహెచ్లో బోధన, బోధనేతర, వైద్యులు, సిబ్బంది, మౌలిక వసతుల కొరతతో పరిస్థితులు దయనీయంగా ఉన్నాయి.
రాజమహేంద్రవరం వైద్యశాలను గతేడాది బోధనాసుపత్రిగా మార్చి వైద్యకళాశాలను కేటాయించారు. గత విద్యాసంవత్సరం నుంచి 150 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. ఇక్కడివరకు బాగానే ఉన్నా ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లతో పాటు సీనియర్ రెసిడెంట్(ఎస్ఆర్)ల కొరత వేధిస్తోంది. వీరితో పాటు ఎంతో కీలకమైన స్టాఫ్నర్సుల పోస్టులు ఖాళీలున్నాయి. గత ప్రభుత్వం ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్చడంతో పాటు నూతనంగా నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాలకూ వైఎస్ఆర్ ప్రభుత్వ వైద్యకళాశాలగా పేరు పెట్టడం గమనార్హం.
కీలక విభాగాలు
రాజమహేంద్రవరం బోధనాసుపత్రి, కళాశాల పరిధిలో మొత్తం 116 మంది వివిధ క్యాడర్ల ప్రొఫెసర్లు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 83 మంది మాత్రమే సేవలందిస్తున్నారు. 33 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో మొదటి ఏడాది విద్యార్థులకు బోధించే అనాటమీ విభాగానికి ప్రొఫెసర్ లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో కీలకమైన ప్రొఫెసర్ల విభాగంలో 20 మంది ఉండాల్సి ఉండగా కేవలం తొమ్మిది మంది మాత్రమే ఉన్నారు. ఫిజియాలజీ విభాగానికి సైతం సరైన బోధన సిబ్బంది ఉండటం లేదని వాపోతున్నారు. రేడియాలజీ, మైక్రోబయాలజీ, పెథాలజీ విభాగాల్లోనూ కొరత వేధిస్తోంది. రేడియాలజీ విభాగంలో వైద్యులు లేకపోవడంతో ఆల్ట్రాసౌండ్, సీటీ స్కానింగ్ కోసం రోగులకు ఇక్కట్లు తప్పడం లేదు. వైద్యసేవలకు ఎంతో కీలకమైన స్టాఫ్నర్సుల విభాగంలో 200 మంది ఉండాల్సి ఉండగా 117 మంది మాత్రమే సేవలందిస్తున్నారు. ఆసుపత్రిలో వైద్యసేవలు, ఆయా విభాగాల్లో కీలకంగా ఉండే సీనియర్ రెసిడెంట్(ఎస్ఆర్) వైద్యుల ఖాళీలు అధికంగా ఉన్నాయి. మొత్తం 84 మంది ఉండాల్సి ఉండగా 32 మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు.
విద్యార్థులకూ ఇబ్బందే..
వైద్యకళాశాలలో గతేడాది నుంచి మొదటి సంవత్సరం విద్యార్థులకు తరగతులు ప్రారంభమయ్యాయి. బోధనకు మౌలిక వసతులు, ల్యాబ్లకు సౌకర్యాలు సక్రమంగా కల్పించకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మొదటి ఏడాది అనాటమీ విభాగంలో డిసెక్షన్కు మృతదేహాలు అందుబాటులో ఉండటం లేదని వాపోతున్నారు. గుండె, మెదడు, ఇతర శరీర అవయవాలన్నీ ఫార్మాలిన్ ద్రావణంలో ఉంచి బోధించే స్పెసిమెన్లు అందుబాటులో లేవు. ఎముకల విభాగానికి సంబంధించి అస్తి పంజరాలను చూపించి బోధించాల్సి ఉంది. అవికూడా అందుబాటులో లేకపోవడంతో బోధనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనిపై ఉన్నతాధికారులు త్వరితగతిన స్పందించాల్సి ఉంది. మొదటి ఏడాదికి సంబంధించి మూడు ప్రధాన విభాగాలైన ఎనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీకి సంబంధించి ఒక్కోచోట ఒక ప్రొఫెసర్, ఒక అసోసియేట్, ముగ్గురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ట్యూటర్లు ఉండాల్సి ఉంది. అలాంటి పరిస్థితి లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మావయ్య మిగిల్చిన ‘విద్యా అవస్థ’!
[ 06-07-2024]
పాఠశాలల రూపురేఖలే మార్చేస్తామంది.. కార్పొరేట్ను తలదన్నేలా వ్యవస్థ ఉంటుందని గొప్పలు చెప్పింది.. తీరా భావితరానికి అవస్థలు మిగిల్చింది.. వైకాపా ప్రభుత్వం నాడు-నేడు పేరిట చేపట్టిన కార్యక్రమం విద్యాలయాల దశను మార్చలేదు సరికదా సరికొత్త తలనొప్పులు తెచ్చింది. -
సత్యదేవుని చెంత సరిదిద్దడం సవాలే
[ 06-07-2024]
ఎంతో ప్రముఖమైన..నిత్యం వేలాదిమంది భక్తులు దర్శించుకునే సత్యదేవుని ఆలయానికి సంబంధించి పనులంటే ఎంత ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలి.. ఎంత ప్రతిష్టాత్మకంగా చేపట్టాలి.. -
రెండో ప్లాట్ఫాం పైకి ఎక్స్ప్రెస్ రైళ్లు
[ 06-07-2024]
రాజమహేంద్రవరం ప్రధాన రైల్వేస్టేషన్లో రెండో నంబరు ప్లాట్ఫాంపై ఎక్స్ప్రెస్ రైళ్ల హాల్ట్ను ఎట్టకేలకు పునరుద్ధరించారు. -
10 రోజుల ముందుగానే సాగునీరు
[ 06-07-2024]
వైకాపా పాలనలో జలవనరులశాఖ ఆధ్వర్యంలో ఉండే ఎత్తిపోతల పథకాలను నిర్వీర్యంగా మార్చడమే కాకుండా నిర్వహణలో గుత్తేదారులకు రూ.కోట్లు బకాయిలు పెట్టింది. -
వ్యవసాయ, అనుబంధ రంగాలకు ప్రాధాన్యం
[ 06-07-2024]
వ్యవసాయం, అనుబంధ రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తూ మార్గదర్శకాలు జారీ చేసినట్లు కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. -
మహిళల అదృశ్య కేసులపై ప్రత్యేక దృష్టి
[ 06-07-2024]
మహిళల అదృశ్య కేసులపై ప్రత్యేక దృష్టిసారించాలని ఎస్పీ పి.జగదీష్ ఆదేశించారు. -
సముద్రపు ఇసుకనూ వదల్లేదు..
[ 06-07-2024]
కోనసీమలోని తీర గ్రామాల్లో సముద్రపు ఇసుకను ఇష్టారీతిన తవ్వేయడంతో మేటలు కరిగిపోతున్నాయి. -
వాహనాల ప్లేట్లు ఫిరాయింపు
[ 06-07-2024]
నంబరు ప్లేట్లు లేకుండా కొందరు ద్విచక్ర వాహనదారులు రోడ్లపై ఇష్టానుసారంగా వాటిని నడుపుతున్నారు. -
ఇక చాలు.. ఖాళీ చేయండి
[ 06-07-2024]
నగరంలోని సంజయ్నగర్ పిడుగులమ్మ గుడి వద్ద ఆక్రమణలో ఉన్న మున్సిపల్ దుకాణ సముదాయాన్ని అధికారులు శుక్రవారం ఖాళీ చేయించారు. -
ఇసుక దుర్వినియోగం కాకుండా చర్యలు
[ 06-07-2024]
జిల్లాలోని ఏడు ఇసుక డిపోల్లో ఉన్న ఇసుక నిల్వలు దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ మహేష్కుమార్ ఆదేశించారు. -
అభ్యర్థుల ఎన్నికల వ్యయ వివరాలు విడుదల
[ 06-07-2024]
పుదుచ్చేరి పార్లమెంటరీ నియోజకవర్గ ఎన్నికల్లో 26 మంది అభ్యర్థులు చేసిన ఖర్చు వివరాలను ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ కుళోత్తుంగన్ శుక్రవారం విడుదల చేశారు. -
చింతలపూడి.. రైతుల చింత తీరుస్తుందా?
[ 06-07-2024]
ఉభయ గోదావరి జిల్లాలో రూ.4,900 కోట్లతో 4.80 లక్షల ఎకరాలకు సాగునీరందించాలన్న మహోన్నత లక్ష్యంతో 2009లో శ్రీకారం చుట్టిన చింతలపూడి ఎత్తిపోతల పథకంపై అయిదేళ్లలో నిర్లక్ష్యపు నీడ కమ్ముకొంది.