మెట్టలో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు
ఉమ్మడి జిల్లాలోని మెట్ట ప్రాంతంలో రెండు లక్షల ఎకరాలకు పైబడి సాగునీరుతో పాటు ఉత్తరాంధ్రకు తాగునీరు అందించే లక్ష్యంతో గోదావరి ఎడమగట్టున ఉన్న ఎత్తిపోతల పథకాలను ప్రారంభించామని జలవనరులశాఖమంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.
మంత్రి నిమ్మల రామానాయుడు
ఎత్తిపోతల స్విచ్ఛాన్ చేస్తున్న మంత్రి నిమ్మల, ఎమ్మెల్యేలు
సీతానగరం: ఉమ్మడి జిల్లాలోని మెట్ట ప్రాంతంలో రెండు లక్షల ఎకరాలకు పైబడి సాగునీరుతో పాటు ఉత్తరాంధ్రకు తాగునీరు అందించే లక్ష్యంతో గోదావరి ఎడమగట్టున ఉన్న ఎత్తిపోతల పథకాలను ప్రారంభించామని జలవనరులశాఖమంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. వైకాపా పాలనలో అస్తవ్యస్తంగా వదిలేసిన ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన మరమ్మతులు పూర్తిచేసి గోదావరి మిగులు జలాలు వృథా కాకుండా సద్వినియోగం చేస్తున్నామన్నారు. సీతానగరం మండలంలోని పురుషోత్తపట్నం, పుష్కర ఎత్తిపోతల పథకాలను రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణతో కలిసి బుధవారం ఆయన ప్రారంభించారు. గతంలో తెదేపా ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు 2020లో పూర్తిచేయాలనే లక్ష్యంతో దాదాపుగా 72 శాతం పనులు పూర్తిచేసిందన్నారు. గోదావరి వరదల వల్ల ఏటా 3,000 టీఎంసీల నీరు వృథాగా సముద్రంలో కలవకుండా ఉండేలా ఎడమగట్టున పోలవరం కాలువలను అనుసంధానం చేస్తూ ‘పురుషోత్తపట్నం’ ఎత్తిపోతల పథకం నిర్మాణం చేశామన్నారు. దీని నుంచి 30 టీఎంసీల నీటిని ఏలేరు జలాశయంలో నింపడంతోపాటు పిఠాపురం బ్రాంచి కెనాల్ పరిధిలో 67,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేలా ఈ ప్రాజెక్టు నిర్మాణం చేశామన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే జాతీయ హరిత ట్రైబ్యునల్ నుంచి వచ్చిన న్యాయపరమైన అంశాలను పట్టించుకోకుండా పథకాన్ని నిరుపయోగంగా వదిలేసిందన్నారు. జలవనరులశాఖ ఎస్ఈ ఏసుబాబు మాట్లాడుతూ తొలిదశలో పురుషోత్తపట్నం ఎత్తిపోతల నుంచి రెండు పంపుల ద్వారా 700 క్యూసెక్కులు, పుష్కర నుంచి రెండు పంపుల ద్వారా 350 క్యూసెక్కుల నీటిని విడుదల చేశామన్నారు. గోదావరి నీటిమట్టం 14.9 మీటర్లకు పెరిగిందని, అన్ని మోటార్లు పనిచేసేందుకు నీటి ప్రవాహం వేగవంతంగా ఉందన్నారు. మెట్ట ప్రాంతంలోని తుని వరకు సాగునీటి అవసరాలను బట్టి మోటార్లు పెంచుతామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, వరుపుల సత్యప్రభ, కలెక్టర్ ప్రశాంతి, ఆర్డీవో చైత్రవర్షిణి, డీఈ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మావయ్య మిగిల్చిన ‘విద్యా అవస్థ’!
[ 06-07-2024]
పాఠశాలల రూపురేఖలే మార్చేస్తామంది.. కార్పొరేట్ను తలదన్నేలా వ్యవస్థ ఉంటుందని గొప్పలు చెప్పింది.. తీరా భావితరానికి అవస్థలు మిగిల్చింది.. వైకాపా ప్రభుత్వం నాడు-నేడు పేరిట చేపట్టిన కార్యక్రమం విద్యాలయాల దశను మార్చలేదు సరికదా సరికొత్త తలనొప్పులు తెచ్చింది. -
సత్యదేవుని చెంత సరిదిద్దడం సవాలే
[ 06-07-2024]
ఎంతో ప్రముఖమైన..నిత్యం వేలాదిమంది భక్తులు దర్శించుకునే సత్యదేవుని ఆలయానికి సంబంధించి పనులంటే ఎంత ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలి.. ఎంత ప్రతిష్టాత్మకంగా చేపట్టాలి.. -
రెండో ప్లాట్ఫాం పైకి ఎక్స్ప్రెస్ రైళ్లు
[ 06-07-2024]
రాజమహేంద్రవరం ప్రధాన రైల్వేస్టేషన్లో రెండో నంబరు ప్లాట్ఫాంపై ఎక్స్ప్రెస్ రైళ్ల హాల్ట్ను ఎట్టకేలకు పునరుద్ధరించారు. -
10 రోజుల ముందుగానే సాగునీరు
[ 06-07-2024]
వైకాపా పాలనలో జలవనరులశాఖ ఆధ్వర్యంలో ఉండే ఎత్తిపోతల పథకాలను నిర్వీర్యంగా మార్చడమే కాకుండా నిర్వహణలో గుత్తేదారులకు రూ.కోట్లు బకాయిలు పెట్టింది. -
వ్యవసాయ, అనుబంధ రంగాలకు ప్రాధాన్యం
[ 06-07-2024]
వ్యవసాయం, అనుబంధ రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తూ మార్గదర్శకాలు జారీ చేసినట్లు కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. -
మహిళల అదృశ్య కేసులపై ప్రత్యేక దృష్టి
[ 06-07-2024]
మహిళల అదృశ్య కేసులపై ప్రత్యేక దృష్టిసారించాలని ఎస్పీ పి.జగదీష్ ఆదేశించారు. -
సముద్రపు ఇసుకనూ వదల్లేదు..
[ 06-07-2024]
కోనసీమలోని తీర గ్రామాల్లో సముద్రపు ఇసుకను ఇష్టారీతిన తవ్వేయడంతో మేటలు కరిగిపోతున్నాయి. -
వాహనాల ప్లేట్లు ఫిరాయింపు
[ 06-07-2024]
నంబరు ప్లేట్లు లేకుండా కొందరు ద్విచక్ర వాహనదారులు రోడ్లపై ఇష్టానుసారంగా వాటిని నడుపుతున్నారు. -
ఇక చాలు.. ఖాళీ చేయండి
[ 06-07-2024]
నగరంలోని సంజయ్నగర్ పిడుగులమ్మ గుడి వద్ద ఆక్రమణలో ఉన్న మున్సిపల్ దుకాణ సముదాయాన్ని అధికారులు శుక్రవారం ఖాళీ చేయించారు. -
ఇసుక దుర్వినియోగం కాకుండా చర్యలు
[ 06-07-2024]
జిల్లాలోని ఏడు ఇసుక డిపోల్లో ఉన్న ఇసుక నిల్వలు దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ మహేష్కుమార్ ఆదేశించారు. -
అభ్యర్థుల ఎన్నికల వ్యయ వివరాలు విడుదల
[ 06-07-2024]
పుదుచ్చేరి పార్లమెంటరీ నియోజకవర్గ ఎన్నికల్లో 26 మంది అభ్యర్థులు చేసిన ఖర్చు వివరాలను ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ కుళోత్తుంగన్ శుక్రవారం విడుదల చేశారు. -
చింతలపూడి.. రైతుల చింత తీరుస్తుందా?
[ 06-07-2024]
ఉభయ గోదావరి జిల్లాలో రూ.4,900 కోట్లతో 4.80 లక్షల ఎకరాలకు సాగునీరందించాలన్న మహోన్నత లక్ష్యంతో 2009లో శ్రీకారం చుట్టిన చింతలపూడి ఎత్తిపోతల పథకంపై అయిదేళ్లలో నిర్లక్ష్యపు నీడ కమ్ముకొంది.