వైకాపా నాయకుడిపై బిగుస్తున్న ఉచ్చు..?
అక్రమ కట్టడం కూల్చివేత సమయంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది విధులకు ఆటంకం కలిగించడం, తెదేపా నాయకులపై బెదిరింపులకు పాల్పడిన వ్యవహారంలో కాకినాడలోని మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ప్రధాన అనుచరుడు బళ్ల సూరిబాబుపై ఉచ్చు బిగిస్తోంది.
విధులకు ఆటంకంపై ఫిర్యాదుకు సిద్ధమైన అధికారులు
తెదేపా నాయకులను బెదిరించడంపైనా సీరియస్
అక్రమ కట్టడం కూల్చివేత పనులు
కాకినాడ కలెక్టరేట్, న్యూస్టుడే: అక్రమ కట్టడం కూల్చివేత సమయంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది విధులకు ఆటంకం కలిగించడం, తెదేపా నాయకులపై బెదిరింపులకు పాల్పడిన వ్యవహారంలో కాకినాడలోని మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ప్రధాన అనుచరుడు బళ్ల సూరిబాబుపై ఉచ్చు బిగిస్తోంది. స్థానిక రాజ్యలక్ష్మినగర్లో అక్రమంగా రెండో అంతస్తు నిర్మించడంతో మంగళవారం దాన్ని తొలగించడానికి వెళ్లిన మున్సిపల్ సిబ్బందిపై దుర్భాషలు, దాడికి పాల్పడిన అంశాన్ని అధికార యంత్రాంగం సీరియస్గా తీసుకుంది. ఈ ఘటనలో మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డి కూడా పోలీసులను నెట్టుకుంటూ.. దురుసుగా వ్యవహరించిన అంశాన్ని అధికారులు సీరియస్గా పరిగణిస్తున్నారు. వీటికి సంబంధించి కాకినాడ రెండో పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదుకు సిద్ధమవుతున్నారు. గురువారం ఫిర్యాదు ఇచ్చిన తర్వాత కేసు నమోదు చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అక్రమ కట్టడం కూల్చివేత సమయంలో విధులకు ఆటంకం కలిగించిన వారందరిపై కేసు పెట్టాలని ఆదేశించినట్లు మున్సిపల్ కమిషనర్ జె.వెంకట్రావు ‘న్యూస్టుడే’కు చెప్పారు. విధులను అడ్డుకుంటే ఎంతటివారినైనా వదిలిపెట్టమని ఆయన స్పష్టం చేశారు. అక్రమ కట్టడం కూల్చివేత సమయంలో అంతుచూస్తానని సూరిబాబు బెదిరించడంపై మాజీ కార్పొరేటర్, తెదేపా ఎస్సీ సెల్ నగర అధ్యక్షుడు సీకోటి అప్పలకొండ బుధవారం కాకినాడ రెండో పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఆగడాలు ఒక్కొక్కటిగా బయటకు..
గత అయిదేళ్ల వైకాపా పాలనలో అప్పటి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అండ చూసుకుని రెచ్చిపోయిన ఆయన ప్రధాన అనుచరుడు బళ్ల సూరిబాబు బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు స్థలాల ఆక్రమణలు, దాడులు, భయపెట్టి ఆస్తులు రాయించుకోవడం, కాకినాడ గ్రామీణంలో ఉద్యోగులకు చెందిన భారీ స్థలాన్ని ఆక్రమించడం, ప్రశ్నించిన వారిపై ఎదురుతిరగడం వంటి అనేక అక్రమాలకు పాల్పడినట్లు బాధితులు బహిరంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆగడాలు, అకృత్యాలతో తీవ్రంగా నష్టపోయిన బాధితులు కేసులు పెట్టడానికి సిద్ధమవుతున్నారు. గతంలో ఈ నాయకుడి అకృత్యాలకు విసిగిపోయిన జిల్లాస్థాయి పోలీసు అధికారి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. కాకినాడ రెండో పట్టణ పోలీసు అధికారి ఒకరిపై తిరగబడటంతో చర్యలకు ఉపక్రమించాలని పోలీసులు భావించినా, మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డి అడ్డుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
చివరి దశకు తొలగింపు పనులు
రాజ్యలక్ష్మినగర్లోని అక్రమ కట్టడం కూల్చివేత పనులు బుధవారం కొనసాగాయి. భారీ కట్టడం కావడంతో సమయం పడుతుందన్నారు. చాలా వరకు అక్రమ కట్టడాన్ని తొలగించారు. మిగతా పనులు గురువారం పూర్తి చేయనున్నారు. బుధవారం పనులకు ఎటువంటి ఆటంకాలు ఏర్పడలేదని డీసీసీ
కె.హరిదాస్ ‘న్యూస్టుడే’కు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మావయ్య మిగిల్చిన ‘విద్యా అవస్థ’!
[ 06-07-2024]
పాఠశాలల రూపురేఖలే మార్చేస్తామంది.. కార్పొరేట్ను తలదన్నేలా వ్యవస్థ ఉంటుందని గొప్పలు చెప్పింది.. తీరా భావితరానికి అవస్థలు మిగిల్చింది.. వైకాపా ప్రభుత్వం నాడు-నేడు పేరిట చేపట్టిన కార్యక్రమం విద్యాలయాల దశను మార్చలేదు సరికదా సరికొత్త తలనొప్పులు తెచ్చింది. -
సత్యదేవుని చెంత సరిదిద్దడం సవాలే
[ 06-07-2024]
ఎంతో ప్రముఖమైన..నిత్యం వేలాదిమంది భక్తులు దర్శించుకునే సత్యదేవుని ఆలయానికి సంబంధించి పనులంటే ఎంత ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలి.. ఎంత ప్రతిష్టాత్మకంగా చేపట్టాలి.. -
రెండో ప్లాట్ఫాం పైకి ఎక్స్ప్రెస్ రైళ్లు
[ 06-07-2024]
రాజమహేంద్రవరం ప్రధాన రైల్వేస్టేషన్లో రెండో నంబరు ప్లాట్ఫాంపై ఎక్స్ప్రెస్ రైళ్ల హాల్ట్ను ఎట్టకేలకు పునరుద్ధరించారు. -
10 రోజుల ముందుగానే సాగునీరు
[ 06-07-2024]
వైకాపా పాలనలో జలవనరులశాఖ ఆధ్వర్యంలో ఉండే ఎత్తిపోతల పథకాలను నిర్వీర్యంగా మార్చడమే కాకుండా నిర్వహణలో గుత్తేదారులకు రూ.కోట్లు బకాయిలు పెట్టింది. -
వ్యవసాయ, అనుబంధ రంగాలకు ప్రాధాన్యం
[ 06-07-2024]
వ్యవసాయం, అనుబంధ రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తూ మార్గదర్శకాలు జారీ చేసినట్లు కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. -
మహిళల అదృశ్య కేసులపై ప్రత్యేక దృష్టి
[ 06-07-2024]
మహిళల అదృశ్య కేసులపై ప్రత్యేక దృష్టిసారించాలని ఎస్పీ పి.జగదీష్ ఆదేశించారు. -
సముద్రపు ఇసుకనూ వదల్లేదు..
[ 06-07-2024]
కోనసీమలోని తీర గ్రామాల్లో సముద్రపు ఇసుకను ఇష్టారీతిన తవ్వేయడంతో మేటలు కరిగిపోతున్నాయి. -
వాహనాల ప్లేట్లు ఫిరాయింపు
[ 06-07-2024]
నంబరు ప్లేట్లు లేకుండా కొందరు ద్విచక్ర వాహనదారులు రోడ్లపై ఇష్టానుసారంగా వాటిని నడుపుతున్నారు. -
ఇక చాలు.. ఖాళీ చేయండి
[ 06-07-2024]
నగరంలోని సంజయ్నగర్ పిడుగులమ్మ గుడి వద్ద ఆక్రమణలో ఉన్న మున్సిపల్ దుకాణ సముదాయాన్ని అధికారులు శుక్రవారం ఖాళీ చేయించారు. -
ఇసుక దుర్వినియోగం కాకుండా చర్యలు
[ 06-07-2024]
జిల్లాలోని ఏడు ఇసుక డిపోల్లో ఉన్న ఇసుక నిల్వలు దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ మహేష్కుమార్ ఆదేశించారు. -
అభ్యర్థుల ఎన్నికల వ్యయ వివరాలు విడుదల
[ 06-07-2024]
పుదుచ్చేరి పార్లమెంటరీ నియోజకవర్గ ఎన్నికల్లో 26 మంది అభ్యర్థులు చేసిన ఖర్చు వివరాలను ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ కుళోత్తుంగన్ శుక్రవారం విడుదల చేశారు. -
చింతలపూడి.. రైతుల చింత తీరుస్తుందా?
[ 06-07-2024]
ఉభయ గోదావరి జిల్లాలో రూ.4,900 కోట్లతో 4.80 లక్షల ఎకరాలకు సాగునీరందించాలన్న మహోన్నత లక్ష్యంతో 2009లో శ్రీకారం చుట్టిన చింతలపూడి ఎత్తిపోతల పథకంపై అయిదేళ్లలో నిర్లక్ష్యపు నీడ కమ్ముకొంది.